75 అడుగుల భారీ రావణ బొమ్మ, లేజర్ షో
రాష్ట్రంలోనే మైసూర్ తరహాలో వరంగల్ ఉర్సు గుట్ట రంగలీల మైదానంలో అత్యంత వైభవంగా నిర్వహించనున్న సద్దుల బతుకమ్మ, దసరా ఉత్సవాలకు అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి అయ్యాయని, ప్రజలు ఉత్సవాలను విజయవంతం చేయాలని ఉర్సు, కరీమాబాద్ బతుకమ్మ, దసరా ఉత్సవ కమిటీ అధ్యక్ష, కార్యదర్శులు నాగపూరి సంజయ్బాబు, మేడిది మధుసూదన్ తెలిపారు.
మాట్లాడుతున్న సంజయ్బాబు, మధుసూదన్ తదితరులు
కరీమాబాద్, న్యూస్టుడే: రాష్ట్రంలోనే మైసూర్ తరహాలో వరంగల్ ఉర్సు గుట్ట రంగలీల మైదానంలో అత్యంత వైభవంగా నిర్వహించనున్న సద్దుల బతుకమ్మ, దసరా ఉత్సవాలకు అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి అయ్యాయని, ప్రజలు ఉత్సవాలను విజయవంతం చేయాలని ఉర్సు, కరీమాబాద్ బతుకమ్మ, దసరా ఉత్సవ కమిటీ అధ్యక్ష, కార్యదర్శులు నాగపూరి సంజయ్బాబు, మేడిది మధుసూదన్ తెలిపారు. ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు ఉత్సవాల ఏర్పాట్లను వివరించారు. ఉత్సవాల్లో ముఖ్య అతిథిగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, అతిథులుగా మేయర్ సుధారాణి, ఎమ్మెల్సీలు బస్వరాజు సారయ్య, బండా ప్రకాశ్, ఎంపీ దయాకర్, జిల్లా కలెక్టర్ గోపి, పోలీసు కమిషనర్ తరుణ్జోషి, బల్దియా’ కమిషనర్ ప్రావీణ్య, స్థానిక కార్పొరేటర్లు పాల్గొంటారన్నారు. లైటింగ్, బారికేడ్ల నిర్మాణం, ఇతర సౌకర్యాలు కల్పించనున్నట్లు తెలిపారు. సద్దుల బతుకమ్మ సంబురాల్లో పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. 5న దసరా నాడు సాయంత్రం 4 గంటలకు కరీమాబాద్ రామస్వామి గుడి నుంచి సీతారాముడు, లక్ష్మణుడు, ఆంజనేయస్వామి విగ్రహాలతో రథం బయలుదేరి ఉర్సుగుట్ట రంగలీలా మైదానానికి చేరుకుంటుందన్నారు. సాయంత్రం 7 గంటలకు జిల్లా సాంస్కృతిక మండలి ఆధ్వర్యంలో కార్యక్రమాలు ప్రారంభమవుతాయన్నారు. తూర్పు ఎమ్మెల్యే నరేందర్ అధ్యక్షతన సభానంతరం 75 అడుగుల రావణ విగ్రహ వధను ముఖ్య అతిథులు ప్రారంభిస్తారన్నారు. ఈసారి ఉత్సవాలలో గుట్టపై లేజర్షో, వివిధ కళాప్రదర్శనలు, మిమిక్రీ షోలుంటాయన్నారు. భారీగా బాణాసంచా కాల్చనున్నట్లు ఉత్సవ కమిటీ ట్రస్టు అధ్యక్షుడు కోటేశ్వర్ వివరించారు. ఉత్సవ కమిటీ కన్వీనర్ వొడ్నాల నరేందర్ వాహనాల పార్కింగ్ ఏర్పాట్లను తెలిపారు. కాగా కమిటీలో గత 30సంవత్సరాలుగా కోశాధికారిగా పనిచేస్తున్న తనను ఆ పదవి నుంచి తప్పించి ప్రస్తుతం అమెరికాలో ఉన్న వ్యక్తికి ఇవ్వడంపై మీడియా సమక్షంలో ప్రశ్నించిన మండ వెంకన్నగౌడ్ను కమిటీ నుంచి తొలగిస్తున్నట్లు ఉత్సవ కమిటీ అధ్యక్షుడు నాగపూరి సంజయ్బాబు తెలిపారు. సమావేశంలో ఉత్సవ కమిటీ కార్యనిర్వహణ కార్యదర్శులు అనిల్కుమార్, రాంప్రసాద్, సమ్మయ్య, వెంకటేశ్వర్లు, వాసు, సందీప్, రంజిత్గౌడ్, సంజయ్, రాజు, వేణు, అజయ్, అశోక్, మహేశ్, శ్రీను, అఖిల్ తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జజ్జనకర.. జనజాతర
[ 25-04-2024]
కాజీపేట మండలం మడికొండలో ఏర్పాటు చేసిన ఓరుగల్లు జనజాతర బహిరంగ సభ విజయవంతమైంది. వరంగల్ లోక్సభ పరిధిలోని ఏడు సెగ్మెంట్ల నుంచి భారీగా జనసమీకరణ చేయడంతో సభా ప్రాంగణం కిక్కిరిసిపోయింది. -
ప్రథమంలో 24 ద్వితీయంలో 26
[ 25-04-2024]
ఇంటర్మీడియట్ వార్షిక ఫలితాల్లో వరంగల్ జిల్లా వెనుకబడింది. ప్రథమ సంవత్సరం ఫలితాల్లో రాష్ట్రంలో 24వ స్థానం, ద్వితీయ సంవత్సరంలో 26వ స్థానంలో నిలిచింది. -
హస్తం జోరు..
[ 25-04-2024]
హనుమకొండ జిల్లా పరిధిలోని కాజీపేట మండలం మడికొండలో నిర్వహించిన ఓరుగల్లు జనజాతర బహిరంగ సభ విజయవంతం కావడం కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం నింపింది. -
ఇంటర్ ఫలితాల్లో ములుగు వెలుగు
[ 25-04-2024]
రాష్ట్ర ప్రభుత్వం బుధవారం విడుదల చేసిన ఇంటర్మీడియట్ ఫలితాల్లో ములుగు జిల్లా అగ్రస్థానంలో నిలిచింది. రాష్ట్రంలోని అన్ని జిల్లాలను వెనకకు నెట్టి ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో మొదటి స్థానంలో నిలిచింది. -
ఇంటర్ ఫలితాల్లో బాలికలదే హవా
[ 25-04-2024]
ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాల్లో ప్రథమ, ద్వితీయ సంవత్సర ఉత్తీర్ణతలో బాలికలదే పైచేయిగా నిలిచింది. బుధవారం ప్రకటించిన ఫలితాల్లో జిల్లాలో ప్రథమ సంవత్సరం 55.72 శాతంతో రాష్ట్రంలో 17వ స్థానం పొందింది. -
బాలికలదే పైచేయి
[ 25-04-2024]
ఇంటర్ బోర్డు అధికారులు బుధవారం విడుదల చేసిన ఇంటర్ ఫలితాల్లో జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో బాలికలే పై చేయి సాధించారు. -
ఇంటర్ ఫలితాల్లో బాలికలదే పైచేయి
[ 25-04-2024]
ఇంటర్ పరీక్ష ఫలితాలు బుధవారం వెలువడిన నేపథ్యంలో జిల్లాలో ఉత్తీర్ణత శాతం గత విద్యా సంవత్సరంతో పోలిస్తే ఈ ఏడాది వెనక్కి వెళ్లింది. -
21 నామపత్రాల దాఖలు
[ 25-04-2024]
వరంగల్ లోక్సభ స్థానానికి బుధవారం 19 మంది అభ్యర్థులు 21 నామపత్రాలను రిటర్నింగ్ అధికారి ప్రావీణ్యకు సమర్పించారు. భారాస పార్టీ అభ్యర్థి మారపల్లి సుధీర్కుమార్ తరఫున భారాస నాయకులు, -
ఆదర్శం.. గంగారం కస్తూర్బా విద్యాలయం
[ 25-04-2024]
మారుమూల ఏజెన్సీలోని కస్తూర్బా గాంధీ బాలికల గురుకుల విద్యాలయం(కేజీబీవీ) విద్యార్థినులు ఇంటర్ ఫలితాల్లో వందశాతం ఫలితాలు సాధించి సత్తా చాటారు.
తాజా వార్తలు (Latest News)
-
టెక్ మహీంద్రా లాభంలో 41 శాతం క్షీణత.. ఒక్కో షేరుపై రూ.28 డివిడెండ్
-
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ.. ఏపీ హైకోర్టు కీలక ఆదేశం
-
యూపీఎస్సీ - 2025 పరీక్షల క్యాలెండర్ విడుదల.. ‘సివిల్స్’ పరీక్షలు ఎప్పుడంటే?
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
కాళేశ్వరం ఆనకట్టలపై ఫిర్యాదులు, నివేదనలు కోరుతూ ప్రకటన జారీ
-
అమెరికా నివేదికకు విలువ లేదు.. ‘మానవ హక్కుల ఉల్లంఘన’ అంశంపై భారత్ సీరియస్