logo

గాంధీ విగ్రహానికి క్షీరాభిషేకం

కోల్‌కతాలో మహిశాసురవర్దిని విగ్రహ ఏర్పాటులో జరిగిన ఘటనను నిరసిస్తూ.. ఇంటర్నేషనల్‌ వైశ్య ఫెడరేషన్‌  సంఘం జిల్లా బాధ్యులు శ్రీనివాస్‌, మహేష్‌, మోహన్‌రావులు నిరసన తెలిపారు.

Published : 05 Oct 2022 01:34 IST

తొర్రూరు టౌన్‌, న్యూస్‌టుడే: కోల్‌కతాలో మహిశాసురవర్దిని విగ్రహ ఏర్పాటులో జరిగిన ఘటనను నిరసిస్తూ.. ఇంటర్నేషనల్‌ వైశ్య ఫెడరేషన్‌  సంఘం జిల్లా బాధ్యులు శ్రీనివాస్‌, మహేష్‌, మోహన్‌రావులు నిరసన తెలిపారు. సంఘం ఆధ్వర్యంలో డివిజన్‌ కేంద్రంలోని కంఠాయపాలెం క్రాస్‌రోడ్డు గాంధీ విగ్రహానికి మంగళవారం పాలాభిషేకం చేశారు. దేవత విగ్రహ ఏర్పాటులో గాంధీజీ తలపెట్టిన బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వం స్పందించకుంటే ఆందోళన చేస్తామని హెచ్చరించారు. వెంకన్న, శ్రీనివాస్‌ వెంకటేశ్వర్లు, హర్షిత్‌, దయాకర్‌ పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని