logo

తాటాకు చప్పుళ్లకు భయపడేది లేదు..

నియోజకవర్గంలో తనపై ఎవరు ఎన్ని కుట్రలు, కుతంత్రాలు చేసినా తాటాకు చప్పుళ్లకు భయపడే ప్రసక్తే లేదని ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య వ్యాఖ్యానించారు.

Published : 07 Dec 2022 05:25 IST

శివునిపల్లి అంబేడ్కర్‌ విగ్రహం వద్ద నివాళులర్పిస్తున్న
తాటికొండ రాజయ్య, చిత్రంలో నాయకులు

స్టేషన్‌ఘన్‌పూర్‌, న్యూస్‌టుడే : నియోజకవర్గంలో తనపై ఎవరు ఎన్ని కుట్రలు, కుతంత్రాలు చేసినా తాటాకు చప్పుళ్లకు భయపడే ప్రసక్తే లేదని ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య వ్యాఖ్యానించారు. అంబేడ్కర్‌ వర్ధంతిని పురస్కరించుకొని మంగళవారం శివునిపల్లి అంబేడ్కర్‌ విగ్రహం వద్ద రాజయ్య పూలమాల వేసి నివాళులర్పించారు. ఆనంతరం నాయకులతో కలసి ద్విచక్ర వాహన ర్యాలీగా వెళ్లి అమరవీరుల స్తూపానికి శంకుస్థాపన చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్‌ దళితబంధును  రాష్ట్రంలోని దళితులందరికీ వర్తించాలనే సంకల్పంతో తీసుకొచ్చారని అన్నారు. ఈ పథకం అమలుపై అనుచిత వ్యాఖ్యలు చేసే పెద్దమనిషికి కూడా అనుచరులు, బంధుమిత్రులు, తమ కుల సంఘాల వారు ఉన్నారని.. వాళ్లకు పథకం వద్దని జాబితా ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. నియోజకవర్గంలో పోటీ చేయడానికి ఏ పార్టీ నుంచైనా స్థానికులే రావాలని.. ఎక్కడి వాళ్లో ఇక్కడ వచ్చి పెత్తనం చేయాలని చూస్తే ప్రజలు ఊరుకోరని చెప్పారు. ఎంపీˆపీˆ కందుల రేఖ, జడ్పీటీసీˆ మారపాక రవి, మార్కెట్ ఛైర్మన్‌ గుజ్జరి రాజు, స్థానిక సర్పంచి సురేష్‌కుమార్‌, మండల పార్టీ అధ్యక్షుడు గణేష్‌, నాయకులు మనోజ్‌ రెడ్డి, కుమార్‌ పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని