మున్సిపల్ స్థలానికి ఎసరు
నగర నడిబొడ్డున సుమారు రూ.15- 20 కోట్ల విలువైన మున్సిపల్ స్థలంపై బల్దియా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు.
గ్రేటర్ వరంగల్ స్థలంలో కొనసాగుతున్న హోటళ్లు
న్యూస్టుడే, కార్పొరేషన్: నగర నడిబొడ్డున సుమారు రూ.15- 20 కోట్ల విలువైన మున్సిపల్ స్థలంపై బల్దియా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. కొందరు ప్రైవేటు వ్యక్తులు సొంత స్థలం అన్నట్లుగా ఇతరులకు అద్దెకు ఇచ్చారు. తాత్కాలిక హోటళ్లు, డబ్బాల నుంచి నెల నెలా అద్దె వసూలు చేసుకుంటున్నారు. స్థలం వెనుక భాగంలో ఇష్టానుసారంగా తాత్కాలిక నిర్మాణాలు జరుగుతున్నా.. బల్దియా టౌన్ప్లానింగ్ విభాగం అధికారులు, క్షేత్రస్థాయి ఉద్యోగులు చూసీచూడనట్లుగా ఉంటున్నారు. మున్సిపల్ స్థలంలో ప్రైవేటు వ్యక్తుల పెత్తనం ఏమిటని స్థానికులు, సామాజిక కార్యకర్తలు ప్రశ్నిస్తే రాష్ట్ర హైకోర్టులో కేసు పెండింగ్లో ఉందని తప్పించుకుంటున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి..
వరంగల్ బస్టాండ్ ఎదురుగా లక్ష్మీపురం శివారులో గ్రేటర్ వరంగల్కు చెందిన 72, 73 ఖాళీ ప్లాట్లు ఉన్నాయి. సుమారు 1100 గజాల స్థలం ఉంటుంది. ఈ ప్లాట్ల వెనుక భాగంలో ప్రహరీ, తాత్కాలిక నిర్మాణాలు జరిగాయి. వీటిపై ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యల్లేవు. గత 30 ఏళ్లుగా ఈ స్థలంలో హోటల్ నడుపుకునే ప్రైవేటు వ్యక్తి బల్దియాపై రాష్ట్ర హైకోర్టులో కేసు వేశారు. గత 10-12 ఏళ్లుగా కేసు కొనసాగుతోంది. కొన్ని నెలల క్రితం మున్సిపల్ స్థలంలో కొత్తగా రెండు హోటళ్లు తాత్కాలిక నిర్మాణాలతో వెలిశాయి. నాలుగు డబ్బాలు ఏర్పాటు చేశారు. వీరి నుంచి నెల నెలా అద్దె వసూలు చేస్తున్నారు. దీని వెనుక ఎవరున్నారు? వసూలు చేస్తున్న అద్దె సొమ్ము ఎవరి జేబులోకెళ్తోంది.. టౌన్ప్లానింగ్ అధికారులు, ఉద్యోగులెందుకు మౌనం వెనుక మతలబు ఏమటని స్థానికులు ప్రశ్నిస్తున్నారు.
విచారణ చేపడతాం:
డీ.బషీర్, ఇన్ఛార్జి ఏసీˆపీˆ, కాశీబుగ్గ సర్కిల్
వరంగల్ బస్టాండ్ ఎదురుగా 72, 73 ప్లాట్ల మున్సిపల్ స్థలం ఉంది. దీనిపై ఓ ప్రైవేటు వ్యక్తి రాష్ట్ర హైకోర్టులో కేసు వేశారు. ఇంకా తుది నిర్ణయం వెలువడ లేదు. మున్సిపల్ స్థలాన్ని అద్దెకివ్వడం, నెల నెలా అద్దె వసూలు చేస్తున్నట్లు నా దృష్టికి రాలేదు. దీనిపై విచారణ చేపడతాం. తాత్కాలిక నిర్మాణాలపై చర్యల కోసం లీగల్సెల్ సలహా తీసుకుంటాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భారాసకు కడియం ఝలక్!
[ 29-03-2024]
అసెంబ్లీ ఎన్నికల్లోనే వరంగల్ లోక్సభ స్థానం పరిధిలో భారాసకు ఎదురుదెబ్బ తగిలింది. ఏడు స్థానాల్లో ఆరు చోట్ల ఓటమి తప్పలేదు. -
మానుకోట ఎమ్మెల్యే వాహనం తనిఖీ
[ 29-03-2024]
లోక్సభ ఎన్నికల నేపథ్యంలో నెల్లికుదురు వద్ద నెలకొల్పిన చెక్ పోస్టు వద్ద గురువారం మహబూబాబాద్ ఎమ్మెల్యే భూక్య మురళీనాయక్, కరీంనగర్ ఎమ్మెల్సీ రఘోత్తంరెడ్డి వాహనాలను తనిఖీ చేశారు. -
షాపింగ్మాల్లో భారీ అగ్నిప్రమాదం
[ 29-03-2024]
వరంగల్ పోచమ్మమైదాన్లోని జెకోటియా షాపింగ్ మాల్లో గురువారం సాయంత్రం 6.45 గంటలకు భారీ అగ్నిప్రమాదం జరిగింది. -
గ్రంథాలయం మాది..పుస్తకం మీది!
[ 29-03-2024]
నేటి తరం పిల్లలు పుస్తక పఠనానికి క్రమంగా దూరమవుతున్నారు. చరవాణుల వ్యామోహంలో పడి గ్రంథాలయాల గడప తొక్కనివారు ఎంతో మంది ఉన్నారు. -
ఎర్రగట్టు గుట్టపై క్షీరాభిషేకం
[ 29-03-2024]
భీమారంలోని ఎర్రగట్టు గుట్టపై వెలసిన వేెంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. నాలుగో రోజు గురువారం స్వామివారికి క్షీరాభిషేకం నిర్వహించారు. -
యథేచ్ఛగా ఆలయ భూముల ఆక్రమణ
[ 29-03-2024]
వరంగల్, హనుమకొండ నగరాల నడిబొడ్డున రూ.కోట్ల విలువైన ఆలయ భూములు ఆక్రమణల చెరలో ఉన్నాయి. ఈ స్థలాల్లో పలుకుబడి ఉన్నవాళ్లు పెద్ద భవనాలు, ఇళ్లు నిర్మించుకున్నారు. -
ఇసుకాసురులపై పోలీసుల కొరడా
[ 29-03-2024]
సహజ వనరులను కాపాడుకుంటూ భవిష్యత్తు తరాలకు అందించినప్పుడే మనుగడ సాధ్యమవుతుంది. కానీ చాలా వరకు గుట్టలు, ఇసుక, మట్టిని గుళ్ల చేస్తూ వనరులను అందిన కాడికి దోచుకుంటున్నారు. -
నాణ్యతా.. వారికి మామూలే!
[ 29-03-2024]
ఉపాధిహామీ పథకం నిధులతో పంచాయతీరాజ్ ఇంజినీరింగ్శాఖ ఆధ్వర్యంలో మహబూబాబాద్, భూపాలపల్లి, ములుగు జిల్లాల్లోని పలు గ్రామాల్లో ఇటీవల సీసీ రోడ్ల నిర్మాణాలు చేపట్టారు. -
వైద్యుడు లేక అందని గుండె పరీక్షల సేవలు
[ 29-03-2024]
జనగామ జిల్లా కేంద్రంగా మారిన తర్వాత జనగామలో ప్రభుత్వం తెలంగాణ డయాగ్నస్టిక్ కేంద్రం, రేడియాలజీ హబ్లను ఏర్పాటు చేసింది. -
మరోసారి కాంగ్రెస్ సత్తా చాటాలి
[ 29-03-2024]
రానున్న లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మాజీ కేంద్ర మంత్రి బలరాంనాయక్ను అధిక మెజారిటీతో గెలిపించాలని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క నాయకులు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. -
ఆస్తి పన్ను బకాయిదారులపై కొరడా
[ 29-03-2024]
ఆస్తి పన్ను మొండి బకాయిదారులపై మున్సిపాలిటీ అధికారులు కొరడా ఝులిపిస్తున్నారు. వారం రోజులుగా ఉదయం 7 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు బకాయిదారుల ఇళ్లు, దుకాణాల వద్దకు వెళ్లి పన్ను చెల్లించాలని కోరుతున్నారు. -
అక్రమ వ్యాపారాలపై ప్రత్యేక నిఘా
[ 29-03-2024]
జిల్లాలో అక్రమ వ్యాపారాలపై పోలీసు యంత్రాంగం ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ అన్నారు. -
వేగవంతంగా చిన్న కాళేశ్వరం ప్రాజెక్టు పనులు
[ 29-03-2024]
మహదేవపూర్ మండలంలోని చిన్న కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ పనులను వేగవంతంగా చేపట్టాలని సంబంధిత నీటిపారుదల శాఖ అధికారులను జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా ఆదేశించారు. -
పల్లెల్లో బెట్టింగ్ల జోరు
[ 29-03-2024]
పట్టణాలకు పరిమితమైన బెట్టింగ్ సంస్కృతి పల్లె ప్రాంతంలో విస్తరించింది. జిల్లాలో మారుమూల ప్రాంతమైన కాటారం రెవెన్యూ డివిజన్ పరిధిలోని పల్లెల్లో యువకులు, వ్యాపారులు, విద్యార్థులు పందేలు కాస్తూ ఆర్థికంగా చితికిపోతున్నారు.