logo

పోలీస్‌స్టేషన్‌లో వృద్ధ దంపతుల ఆత్మహత్యాయత్నం

వృద్ధ దంపతులు పోలీసుస్టేషన్‌లో ఆదివారం ఆత్మహత్యాయత్నానికి పాల్పడుతున్న క్రమంలో పోలీసులు అడ్డుకున్నారు. శాయంపేట మండలం పత్తిపాకకు చెందిన కొడిమాల లక్ష్మి దంపతులు,  సర్పంచి చిట్టిరెడ్డి రాజిరెడ్డి  మధ్య  భూవివాదం కొన్నేళ్లుగా కొనసాగుతోంది. వారం రోజుల కిందట వారు

Published : 26 Sep 2022 04:53 IST

శాయంపేట, న్యూస్‌టుడే: వృద్ధ దంపతులు పోలీసుస్టేషన్‌లో ఆదివారం ఆత్మహత్యాయత్నానికి పాల్పడుతున్న క్రమంలో పోలీసులు అడ్డుకున్నారు. శాయంపేట మండలం పత్తిపాకకు చెందిన కొడిమాల లక్ష్మి దంపతులు,  సర్పంచి చిట్టిరెడ్డి రాజిరెడ్డి  మధ్య  భూవివాదం కొన్నేళ్లుగా కొనసాగుతోంది. వారం రోజుల కిందట వారు గ్రామ సర్పంచిని దూర్భాషలాడడంతో ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు విచారణ నిమిత్తం వారిని పోలీస్‌స్టేషన్‌కు పిలిపించారు. పెట్రోల్‌ సీసాతో వచ్చిన వారు ఒంటిపై పోసుకునేందుకు యత్నిస్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ విషయమై ఎస్సై వీరభద్రరావు వివరణ కోరగా.. సర్పంచి ఫిర్యాదు మేరకే వారిని పిలిచామన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని