పుట్టుకతో గుండె లోపాలున్న పిల్లలకు శస్త్రచికిత్సలు
పుట్టుకతో గుండె లోపాలు(రంధ్రం) ఉన్న పిల్లలకు ఇక నుంచి కేఎంసీ సూపర్స్పెషాలిటీ ఆసుపత్రిలో అధునాతన పద్ధతిలో కోత కుట్టులేకుండా శస్త్రచికిత్సలు చేయాలని వైద్యాధికారులు నిర్ణయించారు.
డిసెంబరు 2 నుంచి ప్రారంభం
ఎంజీఎం ఆసుపత్రి, న్యూస్టుడే: పుట్టుకతో గుండె లోపాలు(రంధ్రం) ఉన్న పిల్లలకు ఇక నుంచి కేఎంసీ సూపర్స్పెషాలిటీ ఆసుపత్రిలో అధునాతన పద్ధతిలో కోత కుట్టులేకుండా శస్త్రచికిత్సలు చేయాలని వైద్యాధికారులు నిర్ణయించారు. ఇటీవల ఎంజీఎంలోని డైయిక్ కేంద్రంలో ఈ సమస్యతో బాధపడుతున్న 44 మంది పిల్లలను గుర్తించి సికింద్రాబాద్ కిమ్స్లో ఆరోగ్యశ్రీ పథకం కింద సర్జరీలు చేయడానికి ఎంపిక చేశారు. కేఎంసీ సూపర్స్పెషాలిటీ ఆసుపత్రి కార్డియాలజీ విభాగంలో ఇద్దరు సీటీ సర్జన్లు ఉండగా, పిల్లలకు కిమ్స్లో ఆరోగ్య శ్రీ పథకం కింద ఎందుకు సర్జరీలు చేయిస్తున్నారని సంబంధిత శాఖ అధికారులు ఇక్కడిఅధికారులను ప్రశ్నించినట్లు తెలిసింది. ఇదే సమయంలో ఇద్దరు సీటీ సర్జన్లు ఉన్నా కేఎంసీలో నెలలో రెండుకు మించి శస్త్రచికిత్సలు చేయలేదని ఈ నెల 24న ఈనాడు ప్రధాన సంచికలో ‘డాక్టర్ డుమ్మా’ శీర్షికన ప్రచురించిన కథనంతో అధికారులు స్పందించారు. ప్రభుత్వం నుంచి వచ్చిన ఒత్తిడి నేపథ్యంలో పుట్టకతో గుండె సమస్యలతో బాధపడుతున్న పిల్లలకు శస్త్రచికిత్సలు చేయాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా డిసెంబర్ 2న శుక్రవారం కిమ్స్ నుంచి వస్తున్న కోత కుట్టు లేకుండా సర్జరీ చేయగల వైద్యనిపుణుడి సహాయంతో మొదట ఐదుగురు పిల్లలకు శస్త్రచికిత్సలు చేయాలని నిర్ణయించినట్లు అధికారులు తెలిపారు. కేఎంసీ ఆసుపత్రిలో పుట్టుకతో గుండెరంద్రాలున్న పిల్లలు సర్జరీలు చేస్తున్నారని సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో సోమవారం సుమారు 15 మంది పిల్లలను తీసుకొని తల్లిదండ్రులు కార్డియాలజీ ఓపీ విభాగానికి రాగా వైద్యులు డిసెంబర్ 2న రావాలని పంపించారు. ఈవిషయంపై నోడల్ అధికారి డాక్టర్ గోపాల్రావు ‘న్యూస్టుడే’తో మాట్లాడుతూ సాధారణ వైద్యపరీక్షల్లో భాగంగానే డిసెంబర్ 2న కోతకుట్టులేకుండా కొంతమంది పిల్లలకు శస్త్రచికిత్సలు చేయాలనుకుంటున్నామని, అది విజయవంతమైతే క్రమంగా ప్రతి నెలా చేస్తామన్నారు. గుండె సంబంధిత సమస్యలున్నవారు, పిల్లలు ప్రతి సోమ, బుధవారం ఓపీ సేవలకు వస్తే పరీక్షలు నిర్వహించి అవసరాన్ని బట్టి చికిత్స, శస్త్రచికిత్సలు చేస్తామన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భారాసకు షాక్.. వరంగల్ ఎంపీ బరి నుంచి తప్పుకొన్న కావ్య
[ 28-03-2024]
వరంగల్ భారాస ఎంపీ అభ్యర్థి డాక్టర్ కడియం కావ్య కీలక నిర్ణయం తీసుకున్నారు. -
వరంగల్ జకోటియ షాపింగ్ కాంప్లెక్స్లో భారీ అగ్ని ప్రమాదం
[ 28-03-2024]
వరంగల్ నగరంలో గురువారం రాత్రి భారీ అగ్ని ప్రమాదం జరిగింది. -
ప్రయాణం చవక..పార్కింగ్ భారం
[ 28-03-2024]
వరంగల్ రైల్వేస్టేషన్ నుంచి ప్రతిరోజు వేల సంఖ్యలో ప్రయాణికులు రాకపోకలు సాగిస్తుంటారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చేవారిని తీసుకెళ్లడానికి, కుటుంబ సభ్యులు, బంధువులకు వీడ్కోలు పలికేందుకు మరికొంత మంది వస్తుంటారు. -
ఆటుపోట్లు దాటి.. విజేతగా నిలిచి
[ 28-03-2024]
ఆయన పుట్టుకతోనే దివ్యాంగుడు.. రెండు కాళ్లూ పనిచేయవు. చిన్నతనం నుంచే బతుకుపోరాటం సాగించారు. ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నారు. క్రికెట్పై ఉన్న మక్కువతో ఆ దిశగా సన్నద్ధమయ్యారు. -
అమ్మకానికి పారిశుద్ధ్య పోస్టులు
[ 28-03-2024]
బల్దియా ప్రజారోగ్య విభాగంలో ఉద్యోగులే పైరవీకారులుగా మారుతున్నారు. పారిశుద్ధ్య కార్మికుల పోస్టులను కొనడం.. అమ్మడం వెనుక కీలకపాత్ర పోషిస్తున్నారు. ఒక్కో పోస్టును రూ.3-4 లక్షల చొప్పున అమ్మేస్తున్నారు. -
వెలుగల ప్రస్థానంలో చీకట్లు!
[ 28-03-2024]
రాష్ట్రంలో హైదరాబాద్ తర్వాత అతిపెద్ద నగరం వరంగల్. అలాంటిది ఉమ్మడి వరంగల్లో సింగరేణి తప్ప పెద్దగా పరిశ్రమలు లేకపోవడంతో ఇక్కడి యువతకు ఉపాధి, ఉద్యోగావకాశాలు అంతంతమాత్రమే లభిస్తున్నాయి. -
విదేశీ పక్షులు.. విశిష్ఠ అతిథులు
[ 28-03-2024]
ఆహ్లాదకర వాతావరణాన్ని మనుషులే కాదు.. పక్షులూ ఆస్వాదిస్తాయనడానికి ఇది నిదర్శనం. వేసవిలో అనుకూల వాతావరణం కోసం వేల మైళ్లు ప్రయాణించి.. మన జిల్లాకు వచ్చాయి పలురకాల పక్షులు. -
అమాయకులకు సైబర్ ఉచ్చు..
[ 28-03-2024]
ఉమ్మడి జిల్లాలో సైబర్ నేరాల సంఖ్య పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. సులువుగా డబ్బు సంపాదించాలనే ఆలోచన ఉన్నవారు వారి బారిన పడుతున్నారు. -
స్తంభాన్ని సరిచేశారు..
[ 28-03-2024]
ఐనవోలు మండలం కొండపర్తి గ్రామ శివారులోని వరి చేనులో ఒరిగి ప్రమాదకరంగా ఉన్న విద్యుత్తు స్తంభాన్ని అధికారులు సరిచేశారు. -
అక్రమ రిజిస్ట్రేషన్ల రద్దుకు చర్యలు
[ 28-03-2024]
తప్పుడు సర్వే నంబర్లతో దేవాలయాల భూములను కొందరు ప్రైవేటు వ్యక్తులు రిజిస్ట్రేషన్లు చేసుకున్నారని, వాటిని పరిశీలించి రద్దు చేయాలని వరంగల్, హనుమకొండ జిల్లాల సబ్ రిజిస్టర్లకు వరంగల్ ఉమ్మడి జిల్లా దేవాదాయ శాఖ సహాయ కమిషనర్ రామల సునీత లేఖ రాశారు. -
సారు.. ఏ ఊరినీ వదల్లేదు..!
[ 28-03-2024]
గ్రామాలు దేశానికి పట్టుకొమ్మలు. వాటిని బాగు చేయాల్సిన ఓ అధికారి అవినీతి సర్పంచులు, అధికారుల అడుగులకు మడుగులొత్తుతూ రూ.కోట్లు వెనకేసుకున్నారు. ఊళ్లలో జరిగిన అనేక కుంభకోణాలు, ఆర్థిక అవకతవకలపై ఫిర్యాదులొచ్చినా చూసీచూడనట్టు ఉన్నారు. -
ధాన్యలక్ష్మికి చేయూత
[ 28-03-2024]
అవకాశాలు కల్పిస్తే మంచి ఫలితాలు చూపిస్తామని గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలోని ఇందిరా క్రాంతి పథకం పొదుపు సంఘాల మహిళలు నిరూపిస్తున్నారు. మద్దతు ధరతో ధాన్యం కొనుగోళ్ల పథకం గ్రామీణ మహిళల ఆర్థికాభివృద్ధికి దోహదపడుతోంది. -
భువనగిరి బరిలో చామల
[ 28-03-2024]
ఎడతెగని ఉత్కంఠ నడుమ అధికార కాంగ్రెస్ పార్టీ తమ భువనగిరి లోక్సభ ఎంపీ అభ్యర్థిగా చామల కిరణ్కుమార్రెడ్డిని ప్రకటించింది. ఆయన ఎంపీగా పోటీ చేయడం ఇదే తొలిసారి. -
ముగిసిన బ్రహ్మోత్సవాలు
[ 28-03-2024]
మండలంలోని కొడవటంచలో సుప్రసిద్ధ శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో బుధవారం రాత్రి నాకబలి (పుష్పయాగం) కార్యక్రమం నేత్రపర్వంగా సాగింది. -
మొక్కల సంరక్షణ తప్పనిసరి
[ 28-03-2024]
భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలోని అటవీ శాఖ సర్కిల్ సీసీఎఫ్ ప్రభాకర్ బుధవారం జిల్లా అటవీ అధికారి రాహుల్ కిషన్ జాదవ్తో కలిసి ఏటూరునాగారం కార్యాలయంలోని నర్సరీలను ఆకస్మిక తనిఖీ చేశారు. -
క్షయ వ్యాధి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్
[ 28-03-2024]
క్షయ వ్యాధి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ద్వారా వస్తుందని డీఎంహెచ్వో డాక్టర్ ఎ.అప్పయ్య అన్నారు. బుధవారం ములుగులో ప్రపంచ క్షయ వ్యాధి దినోత్సవాన్ని పురస్కరించుకొని నిర్వహించిన ర్యాలీని ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. -
విధుల్లో అప్రమత్తత అవసరం
[ 28-03-2024]
న్నికల నేపథ్యంలో సరిహద్దుల వద్ద ఏర్పాటు చేసిన పోలీస్ చెక్పోస్టుల్లో సిబ్బంది అప్రమత్తంగా విధులు నిర్వర్తించాలని వరంగల్ సీపీ అంబర్ కిషోర్ఝా సూచించారు.
తాజా వార్తలు (Latest News)
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
బుల్లెట్ రైలు.. మరో కీలక అప్డేట్ ఇచ్చిన అశ్వినీ వైష్ణవ్
-
దిల్లీకి మళ్లీ నిరాశే.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్ విజయం
-
మేం మాటల మనుషులం కాదు.. చేసి చూపిస్తాం: బాలకృష్ణ
-
అల్లు అర్జున్కు మరో అరుదైన గౌరవం.. తొలి సినిమా విడుదలైన రోజే
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్