ఖాళీ కడుపులు.. సాగని చదువులు
ప్రభుత్వ పాఠశాలల్లో వచ్చే పదో తరగతి వార్షిక పరీక్షల్లో వంద శాతం ఫలితాలు సాధించటానికి విద్యాశాఖ ప్రత్యేక కార్యాచరణ చేపడుతోంది. ఉపాధ్యాయులు బోధన, పరీక్షలపై దృష్టి సారించారు. కరోనాతో మూడేళ్లుగా చదువులు కొంత వెనకబడటంతో గాడిలో పెట్టేందుకు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు.
దాతలు ముందుకొస్తేనే.. అల్పాహారం
న్యూస్టుడే, భూపాలపల్లి
అల్పాహారం అందడం లేదని చేతులు ఎత్తిన భూపాలపల్లి ఉన్నత పాఠశాల విద్యార్థినులు
ప్రభుత్వ పాఠశాలల్లో వచ్చే పదో తరగతి వార్షిక పరీక్షల్లో వంద శాతం ఫలితాలు సాధించటానికి విద్యాశాఖ ప్రత్యేక కార్యాచరణ చేపడుతోంది. ఉపాధ్యాయులు బోధన, పరీక్షలపై దృష్టి సారించారు. కరోనాతో మూడేళ్లుగా చదువులు కొంత వెనకబడటంతో గాడిలో పెట్టేందుకు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. ఉదయం, సాయంత్రం వేళల్లో అదనంగా ఒక్కో గంటపాటు ప్రత్యేక తరగతులు కొనసాగిస్తున్నారు. అయితే పిల్లలు ఖాళీ కడుపులతో చదువులను సాగించాల్సి వస్తోంది. స్వచ్ఛంద సంస్థలు, దాతలు స్పందించి అల్పాహారం అందించేందుకు ముందుకు రావాలి. గత నెల 15 నుంచి అన్ని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు, ఆదర్శ, కేజీబీవీల్లో ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. ఫిబ్రవరి 25 వరకు కొనసాగనున్నాయి. ఉదయం 8.30 గంటల నుంచి 9.30 వరకు, అదేవిధంగా సాయంత్రం 4.45 నుంచి 5.45 వరకు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. జిల్లాలోని మొత్తం 93 ప్రభుత్వ పాఠశాలల నుంచి తెలుగు మీడియంలో 560 మంది విద్యార్థులు, ఆంగ్ల మాధ్యమం నుంచి 1,724 మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలకు హాజరుకానున్నారు. విద్యార్థులు ఉదయం ఇంటి వద్ద తిని బడికి వెళ్తే తిరిగి సాయంత్రం 6 నుంచి 6.15 గంటలకు ఇళ్లకు చేరుకుంటారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థులైతే మరో అరగంట ఆలస్యమవుతుంది. మధ్యాహ్న భోజనం చేసి పొద్దుపోయే వరకు ఆకలితో ఉండటం వారికి కష్టంగానే ఉంటోంది. ఓ వైపు ఆకలి వేస్తుంటే మరోవైపు బోధించే విషయం కూడా వారికి అర్థం కాదు. దీనిని దృష్టిలో ఉంచుకుని సాయంత్రం వేళల్లో అల్పాహారం అందించేందుకు దాతలు ముందుకు రావాల్సిన అవసరం ఉంది.
ఆకలి తీరుద్దాం...
సుదూర ప్రాంతాల నుంచి పిల్లలు ఆహారం తీసుకోకుండానే ఉదయం 7 గంటలకే ప్రత్యేక తరగతుల కోసం బడికి వస్తున్నారు. వీరికి మధ్యాహ్న భోజనం ఒక్కటే ఆకలి తీరుస్తుంది. సాయంత్రం ప్రత్యేక తరగతులు ముగించుకుని మళ్లీ ఇంటికి చేరే సరికి రాత్రి 7 గంటలు అవుతుంది. వీరికి పోషకాహారం చాలా అవసరం. పూర్వ విద్యార్థులు, యువజన సంఘాలు, ప్రవాస భారతీయులు, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు ముందుకొస్తే విద్యార్థులకు ఆకలి తీర్చడంతో పాటు వారి చదువులకు చేయూత ఇచ్చినవారు అవుతారు. పుట్టిన, పెళ్లి రోజు వేడుకల సందర్భంగానూ విద్యార్థులకు అల్పాహారం అందించొచ్చు.
