పల్లెకు వెళ్దాం.. చరితను రాద్దాం!
పల్లెల చరిత్రకు అక్షర రూపం ఇచ్చే వినూత్న ప్రక్రియను చేపట్టే అరుదైన అవకాశాన్ని ఇప్పుడు ప్రభుత్వ డిగ్రీ కళాశాలల విద్యార్థులు సొంతం చేసుకోబోతున్నారు.. వీరు రాసే చరిత భావితరాలకు ఉపయోగపడనుంది.
నాలుగు ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో..
న్యూస్టుడే, మానుకోట
ప్రాజెక్టుపై విద్యార్థులకు అవగాహన కలిగిస్తున్న రామా రత్నమాల (పాత చిత్రం)
పల్లెల చరిత్రకు అక్షర రూపం ఇచ్చే వినూత్న ప్రక్రియను చేపట్టే అరుదైన అవకాశాన్ని ఇప్పుడు ప్రభుత్వ డిగ్రీ కళాశాలల విద్యార్థులు సొంతం చేసుకోబోతున్నారు.. వీరు రాసే చరిత భావితరాలకు ఉపయోగపడనుంది. చివరి సెమిస్టర్లోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలల వివిధ విభాగాల విద్యార్థులు దీనిని ఒక ప్రాజెక్టుగా చేపట్టి ఈ క్రతువులో భాగస్వాములు కానున్నారు. తెలంగాణ సాహిత్య అకాడమి, తెలంగాణ రాష్ట్ర కళాశాల విద్యాశాఖ సంయుక్తంగా ‘మన ఊరు-మన చరిత్ర’ అనే ప్రతిష్ఠాత్మక కార్యక్రమాన్ని చేపట్టగా మహబూబాబాద్ జిల్లాలోనూ శ్రీకారం చుట్టారు.
జిల్లాలోని మహబూబాబాద్, గార్ల, మరిపెడ, తొర్రూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. ప్రాజెక్టు జిల్లా సమన్వయకర్తగా మహబూబాబాద్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల తెలుగు అధ్యాపకురాలు డాక్టర్ రామా రత్నమాలను నియమించారు. డిగ్రీ కళాశాలలకు సమన్వయకర్తలను ఏర్పర్చి కళాశాల వారీగా కమిటీలను నెలకొల్పారు. ప్రాజెక్టు ప్రత్యేకత, విద్యార్థులు చేయాల్సిన పని, తదితర విషయాలపై జిల్లా సమన్వయకర్త ఇప్పటికే జిల్లాలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో సమావేశాలను నిర్వహించి అవగాహన కల్పించారు. ప్రాజెక్టును నిర్వహిస్తున్న ఖమ్మంలోని ఎస్ఆర్ అండ్ బీజీఎన్నార్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల తెలుగు అధ్యాపకుడు డాక్టర్ ఆర్.సీతారాంతో జూమ్ వేదికగా సలహాలు, సూచనలు విద్యార్థులకు అందించారు. ఈ నెల 15నుంచి విద్యార్థులు సమాచారాన్ని సేకరించే పని ప్రారంభిస్తారు. నెలాఖరు వరకు పూర్తి చేసి కళాశాల వెబ్సైట్లో పొందుపరచాల్సి ఉంటుంది.
ప్రశ్నావళి ఇలా..
మన ఊరు-మన ప్రాజెక్టులో విద్యార్థులు తమ గ్రామంలోని సమగ్ర విషయాలను అధ్యయనం చేయాల్సి ఉంటుంది. ఈ మేరకు ఒక ప్రశ్నావళిని రూపొందించారు.
భౌగోళిక నైసర్గిక స్వరూపం, జలవనరులు, అడవులు, వ్యవసాయం, చారిత్రక అంశాలు, గ్రామం ఎప్పుడు ఏర్పడింది. పేరు ఎలా వచ్చింది. ఆలయాలు, శాసనాలు. ప్రజల జీవన విధానం, చేతి వృత్తులు, ఆర్థిక అంశాలు, పంటలు, చేతి వృత్తులు, సామాజిక అంశాలు.. సామాజిక వర్గాలు, అనుబంధాలు, ఆప్యాయతలు, సాంస్కృతిక అంశాలు, ఆటపాటలు, జాతరలు, ప్రత్యేక పండుగలు, కవులు, పండితులు, రచయితలు, సాహితీ వేత్తలు, తెలంగాణ ఉద్యమం, ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు తర్వాత పునర్నిర్మాణం, తదితర విషయాలను ప్రశ్నలతో అధ్యయనం చేయాల్సి ఉంటుంది. సమాచారం కోసం తల్లిదండ్రులు, వయో వృద్ధులు, స్వాతంత్య్ర సమరయోధులు, సర్పంచి, స్థానిక సంస్థల ప్రతినిధులు, గ్రామ అధికారులు తదితరులను సంప్రదించాల్సి ఉంటుంది. గ్రామానికి సంబంధించి గణాంకాలను సంబంధిత అధికారుల నుంచి సేకరించాలి.
పుస్తక రూపంలో వెలువడుతుంది
- రామారత్నమాల, మన ఊరు మన చరిత్ర ప్రాజెక్టు జిల్లా సమన్వయకర్త
తమ గ్రామాల చరిత్రలను రాయడం విద్యార్థులకు ఒక చక్కటి అవకాశం. దీనివల్ల వారి ఊర్లకు సంబంధించి ఇప్పటి కంటే మరింతగా విస్తృత అవగాహన కలుగుతుంది. విలువైన సమాచారం భవిష్యత్తు తరాల వారికి అందించిన వారవుతారు. విద్యార్ధులు సేకరించిన ఆయా గ్రామాల సమాచారంతో ఒక పుస్తకాన్ని కూడా వెలువరిస్తాం. మున్ముందు కూడా ఈ ప్రక్రియ కొనసాగుతుంది.
విజయవంతం చేయాలి
- డి.రాజు, ప్రిన్సిపల్, ప్రభుత్వ డిగ్రీ కళాశాల, మహబూబాబాద్
ఈ ప్రాజెక్టున్న ప్రత్యేకతను గుర్తించి విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని తమ గ్రామ వివరాలను సేకరించి విజయవంతంగా పూర్తి చేయాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సైబర్ మోసమా.. వారియర్లు పట్టేస్తారు!
[ 24-04-2024]
ఓ వైపు శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం పెరుగుతుండగా అదే తరహాలో సైబర్ మోసాలు విజృంభిస్తున్నాయి. డిజిటల్ లావాదేవీలు పెరుగుతున్న కారణంగా స్మార్ట్ఫోన్ల వినియోగం పెరిగింది. -
సీఎం రేవంత్రెడ్డి బహిరంగ సభకు సర్వం సిద్ధం
[ 24-04-2024]
లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి బుధవారం పాల్గొననున్న ‘ఓరుగల్లు జనజాతర’ బహిరంగ సభకు సర్వం సిద్ధమైంది. హనుమకొండ జిల్లా కాజీపేట మండలం మడికొండ సెయింట్ పాల్స్ మైదానంలో మధ్యాహ్నం 3 గంటలకు బహిరంగ సభ ఉంటుందని లోక్సభ ఎన్నికల ఇన్ఛార్జి, పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్రెడ్డి తెలిపారు. -
అభ్యర్థిని చూసి ఆశీర్వదించండి..
[ 24-04-2024]
వరంగల్ లోక్సభ ఎన్నికల ప్రచారంలో భారాస జోరు పెంచింది. అసెంబ్లీ ఎన్నికల తర్వాత మొదటిసారి వరంగల్కు వచ్చిన భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ పార్టీ శ్రేణుల్లో జోష్ నింపారు. -
కేఎంసీకి పోటెత్తిన మహిళా రోగులు
[ 24-04-2024]
కేఎంసీ(కాకతీయ మెడికల్ కాలేజీ)లోని సూపర్స్పెషాలిటీ ఆసుపత్రిలో వైద్యం కోసం వచ్చేవారిలో మహిళలే అధికంగా ఉంటున్నారు. మంగళవారం న్యూరాలజీ, న్యూరోసర్జరీ, నెఫ్రాలజీ, యూరాలజీ ఓపీ వైద్యసేవల కోసం అతివలు పోటెత్తారు. -
నెగ్గేదెవరైనా.. విమానం తీసుకురావాలి
[ 24-04-2024]
కొన్నేళ్లుగా వరంగల్ మామునూరు విమానాశ్రయం ఏర్పాటు ప్రక్రియ ముందుకు వెనక్కి అన్నట్టు సాగుతోంది. ఉమ్మడి వరంగల్ అభివృద్ధికి తోడ్పడే దీని పునరుద్ధరణ అంశం వరంగల్ లోక్సభ స్థానం నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థులకు ఎంతో కీలకం కానుంది. -
నాడు హనుమకొండ.. నేడు భువనగిరి!
[ 24-04-2024]
జనగామ శాసనసభ నియోజకవర్గం గతంలో హనుమకొండ లోక్సభ పరిధిలో ఉండేది. 2009 సంవత్సరంలో పార్లమెంట్ నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా జనగామ నియోజకవర్గాన్ని హనుమకొండ నుంచి వేరు చేసి కొత్తగా ఏర్పడిన భువనగిరి లోక్సభలో కలిపారు. -
వరంగల్ తొలి ఎంపీ సాదత్ అలీఖాన్
[ 24-04-2024]
1952లో జరిగిన తొలి సార్వత్రిక ఎన్నికల్లో వరంగల్ లోక్సభ స్థానం నుంచి హైదరాబాద్కు చెందిన సాదత్ అలీఖాన్ ఎన్నికయ్యారు. ఆయన భారత జాతీయ కాంగ్రెస్ (ఐఎన్సీ) అభ్యర్థిగా పోటీ చేశారు. -
అవును.. నిజమే కదా!
[ 24-04-2024]
జీవరాశికి ప్రాణవాయువు అవసరం. ఇది ఎంత వరకు నిజమో.. ప్రజాస్వామ్య వ్యవస్థ మనుగడకు ఓటూ అంతే. ఓటర్ల జాబితాలో పేరుండి... ఎన్నికల రోజు హక్కుని వినియోగించుకోకపోతే ఎలా? ఓటు వేయకపోతే ప్రజాస్వామ్య వ్యవస్థ నిర్వీర్యమవుతుంది. -
ఓటేయండి.. భవితకు బాటేయండి
[ 24-04-2024]
పోలింగ్ రోజు ప్రతి ఓటరు గడప దాటి ఓటు హక్కు వినియోగించుకోవాలని.. పిల్లల భవితకు బాటలు వేయాలని సామాజికవేత్త నిమ్మల శ్రీనివాస్ పేర్కొన్నారు. -
ఓట్లతోనే.. జాతీయ, ప్రాంతీయ గుర్తింపు..
[ 24-04-2024]
జాతీయ, ప్రాంతీయ పార్టీలంటూ చదువుతుంటాం. ఎన్నికల ప్రచారంలో సైతం జాతీయ పార్టీలు, ప్రాంతీయ పార్టీలంటూ నేతలు చెబుతుంటారు.. జాతీయ పార్టీలు దిల్లీ నుంచి పాలిస్తాయని.. -
గుర్తుంచుకుందాం..
[ 24-04-2024]
రాజకీయ పార్టీ అంటే ముందుగా గుర్తొచ్చేది పార్టీల గుర్తులు. వాటి ఆధారంగానే ఓటు వేస్తుంటాం. మన దేశంలో పార్టీల గుర్తుల కేటాయింపు ఎలా జరిగింది..? జాతీయ పార్టీల గుర్తుల్లో ఎలాంÇటి మార్పులు వచ్చాయో తెలుసుకుందాం.. -
అతిథులు తరలిరాగా.. బూర మోగించె!
