అతివేగం అనర్థదాయకం
అతివేగం ప్రమాదకరమని, యువత అజాగ్రత్తగా వాహనాలు నడిపి తల్లిదండ్రులకు కడుపు కోత మిగల్చవద్దని జనగామ ఎస్సై జీనత్ విద్యార్థులకు సూచించారు.
జనగామ అర్బన్, న్యూస్టుడే: అతివేగం ప్రమాదకరమని, యువత అజాగ్రత్తగా వాహనాలు నడిపి తల్లిదండ్రులకు కడుపు కోత మిగల్చవద్దని జనగామ ఎస్సై జీనత్ విద్యార్థులకు సూచించారు. జనగామలోని స్వామి వివేకానంద ఒకేషనల్ జూనియర్ కళాశాలలో సోమవారం ‘ఈనాడు-ఈటీవీ తెలంగాణ’ ఆధ్వర్యంలో ఇంటర్ విద్యార్థులకు రహదారి భద్రతా నిబంధనలపై అవగాహన సదస్సు నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపల్ ఉడుగుల రమేశ్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఎస్సై ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. విద్యార్థులు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, వాహనాలు నడిపేటప్పుడు అన్ని రకాల ధ్రువపత్రాలు వెంట ఉంచుకోవాలని సూచించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే ఎలాంటి కేసులు నమోదు చేస్తారో వివరించారు. దేశంలో మైనర్లే అధికంగా రోడ్డు ప్రమాదాలకు గురవుతున్నారని చెప్పారు.
పాల్గొన్న విద్యార్థులు
సందేహాల నివృత్తి..!
విద్యార్థుల సందేహాలను ఎస్సై నివృత్తి చేశారు. త్రిపుల్ రైడింగ్, శిరస్త్రాణం ధరించకపోతే, ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించి వాహనాలు నడిపితే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామన్నారు. విద్యార్థులు సైతం ట్రాఫిక్ నిబంధనలపై వాహనదారులకు అవగాహన కల్పించాలని సూచించారు.
సూచనలు ఉపయోగపడతాయి
-రాజు, విద్యార్థి
ట్రాఫిక్ నిబంధనలు, మైనర్ల పాత్రపై ఎస్సై చెప్పిన సలహాలు, సూచనలు మా భవిష్యత్తుకు ఉపయోగపడతాయి. మా వల్ల మా తల్లిదండ్రులు పడే బాధలు ఎక్కువగా ఉంటాయని తెలిసింది. విద్యార్థి దశలో కేసులు నమోదైతే భవిష్యత్తు ఎలా ఉంటుందో తెలుసుకున్నాం. ఇలాంటి కార్యక్రమాలు అన్ని కళాశాలల్లో నిర్వహిస్తే బాగుంటుంది. కొంతమందిలోనైనా మర్పు వచ్చే అవకాశం ఉంటుంది.
అవగాహన కల్పిస్తాం
-ఝూన్సీ, విద్యార్థిని
ప్రమాదాల నివారణకు పోలీసులు అవగాహన కల్పించడం ఉపయోగకరం. మావంతు బాధ్యతగా ట్రాఫిక్ నిబంధనలపై తల్లిదండ్రులు, సోదరులకు అవగాహన కల్పిస్తాం. అతివేగంతో జరిగే అనర్థాలను, పోలీసులు నమోదు చేసే కేసుల విషయం మా కుటుంబ సభ్యులకు వివరిస్తాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జజ్జనకర.. జనజాతర
[ 25-04-2024]
కాజీపేట మండలం మడికొండలో ఏర్పాటు చేసిన ఓరుగల్లు జనజాతర బహిరంగ సభ విజయవంతమైంది. వరంగల్ లోక్సభ పరిధిలోని ఏడు సెగ్మెంట్ల నుంచి భారీగా జనసమీకరణ చేయడంతో సభా ప్రాంగణం కిక్కిరిసిపోయింది. -
ప్రథమంలో 24 ద్వితీయంలో 26
[ 25-04-2024]
ఇంటర్మీడియట్ వార్షిక ఫలితాల్లో వరంగల్ జిల్లా వెనుకబడింది. ప్రథమ సంవత్సరం ఫలితాల్లో రాష్ట్రంలో 24వ స్థానం, ద్వితీయ సంవత్సరంలో 26వ స్థానంలో నిలిచింది. -
హస్తం జోరు..
[ 25-04-2024]
హనుమకొండ జిల్లా పరిధిలోని కాజీపేట మండలం మడికొండలో నిర్వహించిన ఓరుగల్లు జనజాతర బహిరంగ సభ విజయవంతం కావడం కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం నింపింది. -
ఇంటర్ ఫలితాల్లో ములుగు వెలుగు
[ 25-04-2024]
రాష్ట్ర ప్రభుత్వం బుధవారం విడుదల చేసిన ఇంటర్మీడియట్ ఫలితాల్లో ములుగు జిల్లా అగ్రస్థానంలో నిలిచింది. రాష్ట్రంలోని అన్ని జిల్లాలను వెనకకు నెట్టి ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో మొదటి స్థానంలో నిలిచింది. -
ఇంటర్ ఫలితాల్లో బాలికలదే హవా
[ 25-04-2024]
ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాల్లో ప్రథమ, ద్వితీయ సంవత్సర ఉత్తీర్ణతలో బాలికలదే పైచేయిగా నిలిచింది. బుధవారం ప్రకటించిన ఫలితాల్లో జిల్లాలో ప్రథమ సంవత్సరం 55.72 శాతంతో రాష్ట్రంలో 17వ స్థానం పొందింది. -
బాలికలదే పైచేయి
[ 25-04-2024]
ఇంటర్ బోర్డు అధికారులు బుధవారం విడుదల చేసిన ఇంటర్ ఫలితాల్లో జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో బాలికలే పై చేయి సాధించారు. -
ఇంటర్ ఫలితాల్లో బాలికలదే పైచేయి
[ 25-04-2024]
ఇంటర్ పరీక్ష ఫలితాలు బుధవారం వెలువడిన నేపథ్యంలో జిల్లాలో ఉత్తీర్ణత శాతం గత విద్యా సంవత్సరంతో పోలిస్తే ఈ ఏడాది వెనక్కి వెళ్లింది. -
21 నామపత్రాల దాఖలు
[ 25-04-2024]
వరంగల్ లోక్సభ స్థానానికి బుధవారం 19 మంది అభ్యర్థులు 21 నామపత్రాలను రిటర్నింగ్ అధికారి ప్రావీణ్యకు సమర్పించారు. భారాస పార్టీ అభ్యర్థి మారపల్లి సుధీర్కుమార్ తరఫున భారాస నాయకులు, -
ఆదర్శం.. గంగారం కస్తూర్బా విద్యాలయం
[ 25-04-2024]
మారుమూల ఏజెన్సీలోని కస్తూర్బా గాంధీ బాలికల గురుకుల విద్యాలయం(కేజీబీవీ) విద్యార్థినులు ఇంటర్ ఫలితాల్లో వందశాతం ఫలితాలు సాధించి సత్తా చాటారు.
తాజా వార్తలు (Latest News)
-
అలా చేస్తే ఆయుధాలు వీడతాం.. హమాస్ కీలక ప్రతిపాదన!
-
జగన్.. బ్యాండేజ్ ఎక్కువ రోజులు ఉంటే సెప్టిక్ అవుతుంది: సునీత
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM
-
హోటల్లో భారీ అగ్ని ప్రమాదం.. ఆరుగురి సజీవ దహనం
-
విద్యార్థుల చిరునవ్వుల కోసం ఓ టీచర్ ఫన్నీ యాక్ట్.. వీడియో వైరల్
-
(ADVT) జేఈఈ మెయిన్ ఓపెన్ కేటగిరీలో ఆలిండియా 1st ర్యాంక్ నారాయణదే