పల్లె వెలుగు.. కనిపించక రెండేళ్లు!
వరంగల్ ఆర్టీసీ రీజయన్ పరిధిలో బస్సులు నడవని గ్రామాలు అనేకం ఉన్నాయి. కొవిడ్ కారణంగా రోడ్డు రవాణా శాఖ బస్సులు నిలిపి వేసి రెండేళ్లు గడుస్తున్నా అనేక గ్రామాలకు ఆయా సర్వీసులను పునరుద్ధరించడం లేదు.
పునరుద్ధరించాలని కోరుతున్న అనేక గ్రామాలు
ఈనాడు, వరంగల్ - శివనగర్, వరంగల్ కలెక్టరేట్, జులైవాడ, ధర్మసాగర్, న్యూస్టుడే
వరంగల్ జిల్లా నెక్కొండ మండలం బొల్లికొండ గ్రామానికి కరోనాకన్నా ముందు మహబూబాబాద్ డిపో బస్సు నడిచేది. లాక్డౌన్ నుంచి ఈ ఊరికి సర్వీసు నిలిచిపోయింది. ఇప్పటికీ పునరుద్ధరించలేదు. ఈ గ్రామ ప్రజలు మహబూబాబాద్ డిపోకు వెళ్లి మళ్లీ బస్సు వేయాలని కోరినా ఫలితం శూన్యం. నెక్కొండ మండల కేంద్రానికి రావాలంటే ఈ ఊరి వాళ్లకు ఆటోలే దిక్కు. బస్సుతో పోలిస్తే ఆటో ఛార్జీలు ఎక్కువ.
తమ ఊరికి బస్సును పునరుద్ధరించాలని ప్రజలు వినతి పత్రాలు ఇచ్చినా డిపో మేనేజర్లు స్పందించడం లేదు. బస్సులు లేకపోవడంతో ఆటో వాళ్లు ఇష్టారీతిన ఛార్జీలను వసూలు చేస్తున్నారు. సామర్థ్యానికి మించి ప్రయాణికులను తీసుకెళ్తున్నారు.
బస్సులు నడిస్తే పాఠశాల, కళాశాలల విద్యార్థులు పాసు తీసుకొని నెలవారీగా చెల్లిస్తే సరిపోతుంది. సర్వీసులు లేకపోవడంతో ద్విచక్ర వాహనాలు, ఆటోల్లో వెళ్లాల్సి రావడం వారికి భారంగా మారుతోంది.
వరంగల్ ఆర్టీసీ రీజయన్ పరిధిలో బస్సులు నడవని గ్రామాలు అనేకం ఉన్నాయి. కొవిడ్ కారణంగా రోడ్డు రవాణా శాఖ బస్సులు నిలిపి వేసి రెండేళ్లు గడుస్తున్నా అనేక గ్రామాలకు ఆయా సర్వీసులను పునరుద్ధరించడం లేదు. ప్రయాణికులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. బస్సు ఛార్జీలతో రెండింతలు ఆటోలకు చెల్లిస్తున్నారు. పది మంది ఉంటేనే ఆటోను కదిలించే పరిస్థితి ఉండడంతో డబ్బులతో పాటు సమయం వృథా అవుతోంది.
గోపాలపురం, శనిగరం, గూనిపర్తి, మాదన్నపేట గ్రామాల గుండా బస్సును నడిపించాలని కోరుతూ ఇటీవల పరకాల ఆర్టీసీ డిపో మేనేజర్కు వినతిపత్రం అందజేస్తున్న కమలాపూర్ మండలం గ్రామాల ప్రజాప్రతినిధులు. ఆటోల్లో ప్రయాణానికి రూ.20 నుంచి రూ.50 వరకు అదనంగా వెచ్చించాల్సి వస్తోందని ఈ గ్రామాల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇదీ పరిస్థితి..
* మహబూబాబాద్ జిల్లా తొర్రూరు నుంచి వరంగల్కు వెళ్లే బస్సును రద్దు చేశారు. ఇది తొర్రూరు నుంచి సన్నూరు ఎక్స్రోడ్డు, ఈదుల తండా, వెంకటేశ్వరపల్లి, సన్నూరు, రాజునాయక్ తండా, బాలాజీ తండా, ఊకల్, గట్టికల్, మైలారం, రాయపర్తి మీదుగా ఉదయాన్నే వరంగల్ వెళ్లేది. మార్కెట్కు వెళ్లే రైతులు, పనులకు వెళ్లే కార్మికులకు అనుకూలంగా ఉండేది.
