శిరస్త్రాణం.. రక్షణాస్త్రం!!
చాలా మంది ఇంటి నుంచి బయటకు వచ్చే సమయంలో హెల్మెట్ను వెంట తెచ్చుకుంటున్నారు. వాటిని బండికి తగిలించుకొని వెళ్తున్నారు. పోలీసులు తనిఖీలు చేస్తున్నారని తెలిస్తేనే ధరిస్తున్నారు. లేదంటే అంతే. దీని వలన ఉపయోగం లేదు.
న్యూస్టుడే, వరంగల్క్రైం
చాలా మంది ఇంటి నుంచి బయటకు వచ్చే సమయంలో హెల్మెట్ను వెంట తెచ్చుకుంటున్నారు. వాటిని బండికి తగిలించుకొని వెళ్తున్నారు. పోలీసులు తనిఖీలు చేస్తున్నారని తెలిస్తేనే ధరిస్తున్నారు. లేదంటే అంతే. దీని వలన ఉపయోగం లేదు.
విధించిన ఈ-చలాన్లు
జరిమానా(రూ.)
ట్రాఫిక్ ఠాణాల పరిధిలో గతేడాదిలో హెల్మెట్ ఉల్లంఘనలు..
హనుమకొండ: 3,58,929 6,41,16,600
వరంగల్ : 2,69,437 4,75,12,500
కాజీపేట : 2,87,966 5,11,79,100
ప్రాణం కంటే విలువైనది ఏదీ లేదు. ఇంటి పెద్ద, చేతికొచ్చిన కొడుకు రోడ్డు ప్రమాదంలో మృతి చెందితే ఆ కుటుంబం పడే వేదన వర్ణనాతీతం. ద్విచక్రవాహనం నడిపే వారు జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా శిరస్త్రాణం ధరించాలి. ప్రమాదాలు జరిగిన సందర్భాల్లో ప్రాణాపాయం నుంచి తప్పించుకునే అవకాశం ఉంటుంది. హెల్మెట్ ధరించడం భారంగా అనుకోవద్దు.. బాధ్యతగా భావించాలి.
* కుర్రకారు రయ్మని దూసుకుపోతున్నారు. కొంత మంది శిరస్త్రాణాన్ని భారంగా భావిస్తున్నారు. జుట్టు ఊడిపోతుందని, ముఖం పాలిపోతుందని అనుకొని ధరించడం మానేశారు. జరిమానాల నుంచి తప్పించుకోవడానికి నెంబర్ ప్లేట్లు లేకుండా, ఉన్న వాటిని కనిపించకుండా చేస్తున్నారే తప్ప హెల్మెట్ ధరిద్దామని ఆలోచన చేయడం లేదు.
వరంగల్ కమిషనరేట్ పరిధిలో జరుగుతున్న ద్విచక్రవాహనాల ప్రమాదాల్లో 60 శాతం మృతి చెందుతున్నారని పోలీసుల నివేదికలు చెబుతున్నాయి. గతంలో వాహనదారులకు పోలీసులు అవగాహన కల్పించారు. చిన్నపిల్లలతో పుష్పాలు ఇప్పించి.. ధరించమని చెప్పించారు. డిజిటల్ బోర్డులు ఏర్పాటు చేసి హెల్మెట్ ధరించకపోవడం వల్ల జరిగే నష్టాలను సైతం వివరించారు.అయినా కొంతమంది మాత్రం ధరించడం లేదు.
* గతేడాది హనుమకొండ, వరంగల్, కాజీపేట ట్రాఫిక్ ఠాణాల పరిధిలో హెల్మెట్లు లేకుండా తిరుగుతున్న 9,16,332 మందికి ఈ-చలాన్లు ద్వారా రూ.16.28 కోట్ల జరిమానా విధించారు. పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.
తలకు గాయమైతే..
శరీరంలో కీలకమైనది మెదడు. ఇది ఇచ్చే సంకేతాలతోనే అవయవాలు పనిచేస్తుంటాయి. మెదడు కణజాలంతో కూడిన పొరతో కప్పబడి ఉంటుంది. దానిపై రక్షణగా పుర్రె ఉంటుంది. ప్రమాదంలో మెదడుకు గాయమైతే జీవితంలో అన్ని కోల్పోవాల్సి వస్తుంది. తలకు గాయాలు కాకుండా చూసుకోవాలి.
స్వల్ప గాయాలతో బయటపడ్డా
దామోదర్రెడ్డి గోపాల్పూర్
నెల రోజుల క్రితం రాత్రి పూట వ్యక్తిగత పనిపై బయటకు వెళ్లి తిరిగి ఇంటికి వస్తున్నా. గోపాల్పూర్ ప్రధాన రోడ్డుపై ప్రమాదం జరిగింది. ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయి డివైడర్ను ఢీకొట్టడంతో కింద పడ్డాను. హెల్మెట్ ఉండడంతో స్వల్పగాయాలతో బయటపడ్డాను. అదే లేకుంటే తలకు బలమైన గాయమయ్యేది.
చాలా సురక్షితం
శ్రీధర్, హనుమకొండ
హెల్మెట్ ఉపయోగం తెలుసుకొని ధరిస్తున్నా. ఈనెల 8వ తేదీన రోడ్డు ప్రమాదం జరిగింది. అప్పుడు తల రోడ్డుకు తాకింది. కానీ ఏమీకాలేదు. చేతులు, కాళ్లకు దెబ్బలు తగిలాయి. హెల్మెట్ లేకుంటే తలకు గాయం అయ్యేది.
నాణ్యమైనవి కొనుగోలు చేయాలి
మధుసూదన్, ట్రాఫిక్ ఏసీపీ
వాహనదారులు నాణ్యమైన హెల్మెట్ను వాడాలి. దీని వల్ల తలకు పూర్తి రక్షణ లభిస్తుంది. ప్రమాదం జరిగిన సమయంలో స్వల్ప గాయాలతో బయటపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ విషయమై చాలా సార్లు వాహనదారులకు అవగాహన కల్పించాం. ఈ చలాన్లు విధిస్తున్నాం. అయినా కొందరిలో మార్పు రావడం లేదు. ఇలాంటి వారికి కుటుంబ సభ్యులే చెబితే మంచిగా ఉంటుంది.
గతేడాది ద్విచక్ర వాహన ప్రమాదాలు: 390
గాయపడిన వారు: 536
మృతులు: 218
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కాంగ్రెస్ కంచుకోట.. మానుకోట!
[ 20-04-2024]
మహబూబాబాద్ జిల్లాకేంద్రంలో శుక్రవారం నిర్వహించిన కాంగ్రెస్ జన జాతర సభ విజయవంతమైంది. ఈ లోక్సభ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి అధిక సంఖ్యలో తరలొచ్చిన పార్టీ శ్రేణులు, అభిమానులతో సభా ప్రాంగణం హోరెత్తింది. -
కబ్జా కోరల్లో ఇనుపరాతి గుట్ట అటవీ భూములు!
[ 20-04-2024]
భూపాలపల్లి జిల్లా కేంద్రం సమీపంలోని కొంపెల్లి గ్రామ పరిధిలో 106.34 ఎకరాల భూమి ప్రైవేటు వ్యక్తులది కాదని.. అది అటవీ భూమేనని సుప్రీంకోర్టు ఇచ్చిన తాజా తీర్పు పర్యావరణానికి ఎంతో మేలు చేయనుంది. -
ఛత్రం పడితేనే.. చకచకా నడిచేది..!
[ 20-04-2024]
గత లోక్సభ ఎన్నికలు 2019 ఏప్రిల్ 11న జరిగాయి. ఈసారి మే 13న నిర్వహించనున్నారు. ఇప్పుడే ఎండలు దంచి కొడుతున్నాయి. ఆ సమయంలో మరింత తీవ్రంగా ఉండే ప్రమాదం ఉంది.. -
బలరాంనాయక్ నామపత్రం దాఖలు
[ 20-04-2024]
మహబూబాబాద్ (ఎస్టీ) లోక్సభ స్థానానికి కాంగ్రెస్ అభ్యర్థి, కేంద్ర మాజీ సహాయమంత్రి పోరిక బలరాంనాయక్ శుక్రవారం రెండు సెట్ల నామినేషన్ దాఖలు చేశారు. -
మావోయిస్టు దంపతులకు తుది వీడ్కోలు
[ 20-04-2024]
ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్లో మృతిచెందిన మావోయిస్టు దంపతులు జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం చల్లగరిగె గ్రామానికి చెందిన సిరిపెల్లి సుధాకర్ అలియాస్ శంకర్ అలియాస్ మురళీ, ఆదిలాబాద్ జిల్లా బజార్హత్నూర్కు చెందిన సుమన అలియాస్ రంజిత అంత్యక్రియలు శుక్రవారం స్వగ్రామంలో ముగిశాయి. -
ఓటు వేసి ప్రజాస్వామ్యాన్ని గెలిపించాలి
[ 20-04-2024]
వచ్చేనెల 13న జరగబోయే లోక్సభ ఎన్నికల పోలింగ్ రోజు అందరూ ఓటేసి ప్రజాస్వామ్యాన్ని గెలిపించాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ పిలుపునిచ్చారు. -
సీఎం హెలిప్యాడ్కు మూడు స్థలాల పరిశీలన
[ 20-04-2024]
కాజీపేట మండలం మడికొండ సెయింట్ పాల్స్ మైదానంలో ఈ నెల 24న నిర్వహించనున్న కాంగ్రెస్ పార్టీ బహిరంగ సభకు ఏర్పాట్లు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. -
వరంగల్లో భారాస విజయం ఖాయం
[ 20-04-2024]
వరంగల్ లోక్సభ నియోజకవర్గంలో భారాస విజయం ఖాయమైందని మాజీ మంత్రి దయాకర్రావు అన్నారు. -
మరాడించలే.. లెక్కచూపలే
[ 20-04-2024]
జిల్లాలో సీఎంఆర్(కస్టమ్ మిల్లింగ్ రైస్) ప్రక్రియ నత్తనడకన సాగుతోంది.. రైతులు పండించిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి సేకరిస్తోంది. -
ఎన్నిక ఏదైనా సత్తా చాటారు..!
[ 20-04-2024]
రాజకీయ నేతలు తమ జీవిత కాలంలో ఒక్కసారైనా ఏదో ఒక చట్టసభలో అడుగుపెట్టాలని ఆశిస్తుంటారు.. ఒకరికే ఎమ్మెల్యేగా, ఎంపీగా పోటీ చేసే అవకాశం వచ్చి విజయం సాధిస్తే వారి ఆనందానికి అవధులు ఉండవు. -
అట్టహాసంగా ప్రారంభం.. పరిశోధనలు శూన్యం
[ 20-04-2024]
కాకతీయ విశ్వవిద్యాలయంలో పరిశోధనల నిమిత్తం రూ.50 కోట్లతో కె-హబ్, పీవీ నర్సింహారావు విజ్ఞాన కేంద్రం నిర్మించారు. -
ఓటాస్త్రం.. స్వీయచిత్రమే సాక్ష్యం
[ 20-04-2024]
ఓరుగల్లు నగరంలో ఓటింగ్ శాతం పెంచేందుకు వరంగల్ కలెక్టరేట్ ఆవరణలో సెల్ఫీ పాయింట్ ఏర్పాటు చేశారు. -
రెండోరోజు మూడు నామపత్రాలు
[ 20-04-2024]
వరంగల్ లోక్సభ స్థానానికి రెండోరోజు శుక్రవారం ముగ్గురు అభ్యర్థులు, నాలుగుసెట్ల నామపత్రాలు దాఖలు చేశారని వరంగల్ పార్లమెంట్ రిటర్నింగ్ అధికారి, వరంగల్ జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య తెలిపారు.