తక్కువ ఖర్చుతోనూ..
తక్కువ ఖర్చుతో పిల్లల ఆకలి తీర్చే మార్గం ఉంది. తక్కువ ఖర్చులో పల్లీలు, అటుకుల చుడువా, బిస్కెట్లు, శనగలు, పెసర్లు, బొబ్బెర్లు, ఉప్మా, జామకాయలు, అరటిపండ్లు అందుబాటులో ఉన్నాయి. ఇందుకు ఒక్కో విద్యార్థికి రోజుకు రూ.10 చొప్పున ఖర్చు అవుతుంది.
కలెక్టర్ చొరవ తీసుకోవాలి..
హెచ్ఎం గదిలో నిల్వచేసిన బాదం మిల్క్ బాటిళ్లు
భూపాలపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పదో తరగతి విద్యార్థులకు అల్పాహారం అందడం లేదు. మొత్తం 60 మంది పదో తరగతి విద్యార్థులున్నారు. గతేడాది జిల్లా కలెక్టర్ చొరవ తీసుకుని కొద్దిరోజుల పాటు అల్పాహారం అందించారు. ఈ ఏడాది ఇంతవరకు అందించకపోవడంతో విద్యార్థులు సాయంత్రం ఖాళీ కడుపులతోనే ఇంటికి వెళ్తున్నారు. ఓ ప్రైవేటు స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులు బాదం మిల్క్ బాటిళ్లు అందజేశారు. వీటిని రోజు సాయంత్రం వారికి అందిస్తామని ఉపాధ్యాయులు తెలిపారు.
వీరు ఆదర్శం...
చెల్పూరు ఉన్నత పాఠశాలలో ప్రత్యేక తరగతుల్లో అల్పాహారం అందిస్తున్న దృశ్యమిది..
గణపురం మండలం చెల్పూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులకు ఏడాది క్రితం అదే గ్రామానికి చెందిన ఓ వ్యాపారి సాయంత్రం పూట బిస్కెటు ప్యాకెట్లు పంపిణీ చేశారు. ఈ పాఠశాలలో పదో తరగతి విద్యార్థులు 25 మంది ఉన్నారు. కానీ ఈ ఏడాది ఇంత వరకు అల్పాహారం విద్యార్థులకు అందించడం లేదు.
మంచినీళ్లతోనే సరిపెట్టుకుంటున్నాం..
- ఎ.వర్ష, పదో తరగతి, జవహర్నగర్కాలనీ
ప్రత్యేక తరగతులకు హాజరవుతున్న విద్యార్థులకు సాయంత్రం అల్పాహారం అందడం లేదు. చాలా మంది విద్యార్థులు ఆకలికి తట్టుకోలేక మంచినీళ్లతోనే కడుపులు నింపుకొంటున్నారు. మూడు నెలల పాటు కొనసాగే ప్రత్యేక తరగతుల సందర్భంగా ప్రభుత్వమే అల్పాహారం ఏర్పాటు చేస్తే, అనేక మంది విద్యార్థులకు మేలు జరుగుతుంది.
వారం తర్వాత నుంచి అందిస్తాం..
