ఆ అధికారులు ఎవరు?
బల్దియాలో ఇంధనం కుంభకోణం రోజుకో మలుపు తిరుగుతోంది. అక్రమాల్లో కేవలం శానిటరీ జవానే కాదు, తెరవెనుక కొందరు వింగ్ అధికారులున్నారని తెలిసింది. రోజువారీగా వచ్చే ఆదాయాన్ని వాటాల వారీగా పంచుకున్నట్లు గుర్తించడంతో ఆ అధికారులు ఎవరెవరన్నది ఆరా తీస్తున్నారు.
బల్దియాలో ఇంధన కుంభకోణం
బల్దియాలో ఇంధనం కుంభకోణం రోజుకో మలుపు తిరుగుతోంది. అక్రమాల్లో కేవలం శానిటరీ జవానే కాదు, తెరవెనుక కొందరు వింగ్ అధికారులున్నారని తెలిసింది. రోజువారీగా వచ్చే ఆదాయాన్ని వాటాల వారీగా పంచుకున్నట్లు గుర్తించడంతో ఆ అధికారులు ఎవరెవరన్నది ఆరా తీస్తున్నారు. మమల్ని ఎవరడుగుతారులే అన్నట్లుగా డ్రైవర్ల వద్ద ఉండే లాగ్ బుక్కుల్లో ఒక రకంగా, ప్రజారోగ్య విభాగం కంప్యూటర్ బిల్లు మరో రకంగా రాశారు. ఉదాహరణకు పరిశీలిస్తే వరంగల్ ప్రాంతం కరీమాబాద్లో చెత్తను తరలించే ట్రాక్టర్ (నంబరు టీఎస్02 యూసీ 8195)కు ఏప్రిల్ 12వ తేదీన 36 లీటర్ల డీజిల్ పోసినట్లు డ్రైవర్ వద్ద ఉన్న లాగ్ బుక్కులో ఉంది. ప్రజారోగ్య విభాగం కంప్యూటర్ షీట్లో 100 లీటర్లు కేటాయించినట్లుగా చూపి రూ.10,500 బిల్లు డ్రా చేశారు. ఇలా వరంగల్, హనుమకొండ ప్రాంతాల్లో తిరుగుతున్న ట్రాక్టర్లకు డీజిల్ బిల్లుల్లో తప్పుడు సమాచారం నమోదు చేశారు. ఇదేవిధంగా కంపాక్టర్లు, పొక్లెయిన్లు, స్వీపింగ్ మిషన్లకు విచ్చలవిడిగా డీజిల్ కేటాయించినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. శానిటరీ జవాన్తోపాటు ప్రజారోగ్య విభాగంలోని అధికారులు, శానిటరీ ఇన్స్పెక్టర్ల పాత్ర ఉందని తెలిసింది.
నెలకు రూ.10 లక్షలపైనే
ఇంధనం అక్రమాల్లో ప్రజారోగ్య విభాగం ఉద్యోగులే ఉన్నారని తెలిసింది. మొత్తం 250- 280 వాహనాలకు రోజువారీగా డీజిల్ కూపన్లు రాసి, రెండేళ్లుగా రోజూ సుమారు రూ.30- 40 వేల నగదు వెనకేసుకున్నట్లుగా సమాచారం. నెలకు రూ.10లక్షల పైనే పంచుకున్నారని ప్రచారం జరుగుతోంది. సమగ్ర విచారణ చేపడితే వాస్తవాలు వెలుగు చూసే అవకాశాలున్నాయి. అక్రమాలు జరిగాయంటున్నారు.
ప్రజారోగ్య విభాగం కంప్యూటర్ బిల్లులో 100 లీటర్లు
కేటాయించినట్లుగా రూ.10,500 బిల్లు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భారాసకు కడియం ఝలక్!
[ 29-03-2024]
అసెంబ్లీ ఎన్నికల్లోనే వరంగల్ లోక్సభ స్థానం పరిధిలో భారాసకు ఎదురుదెబ్బ తగిలింది. ఏడు స్థానాల్లో ఆరు చోట్ల ఓటమి తప్పలేదు. -
మానుకోట ఎమ్మెల్యే వాహనం తనిఖీ
[ 29-03-2024]
లోక్సభ ఎన్నికల నేపథ్యంలో నెల్లికుదురు వద్ద నెలకొల్పిన చెక్ పోస్టు వద్ద గురువారం మహబూబాబాద్ ఎమ్మెల్యే భూక్య మురళీనాయక్, కరీంనగర్ ఎమ్మెల్సీ రఘోత్తంరెడ్డి వాహనాలను తనిఖీ చేశారు. -
షాపింగ్మాల్లో భారీ అగ్నిప్రమాదం
[ 29-03-2024]
వరంగల్ పోచమ్మమైదాన్లోని జెకోటియా షాపింగ్ మాల్లో గురువారం సాయంత్రం 6.45 గంటలకు భారీ అగ్నిప్రమాదం జరిగింది. -
గ్రంథాలయం మాది..పుస్తకం మీది!
[ 29-03-2024]
నేటి తరం పిల్లలు పుస్తక పఠనానికి క్రమంగా దూరమవుతున్నారు. చరవాణుల వ్యామోహంలో పడి గ్రంథాలయాల గడప తొక్కనివారు ఎంతో మంది ఉన్నారు. -
ఎర్రగట్టు గుట్టపై క్షీరాభిషేకం
[ 29-03-2024]
భీమారంలోని ఎర్రగట్టు గుట్టపై వెలసిన వేెంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. నాలుగో రోజు గురువారం స్వామివారికి క్షీరాభిషేకం నిర్వహించారు. -
యథేచ్ఛగా ఆలయ భూముల ఆక్రమణ
[ 29-03-2024]
వరంగల్, హనుమకొండ నగరాల నడిబొడ్డున రూ.కోట్ల విలువైన ఆలయ భూములు ఆక్రమణల చెరలో ఉన్నాయి. ఈ స్థలాల్లో పలుకుబడి ఉన్నవాళ్లు పెద్ద భవనాలు, ఇళ్లు నిర్మించుకున్నారు. -
ఇసుకాసురులపై పోలీసుల కొరడా
[ 29-03-2024]
సహజ వనరులను కాపాడుకుంటూ భవిష్యత్తు తరాలకు అందించినప్పుడే మనుగడ సాధ్యమవుతుంది. కానీ చాలా వరకు గుట్టలు, ఇసుక, మట్టిని గుళ్ల చేస్తూ వనరులను అందిన కాడికి దోచుకుంటున్నారు. -
నాణ్యతా.. వారికి మామూలే!
[ 29-03-2024]
ఉపాధిహామీ పథకం నిధులతో పంచాయతీరాజ్ ఇంజినీరింగ్శాఖ ఆధ్వర్యంలో మహబూబాబాద్, భూపాలపల్లి, ములుగు జిల్లాల్లోని పలు గ్రామాల్లో ఇటీవల సీసీ రోడ్ల నిర్మాణాలు చేపట్టారు. -
వైద్యుడు లేక అందని గుండె పరీక్షల సేవలు
[ 29-03-2024]
జనగామ జిల్లా కేంద్రంగా మారిన తర్వాత జనగామలో ప్రభుత్వం తెలంగాణ డయాగ్నస్టిక్ కేంద్రం, రేడియాలజీ హబ్లను ఏర్పాటు చేసింది. -
మరోసారి కాంగ్రెస్ సత్తా చాటాలి
[ 29-03-2024]
రానున్న లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మాజీ కేంద్ర మంత్రి బలరాంనాయక్ను అధిక మెజారిటీతో గెలిపించాలని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క నాయకులు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. -
ఆస్తి పన్ను బకాయిదారులపై కొరడా
[ 29-03-2024]
ఆస్తి పన్ను మొండి బకాయిదారులపై మున్సిపాలిటీ అధికారులు కొరడా ఝులిపిస్తున్నారు. వారం రోజులుగా ఉదయం 7 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు బకాయిదారుల ఇళ్లు, దుకాణాల వద్దకు వెళ్లి పన్ను చెల్లించాలని కోరుతున్నారు. -
అక్రమ వ్యాపారాలపై ప్రత్యేక నిఘా
[ 29-03-2024]
జిల్లాలో అక్రమ వ్యాపారాలపై పోలీసు యంత్రాంగం ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ అన్నారు. -
వేగవంతంగా చిన్న కాళేశ్వరం ప్రాజెక్టు పనులు
[ 29-03-2024]
మహదేవపూర్ మండలంలోని చిన్న కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ పనులను వేగవంతంగా చేపట్టాలని సంబంధిత నీటిపారుదల శాఖ అధికారులను జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా ఆదేశించారు. -
పల్లెల్లో బెట్టింగ్ల జోరు
[ 29-03-2024]
పట్టణాలకు పరిమితమైన బెట్టింగ్ సంస్కృతి పల్లె ప్రాంతంలో విస్తరించింది. జిల్లాలో మారుమూల ప్రాంతమైన కాటారం రెవెన్యూ డివిజన్ పరిధిలోని పల్లెల్లో యువకులు, వ్యాపారులు, విద్యార్థులు పందేలు కాస్తూ ఆర్థికంగా చితికిపోతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
కొరియాపై ఐరాస ఆంక్షల వల్ల ప్రయోజనం లేదు: రష్యా
-
టిల్లు స్క్వేర్.. రూ.100 కోట్ల గ్రాస్ వస్తుందనుకుంటున్నా: నాగవంశీ
-
‘వారిపై సినిమాలు రావాలి’.. మస్క్ ఆలోచనకు మహీంద్రా సపోర్ట్
-
ఐటీ నోటీసులపై దేశవ్యాప్త నిరసనలకు కాంగ్రెస్ పిలుపు
-
ఫోన్ ట్యాపింగ్ చేసి.. భార్యాభర్తల మాటలు విన్నారు: సీఎం రేవంత్రెడ్డి
-
టీసీఎస్లో 3.5 లక్షల మంది ఉద్యోగులకు జనరేటివ్ ఏఐలో శిక్షణ