రూ.70 లక్షలు ఏమయ్యాయి?
దొరికితే దొంగ, దొరకక పోతే దొర అన్నట్లుగా ఉంది గ్రేటర్ వరంగల్లో అధికారుల తీరు. 452 మంది కాంట్రాక్టు కార్మికుల పేరు మీద జమ చేయాల్సిన ఈపీఎఫ్, ఈఎస్ఐ రూ.70 లక్షల సొమ్ము ఎవరి ఖాతాల్లోకి వెళ్లాయనేది తాజాగా చర్చనీయాంశమైంది. కార్మికుల డబ్బు స్వాహా చేశారని ప్రచారం
కార్పొరేషన్, న్యూస్టుడే: దొరికితే దొంగ, దొరకక పోతే దొర అన్నట్లుగా ఉంది గ్రేటర్ వరంగల్లో అధికారుల తీరు. 452 మంది కాంట్రాక్టు కార్మికుల పేరు మీద జమ చేయాల్సిన ఈపీఎఫ్, ఈఎస్ఐ రూ.70 లక్షల సొమ్ము ఎవరి ఖాతాల్లోకి వెళ్లాయనేది తాజాగా చర్చనీయాంశమైంది. కార్మికుల డబ్బు స్వాహా చేశారని ప్రచారం జరుగుతోంది. బల్దియా ప్రజారోగ్య విభాగం అధికారుల అండతోనే కాంట్రాక్టర్ ఈపీఎఫ్, ఈఎస్ఐ సొమ్ము తన ఖాతాలో వేసుకున్నారని జిల్లా కాంగ్రెస్ నాయకులు ఆరోపించారు. నిబంధనల ప్రకారమైతే నెల నుంచే కార్మికుల వ్యక్తిగత పేర్లతో కలిగిన ఖాతాల్లో ఈపీఎఫ్, ఈఎస్ఐ థర్డ్ పార్టీ కాంట్రాక్టర్ జమ చేయాలి. చేస్తున్నాడా? లేదా? అనేది అధికారులు పరిశీలించాలి. జమ చేయకపోతే కాంట్రాక్టర్కు నోటీసు జారీ చేయాలి. అడిగే వారు లేకపోవడంతో కార్మికుల సొమ్ము పక్కదారి పట్టింది. వాస్తవంగా పరిశీలిస్తే 452 మంది కాంట్రాక్టు నియామకాల ప్రక్రియ మొదలైన నాటి నుంచి వివాదాస్పదమే. గత పాలకవర్గం పదవీ కాలం చివరి దశలో వీరి నియామకాలు జరిగాయి. రాజకీయ ఒత్తిళ్లతో ఆరేడు నెలల పాటు తుది జాబితా ఖరారవ్వలేదు. నెల నెలా కార్మికుల పేర్లు మారాయి. ప్రస్తుత కమిషనర్ ప్రావీణ్య చొరవతో జనవరి నెలలో తుది జాబితా ఖరారైంది. అదనంగా నియమితులైన 52 మంది కార్మికులు రోడ్డున పడ్డారు.
జాబితాపై ఆరా
కాంట్రాక్టు కార్మికుల నియామకంలో జరిగిన పైరవీలను డీసీసీ అధ్యక్షుడు రాజేందర్రెడ్డి బయట పెట్టారు. ఇందులో మంత్రులు, ఎమ్మెల్యేలు, జిల్లా, బల్దియా ఉన్నతాధికారులు, రాజకీయ పార్టీ నాయకులు, మాజీ మేయర్, మాజీ కార్పొరేటర్లు, మీడియా సిఫారసుల జాబితా విడుదల చేయడంతో నిఘా వర్గాలు రంగంలోకి దిగాయి. కార్మికుల నియామకాల్లో ఏం జరిగింది? కాంగ్రెస్ నాయకులకు ఆధారాలు ఎలా లభించాయి? ఆడియో టేపులు తదితర అంశాలపై లోతుగా విచారణ చేపడుతున్నారు. బల్దియా అధికారులు కూడా సిఫారసులు చేయడంపై ఆరా తీస్తున్నట్లు తెలిసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భారాసకు కడియం ఝలక్!
[ 29-03-2024]
అసెంబ్లీ ఎన్నికల్లోనే వరంగల్ లోక్సభ స్థానం పరిధిలో భారాసకు ఎదురుదెబ్బ తగిలింది. ఏడు స్థానాల్లో ఆరు చోట్ల ఓటమి తప్పలేదు. -
మానుకోట ఎమ్మెల్యే వాహనం తనిఖీ
[ 29-03-2024]
లోక్సభ ఎన్నికల నేపథ్యంలో నెల్లికుదురు వద్ద నెలకొల్పిన చెక్ పోస్టు వద్ద గురువారం మహబూబాబాద్ ఎమ్మెల్యే భూక్య మురళీనాయక్, కరీంనగర్ ఎమ్మెల్సీ రఘోత్తంరెడ్డి వాహనాలను తనిఖీ చేశారు. -
షాపింగ్మాల్లో భారీ అగ్నిప్రమాదం
[ 29-03-2024]
వరంగల్ పోచమ్మమైదాన్లోని జెకోటియా షాపింగ్ మాల్లో గురువారం సాయంత్రం 6.45 గంటలకు భారీ అగ్నిప్రమాదం జరిగింది. -
గ్రంథాలయం మాది..పుస్తకం మీది!
