త్వరలో జిల్లాకు ముఖ్యమంత్రి కేసీఆర్
ప్రజలకు పరిపాలన అందుబాటులోకి తెచ్చేందుకు జిల్లాలను ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ త్వరలో మహబూబాబాద్ కలెక్టరేట్ సమీకృత భవన సముదాయం, వైద్య కళాశాల ప్రారంభోత్సవానికి రానున్నట్లు మంత్రి సత్యవతిరాథోడ్ చెప్పారు.
కలెక్టరేట్ పనులపై వివరాలు తెలుసుకుంటున్న మంత్రి సత్యవతిరాథోడ్, ఎమ్మెల్యే
శంకర్నాయక్, కలెక్టర్ శశాంక, ఎస్పీ శరత్చంద్రపవార్ తదితరులు
మహబూబాబాద్, న్యూస్టుడే: ప్రజలకు పరిపాలన అందుబాటులోకి తెచ్చేందుకు జిల్లాలను ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ త్వరలో మహబూబాబాద్ కలెక్టరేట్ సమీకృత భవన సముదాయం, వైద్య కళాశాల ప్రారంభోత్సవానికి రానున్నట్లు మంత్రి సత్యవతిరాథోడ్ చెప్పారు. సోమవారం జడ్పీ అధ్యక్షురాలు ఆంగోతు బిందు, ఎమ్మెల్యే బానోతు శంకర్నాయక్తో కలిసి కలెక్టరేట్ భవన నిర్మాణాలను పరిశీలించారు. రెండంతస్తుల్లో నిర్మాణం చేసిన విభాగాలు, భవన పరిసరాలను మంత్రి పరిశీలించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ జిల్లాలు ఏర్పాటు కాకముందు సర్పంచి నుంచి మండల స్థాయి ప్రజాప్రతినిధులతో పాటు ఎమ్మెల్యే జిల్లా కలెక్టర్ను కలవాలంటే ఒక్క రోజు ముందే సమయం తీసుకోవలసి వచ్చేదన్నారు. వారితో పాటు ప్రజలు కూడా దూర ప్రాంతంలో ఉన్న కలెక్టరేట్కు వెళ్లేందుకు ఇబ్బందులు పడేవారన్నారు. ఈ సమస్య పరిష్కారం కోసం తక్కువ దూరంలో జిల్లా కేంద్రాలు ఉండేలా కేసీఆర్ ప్రజలకు పరిపాలనను చేరువకు తెచ్చారన్నారు. కలెక్టరేట్ నిర్మాణానికి రూ. 53 కోట్లు మంజూరు చేశారన్నారు. వేగంగా పనులు పూర్తైన వైద్య కళాశాలకు జాతీయ మెడికల్ కౌన్సిల్ అనుమతి ఇచ్చిందన్నారు. ఈ ఏడాది కౌన్సెలింగ్లోనే 150 మంది విద్యార్థులకు ఈ కళాశాలలో సీట్లు కేటాయిస్తారని మంత్రి తెలిపారు. కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రం అన్ని రంగాల్లో ముందుకు దూసుకెళుతుందన్నారు. ఇదే తరహాలో దేశంలోని అన్ని రాష్ట్రాల్లో సంక్షేమ పథకాలను అమలుచేసేందుకు యావత్భారత దేశం కేసీఆర్ కోసం ఎదురు చూస్తోందన్నారు. దసరా రోజున హైదరాబాద్లో జాతీయ పార్టీని ప్రకటించరున్నారని మంత్రి వెల్లడించారు. జాతీయ పార్టీని ప్రారంభించిన తర్వాత తొలిసారిగా మహబూబాబాద్ జిల్లాలో జరిగే అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవానికి హాజరవుతారన్నారు. జిల్లాకు వస్తున్న ముఖ్యమంత్రికి ఘనస్వాగతం చెప్పేందుకు రెండు లక్షల మందిని సమీకరించనున్నట్లు ఆమె స్పష్టం చేశారు. ఈ వేదికపైనే ముఖ్యమంత్రి జిల్లా ప్రజలకు తీపి కబురు చెబుతారన్నారు. మల్యాలలో ఉద్యాన పాలిటెక్నిక్, డిగ్రీ కళాశాలను ప్రకటిస్తారని సత్యవతి చెప్పారు. తెరాస పార్టీ జిల్లా కార్యాలయం కూడా ప్రారంభిస్తారన్నారు. కలెక్టరేట్లో 32 ప్రభుత్వ శాఖల జిల్లా అధికారులు అందుబాటులో ఉంటారన్నారు. కలెక్టర్ కె.శశాంక, జిల్లా ఎస్పీ శరత్చంద్రపవార్, ఆర్డీవో కొమురయ్య, పీఏసీఎస్ ఛైర్మన్ మూల మధుకర్రెడ్డి, రహదారులు, భవనాల శాఖాధికారులున్నారు.
జిల్లా ప్రజలకు దసరా శుభాకాంక్షలు
మహబూబాబాద్: గిరిజన, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతిరాథోడ్ జిల్లా ప్రజలకు విజయ దశమి శుభాకాంక్షలు తెలిపారు. చెడుపై మంచి విజయాలను అందించే దసరా వేడుకలను అన్ని వర్గాల ప్రజలు ఆనందంగా నిర్వహించుకోవాలని ఆమె ఆకాంక్షించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భారాసకు కడియం ఝలక్!
[ 29-03-2024]
అసెంబ్లీ ఎన్నికల్లోనే వరంగల్ లోక్సభ స్థానం పరిధిలో భారాసకు ఎదురుదెబ్బ తగిలింది. ఏడు స్థానాల్లో ఆరు చోట్ల ఓటమి తప్పలేదు. -
మానుకోట ఎమ్మెల్యే వాహనం తనిఖీ
[ 29-03-2024]
లోక్సభ ఎన్నికల నేపథ్యంలో నెల్లికుదురు వద్ద నెలకొల్పిన చెక్ పోస్టు వద్ద గురువారం మహబూబాబాద్ ఎమ్మెల్యే భూక్య మురళీనాయక్, కరీంనగర్ ఎమ్మెల్సీ రఘోత్తంరెడ్డి వాహనాలను తనిఖీ చేశారు. -
షాపింగ్మాల్లో భారీ అగ్నిప్రమాదం
[ 29-03-2024]
వరంగల్ పోచమ్మమైదాన్లోని జెకోటియా షాపింగ్ మాల్లో గురువారం సాయంత్రం 6.45 గంటలకు భారీ అగ్నిప్రమాదం జరిగింది. -
గ్రంథాలయం మాది..పుస్తకం మీది!
[ 29-03-2024]
నేటి తరం పిల్లలు పుస్తక పఠనానికి క్రమంగా దూరమవుతున్నారు. చరవాణుల వ్యామోహంలో పడి గ్రంథాలయాల గడప తొక్కనివారు ఎంతో మంది ఉన్నారు. -
ఎర్రగట్టు గుట్టపై క్షీరాభిషేకం
[ 29-03-2024]
భీమారంలోని ఎర్రగట్టు గుట్టపై వెలసిన వేెంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. నాలుగో రోజు గురువారం స్వామివారికి క్షీరాభిషేకం నిర్వహించారు. -
యథేచ్ఛగా ఆలయ భూముల ఆక్రమణ
[ 29-03-2024]
వరంగల్, హనుమకొండ నగరాల నడిబొడ్డున రూ.కోట్ల విలువైన ఆలయ భూములు ఆక్రమణల చెరలో ఉన్నాయి. ఈ స్థలాల్లో పలుకుబడి ఉన్నవాళ్లు పెద్ద భవనాలు, ఇళ్లు నిర్మించుకున్నారు. -
ఇసుకాసురులపై పోలీసుల కొరడా
[ 29-03-2024]
సహజ వనరులను కాపాడుకుంటూ భవిష్యత్తు తరాలకు అందించినప్పుడే మనుగడ సాధ్యమవుతుంది. కానీ చాలా వరకు గుట్టలు, ఇసుక, మట్టిని గుళ్ల చేస్తూ వనరులను అందిన కాడికి దోచుకుంటున్నారు. -
నాణ్యతా.. వారికి మామూలే!
[ 29-03-2024]
ఉపాధిహామీ పథకం నిధులతో పంచాయతీరాజ్ ఇంజినీరింగ్శాఖ ఆధ్వర్యంలో మహబూబాబాద్, భూపాలపల్లి, ములుగు జిల్లాల్లోని పలు గ్రామాల్లో ఇటీవల సీసీ రోడ్ల నిర్మాణాలు చేపట్టారు. -
వైద్యుడు లేక అందని గుండె పరీక్షల సేవలు
[ 29-03-2024]
జనగామ జిల్లా కేంద్రంగా మారిన తర్వాత జనగామలో ప్రభుత్వం తెలంగాణ డయాగ్నస్టిక్ కేంద్రం, రేడియాలజీ హబ్లను ఏర్పాటు చేసింది. -
మరోసారి కాంగ్రెస్ సత్తా చాటాలి
[ 29-03-2024]
రానున్న లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మాజీ కేంద్ర మంత్రి బలరాంనాయక్ను అధిక మెజారిటీతో గెలిపించాలని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క నాయకులు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. -
ఆస్తి పన్ను బకాయిదారులపై కొరడా
[ 29-03-2024]
ఆస్తి పన్ను మొండి బకాయిదారులపై మున్సిపాలిటీ అధికారులు కొరడా ఝులిపిస్తున్నారు. వారం రోజులుగా ఉదయం 7 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు బకాయిదారుల ఇళ్లు, దుకాణాల వద్దకు వెళ్లి పన్ను చెల్లించాలని కోరుతున్నారు. -
అక్రమ వ్యాపారాలపై ప్రత్యేక నిఘా
[ 29-03-2024]
జిల్లాలో అక్రమ వ్యాపారాలపై పోలీసు యంత్రాంగం ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ అన్నారు. -
వేగవంతంగా చిన్న కాళేశ్వరం ప్రాజెక్టు పనులు
[ 29-03-2024]
మహదేవపూర్ మండలంలోని చిన్న కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ పనులను వేగవంతంగా చేపట్టాలని సంబంధిత నీటిపారుదల శాఖ అధికారులను జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా ఆదేశించారు. -
పల్లెల్లో బెట్టింగ్ల జోరు
[ 29-03-2024]
పట్టణాలకు పరిమితమైన బెట్టింగ్ సంస్కృతి పల్లె ప్రాంతంలో విస్తరించింది. జిల్లాలో మారుమూల ప్రాంతమైన కాటారం రెవెన్యూ డివిజన్ పరిధిలోని పల్లెల్లో యువకులు, వ్యాపారులు, విద్యార్థులు పందేలు కాస్తూ ఆర్థికంగా చితికిపోతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ నుంచి ఐపీఓ.. రూ.7,000 కోట్ల సమీకరణ!
-
‘పన్ను ఉగ్రవాదాన్ని ఆపండి’.. రూ.1823 కోట్ల నోటీసులపై కాంగ్రెస్ మండిపాటు
-
9 అసెంబ్లీ, 4 పార్లమెంట్ స్థానాలకు తెదేపా అభ్యర్థులు వీళ్లే..
-
జగన్ పని దొంగ.. దోపిడీదారుడు: చంద్రబాబు
-
బిహార్లో తేలిన సీట్ల లెక్క.. 26 స్థానాల్లో ఆర్జేడీ, 9 చోట్ల కాంగ్రెస్
-
జనసేనలో చేరతానని నేను చెప్పలేదు.. కానీ: అనసూయ