ప్రజలకు భరోసా కలిగేలా సేవలు
సామాన్య ప్రజలకు పోలీసులు అందుబాటులో ఉంచడమే ప్రధాన లక్ష్యమని వరంగల్ పోలీసు కమిషనర్ ఏవీ రంగనాథ్ అన్నారు. ఆయన శనివారం సీపీ తరుణ్జోషి నుంచి బాధ్యతలు తీసుకున్నారు.
సీపీ రంగనాథ్
వరంగల్క్రైం, న్యూస్టుడే: సామాన్య ప్రజలకు పోలీసులు అందుబాటులో ఉంచడమే ప్రధాన లక్ష్యమని వరంగల్ పోలీసు కమిషనర్ ఏవీ రంగనాథ్ అన్నారు. ఆయన శనివారం సీపీ తరుణ్జోషి నుంచి బాధ్యతలు తీసుకున్నారు. కమిషనరేట్ సాయుధ పోలీసులు గౌరవ వందనం సమర్పించారు. తరుణ్జోషి, ఇతర పోలీసు అధికారులు పుష్పగుచ్ఛాలు ఇచ్చి స్వాగతం పలికారు. అనంతరం మీడియా సమావేశంలో రంగనాథ్ మాట్లాడుతూ చట్టబద్ధంగా ప్రజలకు సేవలందిస్తామని చెప్పారు. సామాన్య ప్రజలకు భరోసా కలిగించే విధంగా పోలీసింగ్ ఉంటుందన్నారు. నగరంలో ట్రాఫిక్ రద్దీ నియంత్రణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని చెప్పారు.
ఇంకా ఏం చెప్పారంటే..
* వరంగల్ నగరంలో భూఆక్రమణలపై ఉక్కు పాదం మోపుతాం. పోలీసులు భూవివాదాల్లో జోక్యం చేసుకోవద్దు. ఎస్వోపీ పాటిస్తూ కేసులను పరిష్కరించాలి.
* సమాజంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగేస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. ప్రస్తుతం ఎన్నికల వాతావరణ దగ్గర పడతుంది.. ఎదుటి వ్యక్తులపై వ్యక్తిగత విమర్శలు చేస్తూ వారిని ఇబ్బంది పెడితే చట్ట పరంగా చర్యలు తీసుకుంటాం.
* రాజకీయ పార్టీల మధ్యలో పోటీ సహజం. దీన్ని ఆసరాగా చేసుకొని సామాజిక మాధ్యమాల్లో ఎవరైనా వ్యక్తిగతంగా లేదా కులమతాలను రెచ్చగొట్టే విధంగా పోస్టింగ్లు పెట్టడం, లేదా మాట్లాడడం లాంటివి చేస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం.
ఎస్ఎంఎస్ చేసినా స్పందిస్తాను
* ప్రజలు వారి సమస్యలను చెప్పుకొనేందుకు నేరుగా వచ్చి నన్ను కలవొచ్చు. లేదా చరవాణి ద్వారా సంక్షిప్త సమాచారం పంపినా జవాబు ఇస్తాను. ప్రజలకు కమిషనరేట్ ద్వారాలు తెరిచి ఉంటాయి.
* కమిషనరేట్లో వివిధ ఠాణాల్లో పనిచేసే అధికారుల పనితీరును ప్రజలు ఇచ్చే సమాచారంతోనే బేరీజు వేస్తాం. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా పోలీసు అధికారులు పనిచేయాలి.
* విలేకరుల సమావేశంలో డీసీపీలు అశోక్కుమార్, వెంకటలక్ష్మి, సీతారాం, అదనపు డీసీపీ కె. పుష్పరెడ్డి, వైభవ్ గైక్వాడ్, ఏసీపీలు, ఆర్ఐలు, ఎస్సైలు, ఇతర పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భారాసకు కడియం ఝలక్!
[ 29-03-2024]
అసెంబ్లీ ఎన్నికల్లోనే వరంగల్ లోక్సభ స్థానం పరిధిలో భారాసకు ఎదురుదెబ్బ తగిలింది. ఏడు స్థానాల్లో ఆరు చోట్ల ఓటమి తప్పలేదు. -
మానుకోట ఎమ్మెల్యే వాహనం తనిఖీ
[ 29-03-2024]
లోక్సభ ఎన్నికల నేపథ్యంలో నెల్లికుదురు వద్ద నెలకొల్పిన చెక్ పోస్టు వద్ద గురువారం మహబూబాబాద్ ఎమ్మెల్యే భూక్య మురళీనాయక్, కరీంనగర్ ఎమ్మెల్సీ రఘోత్తంరెడ్డి వాహనాలను తనిఖీ చేశారు. -
షాపింగ్మాల్లో భారీ అగ్నిప్రమాదం
[ 29-03-2024]
వరంగల్ పోచమ్మమైదాన్లోని జెకోటియా షాపింగ్ మాల్లో గురువారం సాయంత్రం 6.45 గంటలకు భారీ అగ్నిప్రమాదం జరిగింది. -
గ్రంథాలయం మాది..పుస్తకం మీది!
[ 29-03-2024]
నేటి తరం పిల్లలు పుస్తక పఠనానికి క్రమంగా దూరమవుతున్నారు. చరవాణుల వ్యామోహంలో పడి గ్రంథాలయాల గడప తొక్కనివారు ఎంతో మంది ఉన్నారు. -
ఎర్రగట్టు గుట్టపై క్షీరాభిషేకం
[ 29-03-2024]
భీమారంలోని ఎర్రగట్టు గుట్టపై వెలసిన వేెంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. నాలుగో రోజు గురువారం స్వామివారికి క్షీరాభిషేకం నిర్వహించారు. -
యథేచ్ఛగా ఆలయ భూముల ఆక్రమణ
[ 29-03-2024]
వరంగల్, హనుమకొండ నగరాల నడిబొడ్డున రూ.కోట్ల విలువైన ఆలయ భూములు ఆక్రమణల చెరలో ఉన్నాయి. ఈ స్థలాల్లో పలుకుబడి ఉన్నవాళ్లు పెద్ద భవనాలు, ఇళ్లు నిర్మించుకున్నారు. -
ఇసుకాసురులపై పోలీసుల కొరడా
[ 29-03-2024]
సహజ వనరులను కాపాడుకుంటూ భవిష్యత్తు తరాలకు అందించినప్పుడే మనుగడ సాధ్యమవుతుంది. కానీ చాలా వరకు గుట్టలు, ఇసుక, మట్టిని గుళ్ల చేస్తూ వనరులను అందిన కాడికి దోచుకుంటున్నారు. -
నాణ్యతా.. వారికి మామూలే!
[ 29-03-2024]
ఉపాధిహామీ పథకం నిధులతో పంచాయతీరాజ్ ఇంజినీరింగ్శాఖ ఆధ్వర్యంలో మహబూబాబాద్, భూపాలపల్లి, ములుగు జిల్లాల్లోని పలు గ్రామాల్లో ఇటీవల సీసీ రోడ్ల నిర్మాణాలు చేపట్టారు. -
వైద్యుడు లేక అందని గుండె పరీక్షల సేవలు
[ 29-03-2024]
జనగామ జిల్లా కేంద్రంగా మారిన తర్వాత జనగామలో ప్రభుత్వం తెలంగాణ డయాగ్నస్టిక్ కేంద్రం, రేడియాలజీ హబ్లను ఏర్పాటు చేసింది. -
మరోసారి కాంగ్రెస్ సత్తా చాటాలి
[ 29-03-2024]
రానున్న లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మాజీ కేంద్ర మంత్రి బలరాంనాయక్ను అధిక మెజారిటీతో గెలిపించాలని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క నాయకులు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. -
ఆస్తి పన్ను బకాయిదారులపై కొరడా
[ 29-03-2024]
ఆస్తి పన్ను మొండి బకాయిదారులపై మున్సిపాలిటీ అధికారులు కొరడా ఝులిపిస్తున్నారు. వారం రోజులుగా ఉదయం 7 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు బకాయిదారుల ఇళ్లు, దుకాణాల వద్దకు వెళ్లి పన్ను చెల్లించాలని కోరుతున్నారు. -
అక్రమ వ్యాపారాలపై ప్రత్యేక నిఘా
[ 29-03-2024]
జిల్లాలో అక్రమ వ్యాపారాలపై పోలీసు యంత్రాంగం ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ అన్నారు. -
వేగవంతంగా చిన్న కాళేశ్వరం ప్రాజెక్టు పనులు
[ 29-03-2024]
మహదేవపూర్ మండలంలోని చిన్న కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ పనులను వేగవంతంగా చేపట్టాలని సంబంధిత నీటిపారుదల శాఖ అధికారులను జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా ఆదేశించారు. -
పల్లెల్లో బెట్టింగ్ల జోరు
[ 29-03-2024]
పట్టణాలకు పరిమితమైన బెట్టింగ్ సంస్కృతి పల్లె ప్రాంతంలో విస్తరించింది. జిల్లాలో మారుమూల ప్రాంతమైన కాటారం రెవెన్యూ డివిజన్ పరిధిలోని పల్లెల్లో యువకులు, వ్యాపారులు, విద్యార్థులు పందేలు కాస్తూ ఆర్థికంగా చితికిపోతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ట్రాక్టర్ల వ్యాపారానికి ఫోర్స్ మోటార్స్ గుడ్బై
-
ఆప్కు మరో షాక్.. సత్యేందర్ జైన్పై సీబీఐ దర్యాప్తునకు కేంద్రం ఓకే
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
రష్యా భీకర దాడులు.. ఉక్రెయిన్కు ‘కరెంటు కోతల ముప్పు’!
-
ఐదేళ్లలో రాష్ట్రం కోసం ఏం చేశావ్ జగన్?: చంద్రబాబు
-
పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఖరారు