logo

పింఛను కార్డుల పంపిణీ

అర్హులైన ప్రతి ఒక్కరికి ఆసరా పింఛన్లు మంజూరు చేస్తామని పురపాలక సంఘం ఛైర్మన్‌ డాక్టర్‌ పాల్వాయి రామ్మోహన్‌రెడ్డి అన్నారు.

Published : 05 Oct 2022 01:33 IST

మహబూబాబాద్‌, న్యూస్‌టుడే: అర్హులైన ప్రతి ఒక్కరికి ఆసరా పింఛన్లు మంజూరు చేస్తామని పురపాలక సంఘం ఛైర్మన్‌ డాక్టర్‌ పాల్వాయి రామ్మోహన్‌రెడ్డి అన్నారు. మహబూబాబాద్‌ పురపాలక సంఘం 6వ వార్డు పరిధిలోని బేతోల్‌లో మంగళవారం ఆసరా లబ్ధిదారులకు పింఛను గుర్తింపు కార్డులను పంపిణీ చేశారు. కమిషనర్‌ ప్రసన్నరాణి, స్థానిక వార్డు కౌన్సిలర్‌ భూక్యా సునీత, తెరాస ఫ్లోర్‌లీడర్‌ చిట్యాల జనార్దన్‌, తెరాస, కాంగ్రెస్‌ నేతలు దార యాదగిరి, కె.గోపి, రాంజీ, సంతోష్‌, రవి పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని