వాడీవేడిగా మున్సిపల్ కౌన్సిల్ సమావేశం
జనగామ పట్టణ పరిధిలోని వార్డుల్లో ప్రతిపాదించిన పనులకు మోక్షమెప్పుడు? నిధులు ఎప్పుడు వస్తాయి? పనులు ఎప్పుడు పూర్తవుతాయో చెప్పాలని జనగామ మున్సిపల్ కౌన్సిల్ సభ్యులు పాలకవర్గాన్ని, అధికారులను నిలదీశారు.
వేదికపై మున్సిపల్ ఛైర్పర్సన్ జమున, అదనపు కలెక్టర్ ప్రఫుల్దేశాయ్, అధికారులు
జనగామ, న్యూస్టుడే: జనగామ పట్టణ పరిధిలోని వార్డుల్లో ప్రతిపాదించిన పనులకు మోక్షమెప్పుడు? నిధులు ఎప్పుడు వస్తాయి? పనులు ఎప్పుడు పూర్తవుతాయో చెప్పాలని జనగామ మున్సిపల్ కౌన్సిల్ సభ్యులు పాలకవర్గాన్ని, అధికారులను నిలదీశారు. జనగామలో మంగళవారం మున్సిపల్ కౌన్సిల్ సమావేశాన్ని ఛైర్పర్సన్ పోకల జమున అధ్యక్షతన నిర్వహించారు. అదనపు కలెక్టర్ ప్రఫుల్దేశాయ్ హాజరయ్యారు. వివిధ వార్డుల సభ్యులు మాట్లాడారు. పట్టణంలో దోమల వ్యాప్తి, కుక్కలు, పందులు, కోతుల స్వైర విహారంతో ఇబ్బందులు పడుతున్నామని 8, 9 వార్డుల సభ్యులు జక్కుల అనిత, చందర్ ప్రస్తావించారు. నిధుల కొరత పేరిట సమస్యలను దాట వేస్తున్నారన్నారు. ఎస్సీ,ఎస్టీ ఉప ప్రణాళిక నిధులు, పనుల వివరాల గురించి కౌన్సిలర్ చందర్ వివరణ కోరారు. వివిధ వార్డుల్లో అదనపు విద్యుత్తు స్తంభాలు ఏర్పాటు చేయాలని పలువురు సభ్యులు కోరారు. స్తంభాల ఏర్పాటుకు ప్రణాళిక రూపొందిస్తామని డీఈ చంద్రమౌళి తెలిపారు. స్థానిక రైల్వేస్టేషన్ నుంచి బస్టాండు వరకు, ప్రధాన రహదారులు, ఉపదారులపై ఆక్రమణలను తొలగించాలని, ప్రజల రాకపోకలకు ఇబ్బంది లేకుండా చూడాలని తెరాస ఫ్లోర్లీడర్ మారబోయిన పాండు, 19వ వార్డు సభ్యురాలు పద్మ డిమాండ్ చేశారు. సమన్యాయం పాటిస్తూ ఆక్రమణల సమస్యను పరిష్కరించాలని భాజపా సభ్యుడు హరిశ్చంద్రగుప్త సూచించారు. ట్రేడ్లైసెన్సుల విషయంలో వ్యాపారులను ఇబ్బంది పెట్టవద్దని, డిసెంబరు వరకు గడువు ఇవ్వాలని కోరారు. ఆడిట్ గురించి పలువురు సభ్యులు వివరణ కోరగా, డిసెంబరు 10 నుంచి ప్రారంభమవుతుందని కమిషనర్ రజిత వివరణ ఇచ్చారు. పురపాలిక పారిశుద్ధ్య విభాగానికి 22 మంది కార్మికులను ఒప్పంద ప్రాతిపదికన తీసుకునేందుకు పురపాలకశాఖ సంచాలకులు ఆమోదం తెలిపి, ఐదు నెలలు గడుస్తున్నా అమలు కావడం లేదని వైస్ఛైర్మన్ మేకల రాంప్రసాద్, తెరాస ఫ్లోర్లీడర్ పాండు వివరణ కోరారు. నిధుల కొరత కారణంగా మార్చి వరకు అదనపు సిబ్బందిని తీసుకోలేని పరిస్థితి ఉందని ఛైర్పర్సన్ తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అగ్రనేతల ఆగమనం
[ 19-04-2024]
భారీ సభా వేదికలు ముస్తాబవుతున్నాయి. వెల్లువలా ప్రజల్ని తరలించేందుకు రాజకీయ పార్టీలు ఏర్పాట్లు చేసుకుంటున్నాయి. -
అర్హత లేని వైద్యం.. అక్రమంగా మందుల విక్రయం
[ 19-04-2024]
జిల్లా కేంద్రంలో ఓ అర్హత లేని వైద్యుడు చికిత్సలు చేయడమే కాకుండా ఎలాంటి అనుమతుల లేకుండా భారీగా మందులను విక్రయించడంతో పాటు ప్రభుత్వ ఆసుపత్రుల్లోని మందులను కూడా విక్రయిస్తూ డ్రగ్ కంట్రోల్ అధికారుల తనిఖీల్లో పట్టుబడ్డ సంఘటన గురువారం జనగామలో చోటుచేసుకుంది. -
ఆనాడు చంద్రబాబు అన్నీ తానై..
[ 19-04-2024]
అవి 2009 శాసనసభ ఎన్నికలు.. మహాకూటమి నుంచి తెదేపా అభ్యర్థి రేవూరి ప్రకాశ్రెడ్డి నర్సంపేట నుంచి పోటీ చేశారు. -
జైలు నుంచి పోటీ.. మూడు చోట్ల గెలుపు
[ 19-04-2024]
భారతావనికి స్వాతంత్య్రం సిద్ధించాక 1952లో తొలి సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. -
ఒకటి.. రెండు.. ఒకటి.. రెండు..
[ 19-04-2024]
ఉమ్మడి వరంగల్లో లోక్సభ నియోజకవర్గాల ప్రస్థానం, మార్పులు చేర్పులు ఆసక్తిని కలిగిస్తాయి.. లోక్సభ నియోజకవర్గాల పునర్విభజన జరిగిన ప్రతిసారీ ఏదో ఒక మార్పు జరిగింది. -
కాంగ్రెస్ అభ్యర్థి గెలుపునకు కృషి చేయాలి
[ 19-04-2024]
పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ గెలుపునకు కలిసికట్టుగా కృషి చేయాలని రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు అన్నారు. -
కంటి సమస్యలు లేని బాల్యమే లక్ష్యంగా..
[ 19-04-2024]
విద్యార్థులకు కంటి చూపు సమస్య ఉంటే వారి భవిష్యత్తు అంధకారం అవుతుంది. దీన్ని దృష్టిలో పెట్టుకున్న ప్రభుత్వం రాష్ట్రీయ బాల స్వస్థ్య కార్యక్రమం(ఆర్బీఎస్కే), వైద్యశాఖ ఆధ్వర్యంలో ఒకటి నుంచి పదో తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు కంటి పరీక్షలు చేపట్టింది. -
పాఠశాలల అభివృద్ధికి నిధులు
[ 19-04-2024]
అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల పర్యవేక్షణలో ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించేందుకు సర్కారు నిర్ణయించింది. -
రేషన్కార్డుల ఈ-కేవైసీకి మరో అవకాశం
[ 19-04-2024]
ఆహార భద్రతా కార్డులను ఈ-కేవైసీ చేయించుకునేందుకు ప్రభుత్వం మరో అవకాశం ఇచ్చింది. ఫిబ్రవరి 29తో గడువు ముగిసినా రేషన్ దుకాణాల్లో ప్రభుత్వ సూచన మేరకు ఈ-కేవైసీ కొనసాగుతోంది. -
కడియం కావ్య విజయం ఖాయం
[ 19-04-2024]
వరంగల్ ఎంపీగా కాంగ్రెస్ అభ్యర్థి కడియం కావ్య విజయం ఖాయమని, తూర్పు నియోజకవర్గం నుంచే 50 వేల మెజార్టీ తథ్యమని రాష్ట్ర మంత్రి కొండా సురేఖ స్పష్టం చేశారు. -
బోరు ఒకటి.. కనెక్షన్లు 27
[ 19-04-2024]
గిరిజన పల్లెల్లో కన్నీటి గోస తీవ్రమవుతోంది. వేసవి తీవ్రతకు నీటి వనరుల్లో జలం అడుగంటుతుండటంతో.. పలు ప్రాంతాల్లో తాగునీటికి ఇబ్బందులు తలెత్తుతున్నాయి. -
నేర నియంత్రణకు సైబర్ వారియర్స్
[ 19-04-2024]
ప్రస్తుత కాలంలో చరవాణి లేనిదే రోజు గడవడం లేదు. అదే సమయంలో డిజిటల్ లావాదేవీలు పెరిగిపోవడంతో.. చాలా మంది స్మార్ట్ఫోన్లను వినియోగిస్తున్నారు. -
మహిళలకు భరోసా..!
[ 19-04-2024]
మెరుగైన ఆరోగ్యానికి ప్రత్యేక కార్యక్రమంమహబూబాబాద్, న్యూస్టుడే: సమతుల్య ఆహారం తీసుకోకపోవడం, జీవన విధానంలో వస్తున్న మార్పులతో మహిళలు అనారోగ్యాలబారిన పడుతున్నారు. -
కాంగ్రెస్ జనజాతర సభకు సర్వం సిద్ధం
[ 19-04-2024]
లోక్సభ ఎన్నికల్లో అభ్యర్థుల విజయమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ అడుగులు వేస్తోంది. గిరిజనులకు రిజర్వు అయిన మహబూబాబాద్ లోక్సభ స్థానం నుంచి పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి పోరిక బలరాంనాయక్ నామినేషన్ సందర్భంగా శుక్రవారం జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ మైదానంలో నిర్వహించనున్న కాంగ్రెస్ జనజాతర బహిరంగ సభకు టీపీసీసీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి హాజరు కానున్నారు. -
నేతన్నల భూములపై అక్రమార్కుల కన్ను
[ 19-04-2024]
నేతన్నలు చెమటోడ్చి మగ్గంపై శ్రమిస్తేగానీ పూట గడవదు. అలా వారు రూపాయి రూపాయి పోగు చేసి కూడబెట్టుకుని కొనుక్కున్న స్థలాలను అక్రమార్కులు కబ్జా చేస్తున్నారు. -
సుధీర్కుమార్కు భారాస బీఫారం
[ 19-04-2024]
భారాస అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ వరంగల్ భారాస ఎంపీ అభ్యర్థి డాక్టర్ సుధీర్కుమార్కు బీఫారం అందజేశారు. -
రసీదులకు అదనపు రుసుం..!
[ 19-04-2024]
ఆస్తిపన్ను చెల్లించిన పౌరులకు తాత్కాలికంగా పొట్టి(చిన్న) రసీదులు ఇస్తున్నారు. పెద్ద రసీదులివ్వమని అడిగితే అదనంగా రూ.2 ఇవ్వాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
డ్రోన్లను కూల్చేశామన్న ఇరాన్.. ‘నో కామెంట్స్’ అంటున్న ఇజ్రాయెల్
-
ఇక్కడ ప్రభాస్, విష్ణు.. అక్కడ రజనీకాంత్, కమల్ హాసన్: వీరి చిత్రాల స్పెషల్ ఏంటంటే?
-
కొనసాగుతోన్న తొలివిడత పోలింగ్.. ఓటేసిన ప్రముఖులు
-
వినూత్న ‘సైకిల్’ ప్రచారం.. ఓటర్లను ఆకట్టుకునే యత్నం!
-
ఇరాన్-ఇజ్రాయెల్ ఉద్రిక్తతల ఎఫెక్ట్.. భారీ నష్టాల్లో మార్కెట్ సూచీలు
-
అంపైర్గా పని చేసి.. ఐపీఎల్లో అదరగొట్టి... నయా సంచలనం అశుతోష్ కథ ఇది!