దివ్యాంగుల వ్యథ వినలేరా!
జిల్లాలోని దివ్యాంగులు, వయోవృద్దుల నిమిత్తం ప్రతి నెలా నాలుగో శనివారం నిర్వహించే ప్రత్యేక ప్రజావాణికి హాజరవడంలో జిల్లా అధికారులు నిర్లక్ష్య వైఖరిని ప్రదర్శిస్తున్నారు.
దరఖాస్తులు స్వీకరిస్తున్న అదనపు కలెక్టర్ శ్రీవత్స, సంక్షేమాధికారి శారద
వరంగల్ కలెక్టరేట్, న్యూస్టుడే: జిల్లాలోని దివ్యాంగులు, వయోవృద్దుల నిమిత్తం ప్రతి నెలా నాలుగో శనివారం నిర్వహించే ప్రత్యేక ప్రజావాణికి హాజరవడంలో జిల్లా అధికారులు నిర్లక్ష్య వైఖరిని ప్రదర్శిస్తున్నారు. జిల్లా కలెక్టరేట్లో శనివారం జరిగిన ప్రజావాణిలో కేవలం ఐదు శాఖల అధికారులు మాత్రమే హాజరుకాగా.. మున్సిపల్, పోలీస్ శాఖ అధికారులు, జిల్లా న్యాయ సంబంధిత, విద్యాశాఖ, జడ్పీ తదితర శాఖల అధికారులు రాలేదు. నెలకోసారి జరిగే దివ్యాంగులు, వయోవృద్ధుల ప్రత్యేక ప్రజావాణికి వచ్చేందుకు అధికారులు సుముఖత చూపించకపోవడం శోచనీయమని పలువురు అభిప్రాయపడుతున్నారు. ప్రత్యేక ప్రజావాణి కార్యక్రమంపై జిల్లా పాలనాధికారి గోపి ప్రత్యేక దృష్టి సారించకపోవడం.. దరఖాస్తులను సమీక్షించకపోవడంతోనే.. అధికారుల్లో నిర్లక్ష్య ధోరణి పెరుగుతున్నట్లు తెలుస్తోంది. వివిధ సమస్యలపై 12 మంది అదనపు కలెక్టర్ శ్రీవత్స, సంక్షేమాధికారి శారదకు దరఖాస్తులందించారు.
పింఛన్ ఇప్పించరూ..!
ధనుశనాథుల తరుణ్, రేలకుంట, నల్లబెల్లి
పుట్టుకతోనే నరాల సంబంధిత వ్యాధితో బాధపడుతున్న తరుణ్కు 2021లో మానసిక వ్యాధుల విభాగానికి చెందిన వైద్యులు 75శాతం అంగవైకల్యంగా నిర్ధారించి సదరం ధ్రువపత్రాన్ని అందజేశారు. మరల రెన్యువల్కు వెళ్లగా.. ఎలాంటి అంగవైకల్యం లేదని వైద్యులు ధ్రువీకరించడంతో.. పింఛన్ మంజూరు కాలేదు. వైద్యపరీక్షలు నిర్వహించి న్యాయం చేయాలని తరుణ్ తల్లి శనివారం అధికారులను కోరారు.
తొలుత మంజూరుచేసి తర్వాత తొలగించారు
వేముల విశ్వేశ్వర్, లక్ష్మీపురం దుగ్గొండి
కాలికి గ్రహణం సోకి నడవలేని పరిస్థితిలో ఉన్న నాకు ఈ ఏడాది ఆగస్టులో పింఛన్ మంజూరు అయినట్లు పత్రం అందజేశారు. పింఛన్ చేతికి రాకముందే జాబితా నుంచి నా పేరు తొలగించారు. మా అన్నకు నాలుగు చక్రాల వాహనం ఉన్నందుకే పింఛన్ రద్దుచేసినట్లు అధికారులు చెప్పారు. రెండు నెలల క్రితమే రేషన్కార్డు నుంచి నా పేరు తొలగించారు. ఎలాంటి బతుకుతెరువు లేని నాకు పింఛన్ మంజూరుచేయండి.
పోలియో ఉన్నా.. రద్దుచేశారు
గద్దె కళమ్మ, వసంతాపూర్, ఖిలావరంగల్
చిన్నవయసులోనే పోలియో సోకడంతో.. రెండు కాళ్లు వంకర్లు పోయి సరిగా నడవలేని స్థితికి చేరాను. మూడేళ్లకోసారి సదరం రెన్యువల్ సందర్భంలో 2019లో ఎంజీఎం ఆసుపత్రికి వెళ్లగా.. 25 శాతం మాత్రమే అంగవైకల్యం ఉన్నట్లు వైద్యులు నివేదిక ఇచ్చారు. చిన్నప్పటి నుంచి 56 శాతం ఉన్న అంగవైకల్యం ఒకేసారి 25 శాతానికి ఏవిధంగా పడిపోయిందో ధ్రువీకరించిన వైద్యులే చెప్పాలి. అంగవైకల్యం తక్కువగా నమోదుచేయడంతో వికలాంగుల పింఛన్ రద్దుచేశారు. న్యాయం చేయండి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భారాసకు కడియం ఝలక్!
