అంతర్ రాష్ట్ర దొంగల ముఠా అరెస్టు
వరంగల్ పోలీసు కమిషనరేట్ పరిధిలో చోరీలకు పాల్పడుతున్న అంతర్ రాష్ట్ర దొంగల ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. నలుగురు దొంగల ముఠాలోని ముగ్గురు సభ్యులను సీసీఎస్, మామునూర్ పోలీసులు సంయుక్తంగా
వరంగల్క్రైం, న్యూస్టుడే: వరంగల్ పోలీసు కమిషనరేట్ పరిధిలో చోరీలకు పాల్పడుతున్న అంతర్ రాష్ట్ర దొంగల ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. నలుగురు దొంగల ముఠాలోని ముగ్గురు సభ్యులను సీసీఎస్, మామునూర్ పోలీసులు సంయుక్తంగా పట్టుకున్నారు. ఒక్కరు పరారీలో ఉన్నాడు. సీపీ తరుణ్జోషి కమిషనరేట్లో బుధవారం వివరాలను వెల్లడించారు. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంకు చెందిన షేక్ ఖాసీం, షేక్ నాగుల్ మీర, తల్లాడి భాస్కరదుర్గప్రసాద్లను అరెస్టు చేసి 166 గ్రాముల బంగారు నగలు, కారు, ల్యాప్టాప్, రెండు చరవాణిలు, రూ.5వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. కర్రి రాజేశ్ పరారీలో ఉన్నాడు. ఖాసీం, నాగుల్ సోదరులు, భాస్కరదుర్గప్రసాద్, రాజేశ్ ఒకే ప్రాంతానికి చెందిన వారు కావడంతో వీరి మధ్యలో స్నేహం కుదిరింది. నలుగురు దినసరి వేతనంపై పనిచేస్తూ జల్సాలకు అలవాటు పడ్డారు. సులువుగా డబ్బులు సంపాదించాలనే ఆలోచనతో చోరీలను ఎంపిక చేసుకొని ఏలూరు, ఖమ్మం జిల్లాల్లో తాళం వేసి ఉన్న ఇళ్లను ఎంచుకునే వారు. నాగుల్మీర బంధువులు మామునూర్లో ఉండడంతో.. వరంగల్ జిల్లాపై అవగాహన పెంచుకున్నారు. కమిషనరేట్ పరిధిలోని మిల్స్కాలనీ ఠాణా పరిధిలో రెండు, మామునూర్, సంగెం, కేయూసీ, ముల్కనూర్, లింగాలఘనపురం ఠాణాల పరిధిలో ఒక్కొక్క చోరీ చేశారు. వరుసగా ఘటనలు జరగడంతో క్రైం అదనపు డీసీపీ కె.పుష్పారెడ్డి ఆదేశాల మేరకు సీసీఎస్ ఏసీపీ డేవిడ్రాజ్ ఆధ్వర్యంలో నిఘాను పెంచారు. బుధవారం నాయుడు పెట్రోల్ బంక్ సమీపంలో తనిఖీలు చేస్తుండగా నిందితులు కారులో వచ్చారు. అనుమానంతో వారిని తనిఖీ చేయగా వారి వద్ద 166 గ్రాముల బంగారు నగలు, ల్యాప్టాప్, రూ.5వేల నగదు లభించింది. కారుతో పాటు వాటిని స్వాధీనం చేసుకొని నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. కేసులో ప్రతిభ చూపిన అదనపు డీసీపీ కె.పుష్పారెడ్డి, ఏసీపీలు డేవిడ్రాజ్, నరేశ్కుమార్, సీసీఎస్ ఇన్స్పెక్టర్ ఎల్. రమేశ్కుమార్, శ్రీనివాస్రావు, మామునూర్ ఇన్స్పెక్టర్ క్రాంతికుమార్, ఏఏవో సల్మాన్పాషాలను సీపీ అభినందించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కాంగ్రెస్ కంచుకోట.. మానుకోట!
[ 20-04-2024]
మహబూబాబాద్ జిల్లాకేంద్రంలో శుక్రవారం నిర్వహించిన కాంగ్రెస్ జన జాతర సభ విజయవంతమైంది. ఈ లోక్సభ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి అధిక సంఖ్యలో తరలొచ్చిన పార్టీ శ్రేణులు, అభిమానులతో సభా ప్రాంగణం హోరెత్తింది. -
కబ్జా కోరల్లో ఇనుపరాతి గుట్ట అటవీ భూములు!
[ 20-04-2024]
భూపాలపల్లి జిల్లా కేంద్రం సమీపంలోని కొంపెల్లి గ్రామ పరిధిలో 106.34 ఎకరాల భూమి ప్రైవేటు వ్యక్తులది కాదని.. అది అటవీ భూమేనని సుప్రీంకోర్టు ఇచ్చిన తాజా తీర్పు పర్యావరణానికి ఎంతో మేలు చేయనుంది. -
ఛత్రం పడితేనే.. చకచకా నడిచేది..!
