logo

పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం

పేదల అభివృద్ధి, సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి అన్నారు. మండలంలోని వడ్లకొండలో ఆసరా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు.

Published : 05 Oct 2022 02:17 IST


పింఛన్లు అందజేస్తున్న ఎమ్మెల్యే ముత్తిరెడ్డి, బొల్లం శారద

జనగామ రూరల్‌, న్యూస్‌టుడే: పేదల అభివృద్ధి, సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి అన్నారు. మండలంలోని వడ్లకొండలో ఆసరా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. ప్రజల సంక్షేమం కోసం అనేక పథకాలు ప్రవేశపెట్టారని గుర్తుచేశారు. సీఎం కేసీఆర్‌ అభివృద్ది చేస్తుంటే భాజపా, కాంగ్రెస్‌ నాయకులు విమర్శలు చేస్తున్నారని, వారి మాటలు పట్టించుకోవద్దని ఆయన ప్రజలను కోరారు. సర్పంచి శారద, గ్రామ కార్యదర్శి మనోహర్‌, వార్డు సభ్యులు, నాయకులు  తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని