జాతర పనులు నాలుగు రోజుల్లో పూర్తవ్వాలి
మరో నాలుగు రోజుల్లోగా మేడారం చిన్న జాతర పనులు పూర్తి కావాలని ఐటీడీఏ పీవో అంకిత్ అధికారులను ఆదేశించారు.
అధికారులతో సమీక్షిస్తున్న ఐటీడీఏ పీవో అంకిత్
ఏటూరునాగారం, న్యూస్టుడే: మరో నాలుగు రోజుల్లోగా మేడారం చిన్న జాతర పనులు పూర్తి కావాలని ఐటీడీఏ పీవో అంకిత్ అధికారులను ఆదేశించారు. ఐటీడీఏ కార్యాలయంలో గురువారం అధికారులతో సమీక్షించారు. జాతరను పురస్కరించుకుని భక్తుల సౌకర్యార్థం చేపట్టిన పనుల వారీగా పురోగతిపై అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పారిశుద్ధ్య పనులకు గాను కార్మికులను నియమించాలని చెప్పారు. సెప్టిక్ ట్యాంకులు, మరుగుదొడ్లు వెంట వెంటనే శుభ్రం చేయడం వంటి పనులకు గాను సరిపడా సిబ్బందిని ఏర్పాటు చేయాలన్నారు. విద్యుత్తు సరఫరా కోసం అవసరమైన పరికరాల కోసం విద్యుత్తు, దేవాదాయ, గిరిజన సంక్షేమ శాఖలు సంయుక్తగా తనిఖీలు చేపట్టాలని ఆదేశించారు. ఊట బావులలో పూడికతీత పనులు చేపట్టాలన్నారు. పుణ్య స్నానాలు ఆచరించేందుకు నల్లాలను బిగించాలని, మహిళలు దుస్తులు మార్చుకునే గదులను ఏర్పాటు చేయాలన్నారు. చెరువుల వద్ద ఇనుప కంచె అమర్చాలని నీటిపారుదల శాఖ అధికారులను ఆదేశించారు. తాగునీటి ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. ఐలాపూర్, దొడ్ల, కొండాయి గ్రామాల్లోని వనదేవతల ఆలయాలకు రంగులు వేసి, విద్యుదీకరణ పనులు చేపట్టాలని గిరిజన సంక్షేమ ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. ఏపీవో వసంతరావు, ఏవో టీవీఆర్.దామోదరస్వామి, ఎస్వో రాజ్కుమార్, మేడారం ఈవో రాజేంద్రం, ఈఈ సుభాష్, డీఈలు రవీందర్, సదయ్య, డీడబ్ల్యూవో ప్రేమలత, డీఎంజీసీసీ ప్రతాప్రెడ్డి, ఏసీఎంవో కోడి రవీందర్, మేనేజర్ శ్రీనివాస్, డిప్యూటీ ఎస్వో లాల్నాయక్, జీసీడీవో సుగుణ, పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్దబోయిన జగ్గారావు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
షాపింగ్మాల్లో భారీ అగ్నిప్రమాదం
[ 29-03-2024]
వరంగల్ పోచమ్మమైదాన్లోని జెకోటియా షాపింగ్ మాల్లో గురువారం సాయంత్రం 6.45 గంటలకు భారీ అగ్నిప్రమాదం జరిగింది. -
గ్రంథాలయం మాది..పుస్తకం మీది!
[ 29-03-2024]
నేటి తరం పిల్లలు పుస్తక పఠనానికి క్రమంగా దూరమవుతున్నారు. చరవాణుల వ్యామోహంలో పడి గ్రంథాలయాల గడప తొక్కనివారు ఎంతో మంది ఉన్నారు. -
ఎర్రగట్టు గుట్టపై క్షీరాభిషేకం
[ 29-03-2024]
భీమారంలోని ఎర్రగట్టు గుట్టపై వెలసిన వేెంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. నాలుగో రోజు గురువారం స్వామివారికి క్షీరాభిషేకం నిర్వహించారు. -
యథేచ్ఛగా ఆలయ భూముల ఆక్రమణ
[ 29-03-2024]
వరంగల్, హనుమకొండ నగరాల నడిబొడ్డున రూ.కోట్ల విలువైన ఆలయ భూములు ఆక్రమణల చెరలో ఉన్నాయి. ఈ స్థలాల్లో పలుకుబడి ఉన్నవాళ్లు పెద్ద భవనాలు, ఇళ్లు నిర్మించుకున్నారు. -
ఇసుకాసురులపై పోలీసుల కొరడా
[ 29-03-2024]
సహజ వనరులను కాపాడుకుంటూ భవిష్యత్తు తరాలకు అందించినప్పుడే మనుగడ సాధ్యమవుతుంది. కానీ చాలా వరకు గుట్టలు, ఇసుక, మట్టిని గుళ్ల చేస్తూ వనరులను అందిన కాడికి దోచుకుంటున్నారు. -
నాణ్యతా.. వారికి మామూలే!
[ 29-03-2024]
ఉపాధిహామీ పథకం నిధులతో పంచాయతీరాజ్ ఇంజినీరింగ్శాఖ ఆధ్వర్యంలో మహబూబాబాద్, భూపాలపల్లి, ములుగు జిల్లాల్లోని పలు గ్రామాల్లో ఇటీవల సీసీ రోడ్ల నిర్మాణాలు చేపట్టారు. -
వైద్యుడు లేక అందని గుండె పరీక్షల సేవలు
[ 29-03-2024]
జనగామ జిల్లా కేంద్రంగా మారిన తర్వాత జనగామలో ప్రభుత్వం తెలంగాణ డయాగ్నస్టిక్ కేంద్రం, రేడియాలజీ హబ్లను ఏర్పాటు చేసింది. -
మరోసారి కాంగ్రెస్ సత్తా చాటాలి
[ 29-03-2024]
రానున్న లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మాజీ కేంద్ర మంత్రి బలరాంనాయక్ను అధిక మెజారిటీతో గెలిపించాలని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క నాయకులు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. -
ఆస్తి పన్ను బకాయిదారులపై కొరడా
[ 29-03-2024]
ఆస్తి పన్ను మొండి బకాయిదారులపై మున్సిపాలిటీ అధికారులు కొరడా ఝులిపిస్తున్నారు. వారం రోజులుగా ఉదయం 7 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు బకాయిదారుల ఇళ్లు, దుకాణాల వద్దకు వెళ్లి పన్ను చెల్లించాలని కోరుతున్నారు. -
అక్రమ వ్యాపారాలపై ప్రత్యేక నిఘా
[ 29-03-2024]
జిల్లాలో అక్రమ వ్యాపారాలపై పోలీసు యంత్రాంగం ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ అన్నారు. -
వేగవంతంగా చిన్న కాళేశ్వరం ప్రాజెక్టు పనులు
[ 29-03-2024]
మహదేవపూర్ మండలంలోని చిన్న కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ పనులను వేగవంతంగా చేపట్టాలని సంబంధిత నీటిపారుదల శాఖ అధికారులను జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా ఆదేశించారు. -
పల్లెల్లో బెట్టింగ్ల జోరు
[ 29-03-2024]
పట్టణాలకు పరిమితమైన బెట్టింగ్ సంస్కృతి పల్లె ప్రాంతంలో విస్తరించింది. జిల్లాలో మారుమూల ప్రాంతమైన కాటారం రెవెన్యూ డివిజన్ పరిధిలోని పల్లెల్లో యువకులు, వ్యాపారులు, విద్యార్థులు పందేలు కాస్తూ ఆర్థికంగా చితికిపోతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
‘అగ్నివీర్’లో మార్పులకు సిద్ధం: రాజ్నాథ్
-
వైకాపా అభ్యర్థి రాజ్యలక్ష్మి ఎస్టీ కాదంటూ వ్యాజ్యం
-
లోయలో పడిన బస్సు.. 45 మంది మృతి.. గాయాలతో బయటపడ్డ 8 ఏళ్ల బాలిక
-
ఏపీలో రోగులకు ఎన్నికల కష్టాలు
-
అనపర్తి స్థానం మార్పు వైకాపా కుట్ర: నల్లమిల్లి
-
బరిలో ఐదుగురు ఓ.పన్నీర్సెల్వంలు.. అందరి నామినేషన్లు ఆమోదం