రామప్పకు మహర్దశ
యునెస్కో గుర్తింపు పొందిన తర్వాత రామప్ప కట్టడం ప్రపంచ దేశాల పర్యాటకులకు విశేషంగా ఆకర్షిస్తోంది.
స్వామి పేరిట రూ.6 లక్షలు ఫిక్స్డ్ డిపాజిట్
ఆలయ ప్రాంగణంలో సందర్శకులు
వెంకటాపూర్ (ములుగు జిల్లా), న్యూస్టుడే: యునెస్కో గుర్తింపు పొందిన తర్వాత రామప్ప కట్టడం ప్రపంచ దేశాల పర్యాటకులకు విశేషంగా ఆకర్షిస్తోంది. ఆ శుభదినం 2021 జులై 25 తర్వాత కరోనాను సైతం లెక్కచేయకుండా ప్రజలు కుటుంబ సమేతంగా తరలిరావడం ప్రారంభమైంది. ప్రస్తుతం నిత్యం 2 వేల మంది రామప్ప ఆలయాన్ని చూడడానికి వస్తున్నారు. శని, ఆదివారాల్లో ఈ సంఖ్య 6 వేలు దాటుతోంది. వీరంతా రామలింగేశ్వర స్వామిని దర్శించుకుని హుండీ కానుకలను సమర్పిస్తున్నారు. దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో ఇటీవల ఈ-హుండీ సైతం ఏర్పాటు చేశారు. ఆదాయం భారీగా పెరగడంతో ఇటీవల రామప్ప రామలింగేశ్వర స్వామి పేరు మీద రూ.6 లక్షలను ఫిక్స్డ్ డిపాజిట్ చేశారు. రెండళ్ల వ్యవధిలో నిర్వహణ ఖర్చులు పోనూ ఇలా ఎఫ్డిఆర్ చేయడం ఆలయ చరిత్రలో ఇదే మొదటిసారి.
* ఒకప్పుడు రామలింగేశ్వర స్వామి దర్శనానికి ప్రత్యేక రోజులు, పండగ వేళలు, శని, ఆదివారాల్లో మాత్రమే భక్తులు వచ్చేవారు. ఇప్పుడు విదేశీయుల తాకిడి సైతం బాగా పెరిగింది. తీరిక లేకుండా భక్తులు వస్తూనే ఉన్నారు. చాలా సంతోషంగా ఉంది.
హరీశ్శర్మ, రామప్ప ఆలయ ప్రధాన పూజారి
* రాబోయే రోజుల్లో ఆదాయం మరింత పెరిగే అవకాశం ఉంది. ఆలయం అభివృద్ధికి విశేషంగా కృషి చేస్తున్నాం
బిళ్ల శ్రీనివాస్, ఈవో
* టూరిజం శాఖలో రామప్ప గైడ్గా రూ.200 నెలజీతం ఉన్నప్పటి నుంచి 15 ఏళ్లుగా పనిచేస్తున్నాను. ఒకప్పుడు శని, ఆదివారాల్లోనే పర్యాటకులు వచ్చేవాళ్లు. ఇప్పుడు స్వదేశీ, విదేశీ పర్యాటకుల తాకిడి పెరిగింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు రామప్ప చరిత్రను వివరించడానికి తీరిక లేకుండా పనిచేయాల్సి వస్తోంది.
తాడబోయిన వెంకటేశ్, టూరిజం గైడ్
* దాదాపు 35 ఏళ్ల నుంచి రామప్పలో చిల్లర దుకాణం ఏర్పాటు చేసుకుని జీవిస్తున్నాను. నాతో పాటు 40 దుకాణాలు ఉన్నాయి. అందరూ నిరుపేదలే.. మా ఆదాయం బాగా పెరిగింది.
పిల్లలమర్రి భిక్షపతి, చిల్లర దుకాణం యజమాని, రామప్ప
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జజ్జనకర.. జనజాతర
[ 25-04-2024]
కాజీపేట మండలం మడికొండలో ఏర్పాటు చేసిన ఓరుగల్లు జనజాతర బహిరంగ సభ విజయవంతమైంది. వరంగల్ లోక్సభ పరిధిలోని ఏడు సెగ్మెంట్ల నుంచి భారీగా జనసమీకరణ చేయడంతో సభా ప్రాంగణం కిక్కిరిసిపోయింది. -
ప్రథమంలో 24 ద్వితీయంలో 26
[ 25-04-2024]
ఇంటర్మీడియట్ వార్షిక ఫలితాల్లో వరంగల్ జిల్లా వెనుకబడింది. ప్రథమ సంవత్సరం ఫలితాల్లో రాష్ట్రంలో 24వ స్థానం, ద్వితీయ సంవత్సరంలో 26వ స్థానంలో నిలిచింది. -
హస్తం జోరు..
[ 25-04-2024]
హనుమకొండ జిల్లా పరిధిలోని కాజీపేట మండలం మడికొండలో నిర్వహించిన ఓరుగల్లు జనజాతర బహిరంగ సభ విజయవంతం కావడం కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం నింపింది. -
ఇంటర్ ఫలితాల్లో ములుగు వెలుగు
[ 25-04-2024]
రాష్ట్ర ప్రభుత్వం బుధవారం విడుదల చేసిన ఇంటర్మీడియట్ ఫలితాల్లో ములుగు జిల్లా అగ్రస్థానంలో నిలిచింది. రాష్ట్రంలోని అన్ని జిల్లాలను వెనకకు నెట్టి ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో మొదటి స్థానంలో నిలిచింది. -
ఇంటర్ ఫలితాల్లో బాలికలదే హవా
[ 25-04-2024]
ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాల్లో ప్రథమ, ద్వితీయ సంవత్సర ఉత్తీర్ణతలో బాలికలదే పైచేయిగా నిలిచింది. బుధవారం ప్రకటించిన ఫలితాల్లో జిల్లాలో ప్రథమ సంవత్సరం 55.72 శాతంతో రాష్ట్రంలో 17వ స్థానం పొందింది. -
బాలికలదే పైచేయి
[ 25-04-2024]
ఇంటర్ బోర్డు అధికారులు బుధవారం విడుదల చేసిన ఇంటర్ ఫలితాల్లో జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో బాలికలే పై చేయి సాధించారు. -
ఇంటర్ ఫలితాల్లో బాలికలదే పైచేయి
[ 25-04-2024]
ఇంటర్ పరీక్ష ఫలితాలు బుధవారం వెలువడిన నేపథ్యంలో జిల్లాలో ఉత్తీర్ణత శాతం గత విద్యా సంవత్సరంతో పోలిస్తే ఈ ఏడాది వెనక్కి వెళ్లింది. -
21 నామపత్రాల దాఖలు
[ 25-04-2024]
వరంగల్ లోక్సభ స్థానానికి బుధవారం 19 మంది అభ్యర్థులు 21 నామపత్రాలను రిటర్నింగ్ అధికారి ప్రావీణ్యకు సమర్పించారు. భారాస పార్టీ అభ్యర్థి మారపల్లి సుధీర్కుమార్ తరఫున భారాస నాయకులు, -
ఆదర్శం.. గంగారం కస్తూర్బా విద్యాలయం
[ 25-04-2024]
మారుమూల ఏజెన్సీలోని కస్తూర్బా గాంధీ బాలికల గురుకుల విద్యాలయం(కేజీబీవీ) విద్యార్థినులు ఇంటర్ ఫలితాల్లో వందశాతం ఫలితాలు సాధించి సత్తా చాటారు.
తాజా వార్తలు (Latest News)
-
ఐపీఎల్ స్ట్రీమింగ్ కేసు.. నటి తమన్నాకు సమన్లు
-
విమానాలు రద్దయితే ఆటోమేటిక్ రిఫండ్.. అమెరికాలో కొత్త నిబంధనలు
-
హైదరాబాద్కు ‘ఉప్పల్’ అడ్డా.. బెంగళూరుపై ఈసారి స్కోరెంత?
-
గీత రచయిత పాటల హక్కు కోరితే ఏమవుతుంది?: ఇళయరాజా కేసులో హైకోర్టు ప్రశ్న
-
నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. 22,350 దిగువకు నిఫ్టీ
-
ప్రైవేటు ఆస్తి.. సమాజ వనరు కాదని అనలేం: సుప్రీంకోర్టు వ్యాఖ్య