ధరణి సమస్యలు పరిష్కారం దిశగా..
ధరణిలో సాంకేతిక సమస్యలతో ఏర్పడిన లోపాలను సవరించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ ప్రక్రియలో రెవెన్యూ అధికారులు నిమగ్నమయ్యారు.
కలెక్టరేట్లో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులు
హనుమకొండ కలెక్టరేట్, న్యూస్టుడే : ధరణిలో సాంకేతిక సమస్యలతో ఏర్పడిన లోపాలను సవరించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ ప్రక్రియలో రెవెన్యూ అధికారులు నిమగ్నమయ్యారు. కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లాలోని తహసీల్దార్లు, రెవెన్యూ అధికారులు హనుమకొండలోని కలెక్టరేట్లోనే మకాం వేశారు. పది రోజులుగా ధరణి సమస్యల పరిష్కారానికి తగిన చర్యలు తీసుకుంటున్నారు. నిషేధిత జాబితాలో చేరినా, ఎవైనా పొరపాట్లు దొర్లినా, ఇతర సమస్యలపై వచ్చిన దరఖాస్తులను పరిశీలిస్తున్నారు.
అవగాహన కలిగిలా చర్యలు: పాసు పుస్తకాల్లోని తప్పులు సవరించడం, పెండింగ్లో ఉన్న పట్టా మార్పిడిలు, న్యాయస్థానాల ఉత్తర్వుల ద్వారా పాసు పుస్తకాలు పొందడం, నిషేధిత జాబితా నుంచి తొలగించడం వంటి వాటిని సవరించేలా ఆరు మాడ్యూల్స్ ఉన్నాయి. అయితే ఏ సమస్య పరిష్కరానికి ఏ మాడ్యూల్లో దరఖాస్తు చేసుకోవాలి అనే విషయాలపై అధికారులు తహసీల్దార్ కార్యాలయాలు, మీసేవ కేంద్రాల వద్ద అవగాహన కల్పించే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇటీవల టీఎం-33 మాడ్యూల్ను తీసుకువచ్చారు. దీంతో పట్టాదారు పాసుపుస్తకంలో వచ్చిన తప్పులను సవరించే అవకాశం ఉంది. పట్టాదారు పేరు మార్చడం, సర్వే నంబరు చేర్చడం, ప్రభుత్వ ఖాతా నుంచి వ్యక్తిగత ఖాతాకు మార్చడం, భూ విస్తీర్ణ సవరణ లాంటి వాటి కోసం టీఎం-33 మాడ్యూల్లో దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. గత 10 రోజులుగా మండల స్థాయి అధికారులు పాలనాప్రాంగణంలో ఉంటూ విధులు నిర్వహిస్తున్నారు. ఉదయం పూట రెవెన్యూ ఇన్స్పెక్టర్లు క్షేత్రస్థాయిలో పరిశీలించి సాయంత్రం రికార్డుల్లో నమోదు చేస్తున్నారు. రాత్రి 9 గంటల వరకు అధికారులు కలెక్టరేట్లో విధులు నిర్వహిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జజ్జనకర.. జనజాతర
[ 25-04-2024]
కాజీపేట మండలం మడికొండలో ఏర్పాటు చేసిన ఓరుగల్లు జనజాతర బహిరంగ సభ విజయవంతమైంది. వరంగల్ లోక్సభ పరిధిలోని ఏడు సెగ్మెంట్ల నుంచి భారీగా జనసమీకరణ చేయడంతో సభా ప్రాంగణం కిక్కిరిసిపోయింది. -
ప్రథమంలో 24 ద్వితీయంలో 26
[ 25-04-2024]
ఇంటర్మీడియట్ వార్షిక ఫలితాల్లో వరంగల్ జిల్లా వెనుకబడింది. ప్రథమ సంవత్సరం ఫలితాల్లో రాష్ట్రంలో 24వ స్థానం, ద్వితీయ సంవత్సరంలో 26వ స్థానంలో నిలిచింది. -
హస్తం జోరు..
[ 25-04-2024]
హనుమకొండ జిల్లా పరిధిలోని కాజీపేట మండలం మడికొండలో నిర్వహించిన ఓరుగల్లు జనజాతర బహిరంగ సభ విజయవంతం కావడం కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం నింపింది. -
ఇంటర్ ఫలితాల్లో ములుగు వెలుగు
[ 25-04-2024]
రాష్ట్ర ప్రభుత్వం బుధవారం విడుదల చేసిన ఇంటర్మీడియట్ ఫలితాల్లో ములుగు జిల్లా అగ్రస్థానంలో నిలిచింది. రాష్ట్రంలోని అన్ని జిల్లాలను వెనకకు నెట్టి ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో మొదటి స్థానంలో నిలిచింది. -
ఇంటర్ ఫలితాల్లో బాలికలదే హవా
[ 25-04-2024]
ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాల్లో ప్రథమ, ద్వితీయ సంవత్సర ఉత్తీర్ణతలో బాలికలదే పైచేయిగా నిలిచింది. బుధవారం ప్రకటించిన ఫలితాల్లో జిల్లాలో ప్రథమ సంవత్సరం 55.72 శాతంతో రాష్ట్రంలో 17వ స్థానం పొందింది. -
బాలికలదే పైచేయి
[ 25-04-2024]
ఇంటర్ బోర్డు అధికారులు బుధవారం విడుదల చేసిన ఇంటర్ ఫలితాల్లో జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో బాలికలే పై చేయి సాధించారు. -
ఇంటర్ ఫలితాల్లో బాలికలదే పైచేయి
[ 25-04-2024]
ఇంటర్ పరీక్ష ఫలితాలు బుధవారం వెలువడిన నేపథ్యంలో జిల్లాలో ఉత్తీర్ణత శాతం గత విద్యా సంవత్సరంతో పోలిస్తే ఈ ఏడాది వెనక్కి వెళ్లింది. -
21 నామపత్రాల దాఖలు
[ 25-04-2024]
వరంగల్ లోక్సభ స్థానానికి బుధవారం 19 మంది అభ్యర్థులు 21 నామపత్రాలను రిటర్నింగ్ అధికారి ప్రావీణ్యకు సమర్పించారు. భారాస పార్టీ అభ్యర్థి మారపల్లి సుధీర్కుమార్ తరఫున భారాస నాయకులు, -
ఆదర్శం.. గంగారం కస్తూర్బా విద్యాలయం
[ 25-04-2024]
మారుమూల ఏజెన్సీలోని కస్తూర్బా గాంధీ బాలికల గురుకుల విద్యాలయం(కేజీబీవీ) విద్యార్థినులు ఇంటర్ ఫలితాల్లో వందశాతం ఫలితాలు సాధించి సత్తా చాటారు.
తాజా వార్తలు (Latest News)
-
జూదరులతో కలిసి పుట్టిన రోజు వేడుకలు.. మంగళ్హాట్ డీఐ సస్పెన్షన్ ?
-
ఒకే ద్విచక్రవాహనంపై ప్రయాణం.. బస్సు ఢీకొని నలుగురు ఇంటర్ విద్యార్థుల మృతి
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)