[ 24-04-2024]
ఓట్ల కోసం అనాదిగా మత రాజకీయాలు చేస్తున్నది కాంగ్రెస్ పార్టీయేనని భాజపా ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కె.లక్ష్మణ్ విమర్శించారు. ప్రతి విషయాన్ని మతంతో ముడిపెడుతూ ఒక వర్గం మెప్పు కోసం పాకులాడే కాంగ్రెస్ పార్టీ భాజపా మత రాజకీయాలు చేస్తుందని ఆరోపించడం సరికాదన్నారు. -
హేమాచల క్షేత్రంలో పూజలు
[ 24-04-2024]
మండలంలోని మల్లూరు గుట్టపై శ్రీ హేమాచల లక్ష్మీనరసింహస్వామిని మంగళవారం ములుగు కలెక్టర్ ఇలా త్రిపాఠి దర్శించుకున్నారు. ఆలయ సంప్రదాయం ప్రకారం దేవస్థాన కార్యనిర్వహణాధికారి సత్యనారాయణ, అర్చకులు రాఘవాచార్యులు, రాజశేఖర్శర్మలు స్వాగతం పలికారు. -
వారధి.. నిర్లక్ష్యం తీరిది!
[ 24-04-2024]
రెండు జిల్లాల సరిహద్దులోని మానేరు వాగు దాటడానికి ఇరువైపులా గ్రామాల ప్రజలు దశాబ్దాల తరబడి నానా అవస్థలు పడుతున్నారు. ఎట్టకేలకు వంతెన నిర్మాణం పనులు ప్రారంభం కావడంతో కష్టాలు తీరతాయని భావించారు. -
ఏడుగురు అభ్యర్థులు.. 9 నామపత్రాలు
[ 24-04-2024]
వరంగల్ పార్లమెంట్ స్థానానికి మంగళవారం ఏడుగురు అభ్యర్థులు 9 నామపత్రాలను రిటర్నింగ్ అధికారి ప్రావీణ్యకు సమర్పించారు. -
రాత్రి వేళల్లో తరలిస్తున్నారు..!
[ 24-04-2024]
జిల్లాలో బెరైటీస్ అక్రమ రవాణా కొనసాగుతోంది. అడ్డుకట్ట వేసేందుకు అటవీశాఖ అధికారులు చేస్తున్న ప్రయత్నాలు పూర్తిగా సఫలమవడం లేదు. అధికారుల కళ్లుగప్పి విలువైన ఖనిజాన్ని రాత్రి వేళ సరిహద్దులు దాటిస్తున్నారు. -
సర్కారు బడిలో విజన్-2026
[ 24-04-2024]
డోర్నకల్లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయ బృందం రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా విజన్-2026 పేరిట ఓ ప్రత్యేక కార్యాచరణకు రూపకల్పన చేశారు. -
బకాయిలు రావు.. పనులు సాగవు..
[ 24-04-2024]
ప్రైవేటుకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దేందుకు గత ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ‘మన ఊరు మన బడి’ కార్యక్రమం అమలు చేస్తోంది. ఇందులో భాగంగా చేపట్టిన పాఠశాలల మరమ్మతులు, నూతన నిర్మాణాల పనులకు నిధుల కొరత ఏర్పడటంతో.. సుమారుగా ఏడాది కాలంగా పనులు నిలిచిపోయాయి. -
భారాస అభ్యర్థి నామపత్రం దాఖలు
[ 24-04-2024]
మహబూబాబాద్ లోక్సభ భారాస అభ్యర్థి మాలోత్ కవిత మంగళవారం ఆ పార్టీ నేతలతో కలిసి నామినేషన్ వేశారు. ముందుగా కురవి వీరభద్రస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. -
భార్యల సీట్ల కోసం భర్తల కొట్లాట
[ 24-04-2024]
ఆర్టీసీ బస్సులో భార్యల సీట్ల కోసం భర్తలు చెప్పులతో కొట్టుకున్న ఘటన మంగళవారం సాయంత్రం మహబూబాబాద్ జిల్లా తొర్రూరు ఆర్టీసీ బస్టాండ్లో నెలకొంది.
తాజా వార్తలు (Latest News)
-
లాభాల్లో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు.. 22,400 ఎగువనే నిఫ్టీ
-
నా జీవితాన్ని నాశనం చేసింది నువ్వే.. వైకాపా ఎమ్మెల్యే భార్యను నిలదీసిన మహిళ
-
అమెరికా వైదొలగితే.. ప్రపంచానికి ఎవరు నాయకత్వం వహిస్తారు?: బైడెన్
-
బస్సులో సీఎం... ఎండలో జనం
-
విజయవాడ రైల్వేస్టేషన్లో రూ.20కే నాణ్యమైన భోజనం
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM