అనుకున్నదాని కంటే ఎక్కువే తరలిస్తున్నారు..!
జిల్లాలో గ్రానైట్ వ్యాపారులు నిబంధనలకు విరుద్ధంగా రాయిని తరలించుకుపోతూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారు. అనుమతికి మించి గ్రానైట్ను భారీ మొత్తంలో తరలిస్తూ.. అధికంగా సంపాదిస్తున్నారు.
మహబూబాబాద్ నుంచి అక్రమంగా తీసుకెళుతూ..
మహబూబాబాద్, న్యూస్టుడే: జిల్లాలో గ్రానైట్ వ్యాపారులు నిబంధనలకు విరుద్ధంగా రాయిని తరలించుకుపోతూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారు. అనుమతికి మించి గ్రానైట్ను భారీ మొత్తంలో తరలిస్తూ.. అధికంగా సంపాదిస్తున్నారు. ఇంత చేసినా భూగర్భ గనుల శాఖాధికారులు మాత్రం ఈ ఏడాది ఎక్కడా తనిఖీలు చేసిన దాఖలాలు లేవు. ఒకవేళ తనిఖీలు చేసినా చూసి చూడనట్లు వదిలేస్తున్నారనే ఆరోపణలున్నాయి.
క్వారీల్లో తవ్వకాలు..
ఇక్కడి నుంచి ప్రతి నెలా రూ.కోట్ల విలువైన గ్రానైట్ వివిధ ప్రాంతాలకు తరలిపోతోంది. గూడూరు, కేసముద్రం, నెల్లికుదురు మండలాల్లో 168 గ్రానైట్ క్వారీలు ఉంటే.. వాటిలో సుమారు 60కి పైగా క్వారీల్లో తవ్వకాలు జరుగుతున్నాయి. ఇప్పటికే నిబంధనల మేరకు వసూలు చేసిన సీనరేజీ కింద వసూలు చేసిన సుమారు రూ.6 కోట్లకు పైగా నిధులు ఇతర జిల్లాకు వెళ్లి నష్టం జరిగింది. అంతేగాకుండా జిల్లాకు చెందిన అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ తనిఖీలు చేయకపోవడంతో తమ వ్యాపారాన్ని నిరాటంకంగా కొనసాగిస్తున్నారు.
పరిమాణంలో తేడాలు
క్వారీల నుంచి ఇతర ప్రాంతాలకు గ్రానైట్ను తరలించేందుకు వ్యాపారులు తీసుకున్న అనుమతికి విరుద్ధంగా ఎక్కువ పరిమాణంలో గ్రానైట్ను తరలిస్తున్నారు. ఒక్క వాహనంలో 4.5 మెట్రిక్ టన్నుల నుంచి 5.5 మెట్రిక్ టన్నుల వరకు అనుమతి ఇస్తారు. పెద్దపరిమాణం ఉన్న మెట్రిక్ టన్ను నలుపు రంగు గ్రానైట్ రూ.1,361 రుసుం చెల్లించాలి. తక్కువ పరిమాణం కలిగిన మెట్రిక్ టన్ను గ్రానైట్కు రూ.1,128 చెల్లించాలి. అయితే వ్యాపారులు మాత్రం కొందరు అధికారులను మచ్చిక చేసుకుని 7 మెట్రిక్ టన్నుల వరకు బరువు ఉన్న గ్రానైట్ను తీసుకెళుతూ సగం రుసుం మాత్రమే ప్రభుత్వానికి చెల్లిస్తున్నారు. అంతేగాకుండా ఒకే ట్రక్ షీట్ మీద రెండు, మూడు సార్లు గ్రానైట్ను తరలిస్తున్నారనే విమర్శలూ ఉన్నాయి.
దెబ్బతింటున్న రహదారులు
పెద్ద, చిన్న వాహనాల్లో అధిక బరువు ఉన్న గ్రానైట్ను తరలిస్తుండడం వల్ల రహదారులు దెబ్బతింటున్నాయి. దీంతో వాహన చోదకులు ఇబ్బందులు పడుతున్నారు. గత నెలలో నెల్లికుదురు మండలంలోని ఓ గ్రామంలో అధిక లోడ్తో వెళుతున్న గ్రానైట్ లారీని స్థానికులు అడ్డుకోవడంతో సంబంధిత క్వారీ నిర్వాహకులు వచ్చి రహదారి మరమ్మతు చేయిస్తామని చెప్పి వెళ్లారు. లోడు అధికంగా తీసుకెళ్లడంతో రోడ్లు దెబ్బతింటున్నాయి. వీటి మరమ్మతుల కోసం నిధులు మంజూరు చేయడంతో ప్రభుత్వానికి అదనపు భారం పడుతుంది.
అధిక బరువుకు.. మాకేం సంబంధం లేదు
- రవీందర్, ఇన్ఛార్జి భూగర్భ గనుల శాఖాధికారి
గ్రానైట్ క్వారీల అనుమతికి మాకు ఎలాంటి సంబంధం లేదు. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుంటే రాష్ట్ర కార్యాలయం నుంచే అనుమతులు వస్తాయి. ఎలాంటి వివరాలు మా వద్ద ఉండవు. నిబంధనలకు విరుద్దంగా అధిక బరువు కలిగిన గ్రానైట్ను తరలిస్తే తనిఖీలు చేయాల్సిన బాధ్యత రవాణా శాఖాధికారులపై ఉంది. ఈ సంవత్సరం మేం తనిఖీలు నిర్వహించలేదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కబ్జా కోరల్లో చెరువులు..
[ 23-04-2024]
ఉమ్మడి వరంగల్ వ్యాప్తంగా కాకతీయులు నిర్మించిన గొలుసుకట్టు చెరువులపై కబ్జాదారులు కన్నేశారు. భూముల విలువ పెరగడంతో శిఖం భూములను యథేచ్ఛగా ఆక్రమించుకుంటున్నారు -
అంతర్రాష్ట్ర దొంగ అరెస్టు
[ 23-04-2024]
పలు ప్రాంతాల్లో దొంగతనాలకు పాల్పడుతున్న నిందితుడిని జనగామ పోలీసులు అరెస్టు చేశారు. స్థానిక పట్టణ పోలీస్ స్టేషన్లో సోమవారం వెస్ట్జోన్ డీసీపీ పి.సీతారాం జనగామ ఏసీపీ అంకిత్కుమార్తో కలిసి నిర్వహించిన విలేకరుల సమావేశంలో కేసు వివరాలను వెల్లడించారు -
మార్కెట్లో కొనుగోళ్లు చేపట్టాలని ధర్నా
[ 23-04-2024]
జనగామ వ్యవసాయ మార్కెట్లో అన్ని రకాల వ్యవసాయ ఉత్పత్తుల క్రయవిక్రయాలు ప్రారంభించాలని, మూసివేసిన మార్కెట్ను తెరవాలని తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో స్థానిక మార్కెట్ గేటు ముందు ధర్నా నిర్వహించారు -
గొర్రెల పంపిణీకి మంగళం!
[ 23-04-2024]
గొర్రెల పంపిణీకి చెల్లించిన డబ్బులను వెనక్కి ఇవ్వాలని పశు సంవర్థక శాఖ అధికారులు నిర్ణయించారు -
‘భూమి పోతే ఆత్మహత్యలే దిక్కు’
[ 23-04-2024]
న్యూ గ్రీన్ ఫీˆల్డ్ హైవే వల్ల మా వ్యవసాయ భూములు పోతే ఆత్మహత్యలే దిక్కు అని ఇస్సిపేట రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం గ్రామ శివారులో చేపట్టిన రోడ్డు సర్వేను ఆ గ్రామ రైతులు అడ్డుకున్నారు -
భాజపాను ఆశీర్వదించండి.. అభివృద్ధి చేస్తాం
[ 23-04-2024]
మహబూబాబాద్: మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో సోమవారం భాజపా నిర్వహించిన రోడ్షో ఆ పార్టీ శ్రేణుల్లో జోష్ నింపింది. -
గాలివాన బీభత్సం.. అపార నష్టం
[ 23-04-2024]
ఆదివారం సాయంత్రం జిల్లాలో గాలివాన అపార నష్టం మిగిల్చింది. వరి, మామిడి పంటల రైతులకు గుండె కోత మిగిలింది. విద్యుత్తు శాఖకు తీవ్ర నష్టం వాటిల్లింది. -
నవ వధువు ఆత్మహత్య
[ 23-04-2024]
వివాహం జరిగిన 19 రోజులకే ఓ నవ వధువు ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన ఏటూరునాగారం మండలంలోని రాంనగర్ గ్రామంలో చోటు చేసుకుంది. -
విన్నవించాం.. పరిష్కరించండి
[ 23-04-2024]
ప్రజావాణిలో వచ్చిన అర్జీలకు పరిష్కారం చూపాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టర్ ఫిర్యాదులు స్వీకరించారు -
ఇక్కడా కబ్జాల పర్వం.. వెంటాడుతున్న బెంగుళూరు భయం!
[ 23-04-2024]
బెంగళూరు నగరంలో తీవ్రమైన తాగునీటి ఎద్దడి నెలకొంది. భూగర్భ జలాలు అడుగంటాయి.. కారణం చెరువులు, కుంటలు కబ్జాలకు గురై నీటినిల్వకు చోటు లేకపోవడమే. -
నామపత్రాల జాతర..
[ 23-04-2024]
వరంగల్ రిటర్నింగ్ అధికారి కార్యాలయం సోమవారం జాతరను తలపించింది. భారాస, కాంగ్రెస్ అభ్యర్థులతో పాటు ఇతర ప్రాంతీయ పార్టీలు, స్వతంత్రులు కలిపి మొత్తం 10 మంది 11 సెట్ల నామపత్రాలను రిటర్నింగ్ అధికారి ప్రావీణ్యకు సమర్పించారు. -
మోదీ పాలనతోనే దేశాభివృద్ధి
[ 23-04-2024]
భాజపా పాలనతోనే దేశాభివృద్ధి సాధ్యమని ఆ పార్టీ వరంగల్ ఎంపీ అభ్యర్థి అరూరి రమేశ్ పేర్కొన్నారు. -
పాటలతో రీల్స్.. మాటలతో మీమ్స్
[ 23-04-2024]
లోక్సభ ఎన్నికల్లో భాగంగా ఇప్పటికే నామపత్రాల ప్రక్రియ జోరందుకొంది. ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థులు క్షేత్రస్థాయిలో తిరుగుతూ ప్రచారం చేస్తూనే సామాజిక మాధ్యమాల్లోనూ చురుగ్గా ఉంటున్నారు. -
స్వల్ప ఆధిక్యంతో గెలుపు‘మన ఎంపీలు’
[ 23-04-2024]
వరంగల్ లోక్సభ స్థానం నుంచి అతి తక్కువ ఓట్ల మెజార్టీతో బకర్ అలి మీర్జా ఎంపీగా విజయం సాధించారు. ఆయన 1900, మార్చి 7న హైదరాబాద్లో జన్మించారు. ఉన్నత విద్యనభ్యసించి హైదరాబాద్ సర్కారులో ఫారెస్ట్లకు అసిస్టెంట్ క్యూరేటర్గా పనిచేశారు
తాజా వార్తలు (Latest News)
-
కొంతమంది ముంబయి ఆటగాళ్లు రోహిత్ శర్మనే కెప్టెన్ అనుకుంటున్నారు: ఇర్ఫాన్ పఠాన్
-
మాధురి దీక్షిత్తో నటించాలంటే భయమేసింది: మనీషా కొయిరాలా
-
రోహిత్తో ఓపెనింగ్ చేసేది ఎవరు? మీ ఛాయిస్ ఎవరు?
-
యాడ్ సైజ్లోనే ‘క్షమాపణలు’ ప్రచురించారా?.. పతంజలిని ప్రశ్నించిన సుప్రీం
-
తెలుగులో ‘నాయట్టు’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM