అలుపు లేదు.. గెలుపే!
దేహదారుఢ్య పరీక్షల్లో ఎలాంటి పొరపాట్లు, అవకతవకలు జరగకుండా నిఘానీడన పర్యవేక్షణ చేపట్టనున్నారు. ఇందుకోసం మైదానంలో 23 సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు.
రేపటి నుంచి ఎస్సై, కానిస్టేబుల్ అభ్యర్థులకు దేహదారుఢ్య పరీక్షలు
ఈనాడు డిజిటల్, మహబూబాబాద్, న్యూస్టుడే, వరంగల్ క్రైం
దేహదారుఢ్య పరీక్షల్లో ఎలాంటి పొరపాట్లు, అవకతవకలు జరగకుండా నిఘానీడన పర్యవేక్షణ చేపట్టనున్నారు. ఇందుకోసం మైదానంలో 23 సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు.
నిఘా నీడన పర్యవేక్షణ
ఎస్సై, కానిస్టేబుల్ దేహదారుఢ్య పరీక్షలకు ఉమ్మడి జిల్లావ్యాప్తంగా అభ్యర్థులు సిద్ధమవుతున్నారు. పోలీస్ కొలువు కొట్టడమే లక్ష్యంగా మైదానాల్లో చెమటోడుస్తున్నారు. మరోవైపు ఈ నెల 8 నుంచి జనవరి 3 వరకు ఈవెంట్లను పక్కాగా నిర్వహించడానికి పోలీసు యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. ఇందుకోసం కాకతీయ విశ్వవిద్యాలయంలో మైదానాన్ని సిద్ధం చేశారు. పొరపాట్లకు తావు లేకుండా ఈసారి అత్యాధునిక సాంకేతిక వ్యవస్థను ఉపయోగిస్తున్నారు. అభ్యర్థులు పరుగు తీసేందుకు ట్రాక్ను సిద్ధం చేశారు. సెన్సార్ల బిగింపు, సీసీ కెమెరాలను అమర్చారు.
శారీరక కొలతలకు సాంకేతికత వినియోగం: అభ్యర్థుల శారీరక కొలతలను తీసుకునేందుకు సాంకేతికతను వినియోగిస్తున్నారు. ఇందుకోసం రెండు ఆధునిక యంత్రాలను అందుబాటులోకి తీసుకొచ్చారు. పరుగులో అర్హత సాధించిన తర్వాతే అభ్యర్థుల కొలతలను తీసుకుంటారు. వీటిల్లోనూ నిబంధనల ప్రకారం ఉంటేనే మిగతా ఈవెంట్స్లో పాల్గొంటారు.
పరుగే కీలకం..: గతంలో 800, 100 మీటర్ల పరుగు, హైజంప్, లాంగ్జంప్, షాట్పుట్ నిర్వహించగా ఈసారి వాటిలో కొన్ని మార్పులు చేశారు. పురుషులకు 1600 మీటర్లు (7.15 నిమిషాలు), మహిళలకు 800 మీటర్లు (5.20 నిమిషాలు) పరుగు ఉంటుంది. ఇందులో అర్హత సాధిస్తేనే షాట్పుట్, లాంగ్జంప్ నిర్వహిస్తారు. పరుగే అత్యంత కీలకం కానుంది. పరుగులో వచ్చిన మార్కులను తుది పరీక్షకు లెక్కలోకి తీసుకుంటారు. షాట్పుట్, లాంగ్జంప్ అర్హత మాత్రమే.
అంకెల్లో వివరాలు..
* ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా హాజరవుతున్న అభ్యర్థులు: 24,612
* పురుషులు: 19,651 * మహిళలు: 4961 (వీరి కోసం ప్రత్యేకంగా ఈ నెల 10 నుంచి 14 వరకు ఈవెంట్స్ నిర్వహిస్తారు. పురుషులకు ఈ తేదీల్లో ఉండవు.)
* ప్రతి బ్యాచ్కు పరుగెత్తనున్న అభ్యర్థులు: 50 (ఐదు సెకన్లకు ఐదుగురు చొప్పున)
* మొదటి రోజు 600 మంది.. రెండో రోజు నుంచి చివరి రోజు వరకు ఈ సంఖ్యను పెంచుకుంటూ వెళ్తారు.
ఎస్సై, కానిస్టేబుల్ పోస్టులకు దరఖాస్తు చేసుకుని ప్రిలిమ్స్లో రెండింటిలో అర్హత సాధించిన అభ్యర్థులకు పీఈటీలో ఒకటే అర్హత పరీక్ష నిర్వహిస్తున్నారు. ఇలా రెండింటికి అర్హత సాధించినవారు ఉమ్మడి జిల్లాలో సుమారు 16 వేల మంది ఉన్నారు. 8 వేల మంది వరకు కానిస్టేబుల్ పోస్టులకు దరఖాస్తు చేసుకుని అర్హత సాధించారు.
అందుబాటులో వైద్యబృందం
బ్రాండ్ వేదిక
పరుగు తీస్తున్నప్పుడు, లాంగ్జంప్, షాట్పుట్ సమయంలో అభ్యర్థులకు గాయాలైతే, ఆరోగ్యం పరంగా ఏమైనా ఇబ్బంది వస్తే ప్రథమ చికిత్స అందించడానికి వైద్యబృందం అందుబాటులో ఉంటుంది. అత్యవసర వైద్యానికి ఆసుపత్రికి తీసుకెళ్లడానికి 108 వాహనం ఉంటుంది.
వీటిని గుర్తుంచుకోండి..
(సీపీ రంగనాథ్ తెలిపిన వివరాల ప్రకారం..)
మంగళవారం కేయూ మైదానాన్ని పరిశీలిస్తున్న సీపీ ఏవీ రంగనాథ్,
అదనపు డీసీపీ వైభవ్ గైక్వాడ్, ఇతర పోలీసు అధికారులు
* ఈవెంట్స్ ఉదయం 5 గంటలకు ప్రారంభమవుతాయి. * అభ్యర్థులు ప్రవేశకార్డు, ఇంటిమేషన్ లేఖ, స్వీయ సంతకంతో కూడిన పార్ట్-2 దరఖాస్తు ప్రింట్, కమ్యూనిటీ, ఎక్స్సర్వీస్ ఎన్వోసీ, 24/01/2018 ప్రకారం ఏజెన్సీ ధ్రువపత్రాలను తీసుకొని రావాలి. * చేతులపై మెహందీ, పచ్చబొట్లు లేకుండా జాగ్రత పడాలి. * ధ్రువపత్రాల పరిశీలన తర్వాత బయోమెట్రిక్ పరిశీలన ఉంటుంది. వీటిని పూర్తి చేసుకున్న అభ్యర్థి చేతికి డిజిటల్ ఆర్ఎఫ్డీ బ్యాండ్ వేస్తారు. మైదానం వీడే వరకు అది చేతికి ఉండాలి.
