విద్యార్థుల ప్రగతి తెలిసేలా..!
ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థుల ప్రగతితో పాటు పాఠశాల సంస్థాగతమైన అభివృద్ధికి తోడ్పాటు అందించేందుకు విద్యాశాఖ ప్రతినెలా తల్లిదండ్రులను భాగస్వామ్యం చేస్తోంది.
తల్లిదండ్రుల సమావేశంలో పాల్గొన్న అధికారులు
వరంగల్ విద్యావిభాగం, న్యూస్టుడే: ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థుల ప్రగతితో పాటు పాఠశాల సంస్థాగతమైన అభివృద్ధికి తోడ్పాటు అందించేందుకు విద్యాశాఖ ప్రతినెలా తల్లిదండ్రులను భాగస్వామ్యం చేస్తోంది. దీని కోసం రాష్ట్ర విద్యాశాఖ ప్రత్యేక ప్రణాళిక రూపొందించింది. ప్రతి నెలా మూడో శనివారం తప్పనిసరిగా అధికారులు, పాఠశాలల ఉపాధ్యాయులు తల్లిదండ్రులతో సమావేశాలు నిర్వహించడానికి మార్గదర్శకాలు జారీ చేసింది. ఒకవేళ ఆ శనివారం ప్రభుత్వ సెలవు రోజు అయితే నాలుగో శనివారం యాథావిధిగా సమావేశం ఏర్పాటు చేయాలని సూచించింది.
చర్చించే అంశాలివే..
విద్యార్థుల హాజరు పెంపుదల కోసం తీసుకునే చర్యలపై చర్చించాలి. ఆంగ్ల మాధ్యమ బోధనపై తల్లిదండ్రులకు అవగాహన కల్పించి, విద్యార్థులకు ప్రభుత్వం అందించే సదుపాయాలు, అవకాశాలు, ఉపకార వేతనాలు వంటి విషయాలను తెలియజేయాలి. విద్యతో పాటు సాంస్కృతిక, ఆరోగ్య, మానసిక స్థితిగతులు, అభిరుచులు, వైఖరులు, అలవాట్లు వంటి వాటిపై చర్చించాలి. పాఠశాల అభివృద్ధికి సలహాలు, సూచనలు తీసుకోవాలి. మన ఊరు-మన బడి, 8వ తరగతి వరకు ఆంగ్ల మాధ్యమ బోధన, ప్రాథమిక పాఠశాలల్లో విద్యార్థుల సామర్థ్యాల పెంపునకు అమలు చేస్తున్న తొలిమెట్టు కార్యక్రమం, మధ్యాహ్నా భోజనం పథకం అమలు తదితర అంశాలపై విస్తృతంగా చర్చించడం జరుగుతుంది.
ప్రయోజనాలు ఇలా..
ప్రతి నెల క్రమం తప్పకుండా తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల సమావేశాలు నిర్వహించడంతో వీరి మధ్య స్నేహపూర్వక, సహకార వాతావరణం నెలకొంటుంది. పిల్లల సమస్యలు, హాజరు, ప్రవర్తన తీరు, బోధన తదితర అంశాలు అవగతమవుతాయి. తల్లిదండ్రులు తమ పిల్లలకు అందించాల్సిన మద్దతు, ఇంటివద్ద హోంవర్కు, అసైన్మెంటులతో సహకారం అందించే అవకాశం ఉంటుంది. దీంతో నాణ్యమైన విద్య అందించడానికి అవకాశం ఉంటుంది. పాఠశాలలోని విద్యార్థులను తరగతుల వారీగా ప్రగతి, సామర్థ్యాలు, సృజనాత్మకత తదితర అంశాలతో విద్యార్థుల వారీగా నివేదిక రూపొదించడంతో ప్రతి పిల్లవాడిపై ఎప్పటికప్పుడు స్థితిగతులు తెలుసుకోవచ్చు.
సమావేశ లక్ష్యాలు..
* ఉత్తమ ఫలితాల సాధనకు అవసరమైన ప్రణాళికలు రూపొందించడం* తరగతిలోని విద్యార్థుల యొక్క ప్రగతిని తల్లిదండ్రులకు తెలియజేయడం * వివిధ రంగాల్లో పిల్లలు కనబరిచిన సామర్థ్యాన్ని బట్టి వారికి శిక్షణ అందించే విధంగా ప్రోత్సహించడం* విద్యాపరమైన, పాఠశాల సంస్థాగతపరమైన అభివృద్ధి గురించి వివరించి తద్వారా మౌలిక వసతులు కల్పనలో వారి భాగస్వామ్యాన్ని అందించడం.
రెండు నెలలుగా నిర్వహిస్తున్నాం
బి.రాధ, ప్రత్యేక అధికారి
విద్యార్థుల ప్రగతే లక్ష్యంగా ప్రభుత్వం, రాష్ట్ర విద్యాశాఖ రూపొందించిన కార్యక్రమాన్ని ప్రణాళికతో రెండు నెలలుగా నిర్వహిస్తున్నాం. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఒకే వేదిక ద్వారా అన్ని అంశాలు చర్చించడం ద్వారా సర్కార్ బడులపై నమ్మకం పెరుగుతోంది. ఇలాంటి కార్యక్రమాల ద్వారా పిల్లల ప్రగతి, పాఠశాల అభివృద్ధికి పాటుపడొచ్చు.
తల్లిదండ్రులే కీలకం
డి.వాసంతి, డీఈవో హనుమకొండ
ఉపాధ్యాయుడు తన మేధస్సుతో బోధించినా.. ఇంటి దగ్గర తమ పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ కనబరిచే విషయంలో తల్లిదండ్రులే కీలకం. ఎన్ని పనులున్నా నిత్యం వారి చదువు కోసం రెండు గంటలు సమయం కేటాయిస్తే మంచి ఫలితాలు వస్తాయి. విద్యార్థుల ఎదుగుదలకు ఇలాంటి వేదికలు దోహదపడతాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జజ్జనకర.. జనజాతర
[ 25-04-2024]
కాజీపేట మండలం మడికొండలో ఏర్పాటు చేసిన ఓరుగల్లు జనజాతర బహిరంగ సభ విజయవంతమైంది. వరంగల్ లోక్సభ పరిధిలోని ఏడు సెగ్మెంట్ల నుంచి భారీగా జనసమీకరణ చేయడంతో సభా ప్రాంగణం కిక్కిరిసిపోయింది. -
ప్రథమంలో 24 ద్వితీయంలో 26
[ 25-04-2024]
ఇంటర్మీడియట్ వార్షిక ఫలితాల్లో వరంగల్ జిల్లా వెనుకబడింది. ప్రథమ సంవత్సరం ఫలితాల్లో రాష్ట్రంలో 24వ స్థానం, ద్వితీయ సంవత్సరంలో 26వ స్థానంలో నిలిచింది. -
హస్తం జోరు..
[ 25-04-2024]
హనుమకొండ జిల్లా పరిధిలోని కాజీపేట మండలం మడికొండలో నిర్వహించిన ఓరుగల్లు జనజాతర బహిరంగ సభ విజయవంతం కావడం కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం నింపింది. -
ఇంటర్ ఫలితాల్లో ములుగు వెలుగు
[ 25-04-2024]
రాష్ట్ర ప్రభుత్వం బుధవారం విడుదల చేసిన ఇంటర్మీడియట్ ఫలితాల్లో ములుగు జిల్లా అగ్రస్థానంలో నిలిచింది. రాష్ట్రంలోని అన్ని జిల్లాలను వెనకకు నెట్టి ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో మొదటి స్థానంలో నిలిచింది. -
ఇంటర్ ఫలితాల్లో బాలికలదే హవా
[ 25-04-2024]
ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాల్లో ప్రథమ, ద్వితీయ సంవత్సర ఉత్తీర్ణతలో బాలికలదే పైచేయిగా నిలిచింది. బుధవారం ప్రకటించిన ఫలితాల్లో జిల్లాలో ప్రథమ సంవత్సరం 55.72 శాతంతో రాష్ట్రంలో 17వ స్థానం పొందింది. -
బాలికలదే పైచేయి
[ 25-04-2024]
ఇంటర్ బోర్డు అధికారులు బుధవారం విడుదల చేసిన ఇంటర్ ఫలితాల్లో జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో బాలికలే పై చేయి సాధించారు. -
ఇంటర్ ఫలితాల్లో బాలికలదే పైచేయి
[ 25-04-2024]
ఇంటర్ పరీక్ష ఫలితాలు బుధవారం వెలువడిన నేపథ్యంలో జిల్లాలో ఉత్తీర్ణత శాతం గత విద్యా సంవత్సరంతో పోలిస్తే ఈ ఏడాది వెనక్కి వెళ్లింది. -
21 నామపత్రాల దాఖలు
[ 25-04-2024]
వరంగల్ లోక్సభ స్థానానికి బుధవారం 19 మంది అభ్యర్థులు 21 నామపత్రాలను రిటర్నింగ్ అధికారి ప్రావీణ్యకు సమర్పించారు. భారాస పార్టీ అభ్యర్థి మారపల్లి సుధీర్కుమార్ తరఫున భారాస నాయకులు, -
ఆదర్శం.. గంగారం కస్తూర్బా విద్యాలయం
[ 25-04-2024]
మారుమూల ఏజెన్సీలోని కస్తూర్బా గాంధీ బాలికల గురుకుల విద్యాలయం(కేజీబీవీ) విద్యార్థినులు ఇంటర్ ఫలితాల్లో వందశాతం ఫలితాలు సాధించి సత్తా చాటారు.
తాజా వార్తలు (Latest News)
-
జగనన్న నవ్వులు.. జనాలకు చుక్కలు
-
కూలీ బిడ్డకు 993 మార్కులు
-
ఏ ముఖం పెట్టుకుని రాజధాని రైతులను సీఎం ఓట్లు అడుగుతారు
-
ఒకే ద్విచక్రవాహనంపై ప్రయాణం.. బస్సు ఢీకొని నలుగురు ఇంటర్ విద్యార్థుల మృతి
-
సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి
-
జూదరులతో కలిసి పుట్టిన రోజు వేడుకలు.. మంగళ్హాట్ డీఐ సస్పెన్షన్ ?