గర్భిణులకు వరం
సర్కారు దవాఖానాల్లో ప్రసవాల సంఖ్య పెంచాలని ప్రభుత్వం చెబుతోంది. గర్భిణులకు నమ్మకం కలిగించాలని సూచిస్తోంది.. అందుకు అనుగుణంగా సౌకర్యాలు కల్పిస్తోంది.
ప్రసూతి ఆసుపత్రిలో టిఫా సేవలు
నయీంనగర్, హనుమకొండ కలెక్టరేట్ న్యూస్టుడే
సర్కారు దవాఖానాల్లో ప్రసవాల సంఖ్య పెంచాలని ప్రభుత్వం చెబుతోంది. గర్భిణులకు నమ్మకం కలిగించాలని సూచిస్తోంది.. అందుకు అనుగుణంగా సౌకర్యాలు కల్పిస్తోంది. కేసీఆర్ కిట్తో పాటు ఆడశిశువు జన్మిస్తే రూ.13వేలు, మగ శిశువుకు రూ.12వేలు ఇస్తోంది. తాజాగా టిఫా( టార్గెటెడ్ ఇమేజింగ్ ఫర్ ఫ్యూటల్ ఎనామిలీస్) అనే స్కానింగ్ యంత్రం అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇది గర్భిణులకు వరం లాంటిది. దీని ద్వారా కడుపులోని శిశువు ఆరోగ్య పరిస్థితి తెలుసుకోవచ్చు.
జీఎంహెచ్లో ఏర్పాటు చేసిన టిఫా స్కానింగ్ యంత్రం
హనుమకొండలోని ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రికి ఉమ్మడి వరంగల్ జిల్లాతో పాటు పొరుగు జిల్లాలకు చెందిన గర్భిణులు వైద్య సేవల నిమిత్తం వస్తుంటారు. నిత్యం ఓపీ 250 నుంచి 350 వరక ఉంటుంది. వైద్యులు పరీక్షించి సూచనలు చేస్తుంటారు. అదేవిధంగా ప్రతిరోజూ 20పైగా ప్రసవాలు జరుగుతుంటాయి. జీఎంహెచ్లో సాధారణ ప్రసవాలు పెంచేలా ఎప్పటికప్పడు ప్రభుత్వం వైద్యులను ప్రోత్సహిస్తోంది. పేద, మధ్య తరగతి కుటుంబాలపై ఆర్థికభారం పడకూడదని గర్భిణులకు ప్రధానంగా అవసరమయ్యే టీఫా స్కానింగ్ యంత్రాన్ని ఏర్పాటు చేశారు. ఇటీవల వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్రావు ఆన్లైన్ ద్వారా ప్రారంభించారు. ఖరీదు రూ.30లక్షల వరకు ఉంటుంది.
తప్పనున్న ఆర్థిక ఇబ్బందులు
మారుతున్న కాలం, ఆహార అలవాట్లలో భాగంగా ప్రతి గర్భిణికి టీఫా స్కానింగ్ అనేది ప్రధానమైనది. గర్భం దాల్చిన 18 నుంచి 24 వారాల మధ్య తప్పనిసరిగా ఈ స్కానింగ్ చేెయించాలి. గతంలో సరైన స్కానింగ్ యంత్రం లేదు. దీంతో ప్రైవేటు స్కానింగ్ కేంద్రాలను ఆశ్రయించేవారు. ప్రైవేట్కు వెళ్తే రూ. 2 వేలకుపైగా వసూలు చేస్తున్నారు. ఆర్థికంగా ఇబ్బందులు తప్పడం లేదు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ప్రసూతి ఆసుపత్రిలో టీఫా స్కానింగ్ సేవలను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇక్కడ ఉచితంగా స్కానింగ్ చేస్తారు.
తెలుసుకునే విషయాలు..
