యుక్త ప్రాయం.. కాపాడుకో ప్రాణం
ఎట్టి పరిస్థితుల్లో మైనర్లు ద్విచక్రవాహనాలు నడపొద్దని వరంగల్ ట్రాఫిక్ ఠాణా సీఐ బాబులాల్ తెలిపారు. సోమవారం నగరంలోని స్కాలర్స్ జూనియర్ కళాశాలలో ‘ఈనాడు- ఈటీవీ తెలంగాణ’ ఆధ్వర్యంలో ట్రాఫిక్ నియమాలపై అవగాహన కల్పించారు.
న్యూస్టుడే, మట్టెవాడ
మాట్లాడుతున్న సీఐ బాబులాల్
ఎట్టి పరిస్థితుల్లో మైనర్లు ద్విచక్రవాహనాలు నడపొద్దని వరంగల్ ట్రాఫిక్ ఠాణా సీఐ బాబులాల్ తెలిపారు. సోమవారం నగరంలోని స్కాలర్స్ జూనియర్ కళాశాలలో ‘ఈనాడు- ఈటీవీ తెలంగాణ’ ఆధ్వర్యంలో ట్రాఫిక్ నియమాలపై అవగాహన కల్పించారు. ముఖ్యఅతిథిగా వరంగల్ ట్రాఫిక్ ఠాణా సీఐ బాబులాల్ హాజరయ్యారు. ఇటీవల జరిగిన ద్విచక్ర వాహనాల ప్రమాదాల్లో చిన్న పిల్లలు వాహనాలు నడపడం వల్ల జరిగినవే ఎక్కువ ఉన్నాయన్నారు. కొన్ని ప్రమాదాల్లో ఏకంగా ప్రాణాలు కోల్పోయారన్నారు. పిల్లలకు వాహనాలు ఇస్తున్న కుటుంబ సభ్యులు కూడా ఓ కారణమని తెలిపారు. తప్పనిసరిగా వాహనం ఇవ్వాల్సివచ్చినప్పుడు శిరస్త్రాణం ధరించేలా చూడాలని తెలిపారు. కళాశాలల యాజమాన్యాలు కూడా 18 ఏళ్ల లోపు విద్యార్థులను వాహనాలతో రాకుండా చూడాలని సూచించారు.
విద్యార్థులకు అర్థమయ్యేలా..
రోడ్డు ప్రమాదాలు, విద్యార్థుల ఆత్మహత్యలపై ఎస్సై రామారావు పాడిన పాట ఆలోచింపజేసింది. జీవితంలో సుస్థిర స్థానంలో నిలబడేంత వరకు చేయకూడని అంశాలను చక్కగా వివరించారు. విద్యార్థి దశలో ఒక్కసారి కేసు నమోదైతే భవిష్యత్తు ఎలా ఉంటుందో, ఎలాంటి కేసులు నమోదు చేస్తారో విద్యార్థులకు అర్థమయ్యేవిధంగా తెలియజేశారు.జల్సాలకు అలవాటు పడి యుక్త ప్రాయాన్ని విచ్ఛిన్నం చేసుకోకుండా సమాజం మెచ్చే యువతరంగా ఎదగాలని కోరారు. ట్రాఫిక్ నియమ నిబంధనలను వివరించారు. ట్రాఫిక్ సిగ్నల్లోని రంగుల సూచనలు, ప్రమాదాలకు పడే శిక్షలు, తదితర అంశాలను వివరించారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ అనిల్కమార్, డైరెక్టర్లు రంజిత్కుమార్, రవీందర్యాదవ్, అశోక్, హలీమ్, విద్యార్థులు పాల్గొన్నారు.
లైసెన్సు తీసుకోవడం ఇలా..
మేజర్లు తొలిసారిగా లైసెన్స్ కోసం మీసేవ ద్వారా లెర్నింగ్ లైసెన్స్కు దరఖాస్తు చేసుకోవాలి. దీని కాలపరమితి 6 నెలలు ఉంటుంది. కాలపరిమితి లోపు ఎంవీఐ(మోటర్ వెహికిల్ ఇన్స్పెక్టర్) పరీక్ష నిర్వహిస్తారు. ఉత్తీర్ణత అయితే పర్మినెంట్ లైసెన్స్ వస్తుంది. ప్రతి వాహనదారుడు లైసెన్స్, ఆర్సీ కార్డు, బీమా, కాలుష్య సర్టిఫికెట్తోపాటు తప్పనిసరిగా శిరస్త్రాణం ధరించాలి. ఇవేమీ లేకుండాపోలీసులకు పట్టుబడితే విద్యార్థులు తమ బంగారు భవిష్యత్తును కోల్పోతారు. ప్రమాదాలకు కారణం అయితే జరిమానాతోపాటు జైలు పాలవుతారని తెలిపారు. మైనర్లకు వాహనం ఇచ్చిన వాహనదారుడిపైనా కేసులు నమోదు అవుతాయని వివరించారు.
అవగాహన సదస్సు ఉపయోగకరంగా ఉంది
- రంజిత్కుమార్, కళాశాల డైరెక్టర్
కళాశాల విద్యార్థులకు ట్రాఫిక్ నియమాలు, నిబంధనలు తెలియాల్సిన అవరసం ఉంది. ఈనాడు- ఈటీవీ యాజమాన్యం తీసుకున్న చొరవతో విద్యార్థులకు పూర్తి స్థాయిలో అవగాహన వచ్చింది. ముఖ్యంగా మా కళాశాలకు ఎట్టి పరిస్థితుల్లో ద్విచక్ర వాహనాల్లో వచ్చే విద్యార్థులను అనుమతించవద్దని నిర్ణయం తీసుకున్నాం. ఇదే విషయాన్ని విద్యార్థుల తల్లిదండ్రులకు కూడా సమాచారం అందించాం. ‘ఈనాడు’ చొరవతో నిబంధనలు, చట్టాలు, శిక్షలు, అమలు తదితర అంశాలపై అవగాహన ఉపయోగకరంగా ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కబ్జా కోరల్లో చెరువులు..
[ 23-04-2024]
ఉమ్మడి వరంగల్ వ్యాప్తంగా కాకతీయులు నిర్మించిన గొలుసుకట్టు చెరువులపై కబ్జాదారులు కన్నేశారు. భూముల విలువ పెరగడంతో శిఖం భూములను యథేచ్ఛగా ఆక్రమించుకుంటున్నారు -
అంతర్రాష్ట్ర దొంగ అరెస్టు
[ 23-04-2024]
పలు ప్రాంతాల్లో దొంగతనాలకు పాల్పడుతున్న నిందితుడిని జనగామ పోలీసులు అరెస్టు చేశారు. స్థానిక పట్టణ పోలీస్ స్టేషన్లో సోమవారం వెస్ట్జోన్ డీసీపీ పి.సీతారాం జనగామ ఏసీపీ అంకిత్కుమార్తో కలిసి నిర్వహించిన విలేకరుల సమావేశంలో కేసు వివరాలను వెల్లడించారు -
మార్కెట్లో కొనుగోళ్లు చేపట్టాలని ధర్నా
[ 23-04-2024]
జనగామ వ్యవసాయ మార్కెట్లో అన్ని రకాల వ్యవసాయ ఉత్పత్తుల క్రయవిక్రయాలు ప్రారంభించాలని, మూసివేసిన మార్కెట్ను తెరవాలని తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో స్థానిక మార్కెట్ గేటు ముందు ధర్నా నిర్వహించారు -
గొర్రెల పంపిణీకి మంగళం!
[ 23-04-2024]
గొర్రెల పంపిణీకి చెల్లించిన డబ్బులను వెనక్కి ఇవ్వాలని పశు సంవర్థక శాఖ అధికారులు నిర్ణయించారు -
‘భూమి పోతే ఆత్మహత్యలే దిక్కు’
[ 23-04-2024]
న్యూ గ్రీన్ ఫీˆల్డ్ హైవే వల్ల మా వ్యవసాయ భూములు పోతే ఆత్మహత్యలే దిక్కు అని ఇస్సిపేట రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం గ్రామ శివారులో చేపట్టిన రోడ్డు సర్వేను ఆ గ్రామ రైతులు అడ్డుకున్నారు -
భాజపాను ఆశీర్వదించండి.. అభివృద్ధి చేస్తాం
[ 23-04-2024]
మహబూబాబాద్: మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో సోమవారం భాజపా నిర్వహించిన రోడ్షో ఆ పార్టీ శ్రేణుల్లో జోష్ నింపింది. -
గాలివాన బీభత్సం.. అపార నష్టం
[ 23-04-2024]
ఆదివారం సాయంత్రం జిల్లాలో గాలివాన అపార నష్టం మిగిల్చింది. వరి, మామిడి పంటల రైతులకు గుండె కోత మిగిలింది. విద్యుత్తు శాఖకు తీవ్ర నష్టం వాటిల్లింది. -
నవ వధువు ఆత్మహత్య
[ 23-04-2024]
వివాహం జరిగిన 19 రోజులకే ఓ నవ వధువు ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన ఏటూరునాగారం మండలంలోని రాంనగర్ గ్రామంలో చోటు చేసుకుంది. -
విన్నవించాం.. పరిష్కరించండి
[ 23-04-2024]
ప్రజావాణిలో వచ్చిన అర్జీలకు పరిష్కారం చూపాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టర్ ఫిర్యాదులు స్వీకరించారు -
ఇక్కడా కబ్జాల పర్వం.. వెంటాడుతున్న బెంగుళూరు భయం!
[ 23-04-2024]
బెంగళూరు నగరంలో తీవ్రమైన తాగునీటి ఎద్దడి నెలకొంది. భూగర్భ జలాలు అడుగంటాయి.. కారణం చెరువులు, కుంటలు కబ్జాలకు గురై నీటినిల్వకు చోటు లేకపోవడమే. -
నామపత్రాల జాతర..
[ 23-04-2024]
వరంగల్ రిటర్నింగ్ అధికారి కార్యాలయం సోమవారం జాతరను తలపించింది. భారాస, కాంగ్రెస్ అభ్యర్థులతో పాటు ఇతర ప్రాంతీయ పార్టీలు, స్వతంత్రులు కలిపి మొత్తం 10 మంది 11 సెట్ల నామపత్రాలను రిటర్నింగ్ అధికారి ప్రావీణ్యకు సమర్పించారు. -
మోదీ పాలనతోనే దేశాభివృద్ధి
[ 23-04-2024]
భాజపా పాలనతోనే దేశాభివృద్ధి సాధ్యమని ఆ పార్టీ వరంగల్ ఎంపీ అభ్యర్థి అరూరి రమేశ్ పేర్కొన్నారు. -
పాటలతో రీల్స్.. మాటలతో మీమ్స్
[ 23-04-2024]
లోక్సభ ఎన్నికల్లో భాగంగా ఇప్పటికే నామపత్రాల ప్రక్రియ జోరందుకొంది. ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థులు క్షేత్రస్థాయిలో తిరుగుతూ ప్రచారం చేస్తూనే సామాజిక మాధ్యమాల్లోనూ చురుగ్గా ఉంటున్నారు. -
స్వల్ప ఆధిక్యంతో గెలుపు‘మన ఎంపీలు’
[ 23-04-2024]
వరంగల్ లోక్సభ స్థానం నుంచి అతి తక్కువ ఓట్ల మెజార్టీతో బకర్ అలి మీర్జా ఎంపీగా విజయం సాధించారు. ఆయన 1900, మార్చి 7న హైదరాబాద్లో జన్మించారు. ఉన్నత విద్యనభ్యసించి హైదరాబాద్ సర్కారులో ఫారెస్ట్లకు అసిస్టెంట్ క్యూరేటర్గా పనిచేశారు
తాజా వార్తలు (Latest News)
-
ధోనీని అంత కోపంగా నేనెప్పుడూ చూడలేదు: సురేశ్ రైనా
-
నిర్మాతల నుంచి పవన్కల్యాణ్ తీసుకున్న అప్పు ఎంతో తెలుసా?
-
దీదీకి ఆ ధైర్యం లేదు: అమిత్ షా
-
ఆడిషన్ అంటూ పది మందిని ముద్దు పెట్టుకోమన్నారు: స్టార్ హీరోయిన్
-
గుంపులో స్మార్ట్ఫోన్లు కొట్టేస్తే.. చిన్న ట్రిక్తో పట్టేశాడు..!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM