మార్కెటింగ్ శాఖలో ఇ సర్వీసెస్
సులభతర సేవలు, పారదర్శక లావాదేవీలే లక్ష్యంగా రాష్ట్ర మార్కెటింగ్శాఖ ఆన్లైన్ సేవల కోసం ఇ-సర్వీసెస్ పేరిట కొత్త కార్యక్రమాన్ని చేపట్టింది.
కొత్త యాప్ రూపకల్పన దిశగా అడుగులు
జనగామ మార్కెట్ కార్యాలయంలో లైసెన్స్డ్ వ్యాపారుల వివరాల కంప్యూటరీకరణ ప్రక్రియను పరిశీలిస్తున్న రాష్ట్ర అదనపు సంచాలకుడు రవికుమార్ తదితరులు
జనగామ, న్యూస్టుడే: సులభతర సేవలు, పారదర్శక లావాదేవీలే లక్ష్యంగా రాష్ట్ర మార్కెటింగ్శాఖ ఆన్లైన్ సేవల కోసం ఇ-సర్వీసెస్ పేరిట కొత్త కార్యక్రమాన్ని చేపట్టింది. ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా వ్యవసాయ మార్కెట్ల పరిధిలో లైసెన్సు కలిగిన ఖరీదుదారులు, అడ్తీదారుల ప్రాథమిక సమాచారం (బేసిక్ ఇన్ఫర్మేషన్) సేకరించి కంప్యూటరీకరిస్తున్నారు. మొదటి దశలో సమాచార సేకరణ, రెండో దశలో ప్రత్యేక వెబ్సైట్, యాప్ ద్వారా సేవల విస్తరణ జరగనుంది. ఉమ్మడి జిల్లాలోని 17 వ్యవసాయ మార్కెట్ల పరిధిలో సమాచార సేకరణ, చేరవేత కార్యక్రమం జరుగుతోంది. వివరాలు ఇలా ఉన్నాయి.
వివరాల నమోదు
గత రెండు నెలలుగా ఆయా జిల్లాల వ్యవసాయ విపణులకు చెందిన ఖరీదుదారులకు సంబంధించి 12 రకాల వివరాలను, భాగస్వామ్య వ్యాపార సంస్థలకు చెందిన వారి 14 వివరాలను అప్లోడ్ చేస్తున్నారు. ఇందులో లైసెన్సు, బ్యాంకు పూచీకత్తు, సంస్థలు, వ్యాపార లావాదేవీల వివరాలు, ఆధార్, పాన్కార్డు, ఒప్పంద పత్రాలను కంప్యూటరీకరిస్తున్నారు. ఈ ప్రక్రియ రాష్ట్ర సహాయక సంచాలకుల హోదా కలిగిన అధికారుల పర్యవేక్షణలో జరుగుతోంది. ఉమ్మడి జిల్లా పరిధిలో సాంకేతిక ప్రక్రియను పూర్తి చేసేందుకు టీవోటీగా(ట్రైనర్ ఆఫ్ ట్రైనర్స్)గా హనుమకొండ జిల్లా మార్కెటింగ్ అధికారి సురేఖను నియమించారు. ఈ నెలాఖరులోగా ప్రక్రియను పూర్తి చేసి, కొత్త సంవత్సరంలో ప్రయోగాత్మకంగా ఆన్లైన్ సేవలను ప్రారంభించనున్నారు.
ఏ సేవలు..ఎందుకంటే?
ఇ సర్వీసెస్ పేరిట చేపట్టిన ఈ కార్యక్రమం కారణంగా ఇనామ్ పథకం అమలు మరింత సులభతరంగా, ప్రయోజనకరంగా ఉంటుంది. ఖరీదుదారుల వివరాలన్నీ అధికారిక వెబ్సైట్లో ఉంటాయి. రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడైనా ఖరీదులో పాల్గొనవచ్చు. ఇప్పటి వరకు కొనుగోలు తదితర వ్యాపార వివరాలను మార్కెట్ కార్యాలయాలకు వెళ్లి స్వయంగా సమర్పించాల్సి వస్తోంది. సరకుల ఎగుమతుల రవాణాకు అనుమతులను నేరుగా తీసుకోవాల్సి వస్తోంది. ఇ సర్వీసెస్ విధానం అమలులోకి వస్తే.. మిల్లుల కొనుగోళ్లు, ఇతర వ్యాపార లావాదేవీల రిటర్న్లను నేరుగా చరవాణుల ద్వారా సమర్పించవచ్చు. కొనుగోలు వివరాలను సంబంధిత మార్కెట్కు పంపించగానే, ఎగుమతి అనుమతిని నేరుగా తీసుకోవచ్చు. ఆన్లైన్ అనుమతి మీద క్యూఆర్కోడ్ను స్కాన్ చేస్తే సదరు లావాదేవీకి సంబంధించిన పూర్తి వివరాలు తెలుస్తాయి. దీంతో అధికారులు, లైసెన్సుదారుల మధ్య పేచీ ఉండదు. అధికారిక వెబ్సైట్లో ఉన్న వ్యాపారస్తులు ఎవరైనా ఆర్థిక ఇబ్బందులు, ఇతర కారణాలతో రైతుల సరకు సొమ్ము చెల్లించని పక్షంలో ఆ వివరాలు ఉన్నతాధికారులకు చేరుతాయి. లైసెన్సు పునరుద్ధరణకు ఆన్లైన్లోనే దరఖాస్తు చేసుకునే వెసులుబాటు కలుగుతుంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 17 విపణుల పరిధిలో 813 మంది ఖరీదు, 802 మంది అడ్తీలైసెన్సు కమిషన్దారులు, 17 మంది వ్యవసాయ నిపుణులు ఉన్నారు.
రైతులకు సులభతర సేవలు
- రవికుమార్, మార్కెటింగ్ శాఖ అదనపు సంచాలకుడు
వ్యవసాయ మార్కెట్ల నిర్వహణ, రైతులకు సులభతర సేవలు అందించేందుకు ఇ సర్వీసెస్ ఉపయోగపడుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా లైసెన్సుదారుల వివరాల సేకరణ, అప్లోడింగ్ ప్రక్రియ వేగంగా జరుగుతోంది. అమ్మకందారులు, కొనుగోలుదారుల మధ్య వారధిగా ఈ ప్రక్రియ ఉపకరిస్తుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రయాణం చవక..పార్కింగ్ భారం
[ 28-03-2024]
వరంగల్ రైల్వేస్టేషన్ నుంచి ప్రతిరోజు వేల సంఖ్యలో ప్రయాణికులు రాకపోకలు సాగిస్తుంటారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చేవారిని తీసుకెళ్లడానికి, కుటుంబ సభ్యులు, బంధువులకు వీడ్కోలు పలికేందుకు మరికొంత మంది వస్తుంటారు. -
ఆటుపోట్లు దాటి.. విజేతగా నిలిచి
[ 28-03-2024]
ఆయన పుట్టుకతోనే దివ్యాంగుడు.. రెండు కాళ్లూ పనిచేయవు. చిన్నతనం నుంచే బతుకుపోరాటం సాగించారు. ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నారు. క్రికెట్పై ఉన్న మక్కువతో ఆ దిశగా సన్నద్ధమయ్యారు. -
అమ్మకానికి పారిశుద్ధ్య పోస్టులు
[ 28-03-2024]
బల్దియా ప్రజారోగ్య విభాగంలో ఉద్యోగులే పైరవీకారులుగా మారుతున్నారు. పారిశుద్ధ్య కార్మికుల పోస్టులను కొనడం.. అమ్మడం వెనుక కీలకపాత్ర పోషిస్తున్నారు. ఒక్కో పోస్టును రూ.3-4 లక్షల చొప్పున అమ్మేస్తున్నారు. -
వెలుగల ప్రస్థానంలో చీకట్లు!
[ 28-03-2024]
రాష్ట్రంలో హైదరాబాద్ తర్వాత అతిపెద్ద నగరం వరంగల్. అలాంటిది ఉమ్మడి వరంగల్లో సింగరేణి తప్ప పెద్దగా పరిశ్రమలు లేకపోవడంతో ఇక్కడి యువతకు ఉపాధి, ఉద్యోగావకాశాలు అంతంతమాత్రమే లభిస్తున్నాయి. -
విదేశీ పక్షులు.. విశిష్ఠ అతిథులు
[ 28-03-2024]
ఆహ్లాదకర వాతావరణాన్ని మనుషులే కాదు.. పక్షులూ ఆస్వాదిస్తాయనడానికి ఇది నిదర్శనం. వేసవిలో అనుకూల వాతావరణం కోసం వేల మైళ్లు ప్రయాణించి.. మన జిల్లాకు వచ్చాయి పలురకాల పక్షులు. -
అమాయకులకు సైబర్ ఉచ్చు..
[ 28-03-2024]
ఉమ్మడి జిల్లాలో సైబర్ నేరాల సంఖ్య పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. సులువుగా డబ్బు సంపాదించాలనే ఆలోచన ఉన్నవారు వారి బారిన పడుతున్నారు. -
స్తంభాన్ని సరిచేశారు..
[ 28-03-2024]
ఐనవోలు మండలం కొండపర్తి గ్రామ శివారులోని వరి చేనులో ఒరిగి ప్రమాదకరంగా ఉన్న విద్యుత్తు స్తంభాన్ని అధికారులు సరిచేశారు. -
అక్రమ రిజిస్ట్రేషన్ల రద్దుకు చర్యలు
[ 28-03-2024]
తప్పుడు సర్వే నంబర్లతో దేవాలయాల భూములను కొందరు ప్రైవేటు వ్యక్తులు రిజిస్ట్రేషన్లు చేసుకున్నారని, వాటిని పరిశీలించి రద్దు చేయాలని వరంగల్, హనుమకొండ జిల్లాల సబ్ రిజిస్టర్లకు వరంగల్ ఉమ్మడి జిల్లా దేవాదాయ శాఖ సహాయ కమిషనర్ రామల సునీత లేఖ రాశారు. -
సారు.. ఏ ఊరినీ వదల్లేదు..!
[ 28-03-2024]
గ్రామాలు దేశానికి పట్టుకొమ్మలు. వాటిని బాగు చేయాల్సిన ఓ అధికారి అవినీతి సర్పంచులు, అధికారుల అడుగులకు మడుగులొత్తుతూ రూ.కోట్లు వెనకేసుకున్నారు. ఊళ్లలో జరిగిన అనేక కుంభకోణాలు, ఆర్థిక అవకతవకలపై ఫిర్యాదులొచ్చినా చూసీచూడనట్టు ఉన్నారు. -
ధాన్యలక్ష్మికి చేయూత
[ 28-03-2024]
అవకాశాలు కల్పిస్తే మంచి ఫలితాలు చూపిస్తామని గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలోని ఇందిరా క్రాంతి పథకం పొదుపు సంఘాల మహిళలు నిరూపిస్తున్నారు. మద్దతు ధరతో ధాన్యం కొనుగోళ్ల పథకం గ్రామీణ మహిళల ఆర్థికాభివృద్ధికి దోహదపడుతోంది. -
భువనగిరి బరిలో చామల
[ 28-03-2024]
ఎడతెగని ఉత్కంఠ నడుమ అధికార కాంగ్రెస్ పార్టీ తమ భువనగిరి లోక్సభ ఎంపీ అభ్యర్థిగా చామల కిరణ్కుమార్రెడ్డిని ప్రకటించింది. ఆయన ఎంపీగా పోటీ చేయడం ఇదే తొలిసారి. -
ముగిసిన బ్రహ్మోత్సవాలు
[ 28-03-2024]
మండలంలోని కొడవటంచలో సుప్రసిద్ధ శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో బుధవారం రాత్రి నాకబలి (పుష్పయాగం) కార్యక్రమం నేత్రపర్వంగా సాగింది. -
మొక్కల సంరక్షణ తప్పనిసరి
[ 28-03-2024]
భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలోని అటవీ శాఖ సర్కిల్ సీసీఎఫ్ ప్రభాకర్ బుధవారం జిల్లా అటవీ అధికారి రాహుల్ కిషన్ జాదవ్తో కలిసి ఏటూరునాగారం కార్యాలయంలోని నర్సరీలను ఆకస్మిక తనిఖీ చేశారు. -
క్షయ వ్యాధి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్
[ 28-03-2024]
క్షయ వ్యాధి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ద్వారా వస్తుందని డీఎంహెచ్వో డాక్టర్ ఎ.అప్పయ్య అన్నారు. బుధవారం ములుగులో ప్రపంచ క్షయ వ్యాధి దినోత్సవాన్ని పురస్కరించుకొని నిర్వహించిన ర్యాలీని ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. -
విధుల్లో అప్రమత్తత అవసరం
[ 28-03-2024]
న్నికల నేపథ్యంలో సరిహద్దుల వద్ద ఏర్పాటు చేసిన పోలీస్ చెక్పోస్టుల్లో సిబ్బంది అప్రమత్తంగా విధులు నిర్వర్తించాలని వరంగల్ సీపీ అంబర్ కిషోర్ఝా సూచించారు.
తాజా వార్తలు (Latest News)
-
ఇతరులను బెదిరించడం కాంగ్రెస్ సంస్కృతి.. ‘లాయర్ల లేఖ’పై ప్రధాని మోదీ
-
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్సభ ఎన్నికల్లో పోటీ!
-
భుజంగరావు, తిరుపతన్నకు 5 రోజుల పోలీసు కస్టడీ
-
నా భర్తను వేధిస్తున్నారు..: సీఎం కేజ్రీవాల్ సతీమణి ఆరోపణలు
-
తెలంగాణ జెన్కో ఏఈ, కెమిస్ట్ ఉద్యోగ పరీక్ష వాయిదా
-
మస్క్ కీలక ప్రకటన.. వారికి ప్రీమియం సబ్స్క్రిప్షన్ ఫ్రీ!