వాడీవేడిగా పుర కౌన్సిల్ సమావేశం
జనగామ పురపాలిక కార్యాలయంలో బుధవారం ఛైర్పర్సన్ పోకల జమున అధ్యక్షతన నిర్వహించిన సర్వసభ్య సమావేశంలో గందరగోళం నెలకొంది. అదనపు కలెక్టర్ అబ్దుల్హమీద్, వైస్ఛైర్మన్ మేకల రాంప్రసాద్, కమిషనర్ గీత, డీఈ
వేదికపై ఛైర్పర్సన్ జమున, అదనపు కలెక్టర్ అబ్దుల్హమీద్, ప్రజాప్రతినిధులు
జనగామ, న్యూస్టుడే: జనగామ పురపాలిక కార్యాలయంలో బుధవారం ఛైర్పర్సన్ పోకల జమున అధ్యక్షతన నిర్వహించిన సర్వసభ్య సమావేశంలో గందరగోళం నెలకొంది. అదనపు కలెక్టర్ అబ్దుల్హమీద్, వైస్ఛైర్మన్ మేకల రాంప్రసాద్, కమిషనర్ గీత, డీఈ చంద్రమౌళి సమావేశాన్ని నిర్వహించారు. ముందుగా అజెండా అంశాలపై చర్చించడానికి బదులు గత సమావేశంలో ప్రస్తావించిన సమస్యల పరిష్కారానికి ఏం చర్యలు తీసుకున్నారో చెప్పాలని సభ్యులు కోరగా డీఈ వివరణ ఇచ్చారు. వార్డుల వారీగా సభ్యులు సమస్యలను ప్రస్తావించే క్రమంలో తెరాస సభ్యుడు సురేశ్రెడ్డి మున్సిపల్ ఆదాయ వ్యయాల తనిఖీ అంశాన్ని ప్రస్తావించారు. అది పూర్తయ్యే వరకు గుత్తేదారులకు బిల్లులు ఇవ్వవద్దన్నారు. దీనికి తెరాస ఫ్లోర్లీడర్ ఎం.పాండు అభ్యంతరం చెప్పగా వారిద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. భాజపా సభ్యుడు హరిశ్చంద్రగుప్త ఇదే అంశంపై ‘ఈనాడు’లో ప్రచురితమైన కథనాన్ని ఉటంకిస్తూ వివరణ కోరారు. ఆడిట్ పూర్తయ్యే వరకు గుత్తేదారులకు బిల్లులు ఆపాలని, గత సమావేశంలో తీసుకున్న నిర్ణయాన్ని ప్రస్తావించారు. దీంతో ఆయనతోనూ పాండు వాగ్వాదానికి దిగారు. భాజపా సభ్యురాలు ప్రేమలతారెడ్డి మున్సిపల్ నిధులను ఇతర శాఖల అవసరాలకు వెచ్చించే విధానం సరికాదని మాట్లాడుతుండగా ఆమెతోనూ వాగ్వాదానికి దిగడంతో, భాజపా సభ్యులు ఊడ్గుల శ్రీలత, బొట్ల శ్రీనివాస్ ఈ అంశంపై ఏకాభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. నాలుగేళ్ల నుంచి ఆడిట్ జరగలేదని, ఇలాగే ఉంటే, కొన్ని నిధులు రావని అకౌంటెంట్ సంతోషి సభకు వివరించారు. బిల్లులు ఆపాలని చట్టంలో ఉందా? అని కమిషనర్ రజిత ప్రశ్నించగా.. చట్ట ప్రకారం ఆడిట్ జరగాలని ఉందా లేదా అని సభ్యులు ప్రశ్నించారు. అదనపు కలెక్టర్ జోక్యంతో వివాదం సద్దుమణిగింది.డిప్యూటీ ఫ్లోర్లీడర్ గాదెపాక రాంచందర్ మాట్లాడుతూ రూ.30 కోట్ల ప్రత్యేక నిధులతో చేపట్టిన పనులు ముందుకు సాగడం లేదని, విభాగినుల నిర్మాణం ఎప్పటికి పూర్తవుతుందని ప్రశ్నించారు. ట్రాఫిక్ పోలీస్స్టేషన్ ఏర్పాటు, కూడళ్ల వద్ద సిగ్నలింగ్ వ్యవస్థ ఏర్పాటు, పింఛను డబ్బులు రాక లబ్ధిదారుల ఇబ్బందులు, రైల్వేకల్వర్టు అనుసంధాన పనులపై వివరణ కోరారు. సభ్యులు రామగళ్ల అరుణ, ఎం.సుమలత, ఊడ్గుల శ్రీలత, కళ్యాణి, పేర్ని స్వరూప, బండ పద్మ, అనిత, దయాకర్లు వార్డుల్లోని సమస్యలను వివరించారు. పట్టణంలో పందులు, కుక్కల బెడదను నివారించాలన్నారు. అజెండాలోని అన్ని అంశాలకు ఆమోదం లభించిదని కమిషనర్ రజిత ఒక ప్రకటనలో తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భారాసకు కడియం ఝలక్!
[ 29-03-2024]
అసెంబ్లీ ఎన్నికల్లోనే వరంగల్ లోక్సభ స్థానం పరిధిలో భారాసకు ఎదురుదెబ్బ తగిలింది. ఏడు స్థానాల్లో ఆరు చోట్ల ఓటమి తప్పలేదు. -
మానుకోట ఎమ్మెల్యే వాహనం తనిఖీ
[ 29-03-2024]
లోక్సభ ఎన్నికల నేపథ్యంలో నెల్లికుదురు వద్ద నెలకొల్పిన చెక్ పోస్టు వద్ద గురువారం మహబూబాబాద్ ఎమ్మెల్యే భూక్య మురళీనాయక్, కరీంనగర్ ఎమ్మెల్సీ రఘోత్తంరెడ్డి వాహనాలను తనిఖీ చేశారు. -
షాపింగ్మాల్లో భారీ అగ్నిప్రమాదం
[ 29-03-2024]
వరంగల్ పోచమ్మమైదాన్లోని జెకోటియా షాపింగ్ మాల్లో గురువారం సాయంత్రం 6.45 గంటలకు భారీ అగ్నిప్రమాదం జరిగింది. -
గ్రంథాలయం మాది..పుస్తకం మీది!
[ 29-03-2024]
నేటి తరం పిల్లలు పుస్తక పఠనానికి క్రమంగా దూరమవుతున్నారు. చరవాణుల వ్యామోహంలో పడి గ్రంథాలయాల గడప తొక్కనివారు ఎంతో మంది ఉన్నారు. -
ఎర్రగట్టు గుట్టపై క్షీరాభిషేకం
[ 29-03-2024]
భీమారంలోని ఎర్రగట్టు గుట్టపై వెలసిన వేెంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. నాలుగో రోజు గురువారం స్వామివారికి క్షీరాభిషేకం నిర్వహించారు. -
యథేచ్ఛగా ఆలయ భూముల ఆక్రమణ
[ 29-03-2024]
వరంగల్, హనుమకొండ నగరాల నడిబొడ్డున రూ.కోట్ల విలువైన ఆలయ భూములు ఆక్రమణల చెరలో ఉన్నాయి. ఈ స్థలాల్లో పలుకుబడి ఉన్నవాళ్లు పెద్ద భవనాలు, ఇళ్లు నిర్మించుకున్నారు. -
ఇసుకాసురులపై పోలీసుల కొరడా
[ 29-03-2024]
సహజ వనరులను కాపాడుకుంటూ భవిష్యత్తు తరాలకు అందించినప్పుడే మనుగడ సాధ్యమవుతుంది. కానీ చాలా వరకు గుట్టలు, ఇసుక, మట్టిని గుళ్ల చేస్తూ వనరులను అందిన కాడికి దోచుకుంటున్నారు. -
నాణ్యతా.. వారికి మామూలే!
[ 29-03-2024]
ఉపాధిహామీ పథకం నిధులతో పంచాయతీరాజ్ ఇంజినీరింగ్శాఖ ఆధ్వర్యంలో మహబూబాబాద్, భూపాలపల్లి, ములుగు జిల్లాల్లోని పలు గ్రామాల్లో ఇటీవల సీసీ రోడ్ల నిర్మాణాలు చేపట్టారు. -
వైద్యుడు లేక అందని గుండె పరీక్షల సేవలు
[ 29-03-2024]
జనగామ జిల్లా కేంద్రంగా మారిన తర్వాత జనగామలో ప్రభుత్వం తెలంగాణ డయాగ్నస్టిక్ కేంద్రం, రేడియాలజీ హబ్లను ఏర్పాటు చేసింది. -
మరోసారి కాంగ్రెస్ సత్తా చాటాలి
[ 29-03-2024]
రానున్న లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మాజీ కేంద్ర మంత్రి బలరాంనాయక్ను అధిక మెజారిటీతో గెలిపించాలని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క నాయకులు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. -
ఆస్తి పన్ను బకాయిదారులపై కొరడా
[ 29-03-2024]
ఆస్తి పన్ను మొండి బకాయిదారులపై మున్సిపాలిటీ అధికారులు కొరడా ఝులిపిస్తున్నారు. వారం రోజులుగా ఉదయం 7 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు బకాయిదారుల ఇళ్లు, దుకాణాల వద్దకు వెళ్లి పన్ను చెల్లించాలని కోరుతున్నారు. -
అక్రమ వ్యాపారాలపై ప్రత్యేక నిఘా
[ 29-03-2024]
జిల్లాలో అక్రమ వ్యాపారాలపై పోలీసు యంత్రాంగం ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ అన్నారు. -
వేగవంతంగా చిన్న కాళేశ్వరం ప్రాజెక్టు పనులు
[ 29-03-2024]
మహదేవపూర్ మండలంలోని చిన్న కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ పనులను వేగవంతంగా చేపట్టాలని సంబంధిత నీటిపారుదల శాఖ అధికారులను జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా ఆదేశించారు. -
పల్లెల్లో బెట్టింగ్ల జోరు
[ 29-03-2024]
పట్టణాలకు పరిమితమైన బెట్టింగ్ సంస్కృతి పల్లె ప్రాంతంలో విస్తరించింది. జిల్లాలో మారుమూల ప్రాంతమైన కాటారం రెవెన్యూ డివిజన్ పరిధిలోని పల్లెల్లో యువకులు, వ్యాపారులు, విద్యార్థులు పందేలు కాస్తూ ఆర్థికంగా చితికిపోతున్నారు.