సౌత్జోన్ ఈత పోటీలు ప్రారంభం
రంగశాయిపేట శివారులోని బిర్లా ఓపెన్ మైండ్స్ హై స్కూల్లో సీబీఎస్ఈ సౌత్జోన్ స్థాయి ఈత పోటీలను శనివారం వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ ప్రారంభించారు.
క్రీడా జ్యోతితో ఎమ్మెల్యే రమేష్, నిర్వాహకులు
రంగశాయిపేట, న్యూస్టుడే: రంగశాయిపేట శివారులోని బిర్లా ఓపెన్ మైండ్స్ హై స్కూల్లో సీబీఎస్ఈ సౌత్జోన్ స్థాయి ఈత పోటీలను శనివారం వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. క్రీడాకారులు గెలుపు ఓటములు సహజంగా తీసుకొని ముందుకెళ్లాలన్నారు. అనంతరం క్రీడా పతాకాన్ని ఆవిష్కరించి, క్రీడా జ్యోతిని వెలిగించారు. ప్రారంభ వేడుకల్లో భాగంగా విద్యార్థులు ప్రదర్శించిన వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు అందరిని అలరించాయి. ఈ పోటీల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, పుదుచ్చేరి, కర్ణాటక, అండమాన్ నికోబార్ దీవుల ప్రాంతాల నుంచి 1200 క్రీడాకారులు, శిక్షకులు భాగస్వాములయ్యారు. ఇందులో రాష్ట్రంలోని వరంగల్, మొదక్, హైదరాబాద్ ప్రాంతాల విద్యార్థులు పోటీల్లో పాల్గొన్నారు. డైరెక్టర్ వెంకటేశ్వర్రావు, సౌత్జోన్ మాస్టర్ ఫ్రాంచైజీ సాయి సందీప్, భారత స్విమ్మింగ్ ఫెడరేషన్ కోశాధికారి రామకృష్ణ, వర్ధన్నపేట ఎంపీపీ అప్పారావు, 43, 44 డివిజన్ల కార్పొరేటర్లు జలగం అనిత, ఈదురు అరుణ, ప్రిన్సిపాళ్లు రాజ్కుమార్ జోషి, మెర్గిన్ మన్నస్ పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పంచరత్నాలు.. వావ్ అనిపించారు..!
[ 17-04-2024]
లక్ష్య సాధన నల్లేరు మీద నడక కాదు.. కష్టాలు, కన్నీళ్లు, ఎన్నో ప్రయత్నాల వెనుకే గెలుపు దాగి ఉంటుందని ఎన్నో విజయ గాథలు మనకు చెబుతున్నాయి. -
తప్పటడుగు వేస్తే... తప్పదు వేటు!
[ 17-04-2024]
రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల వేడి రోజురోజుకు పెరిగిపోతోంది.. అభ్యర్థుల తరఫున పార్టీల వారీగా సమావేశాలు, ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తున్నారు. -
3వ లోక్సభ: గెలుపోటముల్లో ఓట్ల తేడా స్వల్పమే..
[ 17-04-2024]
వరంగల్ స్థానం నుంచి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ (ఐఎన్సీ) అభ్యర్థి బాకర్ అలీ మిర్జా విజయం సాధించారు. తన సమీప సీపీఐ అభ్యర్థి రామనాథంపై 736 ఓట్ల ఆధిక్యం సాధించారు. ఇద్దరి మధ్య హోరాహోరీగా పోటీ సాగింది. -
తొలి గిరిజన ఎంపీ చందులాల్
[ 17-04-2024]
ఉమ్మడి వరంగల్ జిలా నుంచి తొలి గిరిజన ఎంపీగా ఎన్నికై పార్లమెంటులో అడుగు పెట్టిన చరిత్ర దివంగత మాజీ మంత్రి అజ్మీరా చందులాల్కు దక్కింది. ములుగు మండలం జగ్గన్నపేట పంచాయతీ పరిధిలోని సారంగపల్లిలో జన్మించారు. -
రాజకీయ నేతలకు రామ పాఠం
[ 17-04-2024]
ఎన్ని తరాలైనా రామరాజ్యం గురించి ప్రజలు మాట్లాడుకుంటారు. నేటి పాలకులు ఆ కోదండపాణిని ఆదర్శంగా తీసుకొని ఆయన బాటలో నడిస్తే సుపరిపాలన సాధ్యం. -
నీటి ఫిర్యాదులకు స్పందన కరవు!
[ 17-04-2024]
నగరంలోని పలు కాలనీల్లో తాగునీటి కష్టాలు మొదలయ్యాయి. ఎండల తీవ్రత పెరగడంతో తాగునీటి కోసం ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. -
పకడ్బందీగా నామపత్రాల స్వీకరణ ప్రక్రియ
[ 17-04-2024]
లోక్సభ ఎన్నికలు-2024 నిర్వహణలో భాగంగా వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి నామపత్రాల స్వీకరణ ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించేలా ఏర్పాట్లు చేయాలని రిటర్నింగ్ అధికారి పి.ప్రావీణ్య ఆదేశించారు. -
ప్రమాదం పొంచి ఉంది.. పనులు ప్రారంభించండి..!
[ 17-04-2024]
ఏటా వానాకాలంలో గోదావరి వరదలతో మన్యంలోని గ్రామాలు ముంపునకు గురవుతున్నాయి. దీంతో ఆయా గ్రామాల ప్రజలు అంధకారంలోనే ఉండాల్సిన పరిస్థితులు నెలకొంటున్నాయి. -
ప్రశాంత ఎన్నికలే లక్ష్యం
[ 17-04-2024]
లోక్సభ ఎన్నికలను శాంతియుతంగా నిర్వహించాలని మల్టీజోన్ 1 ఐజీ ఏవీ రంగనాథ్ అన్నారు. -
టెర్రరిస్టులపై సమరం కాదు..
[ 17-04-2024]
రామప్ప పరిసరాల్లో ప్రత్యేక బలగాల సమరం ఏంటని అనుకుంటున్నారా? సినిమా షూటింగ్ అనుకుంటున్నారా? అలా అయితే మీరు పొరబడినట్లే.. శత్రువులై సమరశంఖం పూరిస్తున్నట్లు కనిపిస్తున్న వీరు నిజమైన పోలీసులే. -
‘కడియం చేసిన ద్రోహం చరిత్రలో నిలుస్తుంది’
[ 17-04-2024]
ఆదరించి ఎన్నో అవకాశాలు కల్పించిన భారాసకు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కు ఎమ్మెల్యే కడియం శ్రీహరి చేసిన ద్రోహం చరిత్రలో నిలిచిపోతుందని ఆ పార్టీ వరంగల్ లోక్సభ అభ్యర్థి డాక్టర్ మారేపల్లి సుధీర్కుమార్ అన్నారు. -
నెలలో.. మరింత దిగువకు..!
[ 17-04-2024]
ప్రస్తుత వేసవిలో జిల్లాలో రోజు రోజుకు భూగర్భజలాలు మరింత లోతుకు పడిపోతున్నాయి. ఇందుకు నిదర్శనంగా ఈ సంవత్సరం ఫిబ్రవరి నెలలో జిల్లాలో భూగర్బ జలశాఖ తాజా నివేదిక ప్రకారం జిల్లా సగటు మొత్తం ప్రాంత భూగర్భ నీటి స్థాయి 5.59 మీటర్లు ఉండగా నెల రోజుల్లోనే 6.36 మీటర్ల లోతుకు పడిపోయింది. -
‘తులం బంగారం ఇచ్చి ఉంటే కాంగ్రెస్కు ఓటేయండి’
[ 17-04-2024]
ఇటీవల అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ ప్రకారం కాంగ్రెస్ ప్రభుత్వం పెళ్లైన ఆడబిడ్డలకు తులం బంగారం ఇచ్చి ఉంటే ఆ పార్టీకే ఓటేయాలని మాజీ మంత్రి, ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్ సూచించారు. -
భూ కబ్జా కేసులో.. మున్సిపల్ మాజీ వైస్ ఛైర్మన్ అరెస్టు
[ 17-04-2024]
భూ కబ్జాకు యత్నించిన భూపాలపల్లి పురపాలక సంఘం మాజీ వైస్ ఛైర్మన్, స్థానిక 12వ వార్డు భారాస కౌన్సిలర్ కొత్త హరిబాబును మంగళవారం పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. -
సామాజిక బాధ్యత పెంచేందుకు ‘ప్రేరణ’
[ 17-04-2024]
సాంకేతిక ప్రపంచంలో విద్యార్థులు సెల్ఫోన్కు బానిసలవుతున్న తీరును అరికట్టేందుకు, వారికి దేశంపై అభిమానం పెంపొందించేలా, సామాజిక బాధ్యత, క్రమశిక్షణ గలవారిగా తీర్చిదిద్దేందుకు కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించింది. -
రాములోరి కల్యాణానికి వేళాయె
[ 17-04-2024]
శ్రీరామనవమి పురస్కరించుకొని కాళేశ్వర దేవస్థానం అనుబంధ రామాలయంలో నేడు ఆలయ అధికారుల ఆధ్వర్యంలో అర్చకులు సీతారామచంద్రస్వామి కల్యాణాన్ని నిర్వహించనున్నారు. -
దర్జాగా చెరువు మట్టి తరలింపు
[ 17-04-2024]
ప్రభుత్వ అనుమతులు లేకుండా రాజకీయ పలుకుబడితో ఆక్రమార్కులు చెరువు మట్టిని దర్జాగా విక్రయిస్తున్నారు. అడ్డూ అదుపు లేకుండా పోయిందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
‘భాజపా, భారాసలది అంతర్గత దోస్తానం’
[ 17-04-2024]
భాజపా, భారాసలు అంతర్గత దోస్తానం చేస్తూ.. బహిరంగంగా దుష్మన్గా వ్యవహరిస్తూ ప్రజలను మభ్యపెడుతున్నారని, లోక్సభ ఎన్నికల్లో మోదీకి గుణపాఠం తప్పదని ఎన్ఎస్యూఐ జాతీయ కార్యదర్శి, ఏఐసీసీ కార్యదర్శి రోహిత్ చౌదరి అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
కాబోయే ప్రధాని రాహుల్ గాంధీనే: సీఎం రేవంత్రెడ్డి
-
అల్లు అర్జున్ సినిమాలో నటించే అవకాశం వచ్చింది.. కానీ: విశాల్
-
ఇంటినే చక్కదిద్దలేరు.. ఇక రాష్ట్రాన్ని ఎలా?: అనురాగ్ ఠాకూర్
-
బందరుకు ఏం చేశారో చెప్పే ధైర్యం నీతుల నానికి ఉందా?: చంద్రబాబు
-
గుజరాత్ను వణికించిన దిల్లీ
-
దేశ సరిహద్దులు పూర్తిగా సురక్షితమే: రాజ్నాథ్ సింగ్