అరకొర సౌకర్యాలతో ఆటలకు దూరం
శారీరక దారుఢ్యానికి, మానసిక ఉల్లాసానికి, గొప్ప క్రీడాకారులుగా ఖ్యాతిగడించడానికి మైదానాలే వేదికలు.
జనగామ జిల్లాలోని ఓ పాఠశాలలో కబడ్డీ ఆడుతున్న విద్యార్థులు (పాతచిత్రం)
న్యూస్టుడే, జనగామ అర్బన్: శారీరక దారుఢ్యానికి, మానసిక ఉల్లాసానికి, గొప్ప క్రీడాకారులుగా ఖ్యాతిగడించడానికి మైదానాలే వేదికలు. చిన్ననాటి నుంచే ఆటలపై ఆసక్తి పెంచుకుని వాటిని కెరీర్గా ఎంచుకుని రాణించిన వారెందరో. అలాంటి అవకాశం ప్రభుత్వ పాఠశాలల్లో లేకుండాపోతోంది. సర్కారు బడుల్లో క్రీడలు ఆడుకునేందుకు ఆటస్థలాలు కనమరుగయ్యాయి. విద్యార్థిలోని క్రీడా నైపుణ్యాలు సానబెట్టడానికి వ్యాయామ ఉపాధ్యాయులు కీలకం. కానీ వీరి కొరత విద్యార్థులపై తీవ్ర ప్రభావం చూపుతోంది. కొన్నింట్లో విశాలమైన మైదానం, వ్యాయామ ఉపాధ్యాయులు లేకపోవడం, మరికొన్నింట్లో అవి ఉన్నప్పటికీ క్రీడా సామగ్రి లేక విద్యార్థులు ఆటలకు దూరమవుతున్నారు.
పలు పాఠశాలల్లో పరిస్థితి ఇలా..!
* జనగామ ధర్మకంచలోని జిల్లా పరిషత్తు బాలుర ఉన్నత పాఠశాలలో విశాలమైన క్రీడా మైదానంతో పాటు అనుభవజ్ఞుడైన పీఈటీ ఉన్నా.. క్రీడా సామగ్రి లేక విద్యార్థులకు సాధన కరవవుతోంది.
* సిద్దిపేట రోడ్డులోని బాలికల ఉన్నత పాఠశాలలో 200 మంది విద్యార్థులున్నారు. మహిళా పీఈటీ ఉంది. ఆటస్థలం లేదు. క్రీడా వస్తువులూ అంతంతే ఉన్నాయి.
* స్టేషన్ఘన్పూర్ మండలం సముద్రాల జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలో 90 మంది విద్యార్థులు ఉన్నారు. ప్రైవేటు పీఈటీ ఉన్నారు. మైదానం విశాలంగా ఉంది. కిట్లు లేవు.
* ఇప్పగూడెంలోని ప్రభుత్వ పాఠశాలలో 200కి పైగా విద్యార్థులు ఉన్నారు. పీఈటీ ఉన్నప్పటికీ సరిపడా కిట్లు రావడం లేదని సమాచారం.
* స్టేషన్ఘన్పూర్ మండల కేంద్రంలోని పాఠశాలల్లోనూ క్రీడా సామగ్రి కొరత ఉందని సమాచారం.
జిల్లా కేంద్రంలోని రైల్వేస్టేషన్ సమీపంలో ఉన్న ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఇది. 430 మంది విద్యార్థులున్నారు. ఇక్కడ ఉదయం వేళ ప్రార్థన చేసేందుకే స్థలం సరిపోవడం లేదు. ఉన్న స్థలాన్ని వంటకు కేటాయించారు. పీఈటీ ఉన్నారు. ఆట వస్తువులూ అరకొరగానే ఉన్నాయి. కానీ స్థలాభావం వల్ల పిల్లలు ఆటలకు దూరమవుతున్నారు.
పీఈటీ ఉన్నా స్థలం లేదు..
భవంతిక, పదో తరగతి, ప్రభుత్వ ఉన్నత పాఠశాల
మా పాఠశాలలో చదువుతో పాటు ఆటలపై ఆసక్తి ఉన్నవారు చాలా మంది ఉన్నారు. వ్యాయామ ఉపాధ్యాయులు ఉన్నప్పటికీ సరైన స్థలం లేదు. దీంతో క్రీడలపై ఆసక్తి కోల్పోతున్నాం. ఆటలకు గంట సమయం ఉన్నప్పటికీ మైదానం లేక వినియోగించుకోలేకపోతున్నాం. కనీసం ఇండోర్ ఆటలకు అవసరమయ్యే సామగ్రి సమకూర్చాలని కోరుతున్నాం.
దృష్టి సారిస్తాం:
రాము, డీఈవో
పిల్లల ఆటల విషయంలో దృష్టి సారిస్తాం. ప్రస్తుతం ఆటలకూ ఒక గంట కేటాయించాం. కొన్ని పాఠశాలల్లో మాత్రమే మైదానాలు లేక విద్యార్థులు ఆటలకు దూరమవుతున్నారు. ఆయా బడుల్లో ఇండోర్కు సంబంధించిన కిట్లు అందిస్తున్నాం. పీఈటీల కొరత కూడా ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కాంగ్రెస్ కంచుకోట.. మానుకోట!
[ 20-04-2024]
మహబూబాబాద్ జిల్లాకేంద్రంలో శుక్రవారం నిర్వహించిన కాంగ్రెస్ జన జాతర సభ విజయవంతమైంది. ఈ లోక్సభ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి అధిక సంఖ్యలో తరలొచ్చిన పార్టీ శ్రేణులు, అభిమానులతో సభా ప్రాంగణం హోరెత్తింది. -
కబ్జా కోరల్లో ఇనుపరాతి గుట్ట అటవీ భూములు!
[ 20-04-2024]
భూపాలపల్లి జిల్లా కేంద్రం సమీపంలోని కొంపెల్లి గ్రామ పరిధిలో 106.34 ఎకరాల భూమి ప్రైవేటు వ్యక్తులది కాదని.. అది అటవీ భూమేనని సుప్రీంకోర్టు ఇచ్చిన తాజా తీర్పు పర్యావరణానికి ఎంతో మేలు చేయనుంది. -
ఛత్రం పడితేనే.. చకచకా నడిచేది..!
[ 20-04-2024]
గత లోక్సభ ఎన్నికలు 2019 ఏప్రిల్ 11న జరిగాయి. ఈసారి మే 13న నిర్వహించనున్నారు. ఇప్పుడే ఎండలు దంచి కొడుతున్నాయి. ఆ సమయంలో మరింత తీవ్రంగా ఉండే ప్రమాదం ఉంది.. -
బలరాంనాయక్ నామపత్రం దాఖలు
[ 20-04-2024]
మహబూబాబాద్ (ఎస్టీ) లోక్సభ స్థానానికి కాంగ్రెస్ అభ్యర్థి, కేంద్ర మాజీ సహాయమంత్రి పోరిక బలరాంనాయక్ శుక్రవారం రెండు సెట్ల నామినేషన్ దాఖలు చేశారు. -
మావోయిస్టు దంపతులకు తుది వీడ్కోలు
[ 20-04-2024]
ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్లో మృతిచెందిన మావోయిస్టు దంపతులు జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం చల్లగరిగె గ్రామానికి చెందిన సిరిపెల్లి సుధాకర్ అలియాస్ శంకర్ అలియాస్ మురళీ, ఆదిలాబాద్ జిల్లా బజార్హత్నూర్కు చెందిన సుమన అలియాస్ రంజిత అంత్యక్రియలు శుక్రవారం స్వగ్రామంలో ముగిశాయి. -
ఓటు వేసి ప్రజాస్వామ్యాన్ని గెలిపించాలి
[ 20-04-2024]
వచ్చేనెల 13న జరగబోయే లోక్సభ ఎన్నికల పోలింగ్ రోజు అందరూ ఓటేసి ప్రజాస్వామ్యాన్ని గెలిపించాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ పిలుపునిచ్చారు. -
సీఎం హెలిప్యాడ్కు మూడు స్థలాల పరిశీలన
[ 20-04-2024]
కాజీపేట మండలం మడికొండ సెయింట్ పాల్స్ మైదానంలో ఈ నెల 24న నిర్వహించనున్న కాంగ్రెస్ పార్టీ బహిరంగ సభకు ఏర్పాట్లు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. -
వరంగల్లో భారాస విజయం ఖాయం
[ 20-04-2024]
వరంగల్ లోక్సభ నియోజకవర్గంలో భారాస విజయం ఖాయమైందని మాజీ మంత్రి దయాకర్రావు అన్నారు. -
మరాడించలే.. లెక్కచూపలే
[ 20-04-2024]
జిల్లాలో సీఎంఆర్(కస్టమ్ మిల్లింగ్ రైస్) ప్రక్రియ నత్తనడకన సాగుతోంది.. రైతులు పండించిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి సేకరిస్తోంది. -
ఎన్నిక ఏదైనా సత్తా చాటారు..!
[ 20-04-2024]
రాజకీయ నేతలు తమ జీవిత కాలంలో ఒక్కసారైనా ఏదో ఒక చట్టసభలో అడుగుపెట్టాలని ఆశిస్తుంటారు.. ఒకరికే ఎమ్మెల్యేగా, ఎంపీగా పోటీ చేసే అవకాశం వచ్చి విజయం సాధిస్తే వారి ఆనందానికి అవధులు ఉండవు. -
అట్టహాసంగా ప్రారంభం.. పరిశోధనలు శూన్యం
[ 20-04-2024]
కాకతీయ విశ్వవిద్యాలయంలో పరిశోధనల నిమిత్తం రూ.50 కోట్లతో కె-హబ్, పీవీ నర్సింహారావు విజ్ఞాన కేంద్రం నిర్మించారు. -
ఓటాస్త్రం.. స్వీయచిత్రమే సాక్ష్యం
[ 20-04-2024]
ఓరుగల్లు నగరంలో ఓటింగ్ శాతం పెంచేందుకు వరంగల్ కలెక్టరేట్ ఆవరణలో సెల్ఫీ పాయింట్ ఏర్పాటు చేశారు. -
రెండోరోజు మూడు నామపత్రాలు
[ 20-04-2024]
వరంగల్ లోక్సభ స్థానానికి రెండోరోజు శుక్రవారం ముగ్గురు అభ్యర్థులు, నాలుగుసెట్ల నామపత్రాలు దాఖలు చేశారని వరంగల్ పార్లమెంట్ రిటర్నింగ్ అధికారి, వరంగల్ జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
తెదేపా కార్యాలయం వద్ద టాస్క్ఫోర్స్ కదలికలు
-
సుప్రీం లీడర్ పుట్టిన రోజే ఇరాన్పై దాడులు.. అమెరికాకు చివరి క్షణంలో తెలిసిందట!
-
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!
-
కావ్య బాధ.. శారీలో లావణ్య, మౌనీరాయ్
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/04/24)
-
‘ప్రేమలు 2’ ఫిక్స్.. రిలీజ్ ఎప్పుడంటే?