అంకితభావంతో పని చేస్తే గుర్తింపు
పోలీసుశాఖలో అంకితభావంతో పని చేసిన అధికారులకు గుర్తింపు లభిస్తుందని ఎస్పీ సంగ్రామ్సింగ్ జి పాటిల్ అన్నారు.
పేరూరు ఎస్సై కె. తిరుపతిరావుకు ప్రశంసా పత్రం అందిస్తున్న ఎస్పీ సంగ్రామ్సింగ్
ములుగు, వాజేడు న్యూస్టుడే: పోలీసుశాఖలో అంకితభావంతో పని చేసిన అధికారులకు గుర్తింపు లభిస్తుందని ఎస్పీ సంగ్రామ్సింగ్ జి పాటిల్ అన్నారు. మంగళవారం ములుగు జిల్లా పోలీసు కార్యాలయంలో ఆగస్టులో వర్టికల్లలో ప్రతిభ కనబర్చిన 15 మంది పోలీసు అధికారులకు ఆయన ప్రశంసా పత్రాలు అందించి అభినందించారు. ఎస్పీ మాట్లాడుతూ శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసు శాఖ పాత్ర కీలకమన్నారు. అలాంటి శాఖలో అందరూ ప్రతి అంశంలో జాగ్రత్తగా పని చేయాలని సూచించారు. ప్రతిభ కనబర్చే అధికారులను, సిబ్బందిని గుర్తించి ప్రతి నెల ప్రోత్సహించే విధంగా రివార్డులు, అవార్డులు ఇస్తున్నట్లు వివరించారు. ప్రతి ఒకరు వర్టికల్ వారీగా పోటీ పడి విధులు నిర్వర్తించాలన్నారు. ఆన్లైన్లో సమాచారం నమోదు చేసిన విధంగా పనితనాన్ని బట్టి అవార్డులు ఇస్తున్నట్లు స్పష్టం చేశారు. ప్రజలకు మరింత మెరుగైన, వేగవంతమైన, నాణ్యమైన సేవలు అందించే ప్రయత్నం చేయాలని పిలుపునిచ్చారు. ఏఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్, ఎస్బీ సీఐ సార్ల రాజు, ఆర్ఐ స్వామి, డీసీఆర్బీ ఎస్సై కమలాకర్ పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
ప్రశంసా పత్రాలు అందుకున్న వారు..
* ఇన్వెస్టిగేషన్: కె. తిరుపతిరావు, ఎస్సై వాజేడు * స్టేషన్ హౌస్ ఆఫీసర్: బి.ఓంకార్ యాదవ్, ఎస్సై ములుగు * స్టేషన్ ఇన్ఛార్జి: జి. ప్రభాకర్, హెచ్సీ ములుగు * రిసెప్షన్: ఎస్. ఎం.సత్యాన్వేష్, పీసీ పేరూరు * బ్లూకోర్: డి.రమేష్, పీసీ ములుగు * స్టేషన్ రైటర్: ఎ. రమేష్, పీసీ మంగపేట * కోర్టు డ్యూటీ: పి. బాల, పీసీ వెంకటాపూర్ * టెక్ టీం: ఎండీ రసూల్, పీసీ కన్నాయిగూడెం * సమన్స్: ఆర్. అరుణ్కుమార్, పీసీ ములుగు * వారెంట్: బి.కృష్ణ, పీసీ మంగపేట * 5 ఎస్: ఇ. ఆంజనేయులు, పీసీ వాజేడు * కమ్యూనీటీ పోలీసింగ్: ఎం. శారద, పీసీ పస్రా * ట్రాఫిక్: జి. రాజీవ్, పీసీ పస్రా * 5ఎస్ ఇన్ఛార్జి: బి.యశోద * టెక్ టీం ఇన్ఛార్జి: ఎం. విజయలక్ష్మి, పీసీ డీసీఆర్బీ ములుగు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జజ్జనకర.. జనజాతర
[ 25-04-2024]
కాజీపేట మండలం మడికొండలో ఏర్పాటు చేసిన ఓరుగల్లు జనజాతర బహిరంగ సభ విజయవంతమైంది. వరంగల్ లోక్సభ పరిధిలోని ఏడు సెగ్మెంట్ల నుంచి భారీగా జనసమీకరణ చేయడంతో సభా ప్రాంగణం కిక్కిరిసిపోయింది. -
ప్రథమంలో 24 ద్వితీయంలో 26
[ 25-04-2024]
ఇంటర్మీడియట్ వార్షిక ఫలితాల్లో వరంగల్ జిల్లా వెనుకబడింది. ప్రథమ సంవత్సరం ఫలితాల్లో రాష్ట్రంలో 24వ స్థానం, ద్వితీయ సంవత్సరంలో 26వ స్థానంలో నిలిచింది. -
హస్తం జోరు..
[ 25-04-2024]
హనుమకొండ జిల్లా పరిధిలోని కాజీపేట మండలం మడికొండలో నిర్వహించిన ఓరుగల్లు జనజాతర బహిరంగ సభ విజయవంతం కావడం కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం నింపింది. -
ఇంటర్ ఫలితాల్లో ములుగు వెలుగు
[ 25-04-2024]
రాష్ట్ర ప్రభుత్వం బుధవారం విడుదల చేసిన ఇంటర్మీడియట్ ఫలితాల్లో ములుగు జిల్లా అగ్రస్థానంలో నిలిచింది. రాష్ట్రంలోని అన్ని జిల్లాలను వెనకకు నెట్టి ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో మొదటి స్థానంలో నిలిచింది. -
ఇంటర్ ఫలితాల్లో బాలికలదే హవా
[ 25-04-2024]
ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాల్లో ప్రథమ, ద్వితీయ సంవత్సర ఉత్తీర్ణతలో బాలికలదే పైచేయిగా నిలిచింది. బుధవారం ప్రకటించిన ఫలితాల్లో జిల్లాలో ప్రథమ సంవత్సరం 55.72 శాతంతో రాష్ట్రంలో 17వ స్థానం పొందింది. -
బాలికలదే పైచేయి
[ 25-04-2024]
ఇంటర్ బోర్డు అధికారులు బుధవారం విడుదల చేసిన ఇంటర్ ఫలితాల్లో జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో బాలికలే పై చేయి సాధించారు. -
ఇంటర్ ఫలితాల్లో బాలికలదే పైచేయి
[ 25-04-2024]
ఇంటర్ పరీక్ష ఫలితాలు బుధవారం వెలువడిన నేపథ్యంలో జిల్లాలో ఉత్తీర్ణత శాతం గత విద్యా సంవత్సరంతో పోలిస్తే ఈ ఏడాది వెనక్కి వెళ్లింది. -
21 నామపత్రాల దాఖలు
[ 25-04-2024]
వరంగల్ లోక్సభ స్థానానికి బుధవారం 19 మంది అభ్యర్థులు 21 నామపత్రాలను రిటర్నింగ్ అధికారి ప్రావీణ్యకు సమర్పించారు. భారాస పార్టీ అభ్యర్థి మారపల్లి సుధీర్కుమార్ తరఫున భారాస నాయకులు, -
ఆదర్శం.. గంగారం కస్తూర్బా విద్యాలయం
[ 25-04-2024]
మారుమూల ఏజెన్సీలోని కస్తూర్బా గాంధీ బాలికల గురుకుల విద్యాలయం(కేజీబీవీ) విద్యార్థినులు ఇంటర్ ఫలితాల్లో వందశాతం ఫలితాలు సాధించి సత్తా చాటారు.
తాజా వార్తలు (Latest News)
-
ఆన్లైన్లో తెగ కొనేస్తున్నారు.. తొలిసారి ₹1 లక్ష కోట్లు దాటిన క్రెడిట్ కార్డ్ వ్యయం
-
మోదీజీ.. ఆ చప్పట్లకు మోసపోకండి: ప్రధానికి ఖర్గే లేఖ
-
నా వ్యాఖ్యలను అపార్థం చేసుకోవడంతోనే సమస్య: అంబటి రాయుడు
-
‘రాంచీలో ఉన్నా.. రూ.600 కావాలి’.. ధోనీ పేరుతో మెసేజ్ వైరల్
-
బౌలర్ల విషయంలో రాజీ పడొద్దు.. అలా చేస్తే కష్టమే: నవ్జ్యోత్ సిద్ధూ
-
ఆ అవార్డు వేడుకలో అవమానించారు: విద్యా బాలన్