వాహనం నిలిపే స్థలమెక్కడ?
మహబూబాబాద్ జిల్లా కేంద్రంగా మారి ఏళ్లు గడిచినా ట్రాఫిక్ సమస్య తీరడం లేదు. పట్టణాభివృద్ధిలో భాగంగా రహదారుల విస్తరణ చేపట్టినప్పటికీ వాహనాల రాకపోకలు అధికమయ్యాయి. రద్దీ ఎక్కువై వాహనాల పార్కింగ్ ప్రదేశాలు లేక నగరవాసులకు ఇబ్బందులు తప్పడం లేదు. సెల్లార్లను
జిల్లా కేంద్రంలో ట్రాఫిక్ సమస్యలు
నెహ్రూ కూడలిలో రహదారిపైనే ..
నెహ్రూసెంటర్, న్యూస్టుడే: మహబూబాబాద్ జిల్లా కేంద్రంగా మారి ఏళ్లు గడిచినా ట్రాఫిక్ సమస్య తీరడం లేదు. పట్టణాభివృద్ధిలో భాగంగా రహదారుల విస్తరణ చేపట్టినప్పటికీ వాహనాల రాకపోకలు అధికమయ్యాయి. రద్దీ ఎక్కువై వాహనాల పార్కింగ్ ప్రదేశాలు లేక నగరవాసులకు ఇబ్బందులు తప్పడం లేదు. సెల్లార్లను వాహనాల పార్కింగ్కు కాకుండా భవనాల యజమానులు తమ సొంత పనులకు వినియోగిస్తుండడంతో వాణిజ్య, వ్యాపార అవసరాలకు వచ్చిన వాహనదారులకు బండి నిలిపేందుకు స్థలం కరవైంది. విధిలేని పరిస్థితుల్లో రోడ్డు పక్కనే పార్కింగ్ చేయాల్సి వస్తోంది. దీంతో రాకపోకలకు తీవ్ర ఆటంకం నెలకొని తరచూ వాహనాలు నిలిచిపోతున్నాయి. పురపాలక అధికారులు ఉదాసీనంగా వ్యవహరించడం వల్ల కొందరు రహదారులను ఆక్రమించి వ్యాపారాలు సాగిస్తున్నారు. పండగ రోజుల్లో వాహనాలు నిలిపేందుకు స్థలం లేక రోడ్లపైనే పార్కింగ్ చేయాల్సిన పరిస్థితి. రహదారుల వెంట నిలిపిన వాహనాలను ట్రాఫిక్ పోలీసులు ఫొటోలు తీసి జరిమానా విధిస్తున్నారు. వాణిజ్య వ్యాపారాల దుకాణ భవన సముదాయాల్లోని సెల్లార్లలో వాహనాలు పార్కింగ్ చేస్తే కొంత వరకు ట్రాపిక్ సమస్య పరిష్కారమయ్యే అవకాశం ఉంది. దీనికితోడు పార్కింగ్ స్థలాలు ఏర్పాటు దిశగా పురపాలక, పోలీస్ శాఖ తగిన చర్యలు చేపట్టాలని వాహనదారులు కోరుతున్నారు.
రద్దీగా ఉండే ప్రదేశాలు ఇవే
పట్టణంలోని నెహ్రూ సెంటర్, కూరగాయాల మార్కెట్, శ్రీనివాస కూడలి, మదర్ థెరిసా కూడలిలో రోజూ ట్రాఫిక్ సమస్య తీవ్రంగా ఉంటోంది. ఉదయం సమయంలో కూలీ పనుల కోసం వచ్చే వారితో శ్రీనివాస కూడలి రద్దీగా మారి వాహనదారులకు కష్టాలు తప్పడం లేదు. నెహ్రూసెంటర్లో బ్యాంకులు ఉండటం వల్ల వాహనాలు ఎక్కువగా రోడ్లపైనే పార్కింగ్ చేస్తున్నారు.
రోజూ యాతనే....
పట్టణంలోని పాత బజారు నుంచి కొత్త బజారుకు రావడానికి రైల్వే గేటు గుండా రాకపోకలు సాగించాల్సి వస్తోంది. జిల్లా కేంద్రంలోని అండర్ బ్రిడ్జి ద్వారా నిర్మిస్తున్న రహదారి కారణంగా వాహనదారులకు కష్టాలు తప్పడం లేదు.
ప్రత్యేక చర్యలు తీసుకుంటాం
- వై.సతీష్, సీఐ, మహబూబాబద్ పట్టణం
జిల్లా కేంద్రంలో ట్రాఫిక్ నియంత్రణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం. ఇప్పటికే జిల్లా కేంద్రంలోని రెండు కూడళ్లలో సిగ్నల్ వ్యవస్థను ఏర్పాటు చేశాం. వాణిజ్య వ్యాపార దుకాణాల వద్ద వాహనాల రద్దీ ఎక్కువగా ఉంటుంది. వాహనాల పార్కింగ్ కోసం సెల్లార్లు ఏర్పాటు చేసుకోవాలని సంబంధిత దుకాణ యజమానులకు ఆదేశాలు జారీ చేశాం. ట్రాఫిక్ సమస్య పరిష్కరించేందుకు ప్రధాన కూడళ్ల వద్ద సిబ్బందిని ఏర్పాటు చేసి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కాంగ్రెస్ కంచుకోట.. మానుకోట!
[ 20-04-2024]
మహబూబాబాద్ జిల్లాకేంద్రంలో శుక్రవారం నిర్వహించిన కాంగ్రెస్ జన జాతర సభ విజయవంతమైంది. ఈ లోక్సభ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి అధిక సంఖ్యలో తరలొచ్చిన పార్టీ శ్రేణులు, అభిమానులతో సభా ప్రాంగణం హోరెత్తింది. -
కబ్జా కోరల్లో ఇనుపరాతి గుట్ట అటవీ భూములు!
[ 20-04-2024]
భూపాలపల్లి జిల్లా కేంద్రం సమీపంలోని కొంపెల్లి గ్రామ పరిధిలో 106.34 ఎకరాల భూమి ప్రైవేటు వ్యక్తులది కాదని.. అది అటవీ భూమేనని సుప్రీంకోర్టు ఇచ్చిన తాజా తీర్పు పర్యావరణానికి ఎంతో మేలు చేయనుంది. -
ఛత్రం పడితేనే.. చకచకా నడిచేది..!
[ 20-04-2024]
గత లోక్సభ ఎన్నికలు 2019 ఏప్రిల్ 11న జరిగాయి. ఈసారి మే 13న నిర్వహించనున్నారు. ఇప్పుడే ఎండలు దంచి కొడుతున్నాయి. ఆ సమయంలో మరింత తీవ్రంగా ఉండే ప్రమాదం ఉంది.. -
బలరాంనాయక్ నామపత్రం దాఖలు
[ 20-04-2024]
మహబూబాబాద్ (ఎస్టీ) లోక్సభ స్థానానికి కాంగ్రెస్ అభ్యర్థి, కేంద్ర మాజీ సహాయమంత్రి పోరిక బలరాంనాయక్ శుక్రవారం రెండు సెట్ల నామినేషన్ దాఖలు చేశారు. -
మావోయిస్టు దంపతులకు తుది వీడ్కోలు
[ 20-04-2024]
ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్లో మృతిచెందిన మావోయిస్టు దంపతులు జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం చల్లగరిగె గ్రామానికి చెందిన సిరిపెల్లి సుధాకర్ అలియాస్ శంకర్ అలియాస్ మురళీ, ఆదిలాబాద్ జిల్లా బజార్హత్నూర్కు చెందిన సుమన అలియాస్ రంజిత అంత్యక్రియలు శుక్రవారం స్వగ్రామంలో ముగిశాయి. -
ఓటు వేసి ప్రజాస్వామ్యాన్ని గెలిపించాలి
[ 20-04-2024]
వచ్చేనెల 13న జరగబోయే లోక్సభ ఎన్నికల పోలింగ్ రోజు అందరూ ఓటేసి ప్రజాస్వామ్యాన్ని గెలిపించాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ పిలుపునిచ్చారు. -
సీఎం హెలిప్యాడ్కు మూడు స్థలాల పరిశీలన
[ 20-04-2024]
కాజీపేట మండలం మడికొండ సెయింట్ పాల్స్ మైదానంలో ఈ నెల 24న నిర్వహించనున్న కాంగ్రెస్ పార్టీ బహిరంగ సభకు ఏర్పాట్లు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. -
వరంగల్లో భారాస విజయం ఖాయం
[ 20-04-2024]
వరంగల్ లోక్సభ నియోజకవర్గంలో భారాస విజయం ఖాయమైందని మాజీ మంత్రి దయాకర్రావు అన్నారు. -
మరాడించలే.. లెక్కచూపలే
[ 20-04-2024]
జిల్లాలో సీఎంఆర్(కస్టమ్ మిల్లింగ్ రైస్) ప్రక్రియ నత్తనడకన సాగుతోంది.. రైతులు పండించిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి సేకరిస్తోంది. -
ఎన్నిక ఏదైనా సత్తా చాటారు..!
[ 20-04-2024]
రాజకీయ నేతలు తమ జీవిత కాలంలో ఒక్కసారైనా ఏదో ఒక చట్టసభలో అడుగుపెట్టాలని ఆశిస్తుంటారు.. ఒకరికే ఎమ్మెల్యేగా, ఎంపీగా పోటీ చేసే అవకాశం వచ్చి విజయం సాధిస్తే వారి ఆనందానికి అవధులు ఉండవు. -
అట్టహాసంగా ప్రారంభం.. పరిశోధనలు శూన్యం
[ 20-04-2024]
కాకతీయ విశ్వవిద్యాలయంలో పరిశోధనల నిమిత్తం రూ.50 కోట్లతో కె-హబ్, పీవీ నర్సింహారావు విజ్ఞాన కేంద్రం నిర్మించారు. -
ఓటాస్త్రం.. స్వీయచిత్రమే సాక్ష్యం
[ 20-04-2024]
ఓరుగల్లు నగరంలో ఓటింగ్ శాతం పెంచేందుకు వరంగల్ కలెక్టరేట్ ఆవరణలో సెల్ఫీ పాయింట్ ఏర్పాటు చేశారు. -
రెండోరోజు మూడు నామపత్రాలు
[ 20-04-2024]
వరంగల్ లోక్సభ స్థానానికి రెండోరోజు శుక్రవారం ముగ్గురు అభ్యర్థులు, నాలుగుసెట్ల నామపత్రాలు దాఖలు చేశారని వరంగల్ పార్లమెంట్ రిటర్నింగ్ అధికారి, వరంగల్ జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
సుప్రీం లీడర్ పుట్టిన రోజే ఇరాన్పై దాడులు.. అమెరికాకు చివరి క్షణంలో తెలిసిందట!
-
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!
-
కావ్య బాధ.. శారీలో లావణ్య, మౌనీరాయ్
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/04/24)
-
‘ప్రేమలు 2’ ఫిక్స్.. రిలీజ్ ఎప్పుడంటే?
-
కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో షారూఖ్ ఖాన్ ?... భాజపా అభ్యంతరం