రేషన్ బియ్యం.. అక్రమార్కుల పరం
పేదలకు చెందాల్సిన రాయితీ బియ్యం పక్కదారి పడుతోంది. వ్యాపారులు అక్రమంగా తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు.
ఇటీవల రైస్మిల్లులో బియ్యం బస్తాలను పట్టుకున్న పోలీసులు
హనుమకొండ కలెక్టరేట్, కమలాపూర్, న్యూస్టుడే: పేదలకు చెందాల్సిన రాయితీ బియ్యం పక్కదారి పడుతోంది. వ్యాపారులు అక్రమంగా తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. లబ్ధిదారుల నుంచి తక్కువకు కొనుగోలు చేస్తున్నారు. మిల్లుల్లో నూకలుగా మార్చి లిక్కర్ కంపెనీలు, కోళ్ల ఫారాలకు తరలిస్తున్నారు.
మహారాష్ట్రకు తరలింపు
గ్రామాల్లో లబ్ధిదారుల నుంచి రూ.10కి కొనుగోలు చేస్తున్నారు. రాత్రికి రాత్రే సరిహద్దులు దాటిస్తున్నారు. మహారాష్ట్రలో మన బియ్యానికి బాగా డిమాండ్ ఉంది. రూ.18 నుంచి రూ.25 వరకు ధర పలుకుతోంది. కిలోకు రూ. 8 నుంచి రూ. 15 వరకు లాభాన్ని గడిస్తున్నారు.
కమలాపూర్ కేంద్రంగా...
కమలాపూర్ మండలాన్ని కేంద్రంగా చేసుకొని వివిధ గ్రామాల్లో ఈ బియ్యం దందా చాపకింద నీరులా విస్తరిస్తోంది. మండలంలోని రైల్వేస్టేషన్తో పాటు దాని పక్కన ఉన్న ఓ గ్రామం నుంచి నిత్యం వందల క్వింటాళ్ల మేర లారీల్లో పక్క రాష్ట్రాలకు తరలిస్తున్నారు. గతంలో పుమార్లు అధికారులు దాడులు జరిపి కేసులు నమోదు చేసినా దందా ఆగడం లేదు. కొందరు రైస్ మిల్లుల యజమానులు సైతం భాగస్వాములవుతున్నారని తెలిసింది.
* కమలాపూర్ మండలం అంబాల, పంగిడిపల్లి, కమలాపూర్, ఉప్పల్ గ్రామాల్లో స్థానిక పోలీసులు దాడులు చేసి 60 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. గత రెండు నెలల్లో 12 కేసులు నమోదయ్యాయి.
* ఇటీవల ఉప్పల్ రైల్వేస్టేషన్ వద్ద రైలులో తరలించడానికి సిద్ధంగా ఉన్న 50 క్వింటాళ్ల బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో 15 మందికిపైగా కేసులు నమోదు చేశారు.
* కమలాపూర్ మండలంలోని ఓ గ్రామంలో నిత్యం 50 నుంచి 60 క్వింటాళ్ల మేర రేషన్ బియ్యం వివిధ ప్రాంతాలకు అర్ధరాత్రి నుంచి లారీల్లో దర్జాగా తరలిస్తున్నారు. దళారులందరూ వాహనాల్లో బియ్యం బస్తాలను ఇక్కడికి తీసుకొచ్చి.. లారీలోకి ఎక్కిస్తారు.
* రెండు నెలల క్రితం ఎల్కతుర్తి వద్ద 350 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని పోలీసులు, పౌరసరఫరాలశాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
నాన బెట్టి.. ఆరబోసి..
లబ్ధిదారుల నుంచి క్వింటాళ్ల కొద్ది కొనుగోలు చేస్తున్నారు. బియ్యాన్ని రాత్రిపూట నీళ్లలో నానబెడుతున్నారు. నానిన బియ్యాన్ని ఇళ్ల స్లాబ్పై ఆరబెడుతున్నారు. తర్వాత నూకలుగా మారుస్తున్నారు. తర్వాత సంచుల్లో నింపి ఆంధ్రప్రదేశ్లోని కాకినాడ, మహారాష్ట్రలోని బీర్లు, లిక్కర్ ఫ్యాక్టరీలు, కోళ్ల పరిశ్రమలకు పంపిస్తూ చీకటి దందాను నడిపిస్తున్నారు.
అమ్మినా, కొన్నా నేరమే
-వసంత లక్ష్మి, జిల్లా పౌరసరఫరాల అధికారి
ప్రభుత్వం అందిస్తున్న రేషన్ బియ్యాన్ని అక్రమం గా విక్రయించినా, కొనుగో లు చేసినా నేరం. జిల్లా వ్యాప్తంగా విసృతంగా తని ఖీలు చేస్తున్నాం. ఇటీవల అక్రమంగా బియ్యం సరఫ రా చేస్తున్న వారిపై కేసులు నమోదు చేశాం. అక్ర మాల కు పాల్పడుతున్న వారిపై సమాచారం ఇవ్వాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అగ్రనేతల ఆగమనం
[ 19-04-2024]
భారీ సభా వేదికలు ముస్తాబవుతున్నాయి. వెల్లువలా ప్రజల్ని తరలించేందుకు రాజకీయ పార్టీలు ఏర్పాట్లు చేసుకుంటున్నాయి. -
అర్హత లేని వైద్యం.. అక్రమంగా మందుల విక్రయం
[ 19-04-2024]
జిల్లా కేంద్రంలో ఓ అర్హత లేని వైద్యుడు చికిత్సలు చేయడమే కాకుండా ఎలాంటి అనుమతుల లేకుండా భారీగా మందులను విక్రయించడంతో పాటు ప్రభుత్వ ఆసుపత్రుల్లోని మందులను కూడా విక్రయిస్తూ డ్రగ్ కంట్రోల్ అధికారుల తనిఖీల్లో పట్టుబడ్డ సంఘటన గురువారం జనగామలో చోటుచేసుకుంది. -
ఆనాడు చంద్రబాబు అన్నీ తానై..
[ 19-04-2024]
అవి 2009 శాసనసభ ఎన్నికలు.. మహాకూటమి నుంచి తెదేపా అభ్యర్థి రేవూరి ప్రకాశ్రెడ్డి నర్సంపేట నుంచి పోటీ చేశారు. -
జైలు నుంచి పోటీ.. మూడు చోట్ల గెలుపు
[ 19-04-2024]
భారతావనికి స్వాతంత్య్రం సిద్ధించాక 1952లో తొలి సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. -
ఒకటి.. రెండు.. ఒకటి.. రెండు..
[ 19-04-2024]
ఉమ్మడి వరంగల్లో లోక్సభ నియోజకవర్గాల ప్రస్థానం, మార్పులు చేర్పులు ఆసక్తిని కలిగిస్తాయి.. లోక్సభ నియోజకవర్గాల పునర్విభజన జరిగిన ప్రతిసారీ ఏదో ఒక మార్పు జరిగింది. -
కాంగ్రెస్ అభ్యర్థి గెలుపునకు కృషి చేయాలి
[ 19-04-2024]
పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ గెలుపునకు కలిసికట్టుగా కృషి చేయాలని రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు అన్నారు. -
కంటి సమస్యలు లేని బాల్యమే లక్ష్యంగా..
[ 19-04-2024]
విద్యార్థులకు కంటి చూపు సమస్య ఉంటే వారి భవిష్యత్తు అంధకారం అవుతుంది. దీన్ని దృష్టిలో పెట్టుకున్న ప్రభుత్వం రాష్ట్రీయ బాల స్వస్థ్య కార్యక్రమం(ఆర్బీఎస్కే), వైద్యశాఖ ఆధ్వర్యంలో ఒకటి నుంచి పదో తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు కంటి పరీక్షలు చేపట్టింది. -
పాఠశాలల అభివృద్ధికి నిధులు
[ 19-04-2024]
అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల పర్యవేక్షణలో ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించేందుకు సర్కారు నిర్ణయించింది. -
రేషన్కార్డుల ఈ-కేవైసీకి మరో అవకాశం
[ 19-04-2024]
ఆహార భద్రతా కార్డులను ఈ-కేవైసీ చేయించుకునేందుకు ప్రభుత్వం మరో అవకాశం ఇచ్చింది. ఫిబ్రవరి 29తో గడువు ముగిసినా రేషన్ దుకాణాల్లో ప్రభుత్వ సూచన మేరకు ఈ-కేవైసీ కొనసాగుతోంది. -
కడియం కావ్య విజయం ఖాయం
[ 19-04-2024]
వరంగల్ ఎంపీగా కాంగ్రెస్ అభ్యర్థి కడియం కావ్య విజయం ఖాయమని, తూర్పు నియోజకవర్గం నుంచే 50 వేల మెజార్టీ తథ్యమని రాష్ట్ర మంత్రి కొండా సురేఖ స్పష్టం చేశారు. -
బోరు ఒకటి.. కనెక్షన్లు 27
[ 19-04-2024]
గిరిజన పల్లెల్లో కన్నీటి గోస తీవ్రమవుతోంది. వేసవి తీవ్రతకు నీటి వనరుల్లో జలం అడుగంటుతుండటంతో.. పలు ప్రాంతాల్లో తాగునీటికి ఇబ్బందులు తలెత్తుతున్నాయి. -
నేర నియంత్రణకు సైబర్ వారియర్స్
[ 19-04-2024]
ప్రస్తుత కాలంలో చరవాణి లేనిదే రోజు గడవడం లేదు. అదే సమయంలో డిజిటల్ లావాదేవీలు పెరిగిపోవడంతో.. చాలా మంది స్మార్ట్ఫోన్లను వినియోగిస్తున్నారు. -
మహిళలకు భరోసా..!
[ 19-04-2024]
మెరుగైన ఆరోగ్యానికి ప్రత్యేక కార్యక్రమంమహబూబాబాద్, న్యూస్టుడే: సమతుల్య ఆహారం తీసుకోకపోవడం, జీవన విధానంలో వస్తున్న మార్పులతో మహిళలు అనారోగ్యాలబారిన పడుతున్నారు. -
కాంగ్రెస్ జనజాతర సభకు సర్వం సిద్ధం
[ 19-04-2024]
లోక్సభ ఎన్నికల్లో అభ్యర్థుల విజయమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ అడుగులు వేస్తోంది. గిరిజనులకు రిజర్వు అయిన మహబూబాబాద్ లోక్సభ స్థానం నుంచి పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి పోరిక బలరాంనాయక్ నామినేషన్ సందర్భంగా శుక్రవారం జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ మైదానంలో నిర్వహించనున్న కాంగ్రెస్ జనజాతర బహిరంగ సభకు టీపీసీసీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి హాజరు కానున్నారు. -
నేతన్నల భూములపై అక్రమార్కుల కన్ను
[ 19-04-2024]
నేతన్నలు చెమటోడ్చి మగ్గంపై శ్రమిస్తేగానీ పూట గడవదు. అలా వారు రూపాయి రూపాయి పోగు చేసి కూడబెట్టుకుని కొనుక్కున్న స్థలాలను అక్రమార్కులు కబ్జా చేస్తున్నారు. -
సుధీర్కుమార్కు భారాస బీఫారం
[ 19-04-2024]
భారాస అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ వరంగల్ భారాస ఎంపీ అభ్యర్థి డాక్టర్ సుధీర్కుమార్కు బీఫారం అందజేశారు. -
రసీదులకు అదనపు రుసుం..!
[ 19-04-2024]
ఆస్తిపన్ను చెల్లించిన పౌరులకు తాత్కాలికంగా పొట్టి(చిన్న) రసీదులు ఇస్తున్నారు. పెద్ద రసీదులివ్వమని అడిగితే అదనంగా రూ.2 ఇవ్వాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
నెల్లూరులో తెదేపాలో చేరిన 100 మంది వాలంటీర్లు
-
అది నా డ్రీమ్ సిక్స్.. బుమ్రా బౌలింగ్లో ఇప్పటికి నెరవేరింది: అశుతోష్ శర్మ
-
మధ్యాహ్నం 3 గంటల వరకు 50%పోలింగ్.. అత్యధికంగా ఈ రాష్ట్రంలో..
-
రివ్యూ: సైరెన్.. జయం రవి, కీర్తి సురేశ్ యాక్షన్ థ్రిల్లర్ ఎలా ఉంది?
-
దిల్లీ మద్యం స్కామ్.. సీబీఐ కేసులోనూ అప్రూవర్గా మారిన శరత్ చంద్రారెడ్డి
-
నేను తిన్నది మూడు మామిడి పండ్లే: కేజ్రీవాల్