మారుతున్నాం.. మహాత్మా!
నవ సమాజ నిర్మాణంలో పారిశుద్ధ్య నిర్వహణ అత్యంత ముఖ్యమైంది. బహిరంగ మల విసర్జన దారుణం. సభ్య సమాజం తల దించుకునేలా మహిళలు సిగ్గుతో కుమిలి పోతున్నారు. పారిశుద్ధ్య స్థితిని మెరుగు పరచాలి. దేశం అభివృద్ధి పథాన పయనించేందుకు అది తొలి మెట్టు అవుతుంది.
స్వచ్ఛ సర్వేక్షణ్ పోటీలో ఓరుగల్లుకు మెరుగైన ర్యాంకులు
నేడు గాంధీ జయంతి
న్యూస్టుడే, కార్పొరేషన్, నర్సంపేట, వర్ధన్నపేట
నవ సమాజ నిర్మాణంలో పారిశుద్ధ్య నిర్వహణ అత్యంత ముఖ్యమైంది. బహిరంగ మల విసర్జన దారుణం. సభ్య సమాజం తల దించుకునేలా మహిళలు సిగ్గుతో కుమిలి పోతున్నారు. పారిశుద్ధ్య స్థితిని మెరుగు పరచాలి. దేశం అభివృద్ధి పథాన పయనించేందుకు అది తొలి మెట్టు అవుతుంది.
- మహాత్మాగాంధీ
స్వచ్ఛత కోసం పరితపించిన బాపూజీ అడుగుజాడల్లో మన నగరాలు, పురపాలికలు నడుస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన స్వచ్ఛ సర్వేక్షణ్- 2022 పోటీలో జాతీయ స్థాయిలో మన పట్ణణాలు ముందడుగు వేశాయి. గతం కంటే మెరుగైన ర్యాంకులు సాధించి దేశంలో ఏ నగరానికీ, పట్టణానికీ తీసిపోమని నిరూపించాయి. శనివారం సాయంత్రం దిల్లీలో కేంద్ర గృహ, పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ స్వచ్ఛభారత్ ర్యాంకులు ప్రకటించింది. ఆదివారం మహాత్మాగాంధీ జయంతిని పురస్కరించుకుని మన పట్టణాలు సాధించిన స్వచ్ఛ ప్రగతిపై ప్రత్యేక కథనం..
2021లో వరంగల్కు 115వ ర్యాంకు రాగా, ఈసారి 31 ర్యాంకులు పైకి ఎగబాకింది. సిటిజన్ ఫీడ్ బ్యాక్, సర్వీస్ లెవల్ బెంచి మార్కింగ్ (డాక్యుమెంటేషన్)లో గ్రేటర్ వరంగల్ మంచి ప్రతిభ కనబరిచింది.
స్వచ్ఛభారత్ మిషన్ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం ఏడేళ్లుగా స్వచ్ఛ సర్వేక్షణ్ పోటీ నిర్వహిస్తోంది. పట్టణాల్లో పారిశుద్ధ్యం పనులు మెరుగుపరిచే లక్ష్యంతో ఆరోగ్యకరమైన పోటీ చేపట్టింది. 2021-22 సంవత్సరానికి ఈ పోటీలో దేశ వ్యాప్తంగా 4355 పట్టణాలు పాల్గొన్నాయి. నాలుగైదు నెలలుగా స్వచ్ఛ భారత్ టీంలో పట్టణాల్లో పారిశుద్ధ్యం విధానాలు, ప్రణాళికలు పరిశీలించి మార్కులు ఖరారు చేశారు.
పౌరుల నుంచి అభిప్రాయాలు తీసుకుంటున్న బల్దియా సిబ్బంది
జనాభా ప్రాతిపదికన నిర్వహించిన స్వచ్ఛ పోటీల్లో..
* నగరాల విభాగంలో వరంగల్ స్థానం: 84
* పట్టణాల విభాగంలో వర్ధన్నపేట: 7 నర్సంపేట: 17 పరకాల: 12
మరింత మెరుగుపడాలి..
వరంగల్కు చెత్త రహితం, శుద్ధీకరణ, ప్లాస్టిక్ తదితర అంశాల్లో సున్నా మార్కులొచ్చాయి. స్వచ్ఛ సర్వేక్షణ్ మార్కులు తగ్గడానికి ప్రధాన కారణం చెత్త శుద్ధీకరణ లేకపోవడమేనని నిపుణులంటున్నారు. వరంగల్ను చెత్త రహితం చేయడం, చెత్త శుద్ధీకరణ కోసం ప్రారంభించిన బయోమైనింగ్ ప్రాజెక్టు పనులు ఆపేయడంతో మార్కులు తగ్గాయి.
స్వచ్ఛ సర్వేక్షణ్-2022 పోటీలో 4355 పట్టణాలు పాల్గొన్నాయి.
* సర్వీస్ లెవల్ బెంచి (ఎస్ఎల్బీ)లో 3 వేలు, సర్టిఫికేషన్లో 2250, సిటిజన్ ఫీడ్ బ్యాక్లో 2250 చొప్పున మొత్తం 7500 మార్కులు నిర్ణయించారు.
* గ్రేటర్ వరంగల్కు ఎస్ఎల్బీలో 2145, సర్టిఫికేషన్లో 600, సిటిజన్ ఫీడ్బ్యాక్లో 1932 మార్కులొచ్చాయి. 4677 మార్కులతో 84వ స్థానం దక్కింది.
టాప్-10 మా లక్ష్యం : - గుండు సుధారాణి, మేయరు
గతేడాది కంటే ర్యాంకు మెరుగైంది. జాతీయ స్థాయిలో 84 సాధించడం సంతోషంగా ఉంది. కమిషనర్, ప్రజాప్రతినిధులు, కార్పొరేటర్లు, అధికారులు, పారిశుద్ధ్య కార్మికుల కృషితోనే జరిగింది. వచ్చే ఏడాది టాప్-10లో నిలిచేందుకు పక్కా ప్రణాళికతో ముందుకెళ్తాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జజ్జనకర.. జనజాతర
[ 25-04-2024]
కాజీపేట మండలం మడికొండలో ఏర్పాటు చేసిన ఓరుగల్లు జనజాతర బహిరంగ సభ విజయవంతమైంది. వరంగల్ లోక్సభ పరిధిలోని ఏడు సెగ్మెంట్ల నుంచి భారీగా జనసమీకరణ చేయడంతో సభా ప్రాంగణం కిక్కిరిసిపోయింది. -
ప్రథమంలో 24 ద్వితీయంలో 26
[ 25-04-2024]
ఇంటర్మీడియట్ వార్షిక ఫలితాల్లో వరంగల్ జిల్లా వెనుకబడింది. ప్రథమ సంవత్సరం ఫలితాల్లో రాష్ట్రంలో 24వ స్థానం, ద్వితీయ సంవత్సరంలో 26వ స్థానంలో నిలిచింది. -
హస్తం జోరు..
[ 25-04-2024]
హనుమకొండ జిల్లా పరిధిలోని కాజీపేట మండలం మడికొండలో నిర్వహించిన ఓరుగల్లు జనజాతర బహిరంగ సభ విజయవంతం కావడం కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం నింపింది. -
ఇంటర్ ఫలితాల్లో ములుగు వెలుగు
[ 25-04-2024]
రాష్ట్ర ప్రభుత్వం బుధవారం విడుదల చేసిన ఇంటర్మీడియట్ ఫలితాల్లో ములుగు జిల్లా అగ్రస్థానంలో నిలిచింది. రాష్ట్రంలోని అన్ని జిల్లాలను వెనకకు నెట్టి ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో మొదటి స్థానంలో నిలిచింది. -
ఇంటర్ ఫలితాల్లో బాలికలదే హవా
[ 25-04-2024]
ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాల్లో ప్రథమ, ద్వితీయ సంవత్సర ఉత్తీర్ణతలో బాలికలదే పైచేయిగా నిలిచింది. బుధవారం ప్రకటించిన ఫలితాల్లో జిల్లాలో ప్రథమ సంవత్సరం 55.72 శాతంతో రాష్ట్రంలో 17వ స్థానం పొందింది. -
బాలికలదే పైచేయి
[ 25-04-2024]
ఇంటర్ బోర్డు అధికారులు బుధవారం విడుదల చేసిన ఇంటర్ ఫలితాల్లో జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో బాలికలే పై చేయి సాధించారు. -
ఇంటర్ ఫలితాల్లో బాలికలదే పైచేయి
[ 25-04-2024]
ఇంటర్ పరీక్ష ఫలితాలు బుధవారం వెలువడిన నేపథ్యంలో జిల్లాలో ఉత్తీర్ణత శాతం గత విద్యా సంవత్సరంతో పోలిస్తే ఈ ఏడాది వెనక్కి వెళ్లింది. -
21 నామపత్రాల దాఖలు
[ 25-04-2024]
వరంగల్ లోక్సభ స్థానానికి బుధవారం 19 మంది అభ్యర్థులు 21 నామపత్రాలను రిటర్నింగ్ అధికారి ప్రావీణ్యకు సమర్పించారు. భారాస పార్టీ అభ్యర్థి మారపల్లి సుధీర్కుమార్ తరఫున భారాస నాయకులు, -
ఆదర్శం.. గంగారం కస్తూర్బా విద్యాలయం
[ 25-04-2024]
మారుమూల ఏజెన్సీలోని కస్తూర్బా గాంధీ బాలికల గురుకుల విద్యాలయం(కేజీబీవీ) విద్యార్థినులు ఇంటర్ ఫలితాల్లో వందశాతం ఫలితాలు సాధించి సత్తా చాటారు.
తాజా వార్తలు (Latest News)
-
జూదరులతో కలిసి పుట్టిన రోజు వేడుకలు.. మంగళ్హాట్ డీఐ సస్పెన్షన్ ?
-
ఒకే ద్విచక్రవాహనంపై ప్రయాణం.. బస్సు ఢీకొని నలుగురు ఇంటర్ విద్యార్థుల మృతి
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)