ఇనుగుర్తి.. సీరోలు మండలాల ఏర్పాటు
జిల్లాలో కొన్నేళ్లుగా ఎదురుచూస్తున్న రెండు నూతన మండలాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్కుమార్ సోమవారం ఇనుగుర్తి, సీరోలు మండలాలుగా ప్రకటిస్తూ ఉత్తర్వులను జారీ చేశారు.
తుది ఉత్తర్వులు జారీ
మహబూబాబాద్, న్యూస్టుడే: జిల్లాలో కొన్నేళ్లుగా ఎదురుచూస్తున్న రెండు నూతన మండలాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్కుమార్ సోమవారం ఇనుగుర్తి, సీరోలు మండలాలుగా ప్రకటిస్తూ ఉత్తర్వులను జారీ చేశారు. మహబూబాబాద్ నియోజకవర్గంలో చారిత్రక ప్రాధాన్యాన్ని సంతరించుకున్న ఇనుగుర్తి, డోర్నకల్ నియోజకవర్గంలోని సీరోలును మండల కేంద్రంగా ప్రకటిస్తూ తుది ఉత్వర్వులు వెలువడ్డాయి. పరిపాలనా సౌలభ్యం కోసం రాష్ట్ర ప్రభుత్వం 2016లో 16 మండలాలతో మహబూబాబాద్ను జిల్లాగా ప్రకటించింది. అప్పటి నుంచి ఇనుగుర్తి, సీరోలు గ్రామాలను కూడా మండల కేంద్రాలుగా ఏర్పాటు చేయాలంటూ డిమాండ్లు వచ్చాయి. ఇనుగుర్తిని మండలంగా చేయాలంటూ అఖిలపక్షం ఆధ్వర్యంలో ఆందోళనలు జరిగాయి. కాగా, సోమవారం రాత్రి ఇనుగుర్తి లో ప్రజలు బాణాసంచా కాల్చి సంబురాలు నిర్వహించారు.
పరిధి ఇలా..
రాష్ట్ర ప్రభుత్వం మొదట ప్రతిపాదించిన ముసాయిదా జాబితాల్లోని కొని గ్రామాల్లో మార్పులు, చేర్పులు చేస్తూ నూతన మండలాలకు ప్రభుత్వం ఆమోదముద్ర వేసి ప్రత్యేక జీవోను విడుదల చేసింది. ప్రస్తుతం ఉన్న మండలాల నుంచి కొన్ని గ్రామాలను విభజిస్తూ, పక్క మండల పరిధిలోని ఇతర గ్రామాలను చేరుస్తూ నూతన మండలాలను ఏర్పాటు చేసింది. ఇనుగుర్తి మండలం పరిధిలోకి మొదటగా నెల్లికుదురు మండలంలోని రాజులకొత్తపల్లి గ్రామాన్ని ప్రతిపాదించారు. నెల్లికుదురు మండలంలోని రాజులకొత్తపల్లి గ్రామాన్ని తొలగించి మేచరాజుపల్లి గ్రామాన్ని చేరుస్తూ కొత్త మండలం ఏర్పాటుకు ఉత్తర్వులు జారీ చేసింది.
సీరోలులో ఆరు రెవెన్యూ గ్రామాలు
కురవి మండలం నుంచి సీరోలు, కాంపల్లి, ఉప్పరిగూడెం, తాళ్ల సంకీస, చింతపల్లి, డోర్నకల్ మండలం నుంచి మన్నెగూడెం సహా ఆరు గ్రామాలతో సీరోలు మండలంగా ఏర్పడింది.
ఇనుగుర్తిలో అయిదు..
కేసముద్రం మండలం నుంచి ఇనుగుర్తి, కోమటిపల్లి, నెల్లికుదురు మండలం నుంచి చిన్నముప్పారం, చిన్ననాగారం, మేచరాజుపల్లి గ్రామాలతో ఇనుగుర్తి మండలంగా ఏర్పాటు చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కాంగ్రెస్ కంచుకోట.. మానుకోట!
[ 20-04-2024]
మహబూబాబాద్ జిల్లాకేంద్రంలో శుక్రవారం నిర్వహించిన కాంగ్రెస్ జన జాతర సభ విజయవంతమైంది. ఈ లోక్సభ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి అధిక సంఖ్యలో తరలొచ్చిన పార్టీ శ్రేణులు, అభిమానులతో సభా ప్రాంగణం హోరెత్తింది. -
కబ్జా కోరల్లో ఇనుపరాతి గుట్ట అటవీ భూములు!
[ 20-04-2024]
భూపాలపల్లి జిల్లా కేంద్రం సమీపంలోని కొంపెల్లి గ్రామ పరిధిలో 106.34 ఎకరాల భూమి ప్రైవేటు వ్యక్తులది కాదని.. అది అటవీ భూమేనని సుప్రీంకోర్టు ఇచ్చిన తాజా తీర్పు పర్యావరణానికి ఎంతో మేలు చేయనుంది. -
ఛత్రం పడితేనే.. చకచకా నడిచేది..!
[ 20-04-2024]
గత లోక్సభ ఎన్నికలు 2019 ఏప్రిల్ 11న జరిగాయి. ఈసారి మే 13న నిర్వహించనున్నారు. ఇప్పుడే ఎండలు దంచి కొడుతున్నాయి. ఆ సమయంలో మరింత తీవ్రంగా ఉండే ప్రమాదం ఉంది.. -
బలరాంనాయక్ నామపత్రం దాఖలు
[ 20-04-2024]
మహబూబాబాద్ (ఎస్టీ) లోక్సభ స్థానానికి కాంగ్రెస్ అభ్యర్థి, కేంద్ర మాజీ సహాయమంత్రి పోరిక బలరాంనాయక్ శుక్రవారం రెండు సెట్ల నామినేషన్ దాఖలు చేశారు. -
మావోయిస్టు దంపతులకు తుది వీడ్కోలు
[ 20-04-2024]
ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్లో మృతిచెందిన మావోయిస్టు దంపతులు జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం చల్లగరిగె గ్రామానికి చెందిన సిరిపెల్లి సుధాకర్ అలియాస్ శంకర్ అలియాస్ మురళీ, ఆదిలాబాద్ జిల్లా బజార్హత్నూర్కు చెందిన సుమన అలియాస్ రంజిత అంత్యక్రియలు శుక్రవారం స్వగ్రామంలో ముగిశాయి. -
ఓటు వేసి ప్రజాస్వామ్యాన్ని గెలిపించాలి
[ 20-04-2024]
వచ్చేనెల 13న జరగబోయే లోక్సభ ఎన్నికల పోలింగ్ రోజు అందరూ ఓటేసి ప్రజాస్వామ్యాన్ని గెలిపించాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ పిలుపునిచ్చారు. -
సీఎం హెలిప్యాడ్కు మూడు స్థలాల పరిశీలన
[ 20-04-2024]
కాజీపేట మండలం మడికొండ సెయింట్ పాల్స్ మైదానంలో ఈ నెల 24న నిర్వహించనున్న కాంగ్రెస్ పార్టీ బహిరంగ సభకు ఏర్పాట్లు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. -
వరంగల్లో భారాస విజయం ఖాయం
[ 20-04-2024]
వరంగల్ లోక్సభ నియోజకవర్గంలో భారాస విజయం ఖాయమైందని మాజీ మంత్రి దయాకర్రావు అన్నారు. -
మరాడించలే.. లెక్కచూపలే
[ 20-04-2024]
జిల్లాలో సీఎంఆర్(కస్టమ్ మిల్లింగ్ రైస్) ప్రక్రియ నత్తనడకన సాగుతోంది.. రైతులు పండించిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి సేకరిస్తోంది. -
ఎన్నిక ఏదైనా సత్తా చాటారు..!
[ 20-04-2024]
రాజకీయ నేతలు తమ జీవిత కాలంలో ఒక్కసారైనా ఏదో ఒక చట్టసభలో అడుగుపెట్టాలని ఆశిస్తుంటారు.. ఒకరికే ఎమ్మెల్యేగా, ఎంపీగా పోటీ చేసే అవకాశం వచ్చి విజయం సాధిస్తే వారి ఆనందానికి అవధులు ఉండవు. -
అట్టహాసంగా ప్రారంభం.. పరిశోధనలు శూన్యం
[ 20-04-2024]
కాకతీయ విశ్వవిద్యాలయంలో పరిశోధనల నిమిత్తం రూ.50 కోట్లతో కె-హబ్, పీవీ నర్సింహారావు విజ్ఞాన కేంద్రం నిర్మించారు. -
ఓటాస్త్రం.. స్వీయచిత్రమే సాక్ష్యం
[ 20-04-2024]
ఓరుగల్లు నగరంలో ఓటింగ్ శాతం పెంచేందుకు వరంగల్ కలెక్టరేట్ ఆవరణలో సెల్ఫీ పాయింట్ ఏర్పాటు చేశారు. -
రెండోరోజు మూడు నామపత్రాలు
[ 20-04-2024]
వరంగల్ లోక్సభ స్థానానికి రెండోరోజు శుక్రవారం ముగ్గురు అభ్యర్థులు, నాలుగుసెట్ల నామపత్రాలు దాఖలు చేశారని వరంగల్ పార్లమెంట్ రిటర్నింగ్ అధికారి, వరంగల్ జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
సుప్రీం లీడర్ పుట్టిన రోజే ఇరాన్పై దాడులు.. అమెరికాకు చివరి క్షణంలో తెలిసిందట!
-
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!
-
కావ్య బాధ.. శారీలో లావణ్య, మౌనీరాయ్
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/04/24)
-
‘ప్రేమలు 2’ ఫిక్స్.. రిలీజ్ ఎప్పుడంటే?
-
కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో షారూఖ్ ఖాన్ ?... భాజపా అభ్యంతరం