[ 29-03-2024]
నేటి తరం పిల్లలు పుస్తక పఠనానికి క్రమంగా దూరమవుతున్నారు. చరవాణుల వ్యామోహంలో పడి గ్రంథాలయాల గడప తొక్కనివారు ఎంతో మంది ఉన్నారు. -
ఎర్రగట్టు గుట్టపై క్షీరాభిషేకం
[ 29-03-2024]
భీమారంలోని ఎర్రగట్టు గుట్టపై వెలసిన వేెంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. నాలుగో రోజు గురువారం స్వామివారికి క్షీరాభిషేకం నిర్వహించారు. -
యథేచ్ఛగా ఆలయ భూముల ఆక్రమణ
[ 29-03-2024]
వరంగల్, హనుమకొండ నగరాల నడిబొడ్డున రూ.కోట్ల విలువైన ఆలయ భూములు ఆక్రమణల చెరలో ఉన్నాయి. ఈ స్థలాల్లో పలుకుబడి ఉన్నవాళ్లు పెద్ద భవనాలు, ఇళ్లు నిర్మించుకున్నారు. -
ఇసుకాసురులపై పోలీసుల కొరడా
[ 29-03-2024]
సహజ వనరులను కాపాడుకుంటూ భవిష్యత్తు తరాలకు అందించినప్పుడే మనుగడ సాధ్యమవుతుంది. కానీ చాలా వరకు గుట్టలు, ఇసుక, మట్టిని గుళ్ల చేస్తూ వనరులను అందిన కాడికి దోచుకుంటున్నారు. -
నాణ్యతా.. వారికి మామూలే!
[ 29-03-2024]
ఉపాధిహామీ పథకం నిధులతో పంచాయతీరాజ్ ఇంజినీరింగ్శాఖ ఆధ్వర్యంలో మహబూబాబాద్, భూపాలపల్లి, ములుగు జిల్లాల్లోని పలు గ్రామాల్లో ఇటీవల సీసీ రోడ్ల నిర్మాణాలు చేపట్టారు. -
వైద్యుడు లేక అందని గుండె పరీక్షల సేవలు
[ 29-03-2024]
జనగామ జిల్లా కేంద్రంగా మారిన తర్వాత జనగామలో ప్రభుత్వం తెలంగాణ డయాగ్నస్టిక్ కేంద్రం, రేడియాలజీ హబ్లను ఏర్పాటు చేసింది. -
మరోసారి కాంగ్రెస్ సత్తా చాటాలి
[ 29-03-2024]
రానున్న లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మాజీ కేంద్ర మంత్రి బలరాంనాయక్ను అధిక మెజారిటీతో గెలిపించాలని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క నాయకులు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. -
ఆస్తి పన్ను బకాయిదారులపై కొరడా
[ 29-03-2024]
ఆస్తి పన్ను మొండి బకాయిదారులపై మున్సిపాలిటీ అధికారులు కొరడా ఝులిపిస్తున్నారు. వారం రోజులుగా ఉదయం 7 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు బకాయిదారుల ఇళ్లు, దుకాణాల వద్దకు వెళ్లి పన్ను చెల్లించాలని కోరుతున్నారు. -
అక్రమ వ్యాపారాలపై ప్రత్యేక నిఘా
[ 29-03-2024]
జిల్లాలో అక్రమ వ్యాపారాలపై పోలీసు యంత్రాంగం ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ అన్నారు. -
వేగవంతంగా చిన్న కాళేశ్వరం ప్రాజెక్టు పనులు
[ 29-03-2024]
మహదేవపూర్ మండలంలోని చిన్న కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ పనులను వేగవంతంగా చేపట్టాలని సంబంధిత నీటిపారుదల శాఖ అధికారులను జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా ఆదేశించారు. -
పల్లెల్లో బెట్టింగ్ల జోరు
[ 29-03-2024]
పట్టణాలకు పరిమితమైన బెట్టింగ్ సంస్కృతి పల్లె ప్రాంతంలో విస్తరించింది. జిల్లాలో మారుమూల ప్రాంతమైన కాటారం రెవెన్యూ డివిజన్ పరిధిలోని పల్లెల్లో యువకులు, వ్యాపారులు, విద్యార్థులు పందేలు కాస్తూ ఆర్థికంగా చితికిపోతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
టెలికాం శాఖ పేరుతో కాల్స్ వస్తున్నాయా..? అయితే జాగ్రత్త..!
-
రైలు ప్రయాణికుడి సెల్ఫీతో డెత్ మిస్టరీని ఛేదించిన పోలీసులు
-
బ్యాంకులు, ఎల్ఐసీ కార్యాలయాలు.. ఈ శని, ఆదివారాల్లో తెరిచే ఉంటాయ్!
-
కోహ్లీ Vs గంభీర్.. రస్సెల్ Vs సిరాజ్.. రింకు Vs యశ్.. ఆధిపత్యం ఎవరిదో?
-
ఎన్నికల బరిలో రఘురామ కృష్ణరాజు?.. ఎన్డీయే కూటమి నేతల మధ్య చర్చ
-
ప్రేమ వివాహమే చేసుకుంటా: విజయ్ దేవరకొండ