హనుమకొండకు ప్రగతిహారం మణిహారం!
పల్లెలకు మహర్దశ పట్టనుంది. ఇన్నాళ్లు పట్టణాలకు పరిమితమైన జాతీయ రహదారులు ఇప్పుడు పల్లెలకు మణిహారంగా మారనున్నాయి. గతుకుల రహదారిపై అష్టకష్టాలు పడ్డ ప్రజల బాధలు తీరనున్నాయి. ఈ క్రమంలో రెండు జాతీయ రహదారులు ముద్దాడనుండడంతో ఎల్కతుర్తికి మహర్దశ పట్టనుంది.
ఎల్కతుర్తి-సిద్దిపేట జాతీయ రహదారి నిర్మాణానికి శ్రీకారం
-న్యూస్టుడే, భీమదేవరపల్లి(హనుమకొండ జిల్లా)
ములుకనూర్ అంబేడ్కర్ కూడలి
పల్లెలకు మహర్దశ పట్టనుంది. ఇన్నాళ్లు పట్టణాలకు పరిమితమైన జాతీయ రహదారులు ఇప్పుడు పల్లెలకు మణిహారంగా మారనున్నాయి. గతుకుల రహదారిపై అష్టకష్టాలు పడ్డ ప్రజల బాధలు తీరనున్నాయి. ఈ క్రమంలో రెండు జాతీయ రహదారులు ముద్దాడనుండడంతో ఎల్కతుర్తికి మహర్దశ పట్టనుంది.
ఎల్కతుర్తి-సిద్దిపేట జాతీయ రహదారి నిర్మాణంతో ఈ ప్రాంత రూపురేఖలు మారనున్నాయి. ఎల్కతుర్తి--మెదక్ జాతీయ రహదారి 133.61 కిలోమీటర్లకు కేంద్రప్రభుత్వం రూ.1,458 కోట్లు కేటాయించింది.
* ఈ రహదారిని రెండు ప్యాకేజీలుగా విభజించారు. ప్యాకేజీ2లో సిద్దిపేట పట్టణ పరిధిలోని రంగధాంపల్లి వంతెన నుంచి ఎల్కతుర్తి వరకు నిర్మించే ఈ మార్గానికి టెండర్ వేయగా ఔరంగాబాద్కు చెందిన ఏజీ కన్స్ట్రక్షన్ పనులు దక్కించుకుంది.
పరిశ్రమలకు అనుకూలం...
జాతీయ రహదారి ఏర్పాటుతో పరిశ్రమల ఏర్పాటుకు అనుకూలంగా మారనుంది. జాతీయ రహదారి పక్కనే పరిశ్రమలు ఏర్పాటుతో రవాణా సౌకర్యం సులభతరం కానుంది. ఎల్కతుర్తి మండలం గోపాల్పూర్లో గ్రానైట్ పరిశ్రమలు 50కిపైగా ఏర్పడ్డాయి. గ్రానైట్ రాయిని ఇతర ప్రాంతాలకు ఎగుమతి చేసేందుకు వీలుగా జాతీయ రహదారులతోపాటు హసన్పర్తి మండలం ఎల్లాపూర్లో రైలు సౌకర్యం ఉంది. రవాణా సౌకర్యం పెరగనుండడంతో మరిన్ని పరిశ్రమలు నెలకొల్పే అవకాశం ఉందని పలువురు వ్యాపారులు అభిప్రాయపడుతున్నారు.
మారనున్న రూపురేఖలు..
ఎల్కతుర్తి, భీమదేవరపల్లి మండలాలు విలీనం తర్వాత ఈ ప్రాంతంలో భూముల ధరలు ఆకాశాన్నంటాయి. ఎల్కతుర్తి-సిద్దిపేట ప్రధాన రహదారిలో ఎకరాకు రూ.కోటి ధర పలుకుతోంది. గతంలో ఎకరాకు రూ.10-15 లక్షల ధర ఉన్న భూములు ఇప్పుడు రూ.30-50 లక్షలు పలుకుతోంది. భీమదేవరపల్లి మండలం వంగర శివారులో ఆహార పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వం 150 ఎకరాలకుపైగా భూమి సేకరించి రైతులకు పరిహారం కింద ఎకరాకు రూ.18.80 లక్షలు చెల్లించింది.
* ఎల్కతుర్తి మండలంలో జాతీయ రహదారి ప్రారంభమై ఇందిరానగర్, భీమదేవరపల్లి మండలంలోని కొత్తపల్లి, ములుకనూర్, మంగళపల్లి, రాంనగర్ వరకు 18 కిలోమీటర్ల మేర విస్తరించనున్నారు.
వంద ఫీట్ల వెడల్పుతో..
విస్తరణలో మేజర్ జంక్షన్గా ఎల్కతుర్తి మారనుంది. మూడు కిలోమీటర్లు నాలుగు వరుసల రహదారి, 15 కిలోమీటర్లు పది మీటర్ల రహదారిగా తీర్చిదిద్దనున్నారు. ఇందులో 25 కల్వర్టులు, ఎనిమిది మైనర్ జంక్షన్లు, ఒకటి మేజËర్ జంక్షన్ ఏర్పాటు కానున్నాయి. ఆయా గ్రామాల్లో వంద ఫీట్ల వెడల్పుతో జాతీయ రహదారి నిర్మిస్తున్నందున ములుకనూర్, ఇందిరానగర్లో కొన్ని ఇళ్లు తొలగించాల్సి వస్తోందని అధికారులు తెలిపారు. భూములు, ఇళ్లు కోల్పోతున్న వారికి పరిహారం చెల్లించనున్నారు.
హనుమకొండ-కరీంనగర్ను కలిపే 563తో పాటు ఎల్కతుర్తి-సిద్దిపేట మధ్య 765 జాతీయ రహదారులకు ఇది ప్రధాన కూడలిగా మారనుంది.
మార్కెట్ ధరకు అనుగుణంగా పరిహారం ఇవ్వాలి
- చిదురాల శ్రీనివాస్, వ్యాపారి, ములుకనూర్
ఎల్కతుర్తి-సిద్దిపేట ప్రధాన రహదారిలో ములుకనూర్ కూడలిలో మూడు పోర్షన్ల ఇల్లు ఉంది. జాతీయ రహదారి విస్తరణలో ముందు గది సగం వరకు అధికారులు మార్క్ ఏర్పాటు చేశారు. ఓ గది వరకు కోల్పోవాల్సి వస్తోంది. ఇళ్లు కోల్పోయిన బాధితులకు మార్కెట్ ధరకు అనుగుణంగా ప్రభుత్వం పరిహారం ఇచ్చి ఆదుకోవాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కాంగ్రెస్ కంచుకోట.. మానుకోట!
[ 20-04-2024]
మహబూబాబాద్ జిల్లాకేంద్రంలో శుక్రవారం నిర్వహించిన కాంగ్రెస్ జన జాతర సభ విజయవంతమైంది. ఈ లోక్సభ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి అధిక సంఖ్యలో తరలొచ్చిన పార్టీ శ్రేణులు, అభిమానులతో సభా ప్రాంగణం హోరెత్తింది. -
కబ్జా కోరల్లో ఇనుపరాతి గుట్ట అటవీ భూములు!
[ 20-04-2024]
భూపాలపల్లి జిల్లా కేంద్రం సమీపంలోని కొంపెల్లి గ్రామ పరిధిలో 106.34 ఎకరాల భూమి ప్రైవేటు వ్యక్తులది కాదని.. అది అటవీ భూమేనని సుప్రీంకోర్టు ఇచ్చిన తాజా తీర్పు పర్యావరణానికి ఎంతో మేలు చేయనుంది. -
ఛత్రం పడితేనే.. చకచకా నడిచేది..!
