హృదయం.. ఇలా పదిలం
ఉమ్మడి వరంగల్ జిల్లాలో రోజురోజుకు గుండె జబ్బు బాధితులు పెరుగుతున్నారు. చిన్న పిల్లల్లో పుట్టుకతో గుండె రంధ్రాలు ఏర్పడుతుండగా.. 18 సంవత్సరాల పైబడిన వారు ఇటీవల గుండె జబ్బుకు గురవుతున్నారు. అప్పటి వరకు చురుగ్గా పనిచేసిన
నేడు ప్రపంచ గుండె జబ్బుల నివారణ దినం
న్యూస్టుడే, ఎంజీఎం ఆసుపత్రి
* ఇటీవల జనగామ జిల్లా లింగాలఘనపురానికి చెందిన వ్యక్తి హైదరాబాద్లోని తమ అపార్టుమెంటులో ఆగస్టు 15న జెండా వందనం అనంతరం స్వాతంత్రోద్యమం గురించి వివరిస్తూ కార్డియాక్ అరెస్టుతో మాట్లాడుతూనే కుప్పకూలిపోయి మరణించారు.
* వరంగల్ ఎన్ఐటీలో కెమికల్ ఇంజినీరింగ్ పూర్తిచేసి దుబాయ్లోని ఆయిల్ కంపెనీలో నెలకు రూ.58 లక్షల వేతనంతో ఉద్యోగానికి ఎంపికైన అభిజిత్రెడ్డి(22) కార్డియాక్ అరెస్టుతో రెండు రోజుల కిందట చనిపోయారు. ఈయన రాష్ట్ర వైద్యసేవలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ ఎండి చంద్రశేఖర్రెడ్డి పెద్ద కుమారుడు.
* గత నెలలో వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం పల్లయ్యబోడు తండాకు చెందిన నీహాన్(8) అనే బాలుడికి శస్త్రచికిత్సకు ముందు మత్తు మందు ఇస్తుండగా బాలుడికి అకస్మాత్తుగా కార్డియాక్ అరెస్టు అయింది. వైద్యులు ఎంత ప్రయత్నించినా బాలుడి ప్రాణాలు దక్కలేదు.
కేఎంసీ సూపర్స్పెషాలిటీ ఆసుపత్రి ఐసీయూ వార్డులో చికిత్స పొందుతున్న గుండె జబ్బు బాధితులు
ఉమ్మడి వరంగల్ జిల్లాలో రోజురోజుకు గుండె జబ్బు బాధితులు పెరుగుతున్నారు. చిన్న పిల్లల్లో పుట్టుకతో గుండె రంధ్రాలు ఏర్పడుతుండగా.. 18 సంవత్సరాల పైబడిన వారు ఇటీవల గుండె జబ్బుకు గురవుతున్నారు. అప్పటి వరకు చురుగ్గా పనిచేసిన మనిషి.. హఠాత్తుగా గుండె పట్టుకుని విలవిల్లాడుతూ పడిపోవటం..వారిని కుటుంబసభ్యులు, స్నేహితులు ఆగమేఘాల మీద ఆసుపత్రికి తరలించే లోపే మనకు దక్కకుండా పోతున్నారు. ఇలాంటి సంఘటనలు ఇటీవల ఎక్కువగా చూస్తున్నాం.
కార్డియాక్ అరెస్టు అంటే..
గుండె అకస్మాత్తుగా, అనుకోకుండా కొట్టుకోవడం, ఆగిపోవడాన్ని కార్డియాక్ అరెస్టు అంటారు. దాన్నే హృదయ ధమని వ్యాధిగా పిలుస్తారు. గుండె కండరాలకు సరఫరా చేసే ఆక్సిజన్తో కూడిన రక్తం తగ్గినప్పుడు క్రమంగా కండరాల నిర్మాణాన్ని దెబ్బతీస్తుంది. ఫలితంగా దాని పనితీరులో మార్పులు సంభవించడం వల్ల వెంట్రిక్యులర్ ఫిబ్రిలేషన్ (ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది పడటం)కు దారి తీస్తుంది. ఇది అందరిలో ఒకేలా జరగదు. 15- 25 కేసుల్లో నాన్ కార్డియాక్ కారణమై ఉంటుంది. కొంత మందిలో ఛాతీనొప్పి, ఊపిరి ఆడకపోవడం, వికారం, అధిక హృదయ స్పందన వంటి లక్షణాలు కనిపిస్తాయి. సకాలంలో కార్డియోపల్మొనరీ రెసిసిటేషన్(సిపిఆర్) ద్వారా చికిత్స అందించినట్లయితే వారిని కాపాడుకోవచ్చు. దాదాపు 50 శాతం మందిలో కార్డియాక్ అరెస్టుకు ముందు ఎలాంటి హెచ్చరిక లక్షణాలు కనిపించవని వైద్యులు అంటున్నారు.
లక్షణాలు
ఛాతీ నొప్పి, అలసట, తల తిరగడం, శ్వాస ఆడకపోవడం, బలహీనత, వాంతులు, హఠాత్తుగా పడిపోవడం, స్పృహ కోల్పోవడం, అసాధారణ శ్వాస తీసుకోవడం, శరీరం వెంటనే చల్లబడటం.
నివారణ చర్యలు
కార్డియాక్ అరెస్టుకు గురైన వారికి తక్షణమే కార్డియో పల్మొనరీ(పునరుజ్జీవనం) శ్వాసక్రియను కొనసాగించాలి. డిఫైబ్రిలేటర్ అనే పరికరం ద్వారా గుండెకు విద్యుత్తు షాక్లు ఇవ్వడం వల్ల గుండె కొట్టుకునేలా చేస్తారు. ఛాతీ కుదింపులు చేయడం వల్ల రక్తప్రసరణ కొనసాగేలా చేస్తే మరణాన్ని నివారించవచ్చు.
