ఇంటి పన్ను వసూలులో గంగదేవిపల్లి ఆదర్శం
ఇంటి పన్నుల వసూలులో గంగదేవిపల్లి ఈ ఏడాదీ ఆదర్శంగా నిలిచింది. వరంగల్ జిల్లా గీసుకొండ మండలంలోని ఈ జాతీయ ఆదర్శ గ్రామం జిల్లాలో ముందుగానే నూరుశాతం పన్ను వసూలు చేసి స్ఫూర్తిగా నిలుస్తోంది.
న్యూస్టుడే, గీసుకొండ, పరకాల: ఇంటి పన్నుల వసూలులో గంగదేవిపల్లి ఈ ఏడాదీ ఆదర్శంగా నిలిచింది. వరంగల్ జిల్లా గీసుకొండ మండలంలోని ఈ జాతీయ ఆదర్శ గ్రామం జిల్లాలో ముందుగానే నూరుశాతం పన్ను వసూలు చేసి స్ఫూర్తిగా నిలుస్తోంది. 1995లో మచ్చాపురం నుంచి విడిపోయి ప్రత్యేక పంచాయతీగా ఆవిర్భవించిన గంగదేవిపల్లి నాటి నుంచి నేటి వరకు వరుసగా 27 ఏళ్లపాటు నూరు శాతం ఇంటి పన్నులు వసూలు చేసి రికార్డు సృష్టించింది. జిల్లాలోని ఇతర పంచాయతీలు మార్చి నెలాఖరు నాటికి నూరు శాతం ఇంటి పన్నులు వసూలు చేస్తుండగా ఈ ఊరు మాత్రం ఏటా నవంబరు 25 నాటికే నూరు శాతం పన్నులు వసూలు చేస్తుండటం గమనార్హం. ఈ ఆర్థిక సంవత్సరంలో గ్రామంలో రూ.2,83,883 ఇంటి పన్ను వసూలు లక్ష్యం కాగా నవంబరు 25 నాటికి నూరు శాతం వసూలు చేసి ఖజానా కార్యాలయంలో జమచేశారు అన్ని గ్రామాల కంటే ముందే పన్ను వసూలు చేసినందుకు వరంగల్ డివిజనల్ పంచాయతీ అధికారి ప్రభాకర్, గీసుకొండ ఎంపీడీవో జి. రమేష్, ఎంపీవో ఎ. ప్రభాకర్ సర్పంచి గోనె మల్లారెడ్డిని అభినందించారు.
గీసుకొండ మండలంలో 74 శాతం ..
వరంగల్ జిల్లాలో మొత్తం 11 మండలాలు ఉండగా ఈ ఏడాది ఇప్పటివరకు గీసుకొండ మండలం 74.96 శాతం ఇంటి పన్ను వసూలు చేసి జిల్లాలో ప్రథమ స్థానంలో నిలిచింది. జిల్లాలో అత్యధికంగా ఇంటి పన్నులు ఉన్న మండలం ఇదే. ఇక్కడ 1,02,55,399 పన్ను వస్తోంది. ఇప్పటి వరకు 76,87,909 వసూలు చేసి జిల్లాలో మొదటి స్థానంలో నిలిచింది. జిల్లాలో 323 పంచాయతీల్లో రూ.6,22,31,921 మేర ఇంటి పన్ను వసూలు చేయాల్సి ఉండగా ఇప్పటి వరకు రూ.2,97,81,336 వసూలైంది. పన్ను వసూలులో మొదటి స్థానంలో నిలిచినందుకు జిల్లా అదనపు కలెక్టర్ అశ్విని తానాజీవాకడే ఎంపీడీవో జి. రమేష్ను ప్రత్యేకంగా అభినందించారు.
మాగ్రామాన్ని స్ఫూర్తిగా తీసుకుంటున్నాయి..:
గోనె మల్లారెడ్డి, సర్పంచి, గంగదేవిపల్లి
వరుసగా 27 ఏళ్లపాటు ఏటా నవంబరు 25లోపు నూరుశాతం పన్నులు చెల్లించడం బహుశా రాష్ట్రంలోనే మా గ్రామం మొదటిది కావచ్చు. సకాలంలో ఇంటి పన్నులు చెల్లించడానికి ముందుకు వచ్చిన మా గ్రామస్థులకు ప్రత్యేకంగా అభినందనలు. గ్రామపంచాయతీ సిబ్బంది కృషి వల్లనే ఇది సాధ్యం అయింది. మా గ్రామాన్ని స్ఫూర్తిగా తీసుకుని జిల్లాలోని అన్ని గ్రామాలు కూడా నూరు శాతం ఇంటి పన్ను వసూలుపై దృష్టిపెడుతున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జజ్జనకర.. జనజాతర
[ 25-04-2024]
కాజీపేట మండలం మడికొండలో ఏర్పాటు చేసిన ఓరుగల్లు జనజాతర బహిరంగ సభ విజయవంతమైంది. వరంగల్ లోక్సభ పరిధిలోని ఏడు సెగ్మెంట్ల నుంచి భారీగా జనసమీకరణ చేయడంతో సభా ప్రాంగణం కిక్కిరిసిపోయింది. -
ప్రథమంలో 24 ద్వితీయంలో 26
[ 25-04-2024]
ఇంటర్మీడియట్ వార్షిక ఫలితాల్లో వరంగల్ జిల్లా వెనుకబడింది. ప్రథమ సంవత్సరం ఫలితాల్లో రాష్ట్రంలో 24వ స్థానం, ద్వితీయ సంవత్సరంలో 26వ స్థానంలో నిలిచింది. -
హస్తం జోరు..
[ 25-04-2024]
హనుమకొండ జిల్లా పరిధిలోని కాజీపేట మండలం మడికొండలో నిర్వహించిన ఓరుగల్లు జనజాతర బహిరంగ సభ విజయవంతం కావడం కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం నింపింది. -
ఇంటర్ ఫలితాల్లో ములుగు వెలుగు
[ 25-04-2024]
రాష్ట్ర ప్రభుత్వం బుధవారం విడుదల చేసిన ఇంటర్మీడియట్ ఫలితాల్లో ములుగు జిల్లా అగ్రస్థానంలో నిలిచింది. రాష్ట్రంలోని అన్ని జిల్లాలను వెనకకు నెట్టి ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో మొదటి స్థానంలో నిలిచింది. -
ఇంటర్ ఫలితాల్లో బాలికలదే హవా
[ 25-04-2024]
ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాల్లో ప్రథమ, ద్వితీయ సంవత్సర ఉత్తీర్ణతలో బాలికలదే పైచేయిగా నిలిచింది. బుధవారం ప్రకటించిన ఫలితాల్లో జిల్లాలో ప్రథమ సంవత్సరం 55.72 శాతంతో రాష్ట్రంలో 17వ స్థానం పొందింది. -
బాలికలదే పైచేయి
[ 25-04-2024]
ఇంటర్ బోర్డు అధికారులు బుధవారం విడుదల చేసిన ఇంటర్ ఫలితాల్లో జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో బాలికలే పై చేయి సాధించారు. -
ఇంటర్ ఫలితాల్లో బాలికలదే పైచేయి
[ 25-04-2024]
ఇంటర్ పరీక్ష ఫలితాలు బుధవారం వెలువడిన నేపథ్యంలో జిల్లాలో ఉత్తీర్ణత శాతం గత విద్యా సంవత్సరంతో పోలిస్తే ఈ ఏడాది వెనక్కి వెళ్లింది. -
21 నామపత్రాల దాఖలు
[ 25-04-2024]
వరంగల్ లోక్సభ స్థానానికి బుధవారం 19 మంది అభ్యర్థులు 21 నామపత్రాలను రిటర్నింగ్ అధికారి ప్రావీణ్యకు సమర్పించారు. భారాస పార్టీ అభ్యర్థి మారపల్లి సుధీర్కుమార్ తరఫున భారాస నాయకులు, -
ఆదర్శం.. గంగారం కస్తూర్బా విద్యాలయం
[ 25-04-2024]
మారుమూల ఏజెన్సీలోని కస్తూర్బా గాంధీ బాలికల గురుకుల విద్యాలయం(కేజీబీవీ) విద్యార్థినులు ఇంటర్ ఫలితాల్లో వందశాతం ఫలితాలు సాధించి సత్తా చాటారు.
తాజా వార్తలు (Latest News)
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
టెక్ మహీంద్రా లాభంలో 41 శాతం క్షీణత.. ఒక్కో షేరుపై రూ.28 డివిడెండ్
-
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ.. ఏపీ హైకోర్టు కీలక ఆదేశం
-
యూపీఎస్సీ - 2025 పరీక్షల క్యాలెండర్ విడుదల.. ‘సివిల్స్’ పరీక్షలు ఎప్పుడంటే?
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
కాళేశ్వరం ఆనకట్టలపై ఫిర్యాదులు, నివేదనలు కోరుతూ ప్రకటన జారీ