మహనీయుల బాటలో నడుద్దాం
మండలంలోని సికింద్రాబాద్ తండాలో గాంధీ జయంతిని పురస్కరించుకొని ఆదివారం ఆదరణ వృద్ధాశ్రమంలో వాసవి క్లబ్, ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మహాత్మ గాంధీ, స్వామి వివేకానంద విగ్రహాలను ఎస్పీ శరత్చంద్ర పవార్ ఆవిష్కరించారు.
సికింద్రాబాద్ తండాలో వృద్ధాశ్రమంలో విగ్రహాలను ఆవిష్కరిస్తున్న ఎస్పీ శరత్చంద్ర పవార్ తదితరులు
మహబూబాబాద్ రూరల్, న్యూస్టుడే: మండలంలోని సికింద్రాబాద్ తండాలో గాంధీ జయంతిని పురస్కరించుకొని ఆదివారం ఆదరణ వృద్ధాశ్రమంలో వాసవి క్లబ్, ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మహాత్మ గాంధీ, స్వామి వివేకానంద విగ్రహాలను ఎస్పీ శరత్చంద్ర పవార్ ఆవిష్కరించారు. రూరల్ సీఐ రవికుమార్, ఎస్సై అరుణ్కుమార్ వృద్ధులకు దుస్తులు, పండ్లు పంపిణీ చేశారు. అనాథ పిల్లలను చేరదీసిన లోకేష్ సేవలు అభినందనీయమన్నారు. విగ్రహాలు అందజేసిన వేంశెట్టి కిషోర్, వృద్ధులకు సహాయం అందిస్తున్న చిదిరాల ప్రభాకర్ను ఎస్పీ సన్మానించారు. వాసవి క్లబ్ అధ్యక్షులు వేంశెట్టి వేణుమాధవ్, కార్యదర్శి మురళి, వెంకటేశ్వర్లు, ముత్యం వెంకన్న, రాంచంద్రారెడ్డి, వెంకటేశ్, చిట్టిబాబు తదితరులున్నారు.
రక్తదానం సామాజిక బాధ్యత
నెహ్రూసెంటర్: రక్తదానం సామాజిక బాధ్యత అని జిల్లా అదనపు కలెక్టర్ డేవిడ్ అన్నారు. ఆదివారం మహాత్మాగాంధీ జయంతి పురస్కరించుకొని మహబూబాబాద్ సబ్జైలులో నిర్వహించిన వివిధ కార్యక్రమాలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సబ్జైలులో మొక్కలు నాటిన ఆయన గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడారు. రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించిన శిబిరంలో రక్తదానం చేసిన వారిని అభినందించి ప్రశంసాపత్రాలు అందజేశారు. ఆటల పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు. సివిల్ సప్లై అధికారి నర్సింహరావు, జైలు అధికారులు భిక్షపతి, రవీందర్, అరున్కుమార్, రామరాజు, శ్రీనివాస్, శేఖర్, నిరంజన్, నారాయణ, డాక్టర్ లక్ష్మణ్, భార్గవ్, సుధ, మోహన్ నరేందర్ తదితరులున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కబ్జా కోరల్లో చెరువులు..
[ 23-04-2024]
ఉమ్మడి వరంగల్ వ్యాప్తంగా కాకతీయులు నిర్మించిన గొలుసుకట్టు చెరువులపై కబ్జాదారులు కన్నేశారు. భూముల విలువ పెరగడంతో శిఖం భూములను యథేచ్ఛగా ఆక్రమించుకుంటున్నారు -
అంతర్రాష్ట్ర దొంగ అరెస్టు
[ 23-04-2024]
పలు ప్రాంతాల్లో దొంగతనాలకు పాల్పడుతున్న నిందితుడిని జనగామ పోలీసులు అరెస్టు చేశారు. స్థానిక పట్టణ పోలీస్ స్టేషన్లో సోమవారం వెస్ట్జోన్ డీసీపీ పి.సీతారాం జనగామ ఏసీపీ అంకిత్కుమార్తో కలిసి నిర్వహించిన విలేకరుల సమావేశంలో కేసు వివరాలను వెల్లడించారు -
మార్కెట్లో కొనుగోళ్లు చేపట్టాలని ధర్నా
[ 23-04-2024]
జనగామ వ్యవసాయ మార్కెట్లో అన్ని రకాల వ్యవసాయ ఉత్పత్తుల క్రయవిక్రయాలు ప్రారంభించాలని, మూసివేసిన మార్కెట్ను తెరవాలని తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో స్థానిక మార్కెట్ గేటు ముందు ధర్నా నిర్వహించారు -
గొర్రెల పంపిణీకి మంగళం!
[ 23-04-2024]
గొర్రెల పంపిణీకి చెల్లించిన డబ్బులను వెనక్కి ఇవ్వాలని పశు సంవర్థక శాఖ అధికారులు నిర్ణయించారు -
‘భూమి పోతే ఆత్మహత్యలే దిక్కు’
[ 23-04-2024]
న్యూ గ్రీన్ ఫీˆల్డ్ హైవే వల్ల మా వ్యవసాయ భూములు పోతే ఆత్మహత్యలే దిక్కు అని ఇస్సిపేట రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం గ్రామ శివారులో చేపట్టిన రోడ్డు సర్వేను ఆ గ్రామ రైతులు అడ్డుకున్నారు -
భాజపాను ఆశీర్వదించండి.. అభివృద్ధి చేస్తాం
[ 23-04-2024]
మహబూబాబాద్: మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో సోమవారం భాజపా నిర్వహించిన రోడ్షో ఆ పార్టీ శ్రేణుల్లో జోష్ నింపింది. -
గాలివాన బీభత్సం.. అపార నష్టం
[ 23-04-2024]
ఆదివారం సాయంత్రం జిల్లాలో గాలివాన అపార నష్టం మిగిల్చింది. వరి, మామిడి పంటల రైతులకు గుండె కోత మిగిలింది. విద్యుత్తు శాఖకు తీవ్ర నష్టం వాటిల్లింది. -
నవ వధువు ఆత్మహత్య
[ 23-04-2024]
వివాహం జరిగిన 19 రోజులకే ఓ నవ వధువు ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన ఏటూరునాగారం మండలంలోని రాంనగర్ గ్రామంలో చోటు చేసుకుంది. -
విన్నవించాం.. పరిష్కరించండి
[ 23-04-2024]
ప్రజావాణిలో వచ్చిన అర్జీలకు పరిష్కారం చూపాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టర్ ఫిర్యాదులు స్వీకరించారు -
ఇక్కడా కబ్జాల పర్వం.. వెంటాడుతున్న బెంగుళూరు భయం!
[ 23-04-2024]
బెంగళూరు నగరంలో తీవ్రమైన తాగునీటి ఎద్దడి నెలకొంది. భూగర్భ జలాలు అడుగంటాయి.. కారణం చెరువులు, కుంటలు కబ్జాలకు గురై నీటినిల్వకు చోటు లేకపోవడమే. -
నామపత్రాల జాతర..
[ 23-04-2024]
వరంగల్ రిటర్నింగ్ అధికారి కార్యాలయం సోమవారం జాతరను తలపించింది. భారాస, కాంగ్రెస్ అభ్యర్థులతో పాటు ఇతర ప్రాంతీయ పార్టీలు, స్వతంత్రులు కలిపి మొత్తం 10 మంది 11 సెట్ల నామపత్రాలను రిటర్నింగ్ అధికారి ప్రావీణ్యకు సమర్పించారు. -
మోదీ పాలనతోనే దేశాభివృద్ధి
[ 23-04-2024]
భాజపా పాలనతోనే దేశాభివృద్ధి సాధ్యమని ఆ పార్టీ వరంగల్ ఎంపీ అభ్యర్థి అరూరి రమేశ్ పేర్కొన్నారు. -
పాటలతో రీల్స్.. మాటలతో మీమ్స్
[ 23-04-2024]
లోక్సభ ఎన్నికల్లో భాగంగా ఇప్పటికే నామపత్రాల ప్రక్రియ జోరందుకొంది. ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థులు క్షేత్రస్థాయిలో తిరుగుతూ ప్రచారం చేస్తూనే సామాజిక మాధ్యమాల్లోనూ చురుగ్గా ఉంటున్నారు. -
స్వల్ప ఆధిక్యంతో గెలుపు‘మన ఎంపీలు’
[ 23-04-2024]
వరంగల్ లోక్సభ స్థానం నుంచి అతి తక్కువ ఓట్ల మెజార్టీతో బకర్ అలి మీర్జా ఎంపీగా విజయం సాధించారు. ఆయన 1900, మార్చి 7న హైదరాబాద్లో జన్మించారు. ఉన్నత విద్యనభ్యసించి హైదరాబాద్ సర్కారులో ఫారెస్ట్లకు అసిస్టెంట్ క్యూరేటర్గా పనిచేశారు
తాజా వార్తలు (Latest News)
-
ఆ ‘ఎస్-400’లు.. వచ్చే ఏడాదే భారత్కు!
-
జీవితంలో ముందుకెళ్లాలంటే ధైర్యం ఉండాలి : ఐపీఎస్ ఆఫీసర్ పోస్ట్ వైరల్
-
తగ్గిన బంగారం, వెండి ధరలు.. కారణం ఇదే..
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
మీరు వింటున్న రూమర్స్ నిజమే.. సినిమాటిక్ యూనివర్స్పై ప్రశాంత్ వర్మ
-
ఈ నగరంలో అడుగుపెట్టాలంటే.. టికెట్ కొనాల్సిందే!