వ్యాధి లేకున్నా ఉన్నట్లు నిర్ధారణ!
హనుమకొండ చౌరస్తా కాకాజీకాలనీలోని ఓ ఆసుపత్రిలో వైద్యుడు.. లేని వ్యాధిని ఉందని నిర్ధారించి రెండు నెలల పాటు చికిత్స అందించి డబ్బులు వసూలు చేశారని ఆరోపిస్తూ బాధిత బంధువులు శనివారం ఆసుపత్రి ముందు ఆందోళన చేపట్టారు.
ఆసుపత్రి ముందు బంధువుల ఆందోళన
హనుమకొండ చౌరస్తా, న్యూస్టుడే : హనుమకొండ చౌరస్తా కాకాజీకాలనీలోని ఓ ఆసుపత్రిలో వైద్యుడు.. లేని వ్యాధిని ఉందని నిర్ధారించి రెండు నెలల పాటు చికిత్స అందించి డబ్బులు వసూలు చేశారని ఆరోపిస్తూ బాధిత బంధువులు శనివారం ఆసుపత్రి ముందు ఆందోళన చేపట్టారు. బాధితురాలి కుమారుడు తెలిపిన వివరాల ప్రకారం పెద్దపెండ్యాల గ్రామానికి చెందిన బాధిత మహిళ (60) రెండు నెలల కిందట కడుపునొప్పితో ఆసుపత్రికి వచ్చింది. వైద్యుడు పరీక్షలు జరిపి అపెండెసిస్ ఆపరేషన్ చేయాలని చెప్పారు. ల్యాబ్లో రక్త పరీక్షలు నిర్వహించి ఆమెకు హెచ్ఐవీ ఉన్నట్లు నిర్ధారిస్తారు. సదరు వైద్యుడు బాధితురాలి కుటుంబ సభ్యులతో ఈ విషయం చెప్పి జాగ్రత్తగా ఉండాలని చెబుతారు. విషయం తెలిసి కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. సదరు వైద్యుడు రూ.1.50 లక్షలు తీసుకొని బాధితురాలికి ఆపరేషన్ చేస్తారు. రెండు నెలలుగా చికిత్స పొందుతున్న బాధితురాలు 10 రోజుల కిందట కాలికి గాయం కావడంతో చికిత్స కోసం ఎంజీఎం ఆసుపత్రికి వచ్చి అక్కడ వైద్య పరీక్షలు చేయించుకుంది. ఎంజీఎం వైద్యులు రక్తపరీక్ష చేసి ఆమెకు హెచ్ఐవీ లేనట్లు ధ్రువీకరిస్తారు. బాధితురాలి కుటుంబ సబ్యులు ఆమె రక్తాన్ని తీసుకొని మళ్లీ అదే ఆసుపత్రికి వచ్చి ల్యాబ్లో పరీక్ష చేయించగా హెచ్ఐవీ లేనట్లు ధ్రువీకరిస్తారు. ఇదే ఆసుపత్రిలో ఒకసారి హెచ్ఐవీ ఉన్నట్లు మరోసారి లేనట్లు చెప్పి తమ వద్ద వైద్య పరీక్షల పేరుతో డబ్బులు గుంజారని ఆరోపిస్తూ ఆసుపత్రి ముందు ఆందోళన చేపట్టారు. ఈ క్రమంలో ఆసుపత్రి సిబ్బంది బాధితురాలి కుటుంబసభ్యులపై దాడి చేసినట్లు తెలిసింది. స్థానికులు 100కు డయల్ చేయగా పోలీసులు వచ్చి వారిని స్టేషన్కు తీసుకెళ్లి విచారించారు. ఆసుపత్రిపై చర్యలు తీసుకొని తమకు న్యాయం చేయాలని బాధితులు కోరుతున్నారు. ఈ విషయంపై ఆసుపత్రి వైద్యులను సంప్రదించగా అందుబాటులోకి రాలేదు. ఆసుపత్రి యాజమాన్యం వివరణ కోరగా హెచ్ఐవీ పరీక్షలు చేసిన కిట్ కంపెనీ వారికి రక్త పరీక్షలో తేడా ఎందుకు వచ్చిందని అడుగుతూ మెయిల్ చేశామని వారు అందించే రిపోర్ట్ను బట్టి నిర్ధారిస్తామని చెప్పారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జజ్జనకర.. జనజాతర
[ 25-04-2024]
కాజీపేట మండలం మడికొండలో ఏర్పాటు చేసిన ఓరుగల్లు జనజాతర బహిరంగ సభ విజయవంతమైంది. వరంగల్ లోక్సభ పరిధిలోని ఏడు సెగ్మెంట్ల నుంచి భారీగా జనసమీకరణ చేయడంతో సభా ప్రాంగణం కిక్కిరిసిపోయింది. -
ప్రథమంలో 24 ద్వితీయంలో 26
[ 25-04-2024]
ఇంటర్మీడియట్ వార్షిక ఫలితాల్లో వరంగల్ జిల్లా వెనుకబడింది. ప్రథమ సంవత్సరం ఫలితాల్లో రాష్ట్రంలో 24వ స్థానం, ద్వితీయ సంవత్సరంలో 26వ స్థానంలో నిలిచింది. -
హస్తం జోరు..
[ 25-04-2024]
హనుమకొండ జిల్లా పరిధిలోని కాజీపేట మండలం మడికొండలో నిర్వహించిన ఓరుగల్లు జనజాతర బహిరంగ సభ విజయవంతం కావడం కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం నింపింది. -
ఇంటర్ ఫలితాల్లో ములుగు వెలుగు
[ 25-04-2024]
రాష్ట్ర ప్రభుత్వం బుధవారం విడుదల చేసిన ఇంటర్మీడియట్ ఫలితాల్లో ములుగు జిల్లా అగ్రస్థానంలో నిలిచింది. రాష్ట్రంలోని అన్ని జిల్లాలను వెనకకు నెట్టి ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో మొదటి స్థానంలో నిలిచింది. -
ఇంటర్ ఫలితాల్లో బాలికలదే హవా
[ 25-04-2024]
ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాల్లో ప్రథమ, ద్వితీయ సంవత్సర ఉత్తీర్ణతలో బాలికలదే పైచేయిగా నిలిచింది. బుధవారం ప్రకటించిన ఫలితాల్లో జిల్లాలో ప్రథమ సంవత్సరం 55.72 శాతంతో రాష్ట్రంలో 17వ స్థానం పొందింది. -
బాలికలదే పైచేయి
[ 25-04-2024]
ఇంటర్ బోర్డు అధికారులు బుధవారం విడుదల చేసిన ఇంటర్ ఫలితాల్లో జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో బాలికలే పై చేయి సాధించారు. -
ఇంటర్ ఫలితాల్లో బాలికలదే పైచేయి
[ 25-04-2024]
ఇంటర్ పరీక్ష ఫలితాలు బుధవారం వెలువడిన నేపథ్యంలో జిల్లాలో ఉత్తీర్ణత శాతం గత విద్యా సంవత్సరంతో పోలిస్తే ఈ ఏడాది వెనక్కి వెళ్లింది. -
21 నామపత్రాల దాఖలు
[ 25-04-2024]
వరంగల్ లోక్సభ స్థానానికి బుధవారం 19 మంది అభ్యర్థులు 21 నామపత్రాలను రిటర్నింగ్ అధికారి ప్రావీణ్యకు సమర్పించారు. భారాస పార్టీ అభ్యర్థి మారపల్లి సుధీర్కుమార్ తరఫున భారాస నాయకులు, -
ఆదర్శం.. గంగారం కస్తూర్బా విద్యాలయం
[ 25-04-2024]
మారుమూల ఏజెన్సీలోని కస్తూర్బా గాంధీ బాలికల గురుకుల విద్యాలయం(కేజీబీవీ) విద్యార్థినులు ఇంటర్ ఫలితాల్లో వందశాతం ఫలితాలు సాధించి సత్తా చాటారు.
తాజా వార్తలు (Latest News)
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)
-
ఎన్నికల బరిలో ‘పొలిమేర’ నటి..
-
శిక్షణ నుంచి తప్పించుకున్న గుర్రాలు.. లండన్ వీధుల్లో హల్చల్!