స్కానింగ్ చేయడానికి 20 నుంచి 30 నిమిషాల సమయం పడుతుంది. గర్భంలో శిశువు అవయవాలన్నీ ఒక్కొక్కటిగా పరిశీలిస్తారు. శిశువు ఎంత బరువు ఉంది? ఉమ్మనీరు సరిపడా ఉందా? లేదా? చిన్న మెదడు, పెద్ద మెదడు పనితీరు, గుండె సరిగా కొట్టుకుంటుందా.. ఏమైనా రంధ్రాలున్నాయా?, శిశువు కన్నులు, ముక్కు, నోరు, చెవులు, చేతులు, కాళ్లు సరిగా ఉన్నాయా? వెన్నుముక సరిగా ఉందా? లేదా? ఉపిరితిత్తులు సరిగా పనిచేస్తున్నాయా? లేదా అనేవి క్షుణ్నంగా వైద్యుడు పరిశీలించి నివేదిక అందిస్తారు,
బయట రూ.2వేలు తీసుకుంటున్నారు..
ఎ.పావని, ములుగు
నేను తొమ్మిది నెలల గర్భిణిని. ఇక్కడ గతంలో టీఫా స్కానింగ్ అందుబాటులో లేదు. ప్రైవేటులో స్కాన్ చేయించుకున్నాను. రెండు వేల రూపాయలు తీసుకున్నారు. ఇక్కడ అందుబాటులోకి రావడంతో వైద్యుల సూచన మేరకు మరోసారి పరీక్ష చేయించుకున్నా. ఇది మాలాంటి పేదలకు ఉపయోగకరంగా ఉంటుంది.
చికిత్సతో నివారణ.
డా.ప్రవీణ్రెడ్డి, రేడియాలజిస్ట్
జిల్లాలో ఏటా ఎదో ఒక లోపంతో శిశువులు జన్మిస్తున్నారు. వీటిని అధిగమించడానికి టీఫా పరికరాలతో గర్భస్త దశలోనే పిండం లోపాలు గుర్తించి తగిన చికిత్స అందించవచ్చు. తల్లి, పుట్టబోయే శిశివుకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు.
ఆర్థికభారం తగ్గుతుంది
డా.విజయలక్ష్మి, జీఎంహెచ్ సూపరింటెండెంట్
ప్రభుత్వం పేదలకు ఆర్థికభారం కలగకుండా ఇటీవల టీఫా స్కానింగ్ను ఆసుపత్రిలో ఏర్పాటు చేసింది. నిత్యం 50 నుంచి 70 మంది గర్భిణులను పరీక్షిస్తున్నాం. ఇది వరకు కేవలం అల్ట్రాసౌండ్ స్కానింగ్ మాత్రమే ఉండేది. వాటితో ఇవి గుర్తించేందుకు వీలు పడేదికాదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సైబర్ మోసమా.. వారియర్లు పట్టేస్తారు!
[ 24-04-2024]
ఓ వైపు శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం పెరుగుతుండగా అదే తరహాలో సైబర్ మోసాలు విజృంభిస్తున్నాయి. డిజిటల్ లావాదేవీలు పెరుగుతున్న కారణంగా స్మార్ట్ఫోన్ల వినియోగం పెరిగింది. -
సీఎం రేవంత్రెడ్డి బహిరంగ సభకు సర్వం సిద్ధం
[ 24-04-2024]
లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి బుధవారం పాల్గొననున్న ‘ఓరుగల్లు జనజాతర’ బహిరంగ సభకు సర్వం సిద్ధమైంది. హనుమకొండ జిల్లా కాజీపేట మండలం మడికొండ సెయింట్ పాల్స్ మైదానంలో మధ్యాహ్నం 3 గంటలకు బహిరంగ సభ ఉంటుందని లోక్సభ ఎన్నికల ఇన్ఛార్జి, పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్రెడ్డి తెలిపారు. -
అభ్యర్థిని చూసి ఆశీర్వదించండి..
[ 24-04-2024]
వరంగల్ లోక్సభ ఎన్నికల ప్రచారంలో భారాస జోరు పెంచింది. అసెంబ్లీ ఎన్నికల తర్వాత మొదటిసారి వరంగల్కు వచ్చిన భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ పార్టీ శ్రేణుల్లో జోష్ నింపారు. -
కేఎంసీకి పోటెత్తిన మహిళా రోగులు
[ 24-04-2024]
కేఎంసీ(కాకతీయ మెడికల్ కాలేజీ)లోని సూపర్స్పెషాలిటీ ఆసుపత్రిలో వైద్యం కోసం వచ్చేవారిలో మహిళలే అధికంగా ఉంటున్నారు. మంగళవారం న్యూరాలజీ, న్యూరోసర్జరీ, నెఫ్రాలజీ, యూరాలజీ ఓపీ వైద్యసేవల కోసం అతివలు పోటెత్తారు. -
నెగ్గేదెవరైనా.. విమానం తీసుకురావాలి
[ 24-04-2024]
కొన్నేళ్లుగా వరంగల్ మామునూరు విమానాశ్రయం ఏర్పాటు ప్రక్రియ ముందుకు వెనక్కి అన్నట్టు సాగుతోంది. ఉమ్మడి వరంగల్ అభివృద్ధికి తోడ్పడే దీని పునరుద్ధరణ అంశం వరంగల్ లోక్సభ స్థానం నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థులకు ఎంతో కీలకం కానుంది. -
నాడు హనుమకొండ.. నేడు భువనగిరి!
[ 24-04-2024]
జనగామ శాసనసభ నియోజకవర్గం గతంలో హనుమకొండ లోక్సభ పరిధిలో ఉండేది. 2009 సంవత్సరంలో పార్లమెంట్ నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా జనగామ నియోజకవర్గాన్ని హనుమకొండ నుంచి వేరు చేసి కొత్తగా ఏర్పడిన భువనగిరి లోక్సభలో కలిపారు. -
వరంగల్ తొలి ఎంపీ సాదత్ అలీఖాన్
[ 24-04-2024]
1952లో జరిగిన తొలి సార్వత్రిక ఎన్నికల్లో వరంగల్ లోక్సభ స్థానం నుంచి హైదరాబాద్కు చెందిన సాదత్ అలీఖాన్ ఎన్నికయ్యారు. ఆయన భారత జాతీయ కాంగ్రెస్ (ఐఎన్సీ) అభ్యర్థిగా పోటీ చేశారు. -
అవును.. నిజమే కదా!
[ 24-04-2024]
జీవరాశికి ప్రాణవాయువు అవసరం. ఇది ఎంత వరకు నిజమో.. ప్రజాస్వామ్య వ్యవస్థ మనుగడకు ఓటూ అంతే. ఓటర్ల జాబితాలో పేరుండి... ఎన్నికల రోజు హక్కుని వినియోగించుకోకపోతే ఎలా? ఓటు వేయకపోతే ప్రజాస్వామ్య వ్యవస్థ నిర్వీర్యమవుతుంది. -
ఓటేయండి.. భవితకు బాటేయండి
[ 24-04-2024]
పోలింగ్ రోజు ప్రతి ఓటరు గడప దాటి ఓటు హక్కు వినియోగించుకోవాలని.. పిల్లల భవితకు బాటలు వేయాలని సామాజికవేత్త నిమ్మల శ్రీనివాస్ పేర్కొన్నారు. -
ఓట్లతోనే.. జాతీయ, ప్రాంతీయ గుర్తింపు..
[ 24-04-2024]
జాతీయ, ప్రాంతీయ పార్టీలంటూ చదువుతుంటాం. ఎన్నికల ప్రచారంలో సైతం జాతీయ పార్టీలు, ప్రాంతీయ పార్టీలంటూ నేతలు చెబుతుంటారు.. జాతీయ పార్టీలు దిల్లీ నుంచి పాలిస్తాయని.. -
గుర్తుంచుకుందాం..
[ 24-04-2024]
రాజకీయ పార్టీ అంటే ముందుగా గుర్తొచ్చేది పార్టీల గుర్తులు. వాటి ఆధారంగానే ఓటు వేస్తుంటాం. మన దేశంలో పార్టీల గుర్తుల కేటాయింపు ఎలా జరిగింది..? జాతీయ పార్టీల గుర్తుల్లో ఎలాంÇటి మార్పులు వచ్చాయో తెలుసుకుందాం.. -
అతిథులు తరలిరాగా.. బూర మోగించె!
[ 24-04-2024]
ఓట్ల కోసం అనాదిగా మత రాజకీయాలు చేస్తున్నది కాంగ్రెస్ పార్టీయేనని భాజపా ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కె.లక్ష్మణ్ విమర్శించారు. ప్రతి విషయాన్ని మతంతో ముడిపెడుతూ ఒక వర్గం మెప్పు కోసం పాకులాడే కాంగ్రెస్ పార్టీ భాజపా మత రాజకీయాలు చేస్తుందని ఆరోపించడం సరికాదన్నారు. -
హేమాచల క్షేత్రంలో పూజలు
[ 24-04-2024]
మండలంలోని మల్లూరు గుట్టపై శ్రీ హేమాచల లక్ష్మీనరసింహస్వామిని మంగళవారం ములుగు కలెక్టర్ ఇలా త్రిపాఠి దర్శించుకున్నారు. ఆలయ సంప్రదాయం ప్రకారం దేవస్థాన కార్యనిర్వహణాధికారి సత్యనారాయణ, అర్చకులు రాఘవాచార్యులు, రాజశేఖర్శర్మలు స్వాగతం పలికారు. -
వారధి.. నిర్లక్ష్యం తీరిది!
[ 24-04-2024]
రెండు జిల్లాల సరిహద్దులోని మానేరు వాగు దాటడానికి ఇరువైపులా గ్రామాల ప్రజలు దశాబ్దాల తరబడి నానా అవస్థలు పడుతున్నారు. ఎట్టకేలకు వంతెన నిర్మాణం పనులు ప్రారంభం కావడంతో కష్టాలు తీరతాయని భావించారు. -
ఏడుగురు అభ్యర్థులు.. 9 నామపత్రాలు
[ 24-04-2024]
వరంగల్ పార్లమెంట్ స్థానానికి మంగళవారం ఏడుగురు అభ్యర్థులు 9 నామపత్రాలను రిటర్నింగ్ అధికారి ప్రావీణ్యకు సమర్పించారు. -
రాత్రి వేళల్లో తరలిస్తున్నారు..!
[ 24-04-2024]
జిల్లాలో బెరైటీస్ అక్రమ రవాణా కొనసాగుతోంది. అడ్డుకట్ట వేసేందుకు అటవీశాఖ అధికారులు చేస్తున్న ప్రయత్నాలు పూర్తిగా సఫలమవడం లేదు. అధికారుల కళ్లుగప్పి విలువైన ఖనిజాన్ని రాత్రి వేళ సరిహద్దులు దాటిస్తున్నారు. -
సర్కారు బడిలో విజన్-2026
[ 24-04-2024]
డోర్నకల్లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయ బృందం రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా విజన్-2026 పేరిట ఓ ప్రత్యేక కార్యాచరణకు రూపకల్పన చేశారు. -
బకాయిలు రావు.. పనులు సాగవు..
[ 24-04-2024]
ప్రైవేటుకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దేందుకు గత ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ‘మన ఊరు మన బడి’ కార్యక్రమం అమలు చేస్తోంది. ఇందులో భాగంగా చేపట్టిన పాఠశాలల మరమ్మతులు, నూతన నిర్మాణాల పనులకు నిధుల కొరత ఏర్పడటంతో.. సుమారుగా ఏడాది కాలంగా పనులు నిలిచిపోయాయి. -
భారాస అభ్యర్థి నామపత్రం దాఖలు
[ 24-04-2024]
మహబూబాబాద్ లోక్సభ భారాస అభ్యర్థి మాలోత్ కవిత మంగళవారం ఆ పార్టీ నేతలతో కలిసి నామినేషన్ వేశారు. ముందుగా కురవి వీరభద్రస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. -
భార్యల సీట్ల కోసం భర్తల కొట్లాట
[ 24-04-2024]
ఆర్టీసీ బస్సులో భార్యల సీట్ల కోసం భర్తలు చెప్పులతో కొట్టుకున్న ఘటన మంగళవారం సాయంత్రం మహబూబాబాద్ జిల్లా తొర్రూరు ఆర్టీసీ బస్టాండ్లో నెలకొంది.
తాజా వార్తలు (Latest News)
-
గుంతల దారులు.. బూతు మాటలు!: ఇవే ‘గుడివాడ’లో గెలుపోటములు తేల్చేవి
-
ఇరాన్తో ఒప్పందాలా? జాగ్రత్త..! పాక్కు అమెరికా హెచ్చరిక
-
ఫిర్యాదు రాగానే లావాదేవీ నిలిపివేయాలి: ఆర్బీఐకి తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో సూచన
-
అంటకాగితే.. అంతే రాణా..!
-
సైబర్ మోసమా.. వారియర్లు పట్టేస్తారు!
-
కార్లు, స్థలాల పేరుతో రూ.కోట్లు స్వాహా