బతికే ఉన్నా.. ఆసరాలో చంపేశారు!
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకువచ్చిన ఆసరా పథకంలో భాగంగా స్టేషన్ఘన్పూర్ మండల కేంద్రానికి చెందిన ఆమంచ రాజేంద్రం అనే వ్యక్తి వృద్ధాప్య అసరా పింఛనుకు 2019లో దరఖాస్తు చేసుకున్నాడు.
ఆన్లైన్ రికార్డులో చనిపోయినట్లు చూపిస్తున్న దృశ్యం
న్యూస్టుడే, స్టేషన్ఘన్పూర్: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకువచ్చిన ఆసరా పథకంలో భాగంగా స్టేషన్ఘన్పూర్ మండల కేంద్రానికి చెందిన ఆమంచ రాజేంద్రం అనే వ్యక్తి వృద్ధాప్య అసరా పింఛనుకు 2019లో దరఖాస్తు చేసుకున్నాడు. ఇటీవల ఆసరా గుర్తింపు కార్డు రావడంతో ఆశగా పింఛన్ డబ్బుల కోసం స్థానిక తపాలా కార్యాలయానికి వెళ్లాడు. జాబితాలో తన పేరు లేదని చెప్పడంతో నిరాశగా మండల పరిషత్ కార్యాలయానికి వెళ్లాడు. సిబ్బంది రికార్డులను పరిశీలించి చనిపోయినట్లుగా ఉందని చెప్పారు. వెంటనే గ్రామ పంచాయతీ నుంచి బతికున్నట్లుగా ధ్రువపత్రం తీసుకురావాలని చెప్పారు. అక్కడ దరఖాస్తు చేసుకోగా తనకు సంబంధించిన ఇంటి పన్ను పూర్తిగా చెల్లిస్తేనే ఇస్తామని పంచాయతీ సిబ్బంది సమాధానం చెప్పారు. దీంతో రాజేంద్రం డబ్బులను చెల్లించాడు. అయినా తనకు పింఛన్ రావడం లేదని ఇంకా రికార్డులో చనిపోయిన్లగానే చూపిస్తుందని రోజూ మండల పరిషత్ కార్యాలయం చెట్టూ చెప్పులరిగేలా తిరిగినా అధికారులు పట్టించుకోవడం లేదని వాపోతున్నాడు. కలెక్టరేట్ కార్యాలయానికి వెళ్లాలని చెబుతున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. అధికారులు స్పందించి పింఛను ఇప్పంచాలని వేడుకున్నాడు.
గ్రామ పంచాయతీ కార్యాలయానికి దరఖాస్తు చేసుకున్న పత్రాన్ని,
ఆసరా పింఛన్ కార్డును చూపిస్తున్న రాజేంద్రం
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
Congress: రాష్ట్రపతి ప్రసంగానికి కాంగ్రెస్ ఎంపీలు దూరం.. మంచు కారణమట..!
-
Movies News
Chiranjeevi: ఆ మాట ఎంతో ఉపశమనాన్నిచ్చింది.. తారకరత్న ఆరోగ్యంపై చిరంజీవి ట్వీట్
-
World News
Imran khan: ఇమ్రాన్ సంచలన నిర్ణయం.. 33 ఎంపీ స్థానాల్లో ఒక్కడే పోటీ
-
Ap-top-news News
Andhra News: మామూళ్లు ఇస్తే కోరిన వేతనం.. ఆయుష్ కాంపౌండర్లకు వాట్సప్ సందేశం
-
General News
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
-
Politics News
Ponguleti: ఏడున్నరేళ్లుగా ఇబ్బందులు పెట్టారు: పొంగులేటి