* వరంగల్ జిల్లా గీసుకొండ మండలం 15వ డివిజన్ పరిధి గొర్రెకుంట, కీర్తినగర్ కాలనీకి గతంలో కాజీపేట నుంచి బస్సు నడిచేది. గతంలో రహదారి బాగా లేక, కొవిడ్ సమయంలో బస్సు నిలిచిపోయింది. ఇప్పుడు రెండు వరుసల రహదారి వేసినా బస్సు నడవడం లేదు. గరీభ్నగర్, కీర్తినగర్లలో 12వేల జనాభా ఉంటుంది. వీరికి బస్సు సౌకర్యం లేదు.
గతంలో వరంగల్ బస్టాండు నుంచి తపాలా కార్యాలయం వరంగల్ చౌరస్తా మీదుగా కాజిపేటకు, హనుమకొండ, కేయూకు సిటీ బస్సులు నడిచేవి. స్మార్ట్ రోడ్ల నిర్మాణం పేరిట గతేడాది నుంచి ఈ బస్సులను వెంకటరామ థియేటర్, కాశిబుగ్గ మీదుగా నడిపిస్తున్నారు. రహదారుల నిర్మాణం పూర్తయినా ఈ రూట్లలో బస్సులు నడవడం లేదు. దీంతో స్థానికులకు ఆటోలే దిక్కవుతున్నాయి.
* హనుమకొండ జిల్లా దామెర మండలం పసరగొండ గ్రామానికి కొవిడ్కు ముందు లోకల్ బస్సు ఉదయం, మధ్యాహ్నం ఒక ట్రిప్పు చొప్పున నడిచేది. అనంతరం నిలిపివేశారు. విద్యార్థులు, ప్రజలు ప్రయివేటు వాహనాలను ఆశ్రయించి ఇబ్బంది పడుతున్నారు. ధర్మసాగర్ మండలం పెద్దపెండ్యాల, ఎల్కుర్తి, మల్లకపల్లి గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం లేదు.
* కమలాపూర్ మండలంలోని నేరెళ్ల గ్రామంలో ఏడాదిన్నర కిందట అంబాల మీదుగా వచ్చే బస్సును రద్దు చేయడంతో వృద్ధులు, మహిళలు, విద్యార్థులు బస్సులు లేక మూడు కిలోమీటర్ల కాలినడకన రాకపోకలు సాగిస్తున్నారు. తమ గ్రామానికి ఆర్టీసీ బస్సును పునరుద్ధరించాలని కోరుతూ రీజినల్ మేనేజర్కు ప్రజాప్రతినిధులు వినతిపత్రం అందజేశారు. పరకాల, శనిగరం, గోపాల్పూర్, మాదన్నపేట, గూనిపర్తి గ్రామాల మీదుగా హనుమకొండకు విద్యార్థులు, వ్యాపారులు, ప్రజల సౌకర్యార్థం బస్సు సౌకర్యం కల్పించాలని ఇటీవల మూడు గ్రామాల సర్పంచులు పరకాల ఆర్టీసీ డిపో మేనేజర్కు వినతిపత్రాన్ని అందజేశారు.
ములుగు మండలం పత్తిపల్లి, పొట్లాపూర్ మార్గంలో ఆటోలో వెళ్లేందుకు ఎక్కి కూర్చున్న ప్రయాణికులు
వరంగల్ రీజియన్లో ఆర్టీసీ వివరాలు
మొత్తం డిపోలు - 9 మొత్తం సర్వీసులు - 984
ప్రతి రోజూ ఆదాయం - రూ.1.10 కోట్లు
బస్సులు నిత్యం ప్రయాణించే కిలోమీటర్లు - 3.84 లక్షలు
వరంగల్ రీజియన్ బస్సుల్లో నిత్యం ప్రయాణికులు - 10 లక్షలు
డీఎంకు విన్నవించాం
- దేవునూరు రాధాకృష్ణ, కీర్తినగర్ కాలనీ
గతంలో కీర్తినగర్కు బస్సు సౌకర్యం ఉండేది. మా దగ్గర వేలాది మంది బడి, పాఠశాలల పిల్లలు ఉన్నారు. బస్సు లేక వీరు ఇబ్బంది పడుతున్నారు గతంలో డిపో మేనేజర్కు వినతిపత్రం కూడా ఇచ్చాం. మళ్లీ బస్సు సర్వీసు పునరుద్ధరించాలి
ఇబ్బంది పడుతున్నాం
- బానోతు చంద్రు నాయక్, బొల్లికొండ, నెక్కొండ మండలం
మా ఊరు బొల్లికొండకు గతంలో బస్సులు నడిచేవి. కరోనా తర్వాత ఆపేశారు. రోజుకు నాలుగు ట్రిప్పులు అవసరం ఉంది. మహబూబాబాద్ డిపో మేనేజర్ను కలిసి వినతి పత్రం ఇచ్చాం. రోడ్డు బాగా లేకపోతే మొరం పోయించి బాగు చేయించాం. అయినా బస్సు రావడం లేదు.