[ 20-04-2024]
గత లోక్సభ ఎన్నికలు 2019 ఏప్రిల్ 11న జరిగాయి. ఈసారి మే 13న నిర్వహించనున్నారు. ఇప్పుడే ఎండలు దంచి కొడుతున్నాయి. ఆ సమయంలో మరింత తీవ్రంగా ఉండే ప్రమాదం ఉంది.. -
బలరాంనాయక్ నామపత్రం దాఖలు
[ 20-04-2024]
మహబూబాబాద్ (ఎస్టీ) లోక్సభ స్థానానికి కాంగ్రెస్ అభ్యర్థి, కేంద్ర మాజీ సహాయమంత్రి పోరిక బలరాంనాయక్ శుక్రవారం రెండు సెట్ల నామినేషన్ దాఖలు చేశారు. -
మావోయిస్టు దంపతులకు తుది వీడ్కోలు
[ 20-04-2024]
ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్లో మృతిచెందిన మావోయిస్టు దంపతులు జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం చల్లగరిగె గ్రామానికి చెందిన సిరిపెల్లి సుధాకర్ అలియాస్ శంకర్ అలియాస్ మురళీ, ఆదిలాబాద్ జిల్లా బజార్హత్నూర్కు చెందిన సుమన అలియాస్ రంజిత అంత్యక్రియలు శుక్రవారం స్వగ్రామంలో ముగిశాయి. -
ఓటు వేసి ప్రజాస్వామ్యాన్ని గెలిపించాలి
[ 20-04-2024]
వచ్చేనెల 13న జరగబోయే లోక్సభ ఎన్నికల పోలింగ్ రోజు అందరూ ఓటేసి ప్రజాస్వామ్యాన్ని గెలిపించాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ పిలుపునిచ్చారు. -
సీఎం హెలిప్యాడ్కు మూడు స్థలాల పరిశీలన
[ 20-04-2024]
కాజీపేట మండలం మడికొండ సెయింట్ పాల్స్ మైదానంలో ఈ నెల 24న నిర్వహించనున్న కాంగ్రెస్ పార్టీ బహిరంగ సభకు ఏర్పాట్లు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. -
వరంగల్లో భారాస విజయం ఖాయం
[ 20-04-2024]
వరంగల్ లోక్సభ నియోజకవర్గంలో భారాస విజయం ఖాయమైందని మాజీ మంత్రి దయాకర్రావు అన్నారు. -
మరాడించలే.. లెక్కచూపలే
[ 20-04-2024]
జిల్లాలో సీఎంఆర్(కస్టమ్ మిల్లింగ్ రైస్) ప్రక్రియ నత్తనడకన సాగుతోంది.. రైతులు పండించిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి సేకరిస్తోంది. -
ఎన్నిక ఏదైనా సత్తా చాటారు..!
[ 20-04-2024]
రాజకీయ నేతలు తమ జీవిత కాలంలో ఒక్కసారైనా ఏదో ఒక చట్టసభలో అడుగుపెట్టాలని ఆశిస్తుంటారు.. ఒకరికే ఎమ్మెల్యేగా, ఎంపీగా పోటీ చేసే అవకాశం వచ్చి విజయం సాధిస్తే వారి ఆనందానికి అవధులు ఉండవు. -
అట్టహాసంగా ప్రారంభం.. పరిశోధనలు శూన్యం
[ 20-04-2024]
కాకతీయ విశ్వవిద్యాలయంలో పరిశోధనల నిమిత్తం రూ.50 కోట్లతో కె-హబ్, పీవీ నర్సింహారావు విజ్ఞాన కేంద్రం నిర్మించారు. -
ఓటాస్త్రం.. స్వీయచిత్రమే సాక్ష్యం
[ 20-04-2024]
ఓరుగల్లు నగరంలో ఓటింగ్ శాతం పెంచేందుకు వరంగల్ కలెక్టరేట్ ఆవరణలో సెల్ఫీ పాయింట్ ఏర్పాటు చేశారు. -
రెండోరోజు మూడు నామపత్రాలు
[ 20-04-2024]
వరంగల్ లోక్సభ స్థానానికి రెండోరోజు శుక్రవారం ముగ్గురు అభ్యర్థులు, నాలుగుసెట్ల నామపత్రాలు దాఖలు చేశారని వరంగల్ పార్లమెంట్ రిటర్నింగ్ అధికారి, వరంగల్ జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
ఆ సినిమా నుంచి గుణపాఠం నేర్చుకున్నా: సోనాలి బింద్రే
-
దిల్లీ కోటలో తొలి మ్యాచ్.. హైదరాబాద్ దూకుడును మళ్లీ చూస్తామా?
-
కేంద్ర ఎన్నికల సంఘానికి కనకమేడల మరో లేఖ
-
సైబర్ టవర్స్ వద్ద చంద్రబాబు జన్మదిన వేడుకలు
-
ఆ ప్రాజెక్ట్ వదులుకున్నా.. దీపిక నాకు థ్యాంక్స్ చెప్పాలి: కరీనాకపూర్
-
ధోనీ ఆటే స్ఫూర్తి.. లేటుగా బ్యాటింగ్కు రావడానికి కారణముంది: ఫ్లెమింగ్