ఛాతీలో నొప్పిగా ఉంటే తప్పుకోవాలి
- డాక్టర్.బి.శ్రీనివాస్, పల్మనాలజిస్టు, మహబూబాబాద్
శారీరక సామర్థ్య పరీక్షల్లో పాల్గొనే అభ్యర్థులు జలుబు ఉంటే ఉదయం, సాయంత్రం గోరువెచ్చని నీటిని తాగాలి. పాలు లేదా ఆహారం, పండ్లు తీసుకున్న తర్వాత నోటిని శుభ్రం చేసుకోవాలి. పరుగెత్తుతున్న సమయంలో కళ్లు తిరిగినట్లు, ఛాతీలో నొప్పిగా ఉంటే వెంటనే తప్పుకోవాలి. అవసరముంటే వైద్యుడిని సంప్రదించి చికిత్స పొందాలి. లేకుంటే ప్రమాదకరం అవుతుంది. శ్వాస సమస్యలు రాకుండా ఉండేందుకు మెడిటేషన్ చేయాలి. పోషకాలు కలిగిన ఆహారాన్ని తీసుకోవాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అగ్రనేతల ఆగమనం
[ 19-04-2024]
భారీ సభా వేదికలు ముస్తాబవుతున్నాయి. వెల్లువలా ప్రజల్ని తరలించేందుకు రాజకీయ పార్టీలు ఏర్పాట్లు చేసుకుంటున్నాయి. -
అర్హత లేని వైద్యం.. అక్రమంగా మందుల విక్రయం
[ 19-04-2024]
జిల్లా కేంద్రంలో ఓ అర్హత లేని వైద్యుడు చికిత్సలు చేయడమే కాకుండా ఎలాంటి అనుమతుల లేకుండా భారీగా మందులను విక్రయించడంతో పాటు ప్రభుత్వ ఆసుపత్రుల్లోని మందులను కూడా విక్రయిస్తూ డ్రగ్ కంట్రోల్ అధికారుల తనిఖీల్లో పట్టుబడ్డ సంఘటన గురువారం జనగామలో చోటుచేసుకుంది. -
ఆనాడు చంద్రబాబు అన్నీ తానై..
[ 19-04-2024]
అవి 2009 శాసనసభ ఎన్నికలు.. మహాకూటమి నుంచి తెదేపా అభ్యర్థి రేవూరి ప్రకాశ్రెడ్డి నర్సంపేట నుంచి పోటీ చేశారు. -
జైలు నుంచి పోటీ.. మూడు చోట్ల గెలుపు
[ 19-04-2024]
భారతావనికి స్వాతంత్య్రం సిద్ధించాక 1952లో తొలి సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. -
ఒకటి.. రెండు.. ఒకటి.. రెండు..
[ 19-04-2024]
ఉమ్మడి వరంగల్లో లోక్సభ నియోజకవర్గాల ప్రస్థానం, మార్పులు చేర్పులు ఆసక్తిని కలిగిస్తాయి.. లోక్సభ నియోజకవర్గాల పునర్విభజన జరిగిన ప్రతిసారీ ఏదో ఒక మార్పు జరిగింది. -
కాంగ్రెస్ అభ్యర్థి గెలుపునకు కృషి చేయాలి
[ 19-04-2024]
పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ గెలుపునకు కలిసికట్టుగా కృషి చేయాలని రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు అన్నారు. -
కంటి సమస్యలు లేని బాల్యమే లక్ష్యంగా..
[ 19-04-2024]
విద్యార్థులకు కంటి చూపు సమస్య ఉంటే వారి భవిష్యత్తు అంధకారం అవుతుంది. దీన్ని దృష్టిలో పెట్టుకున్న ప్రభుత్వం రాష్ట్రీయ బాల స్వస్థ్య కార్యక్రమం(ఆర్బీఎస్కే), వైద్యశాఖ ఆధ్వర్యంలో ఒకటి నుంచి పదో తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు కంటి పరీక్షలు చేపట్టింది. -
పాఠశాలల అభివృద్ధికి నిధులు
[ 19-04-2024]
అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల పర్యవేక్షణలో ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించేందుకు సర్కారు నిర్ణయించింది. -
రేషన్కార్డుల ఈ-కేవైసీకి మరో అవకాశం
[ 19-04-2024]
ఆహార భద్రతా కార్డులను ఈ-కేవైసీ చేయించుకునేందుకు ప్రభుత్వం మరో అవకాశం ఇచ్చింది. ఫిబ్రవరి 29తో గడువు ముగిసినా రేషన్ దుకాణాల్లో ప్రభుత్వ సూచన మేరకు ఈ-కేవైసీ కొనసాగుతోంది. -
కడియం కావ్య విజయం ఖాయం
[ 19-04-2024]
వరంగల్ ఎంపీగా కాంగ్రెస్ అభ్యర్థి కడియం కావ్య విజయం ఖాయమని, తూర్పు నియోజకవర్గం నుంచే 50 వేల మెజార్టీ తథ్యమని రాష్ట్ర మంత్రి కొండా సురేఖ స్పష్టం చేశారు. -
బోరు ఒకటి.. కనెక్షన్లు 27
[ 19-04-2024]
గిరిజన పల్లెల్లో కన్నీటి గోస తీవ్రమవుతోంది. వేసవి తీవ్రతకు నీటి వనరుల్లో జలం అడుగంటుతుండటంతో.. పలు ప్రాంతాల్లో తాగునీటికి ఇబ్బందులు తలెత్తుతున్నాయి. -
నేర నియంత్రణకు సైబర్ వారియర్స్
[ 19-04-2024]
ప్రస్తుత కాలంలో చరవాణి లేనిదే రోజు గడవడం లేదు. అదే సమయంలో డిజిటల్ లావాదేవీలు పెరిగిపోవడంతో.. చాలా మంది స్మార్ట్ఫోన్లను వినియోగిస్తున్నారు. -
మహిళలకు భరోసా..!
[ 19-04-2024]
మెరుగైన ఆరోగ్యానికి ప్రత్యేక కార్యక్రమంమహబూబాబాద్, న్యూస్టుడే: సమతుల్య ఆహారం తీసుకోకపోవడం, జీవన విధానంలో వస్తున్న మార్పులతో మహిళలు అనారోగ్యాలబారిన పడుతున్నారు. -
కాంగ్రెస్ జనజాతర సభకు సర్వం సిద్ధం
[ 19-04-2024]
లోక్సభ ఎన్నికల్లో అభ్యర్థుల విజయమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ అడుగులు వేస్తోంది. గిరిజనులకు రిజర్వు అయిన మహబూబాబాద్ లోక్సభ స్థానం నుంచి పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి పోరిక బలరాంనాయక్ నామినేషన్ సందర్భంగా శుక్రవారం జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ మైదానంలో నిర్వహించనున్న కాంగ్రెస్ జనజాతర బహిరంగ సభకు టీపీసీసీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి హాజరు కానున్నారు. -
నేతన్నల భూములపై అక్రమార్కుల కన్ను
[ 19-04-2024]
నేతన్నలు చెమటోడ్చి మగ్గంపై శ్రమిస్తేగానీ పూట గడవదు. అలా వారు రూపాయి రూపాయి పోగు చేసి కూడబెట్టుకుని కొనుక్కున్న స్థలాలను అక్రమార్కులు కబ్జా చేస్తున్నారు. -
సుధీర్కుమార్కు భారాస బీఫారం
[ 19-04-2024]
భారాస అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ వరంగల్ భారాస ఎంపీ అభ్యర్థి డాక్టర్ సుధీర్కుమార్కు బీఫారం అందజేశారు. -
రసీదులకు అదనపు రుసుం..!
[ 19-04-2024]
ఆస్తిపన్ను చెల్లించిన పౌరులకు తాత్కాలికంగా పొట్టి(చిన్న) రసీదులు ఇస్తున్నారు. పెద్ద రసీదులివ్వమని అడిగితే అదనంగా రూ.2 ఇవ్వాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ఈసీ నిబంధనలకు విరుద్ధంగా వైకాపా సోషల్ మీడియా తీరు
-
హైదరాబాద్ విమానాశ్రయంలో ఏఏఐ వాటా విక్రయం?
-
20 నుంచి పవన్ రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం
-
మహిళకు శస్త్రచికిత్స చేసి.. తల్లీ బిడ్డను కాపాడిన దర్శి అభ్యర్థి
-
నా భర్తపై రెబల్గా పోటీ చేస్తా.. టెక్కలి వైకాపా అభ్యర్థి దువ్వాడ భార్య వాణి
-
పేదరాలు బుట్టమ్మ ఆస్తులు రూ.161.21 కోట్లు