పాలకమండలి సమావేశాలకు గ్రహణం!
ఏటూరునాగారం ఐటీడీఏలో పాలకమండలి సమావేశాల ఊసే లేకుండా పోయింది. సుమారు మూడేళ్లుగా నిర్వహణకు నోచుకోవడం లేదు. వివిధ శాఖల్లో ఎన్నో సమస్యలు పేరుకుపోయాయి. ఫలితంగా గిరిజనాభివృద్ధి కుంటుపడుతోంది. ఐటీడీఏలోని కీలక శాఖల్లో పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
మూడేళ్లుగా నిర్వహణలో జాప్యం
ఏటూరునాగారంలోని డ్రైమిక్స్ యూనిట్
ఏటూరునాగారం, న్యూస్టుడే: ఏటూరునాగారం ఐటీడీఏలో పాలకమండలి సమావేశాల ఊసే లేకుండా పోయింది. సుమారు మూడేళ్లుగా నిర్వహణకు నోచుకోవడం లేదు. వివిధ శాఖల్లో ఎన్నో సమస్యలు పేరుకుపోయాయి. ఫలితంగా గిరిజనాభివృద్ధి కుంటుపడుతోంది. ఐటీడీఏలోని కీలక శాఖల్లో పోస్టులు ఖాళీగా ఉన్నాయి. గిరిజన సంక్షేమ ఇంజినీరింగ్, విద్య విభాగాలు మినహా మిగతావి కానరావడం లేదు. దశాబ్ద కాలంగా వ్యవసాయ విభాగం నుంచి చేసిన కార్యక్రమాలేవీ లేవు. 60వ పాలక మండలి సమావేశాన్ని 2019 డిసెంబర్ 20న నిర్వహించారు. అప్పటి నుంచి 61వ సమావేశం నిర్వహణకు నోచుకోలేదు.
పలు శాఖల్లో పోస్టులు ఖాళీ
ఐటీడీఏలో పరిపాలనా, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్, వైద్య, గిరిజన సంక్షేమ ఇంజినీరింగ్, ఉప విద్యా శాఖాధికారి, గిరిజన సహకార సంస్థ, మత్స్య పరిశ్రమ శాఖ, ఉద్యానవన, వ్యవసాయ, పట్టు పరిశ్రమ.. ఇలా పలు శాఖల్లో అధికారులు, సిబ్బంది పోస్టులు చాలా వరకు ఖాళీగా ఉన్నాయి. 2 వ్యవసాయాధికారుల పోస్టులుండగా అందులో ఒకరు పీఏవో స్థాయిలో, మరొకరు వ్యవసాయాధికారిగా పని చేయాల్సి ఉంటుంది. ఇంతకాలం పీఏవోగా పని చేసిన లక్ష్మీ ప్రసన్నను ప్రభుత్వం మాతృశాఖకు బదిలీ చేసింది. దీంతో ఆ శాఖ మొత్తానికే ఖాళీ అయింది. ఏఈవో 1, డేటా ప్రాసెసింగ్ అధికారి 1, సీనియర్ అసిస్టెంట్ 3, సీనియర్ అకౌంటెంట్ 2, సబ్ అసిస్టెంట్ 1, స్టెనో కమ్ టైపిస్ట్ 1, ష్రాఫ్ 1, డ్రైవర్ 2, అటెండర్లు 1, మాలి 2, రాత్రి కాపలాదారు 1.. పోస్టులు ఖాళీగా ఉన్నాయి. పశుగణాభివృద్ధి శాఖ పత్తా లేకుండా పోయింది.
యూనిట్లకు గడ్డు కాలం
ఐటీడీఏ ఆధ్వర్యంలో ఎంఎస్ఎంఈ పథకం కింద అందించిన యూనిట్లు కుంటి నడకన నడుస్తున్నాయి. 2021-22 ఆర్థిక సంవత్సరానికి గాను 8 యూనిట్లు మంజూరు చేశారు. సెంట్రింగ్ యూనిట్లు, కాంక్రీటు మిక్సింగ్ యంత్రాలను అందజేశారు. ఈ యూనిట్లను గ్రూపులుగా ఏర్పాటు చేసి ఒక్కో గ్రూపునకు ఒక యూనిట్ను అందించారు. మరో ఐదు గ్రూపులకు అందించాల్సి ఉంది. రుతు రుమాళ్లు, డిటర్జెంట్ సబ్బుల తయారీ, డ్రైమిక్స్, డిటర్జెంట్ యూనిట్ల నిర్వాహకులు ఆశ్రమ పాఠశాలలు, వసతి గృహాలకు మాత్రమే తమ ఉత్పత్తులను సరఫరా చేస్తున్నారు. బయటి మార్కెట్కు అమ్మేందుకు వీలు లేకుండా పోయింది. మళ్లీ జీసీసీ ఆర్డర్ వచ్చే వరకు వేచి చూడాల్సిన పరిస్థితి. డ్రైమిక్స్ యూనిట్ నిర్వాహకులు కూడా జీసీసీ ఇండెంట్ ఇస్తేనే తయారు చేసి సరఫరా చేస్తున్నారు. జీసీసీ ఆర్డర్ ఇవ్వకపోతే యూనిట్లు మూతపడే పరిస్థితి నెలకొంది.
తీర్మానాలు నామమాత్రమే..
సకాలంలో తదుపరి సమావేశం నిర్వహిస్తామంటూ ప్రతి పాలక మండలి సమావేశంలో తీర్మానిస్తారు. కానీ సమయానికి ఏ ఒక్క సమావేశం కూడా నిర్వహణ చేపట్టలేదు. 59వ, 60వ సమావేశాల మధ్య రెండేళ్ల విరామం నెలకొంది. నిబంధనల ప్రకారం ప్రతి మూడు నెలలకోసారి నిర్వహించాల్సి ఉంటుంది. సకాలంలో నిర్వహిస్తే సభ్యులంతా పథకాల అమలు తీరుపై సమగ్రంగా చర్చించగలుగుతారు. తద్వారా ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు గిరిజనులకు అందుతున్నాయా లేదా తెలుస్తుంది. పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది.
సకాలంలో అందని ‘ఆర్థిక స్వావలంబన’
ఐటీడీఏలో ప్రధానంగా అమలయ్యే ఆర్థిక స్వావలంబన పథకం అడవి బిడ్డలకు సకాలంలో అందడం లేదు. వ్యవసాయ, విద్య, స్వయం ఉపాధి, వృత్తి, ఉద్యోగ శిక్షణల వంటి ఎన్నో రంగాల్లో ఈ పథకం కింద కిరాణ దుకాణాలు, జిరాక్స్ సెంటర్లు, ఇటుకల తయారీ వంటి చిన్న చిన్న పరిశ్రమలు, వాహనాలు, షామియానా దుకాణాల వంటి తదితర ఎన్నో రకాల యూనిట్లు, బ్యూటీషియన్ కోర్సులో, డ్రైవింగ్లో శిక్షణలు వంటి కార్యక్రమాలను అందిస్తారు. 2017-18 ఆర్థిక సంవత్సరంలో 3,375 మంది గిరిజనులకు రూ.34.73 కోట్ల సబ్సిడీ అందేలా వివిధ యూనిట్లను అందించేందుకు లక్ష్యంగా తీసుకున్నారు. సంబంధిత యూనిట్లలో సగానికి పైగా ఇంత వరకు లబ్ధిదారులకు అందించలేదు. 2015-16, 2016-17 ఆర్థిక సంవత్సరపు యూనిట్లు కూడా ఇంకా కొందరికి అందించాల్సి ఉంది. 2018-19, 2019-20లో ప్రతిపాదనలే చేయలేదు. 2020-21, 2021-22 ఆర్థిక సంవత్సరాల్లో మంజూరైన యూనిట్లు ఇంకా అందలేదు.
ఈ నెలలో నిర్వహించేందుకు ఏర్పాట్లు
- అంకిత్, పీవో, ఐటీడీఏ
ఐటీడీఏ 61వ పాలక మండలి సమావేశం ఈ నెలలో నిర్వహించేందుకు కసరత్తు చేస్తున్నాం. ఇప్పటికే గౌరవ సభ్యులు సమయాన్ని కేటాయించాలని కోరాం. కరోనా వ్యాప్తి కారణంగా జాప్యం జరిగింది. సంబంధిత ఎజెండా అంశాలను కూడా సిద్ధం చేశాం. అనుకూల సమయాన్ని చూసి సమావేశం ఏర్పాటు చేస్తాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అవిశ్వాసం దిశగా అసంతృప్తి..
[ 26-04-2024]
గ్రేటర్ వరంగల్ మేయర్ సుధారాణి, ఉప మేయర్ రిజ్వానా షమీమ్లకు అవిశ్వాస గండం పొంచి ఉంది. -
ఓటు వేటలో నడక బాట!
[ 26-04-2024]
వరంగల్ లోక్సభ భాజపా అభ్యర్థి అరూరి రమేష్, భారాస అభ్యర్థి ఎం.సుధీర్కుమార్ వాకర్స్ మద్దతు కోరుతూ గురువారం ప్రచారం నిర్వహించారు. -
‘కాంగ్రెస్కు ఓటమి తప్పదు’
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికల్లో భాగంగా వరంగల్ భారాస ఎంపీ అభ్యర్థి సుధీర్కుమార్కు మద్దతుగా తొర్రూరు మండలంలోని వెలికట్ట శివారులో గురువారం నిర్వహించిన కార్యకర్తల సమావేశానికి ముఖ్య అతిథిగా మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు హాజరై ప్రసంగించారు. -
పెద్దమ్మతల్లి వేడుకల్లో ఎమ్మెల్యే కడియం
[ 26-04-2024]
మండలంలోని ఇప్పగూడెం, చాగల్లు గ్రామాల్లో నిర్వహిస్తున్న పెద్దమ్మతల్లి ఉత్సవాల్లో ఎమ్మెల్యే కడియం శ్రీహరి గురువారం పాల్గొన్నారు. -
అర్హత లేకుండా వైద్యం.. ప్రాణాలతో చెలగాటం
[ 26-04-2024]
రాష్ట్ర వైద్య మండలి ఛైర్మన్ డాక్టర్ మహేశ్కుమార్ ఆదేశాల మేరకు టీఎస్ఎంసీ సభ్యులు డాక్టర్ శేషుమాధవ్, డాక్టర్ నరేశ్కుమార్, ఐఎంఏ, తానా, భూపాలపల్లి డీఎంహెచ్వో సంయుక్తంగా -
రెండు పడక గదుల ఇళ్లు అమ్మితే చర్యలు
[ 26-04-2024]
లబ్ధిదారులకు కేటాయించిన రెండు పడక గదుల ఇళ్లను ఎవరైనా అమ్మితే వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా తెలిపారు. -
ఓటు చైతన్యం..!
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికల్లో పోలింగ్ శాతం అధికంగా నమోదు కోసం ప్రజల్లో చైతన్యం కల్పించేందుకు స్వీప్ ఆధ్వర్యంలో గురువారం జిల్లా కేంద్రంలో తెలంగాణ సాంస్కృతిక సారథి కళాబృందం ప్రదర్శనలు నిర్వహించారు. -
అటవీశాఖ ప్రత్యేక గస్తీ
[ 26-04-2024]
మండలంలోని నగరం, బాలాజీతండా, కోట్యానాయక్తండా, పోచారం పరిసరాల్లో ఉన్న బెరైటీస్ ఖనిజాల పరిరక్షణకు అటవీశాఖాధికారులు ప్రత్యేక గస్తీని ఏర్పాటు చేశారు. -
‘భయంతోనే ప్రతిపక్ష నాయకులపై కేసులు’
[ 26-04-2024]
దేశానికి రాహుల్ గాంధీ ప్రధాని కాబోతున్నారని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క అన్నారు. -
ఉత్తమ లోకోషెడ్ అవార్డు అందజేత
[ 26-04-2024]
దక్షిణ మధ్య రైల్వేలో లోకోల నిర్వహణలో కాజీపేట డీజిల్ లోకోషెడ్ అందుకున్న ఉత్తమ అవార్డును జనరల్ మేనేజర్ అరుణ్కుమార్ జైన్ చేతుల మీదుగా షెడ్ సీనియర్ డీఎంఈ స్వరాజ్కుమార్ గురువారం స్వీకరించారు. -
పేదింట మృత్యుఘోష
[ 26-04-2024]
వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం ఇల్లంద గ్రామ శివారులో బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో చనిపోయిన నలుగురు యువకులవి పేద కుటుంబాలు.. తల్లిదండ్రులు ఏదో ఒక పని చేస్తేనే పూటగడిచేది. -
అక్రమ మద్యం నియంత్రణకు మొబైల్ తనిఖీ కేంద్రాలు
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికలను పురస్కరించుకొని ములుగు జిల్లాలో మత్తు, గంజాయి, అక్రమ మద్యం దిగుమతి కాకుండా ఏడు ప్రత్యేక మొబైల్ తనిఖీ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎక్సైజ్ అధికారి వి.శ్రీనివాస్ తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్లు మార్పిడి!
-
సివిల్స్ ఫలితాల్లో వికారాబాద్ జిల్లా యువకుడి పొరపాటు
-
ఎంత దెబ్బకు అంత బ్యాండేజ్ కాదా!
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని