మైనర్లు వాహనాలు నడపొద్దు
‘ట్రాఫిక్ నిబంధనలు పాటించకపోవడం.. యువకులు, కార్మికులు, మైనర్లు నిర్లక్ష్యంగా ద్విచక్రవాహనాలు నడపడం వల్లనే రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని’ భూపాలపల్లి మహిళా ఎస్సై డి.స్వప్న తెలిపారు.
భూపాలపల్లి టౌన్, భూపాలపల్లి, న్యూస్టుడే: ‘ట్రాఫిక్ నిబంధనలు పాటించకపోవడం.. యువకులు, కార్మికులు, మైనర్లు నిర్లక్ష్యంగా ద్విచక్రవాహనాలు నడపడం వల్లనే రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని’ భూపాలపల్లి మహిళా ఎస్సై డి.స్వప్న తెలిపారు. వాహనాలు నడిపే ప్రతి వ్యక్తి ట్రాఫిక్ రూల్స్ పాటిస్తే, చాలా వరకు రోడ్డు ప్రమాదాలు తగ్గుతాయని ఆమె తెలిపారు.
సమావేశంలో మాట్లాడుతున్న ఎస్సై డి.స్వప్న
* జిల్లా కేంద్రంలోని ఎల్బీనగర్ కాలనీలో తేజస్విని(గాంధీ) జూనియర్ కళాశాలలో గురువారం ‘ఈనాడు-ఈటీవీ’ ఆధ్వర్యంలో ట్రాఫిక్ నియమాలపై అవగాహన కల్పించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎస్సై స్వప్న మాట్లాడుతూ.. విద్యార్థులు చాలా మంది ఫోన్లో మాట్లాడుతూ.. ద్విచక్రవాహనాలను నడుపుతూ ప్రమాదాల బారిన పడుతున్నారని అన్నారు.
* భూపాలపల్లి ఏరియాలో కొద్ది నెలల క్రితం నుంచి జరిగిన ప్రమాదాలను పరిశీలిస్తే, మైనర్లు ద్విచక్రవాహనాలు నడిపిన కారణంగా జరిగినవే ఉన్నాయని అన్నారు. కొన్ని ప్రమాదాల్లో ఏకంగా ప్రాణాలు కోల్పోయారన్నారు. మైనర్లకు ద్విచక్రవాహనాలు ఇవ్వకుండా తల్లిదండ్రులు ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని, పిల్లలకు వాహనాలు ఇస్తున్న కొంత మంది కుటుంబ సభ్యుల కారణంగా ఇతరులకు పెద్ద నష్టం జరిగే అవకాశాలుంటాయని పేర్కొన్నారు.
విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయిస్తున్న భూపాలపల్లి పోలీసులు
ప్రమాదాలకు కారణాలివే..
* కోల్బెల్ట్ ప్రాంతంలో యువత, విద్యార్థులు ద్విచక్రవాహనాలు నడిపే సమయంలో శిరస్త్రాణం ధరించడం లేదు.. ప్రతి రోజు ఉదయం, సాయంత్రం చేపడుతున్న వాహనాల తనిఖీల్లో ఈ విషయం తెలిసిందని ఎస్ఐ చెప్పారు.
* విద్యార్థులు కొందరు గంజాయికి అలవాటుపడి వారి జీవితాలను నాశనం చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి చట్టవ్యతిరేకమైన కార్యక్రమాలకు పాల్పడినట్లు తెలిస్తే వెంటనే 100 నంబరుకు ఫోన్ చేయాలని సూచించారు.
* జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలల యాజమాన్యాలు ఎవరైనా విద్యార్థులు ద్విచక్రవాహనాలపై కళాశాలకు శిరస్త్రాణం లేకుండా వస్తే, కళాశాలలోకి వారికి అనుమతించకూడదని సూచించారు.
* త్రిబుల్ రైడింగ్ కూడా చట్టవిరుద్ధమే అవుతుంది. త్రిబుల్ రైడింగ్ చేస్తున్న వారిని పోలీసులు గుర్తించి, వారిని ఆపడానికి ప్రయత్నిస్తే, మరింత వేగంతో వెళ్లి ప్రమాదాలకు గురైన సందర్భాలు కూడా ఉన్నాయన్నారు. * వాహనాలు మద్యం తాగి నడిపించకూడదని పేర్కొన్నారు.
లైసెన్సు తీసుకోండిలా..
అర్హులైన ప్రతి ఒక్కరూ మీ సేవ కేంద్రంలో లెర్నింగ్ లైసెన్సు కోసం మొదటగా దరఖాస్తు చేసుకోవాలి. కాలపరిమితి 6 నెలలు ఉంటుంది. కాలపరిమితిలోపు మోటారు వెహికిల్ ఇన్స్పెక్టర్(ఎంవీఐ) పరీక్ష నిర్వహించి, లైసెన్సు జారీ చేస్తారు. ఈ విషయం అందరికీ తెలిసినా కొందరు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, ప్రమాదాలు జరిగిన తర్వాత బాధపడటం కంటే ముందే అన్ని జాగ్రత్తలు తీసుకుంటే చాలా మంచిది. లైసెన్సు, ఆర్సీˆ కార్డు, బీమా, కాలుష్య సర్టిఫికెట్తో పాటు తప్పనిసరిగా శిరస్త్రాణం ధరించాలి. ఇవేమీ లేకుండా పోలీసులకు పట్టుబడితే విద్యార్థులు బంగారు భవిష్యత్తును కోల్పోతారు. ప్రమాదాలకు కారణమైతే జరిమానాతో పాటు జైలుకు కూడా వెళ్లాల్సిన పరిస్థితి ఉంటుందన్నారు. మైనర్లకు వాహనం ఇచ్చిన సదరు వాహనదారుడిపైనా కేసు నమోదు చేయాల్సి ఉంటుందని ఎస్సై వివరించారు. అనంతరం ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తామని విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. కళాశాల ప్రిన్సిపల్ బిల్ల రాజిరెడ్డి, వైస్ ప్రిన్సిపల్ శ్రీమత, విద్యార్థులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కాంగ్రెస్ కంచుకోట.. మానుకోట!
[ 20-04-2024]
మహబూబాబాద్ జిల్లాకేంద్రంలో శుక్రవారం నిర్వహించిన కాంగ్రెస్ జన జాతర సభ విజయవంతమైంది. ఈ లోక్సభ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి అధిక సంఖ్యలో తరలొచ్చిన పార్టీ శ్రేణులు, అభిమానులతో సభా ప్రాంగణం హోరెత్తింది. -
కబ్జా కోరల్లో ఇనుపరాతి గుట్ట అటవీ భూములు!
[ 20-04-2024]
భూపాలపల్లి జిల్లా కేంద్రం సమీపంలోని కొంపెల్లి గ్రామ పరిధిలో 106.34 ఎకరాల భూమి ప్రైవేటు వ్యక్తులది కాదని.. అది అటవీ భూమేనని సుప్రీంకోర్టు ఇచ్చిన తాజా తీర్పు పర్యావరణానికి ఎంతో మేలు చేయనుంది. -
ఛత్రం పడితేనే.. చకచకా నడిచేది..!
[ 20-04-2024]
గత లోక్సభ ఎన్నికలు 2019 ఏప్రిల్ 11న జరిగాయి. ఈసారి మే 13న నిర్వహించనున్నారు. ఇప్పుడే ఎండలు దంచి కొడుతున్నాయి. ఆ సమయంలో మరింత తీవ్రంగా ఉండే ప్రమాదం ఉంది.. -
బలరాంనాయక్ నామపత్రం దాఖలు
[ 20-04-2024]
మహబూబాబాద్ (ఎస్టీ) లోక్సభ స్థానానికి కాంగ్రెస్ అభ్యర్థి, కేంద్ర మాజీ సహాయమంత్రి పోరిక బలరాంనాయక్ శుక్రవారం రెండు సెట్ల నామినేషన్ దాఖలు చేశారు. -
మావోయిస్టు దంపతులకు తుది వీడ్కోలు
[ 20-04-2024]
ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్లో మృతిచెందిన మావోయిస్టు దంపతులు జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం చల్లగరిగె గ్రామానికి చెందిన సిరిపెల్లి సుధాకర్ అలియాస్ శంకర్ అలియాస్ మురళీ, ఆదిలాబాద్ జిల్లా బజార్హత్నూర్కు చెందిన సుమన అలియాస్ రంజిత అంత్యక్రియలు శుక్రవారం స్వగ్రామంలో ముగిశాయి. -
ఓటు వేసి ప్రజాస్వామ్యాన్ని గెలిపించాలి
[ 20-04-2024]
వచ్చేనెల 13న జరగబోయే లోక్సభ ఎన్నికల పోలింగ్ రోజు అందరూ ఓటేసి ప్రజాస్వామ్యాన్ని గెలిపించాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ పిలుపునిచ్చారు. -
సీఎం హెలిప్యాడ్కు మూడు స్థలాల పరిశీలన
[ 20-04-2024]
కాజీపేట మండలం మడికొండ సెయింట్ పాల్స్ మైదానంలో ఈ నెల 24న నిర్వహించనున్న కాంగ్రెస్ పార్టీ బహిరంగ సభకు ఏర్పాట్లు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. -
వరంగల్లో భారాస విజయం ఖాయం
[ 20-04-2024]
వరంగల్ లోక్సభ నియోజకవర్గంలో భారాస విజయం ఖాయమైందని మాజీ మంత్రి దయాకర్రావు అన్నారు. -
మరాడించలే.. లెక్కచూపలే
[ 20-04-2024]
జిల్లాలో సీఎంఆర్(కస్టమ్ మిల్లింగ్ రైస్) ప్రక్రియ నత్తనడకన సాగుతోంది.. రైతులు పండించిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి సేకరిస్తోంది. -
ఎన్నిక ఏదైనా సత్తా చాటారు..!
[ 20-04-2024]
రాజకీయ నేతలు తమ జీవిత కాలంలో ఒక్కసారైనా ఏదో ఒక చట్టసభలో అడుగుపెట్టాలని ఆశిస్తుంటారు.. ఒకరికే ఎమ్మెల్యేగా, ఎంపీగా పోటీ చేసే అవకాశం వచ్చి విజయం సాధిస్తే వారి ఆనందానికి అవధులు ఉండవు. -
అట్టహాసంగా ప్రారంభం.. పరిశోధనలు శూన్యం
[ 20-04-2024]
కాకతీయ విశ్వవిద్యాలయంలో పరిశోధనల నిమిత్తం రూ.50 కోట్లతో కె-హబ్, పీవీ నర్సింహారావు విజ్ఞాన కేంద్రం నిర్మించారు. -
ఓటాస్త్రం.. స్వీయచిత్రమే సాక్ష్యం
[ 20-04-2024]
ఓరుగల్లు నగరంలో ఓటింగ్ శాతం పెంచేందుకు వరంగల్ కలెక్టరేట్ ఆవరణలో సెల్ఫీ పాయింట్ ఏర్పాటు చేశారు. -
రెండోరోజు మూడు నామపత్రాలు
[ 20-04-2024]
వరంగల్ లోక్సభ స్థానానికి రెండోరోజు శుక్రవారం ముగ్గురు అభ్యర్థులు, నాలుగుసెట్ల నామపత్రాలు దాఖలు చేశారని వరంగల్ పార్లమెంట్ రిటర్నింగ్ అధికారి, వరంగల్ జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
హెచ్డీఎఫ్సీ ఫలితాలు.. నికర లాభం రూ.17,622 కోట్లు
-
అనారోగ్య సమస్యలతో కేజ్రీవాల్ మరణించేలా కుట్ర: దిల్లీ మంత్రి సౌరభ్ భరద్వాజ్
-
‘ఇంకెవరూ మీ భార్యే..’: కోహ్లీ ఆన్సర్కు షాకైన దినేశ్ కార్తిక్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
‘నానమ్మా.. మీ కోడలు పచ్చళ్లు సరిగ్గా చేయట్లేదా?’: ఉపాసన ఫన్నీ వీడియో
-
డేవిడ్, పొలార్డ్కు భారీ జరిమానా.. ‘డీఆర్ఎస్ సిగ్నల్’ వివాదమేనా కారణం?