నకిలీ భూ పత్రాల తయారీదారుల అరెస్టు
నకిలీ భూ పత్రాలు తయారు చేస్తున్న ఇద్దరిని టాస్క్ఫోర్స్, నెక్కొండ పోలీసులు సంయుక్తంగా అరెస్టు చేశారు.
వివరాలు వెల్లడిస్తున్న అదనపు డీసీపీ వైభవ్ గైక్వాడ్, ఏసీపీ, ఇన్స్పెక్టర్లు
వరంగల్క్రైం, న్యూస్టుడే: నకిలీ భూ పత్రాలు తయారు చేస్తున్న ఇద్దరిని టాస్క్ఫోర్స్, నెక్కొండ పోలీసులు సంయుక్తంగా అరెస్టు చేశారు. వారి నుంచి భూములకు సంబంధించిన నకిలీ కన్వర్జేషన్, ప్రొసీడింగ్స్, 13 బీ, సీ ఫారాలు, తహసీల్దార్, ఆర్డీవోలకు సంబంధించిన నకిలీ స్టాంపులు, గ్రామాల నక్ష నకళ్లు, స్టాంపు పేపర్లు తదితరాలు స్వాధీనం చేసుకున్నారు. శనివారం కమిషనరేట్లో టాస్క్ఫోర్స్ అదనపు డీసీపీ వైభవ్ గైక్వాడ్ వివరాలు వెల్లడించారు. నెక్కొండ మండలానికి చెందిన మద్ది వెంకట్రెడ్డి, కల్వచర్ల రఘు నకిలీ పత్రాలు తయారు చేశారు. మద్ది వెంకట్రెడ్డి 1973 నుంచి 2012 వరకు రెవెన్యూ విభాగంలో నెక్కొండ, పర్వతగిరి మండలాల్లో పట్వారీ, పంచాయతీ కార్యదర్శి, వీఆర్వోగా పనిచేసిన అనుభవం ఉండడంతో సులువుగా డబ్బులు సంపాదించాలనే ఆలోచనతో భూములకు సంబంధించిన అన్ని రకాలైన నకిలీ ధ్రువపత్రాలను సృష్టించి రఘుతో అధికారుల సంతకాలను ఫోర్జరీ చేసి అవసరం ఉన్న వారికి ఇచ్చి డబ్బులు తీసుకొనే వారు. భూ పత్రాలు పొందిన పలువురు బ్యాంకుల నుంచి రుణాలు కూడా తీసుకున్నారు. దీనిపై టాస్క్ఫోర్స్ పోలీసులకు సమాచారం రావడంతో నిందితులను అదుపులోకి తీసుకొని విచారించగా చేసిన నేరాన్ని ఒప్పుకున్నారు. నిందితులను పట్టుకోవడంలో ప్రతిభ చూపిన టాస్క్ఫోర్స్ ఏసీపీ జితేందర్రెడ్డి, ఇన్స్పెక్టర్లు నరేశ్కుమార్, వెంకటేశ్వర్లు, ఎస్సైలు లవణ్కుమార్, నెక్కొండ, పర్వతగిని ఎస్సైలు పర్వీన్, దేవేందర్లను గైక్వాడ్ అభినందించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జజ్జనకర.. జనజాతర
[ 25-04-2024]
కాజీపేట మండలం మడికొండలో ఏర్పాటు చేసిన ఓరుగల్లు జనజాతర బహిరంగ సభ విజయవంతమైంది. వరంగల్ లోక్సభ పరిధిలోని ఏడు సెగ్మెంట్ల నుంచి భారీగా జనసమీకరణ చేయడంతో సభా ప్రాంగణం కిక్కిరిసిపోయింది. -
ప్రథమంలో 24 ద్వితీయంలో 26
[ 25-04-2024]
ఇంటర్మీడియట్ వార్షిక ఫలితాల్లో వరంగల్ జిల్లా వెనుకబడింది. ప్రథమ సంవత్సరం ఫలితాల్లో రాష్ట్రంలో 24వ స్థానం, ద్వితీయ సంవత్సరంలో 26వ స్థానంలో నిలిచింది. -
హస్తం జోరు..
[ 25-04-2024]
హనుమకొండ జిల్లా పరిధిలోని కాజీపేట మండలం మడికొండలో నిర్వహించిన ఓరుగల్లు జనజాతర బహిరంగ సభ విజయవంతం కావడం కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం నింపింది. -
ఇంటర్ ఫలితాల్లో ములుగు వెలుగు
[ 25-04-2024]
రాష్ట్ర ప్రభుత్వం బుధవారం విడుదల చేసిన ఇంటర్మీడియట్ ఫలితాల్లో ములుగు జిల్లా అగ్రస్థానంలో నిలిచింది. రాష్ట్రంలోని అన్ని జిల్లాలను వెనకకు నెట్టి ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో మొదటి స్థానంలో నిలిచింది. -
ఇంటర్ ఫలితాల్లో బాలికలదే హవా
[ 25-04-2024]
ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాల్లో ప్రథమ, ద్వితీయ సంవత్సర ఉత్తీర్ణతలో బాలికలదే పైచేయిగా నిలిచింది. బుధవారం ప్రకటించిన ఫలితాల్లో జిల్లాలో ప్రథమ సంవత్సరం 55.72 శాతంతో రాష్ట్రంలో 17వ స్థానం పొందింది. -
బాలికలదే పైచేయి
[ 25-04-2024]
ఇంటర్ బోర్డు అధికారులు బుధవారం విడుదల చేసిన ఇంటర్ ఫలితాల్లో జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో బాలికలే పై చేయి సాధించారు. -
ఇంటర్ ఫలితాల్లో బాలికలదే పైచేయి
[ 25-04-2024]
ఇంటర్ పరీక్ష ఫలితాలు బుధవారం వెలువడిన నేపథ్యంలో జిల్లాలో ఉత్తీర్ణత శాతం గత విద్యా సంవత్సరంతో పోలిస్తే ఈ ఏడాది వెనక్కి వెళ్లింది. -
21 నామపత్రాల దాఖలు
[ 25-04-2024]
వరంగల్ లోక్సభ స్థానానికి బుధవారం 19 మంది అభ్యర్థులు 21 నామపత్రాలను రిటర్నింగ్ అధికారి ప్రావీణ్యకు సమర్పించారు. భారాస పార్టీ అభ్యర్థి మారపల్లి సుధీర్కుమార్ తరఫున భారాస నాయకులు, -
ఆదర్శం.. గంగారం కస్తూర్బా విద్యాలయం
[ 25-04-2024]
మారుమూల ఏజెన్సీలోని కస్తూర్బా గాంధీ బాలికల గురుకుల విద్యాలయం(కేజీబీవీ) విద్యార్థినులు ఇంటర్ ఫలితాల్లో వందశాతం ఫలితాలు సాధించి సత్తా చాటారు.