జాగ్రత్తపడాలి..
డాక్టర్ అత్తె భగీరథ, కేఎంసీ సూపర్స్పెషాలిటీ ఆసుపత్రి
గుండె కొట్టుకోవడం ఆగితే దాన్ని కార్డియాక్ అరెస్టు అని, గుండెకు తగినంత రక్తం సరఫరా కాకపోతే వచ్చే దాన్ని హార్ట్ ఎటాక్ అని చెప్పవచ్చు. రక్తపోటు, మధుమేహం, పొగతాగే వారికి ఎక్కువగా గుండె జబ్బులొచ్చే అవకాశాలున్నాయి. ఇప్పటికే గుండె జబ్బు ఉన్నవారు, గుండె బలహీనంగా ఉన్నవారు, గుండె విఫలమైనవారు జాగ్రత్త పడాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జజ్జనకర.. జనజాతర
[ 25-04-2024]
కాజీపేట మండలం మడికొండలో ఏర్పాటు చేసిన ఓరుగల్లు జనజాతర బహిరంగ సభ విజయవంతమైంది. వరంగల్ లోక్సభ పరిధిలోని ఏడు సెగ్మెంట్ల నుంచి భారీగా జనసమీకరణ చేయడంతో సభా ప్రాంగణం కిక్కిరిసిపోయింది. -
ప్రథమంలో 24 ద్వితీయంలో 26
[ 25-04-2024]
ఇంటర్మీడియట్ వార్షిక ఫలితాల్లో వరంగల్ జిల్లా వెనుకబడింది. ప్రథమ సంవత్సరం ఫలితాల్లో రాష్ట్రంలో 24వ స్థానం, ద్వితీయ సంవత్సరంలో 26వ స్థానంలో నిలిచింది. -
హస్తం జోరు..
[ 25-04-2024]
హనుమకొండ జిల్లా పరిధిలోని కాజీపేట మండలం మడికొండలో నిర్వహించిన ఓరుగల్లు జనజాతర బహిరంగ సభ విజయవంతం కావడం కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం నింపింది. -
ఇంటర్ ఫలితాల్లో ములుగు వెలుగు
[ 25-04-2024]
రాష్ట్ర ప్రభుత్వం బుధవారం విడుదల చేసిన ఇంటర్మీడియట్ ఫలితాల్లో ములుగు జిల్లా అగ్రస్థానంలో నిలిచింది. రాష్ట్రంలోని అన్ని జిల్లాలను వెనకకు నెట్టి ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో మొదటి స్థానంలో నిలిచింది. -
ఇంటర్ ఫలితాల్లో బాలికలదే హవా
[ 25-04-2024]
ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాల్లో ప్రథమ, ద్వితీయ సంవత్సర ఉత్తీర్ణతలో బాలికలదే పైచేయిగా నిలిచింది. బుధవారం ప్రకటించిన ఫలితాల్లో జిల్లాలో ప్రథమ సంవత్సరం 55.72 శాతంతో రాష్ట్రంలో 17వ స్థానం పొందింది. -
బాలికలదే పైచేయి
[ 25-04-2024]
ఇంటర్ బోర్డు అధికారులు బుధవారం విడుదల చేసిన ఇంటర్ ఫలితాల్లో జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో బాలికలే పై చేయి సాధించారు. -
ఇంటర్ ఫలితాల్లో బాలికలదే పైచేయి
[ 25-04-2024]
ఇంటర్ పరీక్ష ఫలితాలు బుధవారం వెలువడిన నేపథ్యంలో జిల్లాలో ఉత్తీర్ణత శాతం గత విద్యా సంవత్సరంతో పోలిస్తే ఈ ఏడాది వెనక్కి వెళ్లింది. -
21 నామపత్రాల దాఖలు
[ 25-04-2024]
వరంగల్ లోక్సభ స్థానానికి బుధవారం 19 మంది అభ్యర్థులు 21 నామపత్రాలను రిటర్నింగ్ అధికారి ప్రావీణ్యకు సమర్పించారు. భారాస పార్టీ అభ్యర్థి మారపల్లి సుధీర్కుమార్ తరఫున భారాస నాయకులు, -
ఆదర్శం.. గంగారం కస్తూర్బా విద్యాలయం
[ 25-04-2024]
మారుమూల ఏజెన్సీలోని కస్తూర్బా గాంధీ బాలికల గురుకుల విద్యాలయం(కేజీబీవీ) విద్యార్థినులు ఇంటర్ ఫలితాల్లో వందశాతం ఫలితాలు సాధించి సత్తా చాటారు.
తాజా వార్తలు (Latest News)
-
323km రేంజ్.. 155km టాప్ స్పీడ్తో అల్ట్రావయోలెట్ కొత్త ఎలక్ట్రిక్ బైక్
-
తిరుపతిలో తెదేపా కార్యకర్తలపై వైకాపా శ్రేణుల రాళ్ల దాడి.. ఉద్రిక్తత
-
అదేం కొట్టుడు.. పంత్ నువ్వేనా క్రికెట్కు ఏడాదిన్నర దూరమైంది?
-
అభిమాన హీరోను కొట్టాలంటే భయమేసింది: మృణాల్ ఠాకూర్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
కోటక్ బ్యాంకు షేరు ఢమాల్.. రూ.37,500 కోట్ల సంపద ఆవిరి!