[ 29-03-2024]
అసెంబ్లీ ఎన్నికల్లోనే వరంగల్ లోక్సభ స్థానం పరిధిలో భారాసకు ఎదురుదెబ్బ తగిలింది. ఏడు స్థానాల్లో ఆరు చోట్ల ఓటమి తప్పలేదు. -
మానుకోట ఎమ్మెల్యే వాహనం తనిఖీ
[ 29-03-2024]
లోక్సభ ఎన్నికల నేపథ్యంలో నెల్లికుదురు వద్ద నెలకొల్పిన చెక్ పోస్టు వద్ద గురువారం మహబూబాబాద్ ఎమ్మెల్యే భూక్య మురళీనాయక్, కరీంనగర్ ఎమ్మెల్సీ రఘోత్తంరెడ్డి వాహనాలను తనిఖీ చేశారు. -
షాపింగ్మాల్లో భారీ అగ్నిప్రమాదం
[ 29-03-2024]
వరంగల్ పోచమ్మమైదాన్లోని జెకోటియా షాపింగ్ మాల్లో గురువారం సాయంత్రం 6.45 గంటలకు భారీ అగ్నిప్రమాదం జరిగింది. -
గ్రంథాలయం మాది..పుస్తకం మీది!
[ 29-03-2024]
నేటి తరం పిల్లలు పుస్తక పఠనానికి క్రమంగా దూరమవుతున్నారు. చరవాణుల వ్యామోహంలో పడి గ్రంథాలయాల గడప తొక్కనివారు ఎంతో మంది ఉన్నారు. -
ఎర్రగట్టు గుట్టపై క్షీరాభిషేకం
[ 29-03-2024]
భీమారంలోని ఎర్రగట్టు గుట్టపై వెలసిన వేెంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. నాలుగో రోజు గురువారం స్వామివారికి క్షీరాభిషేకం నిర్వహించారు. -
యథేచ్ఛగా ఆలయ భూముల ఆక్రమణ
[ 29-03-2024]
వరంగల్, హనుమకొండ నగరాల నడిబొడ్డున రూ.కోట్ల విలువైన ఆలయ భూములు ఆక్రమణల చెరలో ఉన్నాయి. ఈ స్థలాల్లో పలుకుబడి ఉన్నవాళ్లు పెద్ద భవనాలు, ఇళ్లు నిర్మించుకున్నారు. -
ఇసుకాసురులపై పోలీసుల కొరడా
[ 29-03-2024]
సహజ వనరులను కాపాడుకుంటూ భవిష్యత్తు తరాలకు అందించినప్పుడే మనుగడ సాధ్యమవుతుంది. కానీ చాలా వరకు గుట్టలు, ఇసుక, మట్టిని గుళ్ల చేస్తూ వనరులను అందిన కాడికి దోచుకుంటున్నారు. -
నాణ్యతా.. వారికి మామూలే!
[ 29-03-2024]
ఉపాధిహామీ పథకం నిధులతో పంచాయతీరాజ్ ఇంజినీరింగ్శాఖ ఆధ్వర్యంలో మహబూబాబాద్, భూపాలపల్లి, ములుగు జిల్లాల్లోని పలు గ్రామాల్లో ఇటీవల సీసీ రోడ్ల నిర్మాణాలు చేపట్టారు. -
వైద్యుడు లేక అందని గుండె పరీక్షల సేవలు
[ 29-03-2024]
జనగామ జిల్లా కేంద్రంగా మారిన తర్వాత జనగామలో ప్రభుత్వం తెలంగాణ డయాగ్నస్టిక్ కేంద్రం, రేడియాలజీ హబ్లను ఏర్పాటు చేసింది. -
మరోసారి కాంగ్రెస్ సత్తా చాటాలి
[ 29-03-2024]
రానున్న లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మాజీ కేంద్ర మంత్రి బలరాంనాయక్ను అధిక మెజారిటీతో గెలిపించాలని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క నాయకులు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. -
ఆస్తి పన్ను బకాయిదారులపై కొరడా
[ 29-03-2024]
ఆస్తి పన్ను మొండి బకాయిదారులపై మున్సిపాలిటీ అధికారులు కొరడా ఝులిపిస్తున్నారు. వారం రోజులుగా ఉదయం 7 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు బకాయిదారుల ఇళ్లు, దుకాణాల వద్దకు వెళ్లి పన్ను చెల్లించాలని కోరుతున్నారు. -
అక్రమ వ్యాపారాలపై ప్రత్యేక నిఘా
[ 29-03-2024]
జిల్లాలో అక్రమ వ్యాపారాలపై పోలీసు యంత్రాంగం ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ అన్నారు. -
వేగవంతంగా చిన్న కాళేశ్వరం ప్రాజెక్టు పనులు
[ 29-03-2024]
మహదేవపూర్ మండలంలోని చిన్న కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ పనులను వేగవంతంగా చేపట్టాలని సంబంధిత నీటిపారుదల శాఖ అధికారులను జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా ఆదేశించారు. -
పల్లెల్లో బెట్టింగ్ల జోరు
[ 29-03-2024]
పట్టణాలకు పరిమితమైన బెట్టింగ్ సంస్కృతి పల్లె ప్రాంతంలో విస్తరించింది. జిల్లాలో మారుమూల ప్రాంతమైన కాటారం రెవెన్యూ డివిజన్ పరిధిలోని పల్లెల్లో యువకులు, వ్యాపారులు, విద్యార్థులు పందేలు కాస్తూ ఆర్థికంగా చితికిపోతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ఐటీ నోటీసులపై దేశవ్యాప్త నిరసనలకు కాంగ్రెస్ పిలుపు
-
ఫోన్ ట్యాపింగ్ చేసి.. భార్యాభర్తల మాటలు విన్నారు: సీఎం రేవంత్రెడ్డి
-
టీసీఎస్లో 3.5 లక్షల మంది ఉద్యోగులకు జనరేటివ్ ఏఐలో శిక్షణ
-
సీ-విజిల్కు తాకిడి.. రెండు వారాల్లోనే 79 వేల ఫిర్యాదులు
-
సిరియాపై విరుచుకుపడ్డ ఇజ్రాయెల్.. 42 మంది మృతి
-
లోక్సభ ఎంపీల్లో 225 మందిపై క్రిమినల్ కేసులు: ఏడీఆర్