సరిహద్దులు దాటుతున్న గంజాయి
గంజాయి అక్రమ రవాణా యథేచ్ఛగా సాగుతోంది. నిఘా కళ్లుగప్పి సరిహద్దులు దాటుతోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చింతూరు ఏజెన్సీ అడ్డాగా మాఫియా నడుస్తోంది. జిల్లాలోని మార్గాలను అసాంఘిక కార్యకలాపాలకు వేదికగా మార్చుకుంది. ద్విచక్రవాహనాలు,
న్యూస్టుడే, వెంకటాపురం
గంజాయి అక్రమ రవాణా యథేచ్ఛగా సాగుతోంది. నిఘా కళ్లుగప్పి సరిహద్దులు దాటుతోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చింతూరు ఏజెన్సీ అడ్డాగా మాఫియా నడుస్తోంది. జిల్లాలోని మార్గాలను అసాంఘిక కార్యకలాపాలకు వేదికగా మార్చుకుంది. ద్విచక్రవాహనాలు, కార్లలో తరలిస్తూ సొమ్ము చేసుకుంటోంది. యువతను మత్తుకు బానిస చేస్తోంది. అప్పుడప్పుడు పోలీసులకు చిక్కుతున్న సంఘటనలతో అక్రమం గుట్టు ప్రస్ఫుటమవుతోంది. నిఘా వ్యవస్థ బలోపేతంతోనే ఈ దందాకు అడ్డుకట్ట పడనుంది.
ప్యాకెట్ల నుంచి తీసిన సరకు
గోదావరి పరివాహక రహదారుల మీదుగా మాదక ద్రవ్యాల అక్రమ తరలింపు సాగుతోంది. పొరుగు రాష్ట్రాల్లో కొనుగోలు చేస్తున్న గంజాయిని దొడ్డిదారిన తెలంగాణలోకి తీసుకొస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అల్లూరిసీతారామరాజు జిల్లా మీదుగా వాహనాలను భద్రాద్రికొత్తగూడెం జిల్లాలోకి చేర్చుతున్నారు. పోలీసుల నిఘాపై రెక్కీలు నిర్వహిస్తూ రూటు మార్చుతున్నారు. భద్రాచలం, మణుగూరు, ఏటూరునాగారం మార్గాలతో పాటు దుమ్ముగూడెం, చర్ల, వెంకటాపురం రహదారుల ద్వారా జిల్లాలోని హైదరాబాద్-భూపాలపట్నం జాతీయ రహదారి మీదుగా రాజధానికి గంజాయిని రవాణా చేస్తున్నారు. ఆయా మార్గాలపై పోలీసుల నిఘా ఉన్న క్రమంలో వాజేడు మండలం చెరుకూరు మార్గంలో ఛత్తీస్గఢ్ రాష్ట్రం తాళ్లగూడెం, పూసూరు-ముళ్లెకట్ట వారధిని దాటిస్తూ అటవీ మార్గమైన తుపాకులగూడెం రోడ్డు ద్వారా మహాముత్తారం, పలిమెల మండలాల మీదుగా భూపాలపల్లి జిల్లా మహారాష్ట్రకు తరలిస్తూ అసాంఘిక మార్గాలుగా మార్చారు.
జిల్లాలో పట్టుబడ్డ ఘటనలు
* ఈ నెల 19న అక్రమంగా కారులో తరలిస్తున్న 105 కిలోల గంజాయిని వెంకటాపురం మండల కేంద్రం శివారులో పోలీసులు పట్టుకున్నారు. రెవెన్యూ అధికారుల సమక్షంలో పంచనామా నిర్వహించి రూ.10 లక్షల నిల్వలను సీజ్ చేశారు. అక్రమానికి పాల్పడిన ముగ్గురు వ్యక్తులపై కేసు నమోదు చేశారు.
* ఈ ఏడాది జనవరి 25న మంగపేట మండలం తిమ్మంపేట మూలమలుపు వద్ద మణుగూరు మార్గంలో అక్రమంగా తరలిస్తున్న రూ.1.30 కోట్ల విలువైన 612 కేజీల గంజాయిని పోలీసులు వలపన్ని పట్టుకున్నారు. వాహనాన్ని సీజ్ చేసి ఐదుగురు వ్యక్తులపై కేసు నమోదు చేశారు.
* గోవిందరావుపేట మండలం పస్రాలో 2020లో 17.5 కేజీలు, 2021లో 2.25 కేజీల గంజాయి నిల్వలను అక్రమార్కుల నుంచి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పలువురిపై కేసులు నమోదు చేశారు.
* 2020 నవంబర్ 1న ద్విచక్రవాహనాలపై బస్తాల్లో తరలిస్తున్న సుమారు 54 కేజీల గంజాయిని ములుగు మండలం పందికుంట ఎక్స్ రోడ్డు వద్ద పోలీసులు చేజిక్కించుకున్నారు. పట్టుబడిన సరకు విలువ రూ.4.32 లక్షలు కాగా ద్విచక్రవాహనం స్వాధీనం చేసుకుని ముగ్గురిపై కేసు నమోదు చేశారు.
* 2020 ఆగస్టు 5న ములుగు మండలం ఇంచర్ల-ఎర్రగట్టమ్మ వద్ద రూ.13.92 లక్షల విలువైన 174 కిలోల నిల్వలను పోలీసులు పట్టుకున్నారు. ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేయడంతో పాటు వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు.
వాహనాల నంబర్లు మార్చి!
సెప్టెంబర్ 19న వెంకటాపురం శివారులో గంజాయి తరలిస్తున్న వాహనాన్ని పట్టుకున్న పోలీసులు
గంజాయిని సేకరిస్తున్న అక్రమార్కులు తరలింపునకు సులభంగా ప్యాక్ చేస్తున్నారు. సుమారు 6 కిలోల బరువు ఉండేలా చతురస్రాకారంలో ముద్దలుగా చేసి వాహనాల్లో నిల్వ చేస్తున్నారు. మహారాష్ట్రకు చెందిన వాహనాలకు ఆంధ్రప్రదేశ్ బోర్డును తగిలిస్తున్నారు. ఒడిశా, ఛత్తీస్గఢ్ వాహనాలకు తెలంగాణ నంబరు ప్లేట్లను నకిలీవి సృష్టించి వాహనాలకు ఏర్పాటు చేస్తున్నారు. ఇటీవల వెంకటాపురంలో పోలీసులకు చిక్కిన వాహనాల ద్వారా ఈ విషయం బహిర్గతమైంది. నిఘా అధికారులను ఏమార్చేందుకు ఆయా ప్రాంతాలకు అనుగుణంగా నంబర్ ప్లేట్లను మార్చుతున్నట్లు సమాచారం.
యువత మత్తుకు బానిస
మన్యంలోని యువత మత్తుకు బానిస అవుతోంది. వెంకటాపురం, వాజేడు, ఏటూరునాగారం, మంగపేట మండలాల్లో పలు గ్రామాల్లో రహస్యంగా గంజాయి విక్రయాలు జరుగుతున్నాయి. మార్కెట్లో లభ్యమయ్యే సిగరెట్లోని నిల్వలను తొలగిస్తున్న స్మగ్లర్లు అందులో గంజాయిని ఏర్పాటు చేస్తున్నారు. ఒక్కో సిగరెట్ను రూ.150 నుంచి రూ.200లకు విక్రయిస్తూ యువత జీవితాలతో చెలగాటమాడుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
షాపింగ్మాల్లో భారీ అగ్నిప్రమాదం
[ 29-03-2024]
వరంగల్ పోచమ్మమైదాన్లోని జెకోటియా షాపింగ్ మాల్లో గురువారం సాయంత్రం 6.45 గంటలకు భారీ అగ్నిప్రమాదం జరిగింది. -
గ్రంథాలయం మాది..పుస్తకం మీది!
[ 29-03-2024]
నేటి తరం పిల్లలు పుస్తక పఠనానికి క్రమంగా దూరమవుతున్నారు. చరవాణుల వ్యామోహంలో పడి గ్రంథాలయాల గడప తొక్కనివారు ఎంతో మంది ఉన్నారు. -
ఎర్రగట్టు గుట్టపై క్షీరాభిషేకం
[ 29-03-2024]
భీమారంలోని ఎర్రగట్టు గుట్టపై వెలసిన వేెంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. నాలుగో రోజు గురువారం స్వామివారికి క్షీరాభిషేకం నిర్వహించారు. -
యథేచ్ఛగా ఆలయ భూముల ఆక్రమణ
[ 29-03-2024]
వరంగల్, హనుమకొండ నగరాల నడిబొడ్డున రూ.కోట్ల విలువైన ఆలయ భూములు ఆక్రమణల చెరలో ఉన్నాయి. ఈ స్థలాల్లో పలుకుబడి ఉన్నవాళ్లు పెద్ద భవనాలు, ఇళ్లు నిర్మించుకున్నారు. -
ఇసుకాసురులపై పోలీసుల కొరడా
[ 29-03-2024]
సహజ వనరులను కాపాడుకుంటూ భవిష్యత్తు తరాలకు అందించినప్పుడే మనుగడ సాధ్యమవుతుంది. కానీ చాలా వరకు గుట్టలు, ఇసుక, మట్టిని గుళ్ల చేస్తూ వనరులను అందిన కాడికి దోచుకుంటున్నారు. -
నాణ్యతా.. వారికి మామూలే!
[ 29-03-2024]
ఉపాధిహామీ పథకం నిధులతో పంచాయతీరాజ్ ఇంజినీరింగ్శాఖ ఆధ్వర్యంలో మహబూబాబాద్, భూపాలపల్లి, ములుగు జిల్లాల్లోని పలు గ్రామాల్లో ఇటీవల సీసీ రోడ్ల నిర్మాణాలు చేపట్టారు. -
వైద్యుడు లేక అందని గుండె పరీక్షల సేవలు
[ 29-03-2024]
జనగామ జిల్లా కేంద్రంగా మారిన తర్వాత జనగామలో ప్రభుత్వం తెలంగాణ డయాగ్నస్టిక్ కేంద్రం, రేడియాలజీ హబ్లను ఏర్పాటు చేసింది. -
మరోసారి కాంగ్రెస్ సత్తా చాటాలి
[ 29-03-2024]
రానున్న లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మాజీ కేంద్ర మంత్రి బలరాంనాయక్ను అధిక మెజారిటీతో గెలిపించాలని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క నాయకులు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. -
ఆస్తి పన్ను బకాయిదారులపై కొరడా
[ 29-03-2024]
ఆస్తి పన్ను మొండి బకాయిదారులపై మున్సిపాలిటీ అధికారులు కొరడా ఝులిపిస్తున్నారు. వారం రోజులుగా ఉదయం 7 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు బకాయిదారుల ఇళ్లు, దుకాణాల వద్దకు వెళ్లి పన్ను చెల్లించాలని కోరుతున్నారు. -
అక్రమ వ్యాపారాలపై ప్రత్యేక నిఘా
[ 29-03-2024]
జిల్లాలో అక్రమ వ్యాపారాలపై పోలీసు యంత్రాంగం ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ అన్నారు. -
వేగవంతంగా చిన్న కాళేశ్వరం ప్రాజెక్టు పనులు
[ 29-03-2024]
మహదేవపూర్ మండలంలోని చిన్న కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ పనులను వేగవంతంగా చేపట్టాలని సంబంధిత నీటిపారుదల శాఖ అధికారులను జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా ఆదేశించారు. -
పల్లెల్లో బెట్టింగ్ల జోరు
[ 29-03-2024]
పట్టణాలకు పరిమితమైన బెట్టింగ్ సంస్కృతి పల్లె ప్రాంతంలో విస్తరించింది. జిల్లాలో మారుమూల ప్రాంతమైన కాటారం రెవెన్యూ డివిజన్ పరిధిలోని పల్లెల్లో యువకులు, వ్యాపారులు, విద్యార్థులు పందేలు కాస్తూ ఆర్థికంగా చితికిపోతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
‘అగ్నివీర్’లో మార్పులకు సిద్ధం: రాజ్నాథ్
-
వైకాపా అభ్యర్థి రాజ్యలక్ష్మి ఎస్టీ కాదంటూ వ్యాజ్యం
-
లోయలో పడిన బస్సు.. 45 మంది మృతి.. గాయాలతో బయటపడ్డ 8 ఏళ్ల బాలిక
-
ఏపీలో రోగులకు ఎన్నికల కష్టాలు
-
అనపర్తి స్థానం మార్పు వైకాపా కుట్ర: నల్లమిల్లి
-
బరిలో ఐదుగురు ఓ.పన్నీర్సెల్వంలు.. అందరి నామినేషన్లు ఆమోదం