logo

‘ కేసీఆర్‌ హామీలన్నీ మోసాలే’

దళిత ముఖ్యమంత్రి నుంచి దళిత బంధు వరకు కేసీఆర్‌ ఇచ్చిన హామీలన్నీ మోసాలేనని వైతెపా అధ్యక్షురాలు వైఎస్‌.షర్మిల అన్నారు.

Published : 27 Nov 2022 05:21 IST

నల్లబెల్లిలో మహిళలతో మాట్లాడుతున్న షర్మిల

నల్లబెల్లి, న్యూస్‌టుడే: దళిత ముఖ్యమంత్రి నుంచి దళిత బంధు వరకు కేసీఆర్‌ ఇచ్చిన హామీలన్నీ మోసాలేనని వైతెపా అధ్యక్షురాలు వైఎస్‌.షర్మిల అన్నారు. ప్రజా ప్రస్థానం పాదయాత్రలో భాగంగా శనివారం ఆమె వరంగల్‌ జిల్లా నల్లబెల్లి మండలంలో పర్యటించారు. ఓట్ల కోసమే కేసీఆర్‌ వస్తారని, గెలిచిన పిదప ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అటకెక్కిస్తారన్నారు. ‘కేసీఆర్‌ ఎనిమిదేళ్ల పాలనలో ఎనిమిది వేల మంది రైతులు అప్పులతో ఆత్మహత్యలు చేసుకున్నారు. రెండు లక్షల ఉద్యోగ ఖాళీలు భర్తీ చేయలేదు.. ఫీజు రీయింబర్స్‌మెంటు విస్మరించార’న్నారు. తెరాస బ్యాంకు ఖాతాలో రూ.860 కోట్లున్నాయని,  కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో రూ. 70 వేల కోట్లు దోచుకున్నారని దుయ్యబట్టారు. ప్రాజెక్టుల పేరుతో ఫామ్‌హౌజ్‌లు, విమానాలు కొంటున్నారని విమర్శించారు. బంగారు రాష్ట్రాన్ని కేసీఆర్‌ చేతిలో పెడితే రూ.నాలుగు లక్షల కోట్ల అప్పుల కుప్ప చేశారన్నారు. రుణమాఫీ, ఉచిత విద్యుత్తు, రీయింబర్స్‌మెంట్‌, ఆరోగ్యశ్రీ తదితర వైఎస్సార్‌ పథకాలు మళ్లీ తెచ్చేందుకు ఆయన బిడ్డగా వచ్చానని, నన్ను ఆశీర్వదించాలని  ఆమె ప్రజలను కోరారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని