అల్పాహారం.. చేయూత అవసరం
పదోతరగతిలో ఉత్తీర్ణత శాతాన్ని పెంచేందుకు ప్రభుత్వ పాఠశాలల్లో ప్రత్యేక తరగతులను నిర్వహిస్తున్నారు. నవంబరు నుంచి మార్చి మొదటి వారం వరకు వీటిని కొనసాగించాలని విద్యాశాఖ కార్యచరణ ప్రణాళిక రూపొందించింది.
మొదలైన ‘పది’ విద్యార్థులకు ప్రత్యేక తరగతులు
ఈనాడు డిజిటల్, మహబూబాబాద్, న్యూస్టుడే, డోర్నకల్
పదోతరగతిలో ఉత్తీర్ణత శాతాన్ని పెంచేందుకు ప్రభుత్వ పాఠశాలల్లో ప్రత్యేక తరగతులను నిర్వహిస్తున్నారు. నవంబరు నుంచి మార్చి మొదటి వారం వరకు వీటిని కొనసాగించాలని విద్యాశాఖ కార్యచరణ ప్రణాళిక రూపొందించింది. ఉదయం, సాయంత్రం గంట పాటు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. ఉదయాన్నే విద్యార్థులు ఇంటి వద్ద తినకుండా పాఠశాలకు ముందుగా వచ్చి ఆలస్యంగా వెళ్తున్నారు. ఆ సమయంలో వారికి అల్పాహారం అందక పస్తులుంటున్నారు. ఇది ప్రమాదమని వైద్యులు సూచిస్తున్నారు. కొన్ని పాఠశాలల్లో మాత్రమే దాతలు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల చేయూతతో అల్పాహారం అందుతోంది. ఇంకా అందని బడులున్నాయి.
నలభై పాఠశాలల్లో కొనసాగింపు
జిల్లాలో నలభై పాఠశాలల్లో విద్యార్థులకు అల్పాహారం అందుతుంది. దాతలు, ఆయా పాఠశాలల్లో ఉపాధ్యాయులు, గ్రామ ప్రజాప్రతినిధుల సహకారంతో అందిస్తున్నారు. మిగిలిన బడుల్లో ఇదే తరహాలో అందించడానికి ఆ ప్రాంతంలోని దాతలు ముందుకు రావాలి.
దాతలు స్పందించాలి
సుదూర ప్రాంతాల నుంచి పిల్లలు ఆహారం తీసుకోకుండానే ఉదయం 7 గంటలకే ప్రత్యేక తరగతుల కోసం బడికి వస్తున్నారు. వీరికి మధ్యాహ్న భోజనం ఒక్కటే ఆకలి తీరుస్తుంది. సాయంత్రం ప్రత్యేక తరగతులు ముగించుకుని మళ్లీ ఇంటికి చేరే సరికి రాత్రి 7 గంటలు అవుతుంది. వీరికి పోషకాహారం చాలా అవసరం. పూర్వ విద్యార్థులు, యువజన సంఘాలు, ప్రవాస భారతీయులు, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు ముందుకొస్తే విద్యార్థులకు ఆకలి తీర్చడంతో పాటు వారి చదువులకు చేయూత ఇచ్చినవారు అవుతారు. పుట్టిన, పెళ్లి రోజు వేడుకల సందర్భంగానూ విద్యార్థులకు అల్పాహారం అందించొచ్చు.
తక్కువ ఖర్చుతోనూ..
తక్కువ వ్యయంతో పిల్లల ఆకలి తీర్చే మార్గం ఉంది. తక్కువ ఖర్చులో పల్లీలు, అటుకుల చుడువా, బిస్కెట్లు, శనగలు, పెసర్లు, బొబ్బెర్లు, ఉప్మా, జామకాయలు, అరటిపండ్లు అందుబాటులో ఉన్నాయి. ఇందుకు ఒక్కో విద్యార్థికి రోజుకు రూ.10 చొప్పున ఖర్చు అవుతుంది.
వీరు ఆదర్శం..
కేసముద్రం మండలం కల్వల గ్రామంలోని ఉన్నత పాఠశాలలో 43 మంది పదోతరగతి విద్యార్థులున్నారు. నెల రోజుల నుంచి వీరికి ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. సర్పంచి గంట సంజీవరెడ్డి, పాఠశాల ఉపాధ్యాయ బృందం, ఇక్కడ పనిచేసి బదిలీపై వెళ్లిన ఉపాధ్యాయుల వీరికి అల్పాహారం అందిస్తున్నారు. ఉదయం ప్రతి ఒక్కరికీ రూ.5 విలువ చేసే బిస్కెట్ ప్యాకెట్ను అందిస్తున్నారు. సాయంత్రం ప్రతి విద్యార్థికి 100 గ్రాముల చొప్పున ఉడికించిన బొబ్బెర్లు, శనగలు, వేరుశనగలను అందిస్తున్నట్లు ప్రధానోపాధ్యాయుడు ఎస్. వెంకటేశ్వర్లు తెలిపారు.
వీరంతా దంతాలపల్లి జడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థులు. 134 మంది పదోతరగతి చదువుతున్నారు. వీరిని నాలుగు సెక్షన్లుగా విభజించారు. ఉత్తమ ఫలితాలు సాధన కోసం ఉదయం, సాయంత్రం గంట పాటు నిర్వహిస్తున్న ప్రత్యేక తరగతులకు 125 మంది పిల్లలు హాజరవుతున్నారు. అధిక సంఖ్యలో 10 కిలోమీటర్ల దూరం నుంచి వస్తున్నారు. వారి ఆకలి తీర్చేందుకు నవంబరులో ఉపాధ్యాయ బృందం బిస్కెట్లు, అరటిపండ్లు, అటుకులు, పల్లీలు ఇచ్చారు. శనగలు, బొబ్బెర్లను ఉడికించి గుగ్గిళ్ల రూపంలో అందించారు. రోజుకు రూ.1200 వరకు ఖర్చు చేశారు. తరగతులు ముగిసే వరకు దాతల అవసరం ఉంది. ఈమేరకు పూర్వ విద్యార్థులు, ప్రజాప్రతినిధులను కలవాలని నిర్ణయించుకున్నట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు బి.శ్రీనివాస్ తెలిపారు.
పాఠ్యాంశాలపై దృష్టి పెడుతున్నాం
- కె.శివాని, కల్వల, కేసముద్రం
బడిలో ఉదయం, సాయంత్రం నిర్వహిస్తున్న ప్రత్యేక తరగతులకు హాజరవుతున్నా. దాతలు, ఉపాధ్యాయుల సహకారంతో అందిస్తున్న అల్పాహారంతో ఆకలి తీరుతుంది. దీంతో పాఠాలపై దృష్టి పెడుతున్నాం.
పిల్లలకు ఎంతో ప్రయోజనం
- సంక బద్రినారాయణ, ప్రధానోపాధ్యాయుడు, మాధావపురం, మహబూబాబాద్
మా బడిలో పదోతరగతిలో 17 మంది విద్యార్థులున్నారు. వారికి ప్రతి రోజు అల్పాహారాన్ని సొంత ఖర్చులతో అందిస్తున్నాను. నాతో పాటు గ్రామంలోని మరి కొందరూ దాతలు ముందుకొస్తే పిల్లలకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. బాగా చదువుకుని మంచి ఫలితాలు సాధిస్తారు.
ప్రభుత్వ నిధులు లేవు
- డాక్టర్ అబ్దుల్హై, డీఈవో
పదోతరగతి విద్యార్థుల ప్రత్యేక తరగతుల నిర్వహణకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఎలాంటి నిధుల లేవు. విద్యార్థులకు దాతల సహకారంతోనే అల్పాహరం అందిస్తున్నాం. దీనికి పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, స్థానికుల ఆర్థిక సహకారంతో అందిస్తున్నాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భారాసకు కడియం ఝలక్!
[ 29-03-2024]
అసెంబ్లీ ఎన్నికల్లోనే వరంగల్ లోక్సభ స్థానం పరిధిలో భారాసకు ఎదురుదెబ్బ తగిలింది. ఏడు స్థానాల్లో ఆరు చోట్ల ఓటమి తప్పలేదు. -
మానుకోట ఎమ్మెల్యే వాహనం తనిఖీ
[ 29-03-2024]
లోక్సభ ఎన్నికల నేపథ్యంలో నెల్లికుదురు వద్ద నెలకొల్పిన చెక్ పోస్టు వద్ద గురువారం మహబూబాబాద్ ఎమ్మెల్యే భూక్య మురళీనాయక్, కరీంనగర్ ఎమ్మెల్సీ రఘోత్తంరెడ్డి వాహనాలను తనిఖీ చేశారు. -
షాపింగ్మాల్లో భారీ అగ్నిప్రమాదం
[ 29-03-2024]
వరంగల్ పోచమ్మమైదాన్లోని జెకోటియా షాపింగ్ మాల్లో గురువారం సాయంత్రం 6.45 గంటలకు భారీ అగ్నిప్రమాదం జరిగింది. -
గ్రంథాలయం మాది..పుస్తకం మీది!
[ 29-03-2024]
నేటి తరం పిల్లలు పుస్తక పఠనానికి క్రమంగా దూరమవుతున్నారు. చరవాణుల వ్యామోహంలో పడి గ్రంథాలయాల గడప తొక్కనివారు ఎంతో మంది ఉన్నారు. -
ఎర్రగట్టు గుట్టపై క్షీరాభిషేకం
[ 29-03-2024]
భీమారంలోని ఎర్రగట్టు గుట్టపై వెలసిన వేెంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. నాలుగో రోజు గురువారం స్వామివారికి క్షీరాభిషేకం నిర్వహించారు. -
యథేచ్ఛగా ఆలయ భూముల ఆక్రమణ
[ 29-03-2024]
వరంగల్, హనుమకొండ నగరాల నడిబొడ్డున రూ.కోట్ల విలువైన ఆలయ భూములు ఆక్రమణల చెరలో ఉన్నాయి. ఈ స్థలాల్లో పలుకుబడి ఉన్నవాళ్లు పెద్ద భవనాలు, ఇళ్లు నిర్మించుకున్నారు. -
ఇసుకాసురులపై పోలీసుల కొరడా
[ 29-03-2024]
సహజ వనరులను కాపాడుకుంటూ భవిష్యత్తు తరాలకు అందించినప్పుడే మనుగడ సాధ్యమవుతుంది. కానీ చాలా వరకు గుట్టలు, ఇసుక, మట్టిని గుళ్ల చేస్తూ వనరులను అందిన కాడికి దోచుకుంటున్నారు. -
నాణ్యతా.. వారికి మామూలే!
[ 29-03-2024]
ఉపాధిహామీ పథకం నిధులతో పంచాయతీరాజ్ ఇంజినీరింగ్శాఖ ఆధ్వర్యంలో మహబూబాబాద్, భూపాలపల్లి, ములుగు జిల్లాల్లోని పలు గ్రామాల్లో ఇటీవల సీసీ రోడ్ల నిర్మాణాలు చేపట్టారు. -
వైద్యుడు లేక అందని గుండె పరీక్షల సేవలు
[ 29-03-2024]
జనగామ జిల్లా కేంద్రంగా మారిన తర్వాత జనగామలో ప్రభుత్వం తెలంగాణ డయాగ్నస్టిక్ కేంద్రం, రేడియాలజీ హబ్లను ఏర్పాటు చేసింది. -
మరోసారి కాంగ్రెస్ సత్తా చాటాలి
[ 29-03-2024]
రానున్న లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మాజీ కేంద్ర మంత్రి బలరాంనాయక్ను అధిక మెజారిటీతో గెలిపించాలని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క నాయకులు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. -
ఆస్తి పన్ను బకాయిదారులపై కొరడా
[ 29-03-2024]
ఆస్తి పన్ను మొండి బకాయిదారులపై మున్సిపాలిటీ అధికారులు కొరడా ఝులిపిస్తున్నారు. వారం రోజులుగా ఉదయం 7 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు బకాయిదారుల ఇళ్లు, దుకాణాల వద్దకు వెళ్లి పన్ను చెల్లించాలని కోరుతున్నారు. -
అక్రమ వ్యాపారాలపై ప్రత్యేక నిఘా
[ 29-03-2024]
జిల్లాలో అక్రమ వ్యాపారాలపై పోలీసు యంత్రాంగం ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ అన్నారు. -
వేగవంతంగా చిన్న కాళేశ్వరం ప్రాజెక్టు పనులు
[ 29-03-2024]
మహదేవపూర్ మండలంలోని చిన్న కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ పనులను వేగవంతంగా చేపట్టాలని సంబంధిత నీటిపారుదల శాఖ అధికారులను జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా ఆదేశించారు. -
పల్లెల్లో బెట్టింగ్ల జోరు
[ 29-03-2024]
పట్టణాలకు పరిమితమైన బెట్టింగ్ సంస్కృతి పల్లె ప్రాంతంలో విస్తరించింది. జిల్లాలో మారుమూల ప్రాంతమైన కాటారం రెవెన్యూ డివిజన్ పరిధిలోని పల్లెల్లో యువకులు, వ్యాపారులు, విద్యార్థులు పందేలు కాస్తూ ఆర్థికంగా చితికిపోతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
సీఎం రేవంత్రెడ్డితో ఎంపీ కె.కేశవరావు భేటీ
-
ఉత్తర్ప్రదేశ్లో హైఅలర్ట్.. గ్యాంగ్స్టర్ ముఖ్తార్ మృతిపై కుటుంబం అనుమానాలు!
-
కాంగ్రెస్కు మళ్లీ షాక్.. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు
-
విజయ్ దేవరకొండను పార్టీ అడిగిన రష్మిక.. ఎందుకంటే..?
-
ప్రధాని మోదీ, బిల్గేట్స్.. ‘చాయ్ పే చర్చ’
-
‘మిలిటరీ తరహా కోచ్’ అంటూ వీజ్ వ్యాఖ్యలు.. ఆండ్రి రస్సెల్ కౌంటర్