- జుమ్మూనాయక్, హెచ్ఎం, చెల్పూరు ఉన్నత పాఠశాల
వారం తర్వాత నుంచి చెల్పూరు ఉన్నత పాఠశాలలో పదో తరగతి విద్యార్థులకు సాయంత్రం అల్పాహారం అందించడానికి చర్యలు తీసుకుంటాం.. గతేడాది అందించిన కొంతమంది వ్యాపారుల దృష్టికి ఇప్పటికే తీసుకెళ్లాం. స్వచ్ఛంద సంస్థలు, ప్రజా ప్రతినిధులు చొరవ తీసుకోవాలి.
త్వరలోనే చర్యలు తీసుకుంటాం..
- ఎం.రాజేందర్, డీఈవో.భూపాలపల్లి
రాష్ట్ర స్థాయిలో రాబోయే పదో తరగతి వార్షిక పరీక్షల్లో జయశంకర్ జిల్లా మొదటి స్థానం సాధించడానికి ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు ప్రత్యేక ప్రణాళికను పకడ్బందీగా అమలు చేయాలని ఆదేశించాం. సాయంత్రం పూట పిల్లలకు అల్పాహారం అందించడానికి చర్యలు త్వరలోనే తీసుకుంటాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సైబర్ మోసమా.. వారియర్లు పట్టేస్తారు!
[ 24-04-2024]
ఓ వైపు శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం పెరుగుతుండగా అదే తరహాలో సైబర్ మోసాలు విజృంభిస్తున్నాయి. డిజిటల్ లావాదేవీలు పెరుగుతున్న కారణంగా స్మార్ట్ఫోన్ల వినియోగం పెరిగింది. -
సీఎం రేవంత్రెడ్డి బహిరంగ సభకు సర్వం సిద్ధం
[ 24-04-2024]
లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి బుధవారం పాల్గొననున్న ‘ఓరుగల్లు జనజాతర’ బహిరంగ సభకు సర్వం సిద్ధమైంది. హనుమకొండ జిల్లా కాజీపేట మండలం మడికొండ సెయింట్ పాల్స్ మైదానంలో మధ్యాహ్నం 3 గంటలకు బహిరంగ సభ ఉంటుందని లోక్సభ ఎన్నికల ఇన్ఛార్జి, పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్రెడ్డి తెలిపారు. -
అభ్యర్థిని చూసి ఆశీర్వదించండి..
[ 24-04-2024]
వరంగల్ లోక్సభ ఎన్నికల ప్రచారంలో భారాస జోరు పెంచింది. అసెంబ్లీ ఎన్నికల తర్వాత మొదటిసారి వరంగల్కు వచ్చిన భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ పార్టీ శ్రేణుల్లో జోష్ నింపారు. -
కేఎంసీకి పోటెత్తిన మహిళా రోగులు
[ 24-04-2024]
కేఎంసీ(కాకతీయ మెడికల్ కాలేజీ)లోని సూపర్స్పెషాలిటీ ఆసుపత్రిలో వైద్యం కోసం వచ్చేవారిలో మహిళలే అధికంగా ఉంటున్నారు. మంగళవారం న్యూరాలజీ, న్యూరోసర్జరీ, నెఫ్రాలజీ, యూరాలజీ ఓపీ వైద్యసేవల కోసం అతివలు పోటెత్తారు. -
నెగ్గేదెవరైనా.. విమానం తీసుకురావాలి
[ 24-04-2024]
కొన్నేళ్లుగా వరంగల్ మామునూరు విమానాశ్రయం ఏర్పాటు ప్రక్రియ ముందుకు వెనక్కి అన్నట్టు సాగుతోంది. ఉమ్మడి వరంగల్ అభివృద్ధికి తోడ్పడే దీని పునరుద్ధరణ అంశం వరంగల్ లోక్సభ స్థానం నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థులకు ఎంతో కీలకం కానుంది. -
నాడు హనుమకొండ.. నేడు భువనగిరి!
[ 24-04-2024]
జనగామ శాసనసభ నియోజకవర్గం గతంలో హనుమకొండ లోక్సభ పరిధిలో ఉండేది. 2009 సంవత్సరంలో పార్లమెంట్ నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా జనగామ నియోజకవర్గాన్ని హనుమకొండ నుంచి వేరు చేసి కొత్తగా ఏర్పడిన భువనగిరి లోక్సభలో కలిపారు. -
వరంగల్ తొలి ఎంపీ సాదత్ అలీఖాన్
[ 24-04-2024]
1952లో జరిగిన తొలి సార్వత్రిక ఎన్నికల్లో వరంగల్ లోక్సభ స్థానం నుంచి హైదరాబాద్కు చెందిన సాదత్ అలీఖాన్ ఎన్నికయ్యారు. ఆయన భారత జాతీయ కాంగ్రెస్ (ఐఎన్సీ) అభ్యర్థిగా పోటీ చేశారు. -
అవును.. నిజమే కదా!
[ 24-04-2024]
జీవరాశికి ప్రాణవాయువు అవసరం. ఇది ఎంత వరకు నిజమో.. ప్రజాస్వామ్య వ్యవస్థ మనుగడకు ఓటూ అంతే. ఓటర్ల జాబితాలో పేరుండి... ఎన్నికల రోజు హక్కుని వినియోగించుకోకపోతే ఎలా? ఓటు వేయకపోతే ప్రజాస్వామ్య వ్యవస్థ నిర్వీర్యమవుతుంది. -
ఓటేయండి.. భవితకు బాటేయండి
[ 24-04-2024]
పోలింగ్ రోజు ప్రతి ఓటరు గడప దాటి ఓటు హక్కు వినియోగించుకోవాలని.. పిల్లల భవితకు బాటలు వేయాలని సామాజికవేత్త నిమ్మల శ్రీనివాస్ పేర్కొన్నారు. -
ఓట్లతోనే.. జాతీయ, ప్రాంతీయ గుర్తింపు..
[ 24-04-2024]
జాతీయ, ప్రాంతీయ పార్టీలంటూ చదువుతుంటాం. ఎన్నికల ప్రచారంలో సైతం జాతీయ పార్టీలు, ప్రాంతీయ పార్టీలంటూ నేతలు చెబుతుంటారు.. జాతీయ పార్టీలు దిల్లీ నుంచి పాలిస్తాయని.. -
గుర్తుంచుకుందాం..
[ 24-04-2024]
రాజకీయ పార్టీ అంటే ముందుగా గుర్తొచ్చేది పార్టీల గుర్తులు. వాటి ఆధారంగానే ఓటు వేస్తుంటాం. మన దేశంలో పార్టీల గుర్తుల కేటాయింపు ఎలా జరిగింది..? జాతీయ పార్టీల గుర్తుల్లో ఎలాంÇటి మార్పులు వచ్చాయో తెలుసుకుందాం.. -
అతిథులు తరలిరాగా.. బూర మోగించె!
[ 24-04-2024]
ఓట్ల కోసం అనాదిగా మత రాజకీయాలు చేస్తున్నది కాంగ్రెస్ పార్టీయేనని భాజపా ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కె.లక్ష్మణ్ విమర్శించారు. ప్రతి విషయాన్ని మతంతో ముడిపెడుతూ ఒక వర్గం మెప్పు కోసం పాకులాడే కాంగ్రెస్ పార్టీ భాజపా మత రాజకీయాలు చేస్తుందని ఆరోపించడం సరికాదన్నారు. -
హేమాచల క్షేత్రంలో పూజలు
[ 24-04-2024]
మండలంలోని మల్లూరు గుట్టపై శ్రీ హేమాచల లక్ష్మీనరసింహస్వామిని మంగళవారం ములుగు కలెక్టర్ ఇలా త్రిపాఠి దర్శించుకున్నారు. ఆలయ సంప్రదాయం ప్రకారం దేవస్థాన కార్యనిర్వహణాధికారి సత్యనారాయణ, అర్చకులు రాఘవాచార్యులు, రాజశేఖర్శర్మలు స్వాగతం పలికారు. -
వారధి.. నిర్లక్ష్యం తీరిది!
[ 24-04-2024]
రెండు జిల్లాల సరిహద్దులోని మానేరు వాగు దాటడానికి ఇరువైపులా గ్రామాల ప్రజలు దశాబ్దాల తరబడి నానా అవస్థలు పడుతున్నారు. ఎట్టకేలకు వంతెన నిర్మాణం పనులు ప్రారంభం కావడంతో కష్టాలు తీరతాయని భావించారు. -
ఏడుగురు అభ్యర్థులు.. 9 నామపత్రాలు
[ 24-04-2024]
వరంగల్ పార్లమెంట్ స్థానానికి మంగళవారం ఏడుగురు అభ్యర్థులు 9 నామపత్రాలను రిటర్నింగ్ అధికారి ప్రావీణ్యకు సమర్పించారు. -
రాత్రి వేళల్లో తరలిస్తున్నారు..!
[ 24-04-2024]
జిల్లాలో బెరైటీస్ అక్రమ రవాణా కొనసాగుతోంది. అడ్డుకట్ట వేసేందుకు అటవీశాఖ అధికారులు చేస్తున్న ప్రయత్నాలు పూర్తిగా సఫలమవడం లేదు. అధికారుల కళ్లుగప్పి విలువైన ఖనిజాన్ని రాత్రి వేళ సరిహద్దులు దాటిస్తున్నారు. -
సర్కారు బడిలో విజన్-2026
[ 24-04-2024]
డోర్నకల్లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయ బృందం రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా విజన్-2026 పేరిట ఓ ప్రత్యేక కార్యాచరణకు రూపకల్పన చేశారు. -
బకాయిలు రావు.. పనులు సాగవు..
[ 24-04-2024]
ప్రైవేటుకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దేందుకు గత ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ‘మన ఊరు మన బడి’ కార్యక్రమం అమలు చేస్తోంది. ఇందులో భాగంగా చేపట్టిన పాఠశాలల మరమ్మతులు, నూతన నిర్మాణాల పనులకు నిధుల కొరత ఏర్పడటంతో.. సుమారుగా ఏడాది కాలంగా పనులు నిలిచిపోయాయి. -
భారాస అభ్యర్థి నామపత్రం దాఖలు
[ 24-04-2024]
మహబూబాబాద్ లోక్సభ భారాస అభ్యర్థి మాలోత్ కవిత మంగళవారం ఆ పార్టీ నేతలతో కలిసి నామినేషన్ వేశారు. ముందుగా కురవి వీరభద్రస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. -
భార్యల సీట్ల కోసం భర్తల కొట్లాట
[ 24-04-2024]
ఆర్టీసీ బస్సులో భార్యల సీట్ల కోసం భర్తలు చెప్పులతో కొట్టుకున్న ఘటన మంగళవారం సాయంత్రం మహబూబాబాద్ జిల్లా తొర్రూరు ఆర్టీసీ బస్టాండ్లో నెలకొంది.
తాజా వార్తలు (Latest News)
-
తెలంగాణ ఇంటర్ ఫలితాలు వచ్చేశాయ్.. రిజల్ట్స్ కోసం క్లిక్ చేయండి
-
‘సంపద స్వాధీనం’పై శామ్ పిట్రోడా వ్యాఖ్యలు.. మరోసారి వివాదంలో కాంగ్రెస్
-
మనసుకీ వ్యాయామం ముఖ్యమే.. వేదాంత అధిపతి హెల్త్ టిప్స్
-
14 ఓవర్ల వరకూ మాదే పైచేయి.. ఆ ఒక్క కారణంతోనే మా ఓటమి: రుతురాజ్
-
సుప్రీం సీరియస్.. మరోసారి పతంజలి బహిరంగ క్షమాపణలు
-
వేడుకగా ‘ఆదికేశవ’ నటి వివాహం.. ఫొటో వైరల్