డిమాండు ఉంటే నడిపిస్తాం
- జె.శ్రీలత, వరంగల్ రీజనల్ మేనేజర్
ప్రజల వద్దకే ఆర్టీసీ అనే కార్యక్రమాన్ని చేపట్టాం. మా అధికారులు గ్రామాలకు వెళ్లి అవసరాలు తెలుసుకుంటున్నారు. డిమాండు ఉన్న ప్రాంతాలకు నడిపిస్తాం. విద్యార్థులు ఉన్న అన్ని రూట్లలో బస్సులు ఇస్తున్నాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అగ్రనేతల ఆగమనం
[ 19-04-2024]
భారీ సభా వేదికలు ముస్తాబవుతున్నాయి. వెల్లువలా ప్రజల్ని తరలించేందుకు రాజకీయ పార్టీలు ఏర్పాట్లు చేసుకుంటున్నాయి. -
అర్హత లేని వైద్యం.. అక్రమంగా మందుల విక్రయం
[ 19-04-2024]
జిల్లా కేంద్రంలో ఓ అర్హత లేని వైద్యుడు చికిత్సలు చేయడమే కాకుండా ఎలాంటి అనుమతుల లేకుండా భారీగా మందులను విక్రయించడంతో పాటు ప్రభుత్వ ఆసుపత్రుల్లోని మందులను కూడా విక్రయిస్తూ డ్రగ్ కంట్రోల్ అధికారుల తనిఖీల్లో పట్టుబడ్డ సంఘటన గురువారం జనగామలో చోటుచేసుకుంది. -
ఆనాడు చంద్రబాబు అన్నీ తానై..
[ 19-04-2024]
అవి 2009 శాసనసభ ఎన్నికలు.. మహాకూటమి నుంచి తెదేపా అభ్యర్థి రేవూరి ప్రకాశ్రెడ్డి నర్సంపేట నుంచి పోటీ చేశారు. -
జైలు నుంచి పోటీ.. మూడు చోట్ల గెలుపు
[ 19-04-2024]
భారతావనికి స్వాతంత్య్రం సిద్ధించాక 1952లో తొలి సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. -
ఒకటి.. రెండు.. ఒకటి.. రెండు..
[ 19-04-2024]
ఉమ్మడి వరంగల్లో లోక్సభ నియోజకవర్గాల ప్రస్థానం, మార్పులు చేర్పులు ఆసక్తిని కలిగిస్తాయి.. లోక్సభ నియోజకవర్గాల పునర్విభజన జరిగిన ప్రతిసారీ ఏదో ఒక మార్పు జరిగింది. -
కాంగ్రెస్ అభ్యర్థి గెలుపునకు కృషి చేయాలి
[ 19-04-2024]
పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ గెలుపునకు కలిసికట్టుగా కృషి చేయాలని రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు అన్నారు. -
కంటి సమస్యలు లేని బాల్యమే లక్ష్యంగా..
[ 19-04-2024]
విద్యార్థులకు కంటి చూపు సమస్య ఉంటే వారి భవిష్యత్తు అంధకారం అవుతుంది. దీన్ని దృష్టిలో పెట్టుకున్న ప్రభుత్వం రాష్ట్రీయ బాల స్వస్థ్య కార్యక్రమం(ఆర్బీఎస్కే), వైద్యశాఖ ఆధ్వర్యంలో ఒకటి నుంచి పదో తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు కంటి పరీక్షలు చేపట్టింది. -
పాఠశాలల అభివృద్ధికి నిధులు
[ 19-04-2024]
అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల పర్యవేక్షణలో ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించేందుకు సర్కారు నిర్ణయించింది. -
రేషన్కార్డుల ఈ-కేవైసీకి మరో అవకాశం
[ 19-04-2024]
ఆహార భద్రతా కార్డులను ఈ-కేవైసీ చేయించుకునేందుకు ప్రభుత్వం మరో అవకాశం ఇచ్చింది. ఫిబ్రవరి 29తో గడువు ముగిసినా రేషన్ దుకాణాల్లో ప్రభుత్వ సూచన మేరకు ఈ-కేవైసీ కొనసాగుతోంది. -
కడియం కావ్య విజయం ఖాయం
[ 19-04-2024]
వరంగల్ ఎంపీగా కాంగ్రెస్ అభ్యర్థి కడియం కావ్య విజయం ఖాయమని, తూర్పు నియోజకవర్గం నుంచే 50 వేల మెజార్టీ తథ్యమని రాష్ట్ర మంత్రి కొండా సురేఖ స్పష్టం చేశారు. -
బోరు ఒకటి.. కనెక్షన్లు 27
[ 19-04-2024]
గిరిజన పల్లెల్లో కన్నీటి గోస తీవ్రమవుతోంది. వేసవి తీవ్రతకు నీటి వనరుల్లో జలం అడుగంటుతుండటంతో.. పలు ప్రాంతాల్లో తాగునీటికి ఇబ్బందులు తలెత్తుతున్నాయి. -
నేర నియంత్రణకు సైబర్ వారియర్స్
[ 19-04-2024]
ప్రస్తుత కాలంలో చరవాణి లేనిదే రోజు గడవడం లేదు. అదే సమయంలో డిజిటల్ లావాదేవీలు పెరిగిపోవడంతో.. చాలా మంది స్మార్ట్ఫోన్లను వినియోగిస్తున్నారు. -
మహిళలకు భరోసా..!
[ 19-04-2024]
మెరుగైన ఆరోగ్యానికి ప్రత్యేక కార్యక్రమంమహబూబాబాద్, న్యూస్టుడే: సమతుల్య ఆహారం తీసుకోకపోవడం, జీవన విధానంలో వస్తున్న మార్పులతో మహిళలు అనారోగ్యాలబారిన పడుతున్నారు. -
కాంగ్రెస్ జనజాతర సభకు సర్వం సిద్ధం
[ 19-04-2024]
లోక్సభ ఎన్నికల్లో అభ్యర్థుల విజయమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ అడుగులు వేస్తోంది. గిరిజనులకు రిజర్వు అయిన మహబూబాబాద్ లోక్సభ స్థానం నుంచి పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి పోరిక బలరాంనాయక్ నామినేషన్ సందర్భంగా శుక్రవారం జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ మైదానంలో నిర్వహించనున్న కాంగ్రెస్ జనజాతర బహిరంగ సభకు టీపీసీసీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి హాజరు కానున్నారు. -
నేతన్నల భూములపై అక్రమార్కుల కన్ను
[ 19-04-2024]
నేతన్నలు చెమటోడ్చి మగ్గంపై శ్రమిస్తేగానీ పూట గడవదు. అలా వారు రూపాయి రూపాయి పోగు చేసి కూడబెట్టుకుని కొనుక్కున్న స్థలాలను అక్రమార్కులు కబ్జా చేస్తున్నారు. -
సుధీర్కుమార్కు భారాస బీఫారం
[ 19-04-2024]
భారాస అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ వరంగల్ భారాస ఎంపీ అభ్యర్థి డాక్టర్ సుధీర్కుమార్కు బీఫారం అందజేశారు. -
రసీదులకు అదనపు రుసుం..!
[ 19-04-2024]
ఆస్తిపన్ను చెల్లించిన పౌరులకు తాత్కాలికంగా పొట్టి(చిన్న) రసీదులు ఇస్తున్నారు. పెద్ద రసీదులివ్వమని అడిగితే అదనంగా రూ.2 ఇవ్వాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
నెల్లూరులో తెదేపాలో చేరిన 100 మంది వాలంటీర్లు
-
అది నా డ్రీమ్ సిక్స్.. బుమ్రా బౌలింగ్లో ఇప్పటికి నెరవేరింది: అశుతోష్ శర్మ
-
మధ్యాహ్నం 3 గంటల వరకు 50%పోలింగ్.. అత్యధికంగా ఈ రాష్ట్రంలో..
-
రివ్యూ: సైరెన్.. జయం రవి, కీర్తి సురేశ్ యాక్షన్ థ్రిల్లర్ ఎలా ఉంది?
-
దిల్లీ మద్యం స్కామ్.. సీబీఐ కేసులోనూ అప్రూవర్గా మారిన శరత్ చంద్రారెడ్డి