[ 20-04-2024]
గత లోక్సభ ఎన్నికలు 2019 ఏప్రిల్ 11న జరిగాయి. ఈసారి మే 13న నిర్వహించనున్నారు. ఇప్పుడే ఎండలు దంచి కొడుతున్నాయి. ఆ సమయంలో మరింత తీవ్రంగా ఉండే ప్రమాదం ఉంది.. -
బలరాంనాయక్ నామపత్రం దాఖలు
[ 20-04-2024]
మహబూబాబాద్ (ఎస్టీ) లోక్సభ స్థానానికి కాంగ్రెస్ అభ్యర్థి, కేంద్ర మాజీ సహాయమంత్రి పోరిక బలరాంనాయక్ శుక్రవారం రెండు సెట్ల నామినేషన్ దాఖలు చేశారు. -
మావోయిస్టు దంపతులకు తుది వీడ్కోలు
[ 20-04-2024]
ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్లో మృతిచెందిన మావోయిస్టు దంపతులు జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం చల్లగరిగె గ్రామానికి చెందిన సిరిపెల్లి సుధాకర్ అలియాస్ శంకర్ అలియాస్ మురళీ, ఆదిలాబాద్ జిల్లా బజార్హత్నూర్కు చెందిన సుమన అలియాస్ రంజిత అంత్యక్రియలు శుక్రవారం స్వగ్రామంలో ముగిశాయి. -
ఓటు వేసి ప్రజాస్వామ్యాన్ని గెలిపించాలి
[ 20-04-2024]
వచ్చేనెల 13న జరగబోయే లోక్సభ ఎన్నికల పోలింగ్ రోజు అందరూ ఓటేసి ప్రజాస్వామ్యాన్ని గెలిపించాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ పిలుపునిచ్చారు. -
సీఎం హెలిప్యాడ్కు మూడు స్థలాల పరిశీలన
[ 20-04-2024]
కాజీపేట మండలం మడికొండ సెయింట్ పాల్స్ మైదానంలో ఈ నెల 24న నిర్వహించనున్న కాంగ్రెస్ పార్టీ బహిరంగ సభకు ఏర్పాట్లు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. -
వరంగల్లో భారాస విజయం ఖాయం
[ 20-04-2024]
వరంగల్ లోక్సభ నియోజకవర్గంలో భారాస విజయం ఖాయమైందని మాజీ మంత్రి దయాకర్రావు అన్నారు. -
మరాడించలే.. లెక్కచూపలే
[ 20-04-2024]
జిల్లాలో సీఎంఆర్(కస్టమ్ మిల్లింగ్ రైస్) ప్రక్రియ నత్తనడకన సాగుతోంది.. రైతులు పండించిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి సేకరిస్తోంది. -
ఎన్నిక ఏదైనా సత్తా చాటారు..!
[ 20-04-2024]
రాజకీయ నేతలు తమ జీవిత కాలంలో ఒక్కసారైనా ఏదో ఒక చట్టసభలో అడుగుపెట్టాలని ఆశిస్తుంటారు.. ఒకరికే ఎమ్మెల్యేగా, ఎంపీగా పోటీ చేసే అవకాశం వచ్చి విజయం సాధిస్తే వారి ఆనందానికి అవధులు ఉండవు. -
అట్టహాసంగా ప్రారంభం.. పరిశోధనలు శూన్యం
[ 20-04-2024]
కాకతీయ విశ్వవిద్యాలయంలో పరిశోధనల నిమిత్తం రూ.50 కోట్లతో కె-హబ్, పీవీ నర్సింహారావు విజ్ఞాన కేంద్రం నిర్మించారు. -
ఓటాస్త్రం.. స్వీయచిత్రమే సాక్ష్యం
[ 20-04-2024]
ఓరుగల్లు నగరంలో ఓటింగ్ శాతం పెంచేందుకు వరంగల్ కలెక్టరేట్ ఆవరణలో సెల్ఫీ పాయింట్ ఏర్పాటు చేశారు. -
రెండోరోజు మూడు నామపత్రాలు
[ 20-04-2024]
వరంగల్ లోక్సభ స్థానానికి రెండోరోజు శుక్రవారం ముగ్గురు అభ్యర్థులు, నాలుగుసెట్ల నామపత్రాలు దాఖలు చేశారని వరంగల్ పార్లమెంట్ రిటర్నింగ్ అధికారి, వరంగల్ జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
వేధింపులు.. ఊడిగంలో తగ్గేదే లేదు
-
విశాఖ-బెంగళూరు మధ్య ప్రత్యేక రైలు
-
ఒలింపిక్స్లో పతకం తెస్తే బీఎండబ్ల్యూ కారు
-
పెళ్లి ఘట్టం.. క్యూఆర్ కోడ్లో నిక్ష్లిప్తం
-
పిల్లలతో అశ్లీల వీడియోలు తీయడం ఆందోళనకరం, నేరం : సుప్రీంకోర్టు
-
వివేకా హత్యలో నాపై రెండు క్రిమినల్ కేసులు.. అఫిడవిట్లో పేర్కొన్న అవినాష్రెడ్డి