logo

వంతెనను ఢీకొట్టి.. పొలాల్లో పడిపోయిన డీసీఎం వ్యాన్‌

సరకులతో వస్తున్న డీసీఎం వ్యాన్‌ అదుపుతప్పి వంతెనను ఢీకొట్టింది. 

Published : 25 Jan 2023 12:20 IST

నర్సంపేట‌:  సరకులతో వస్తున్న డీసీఎం వ్యాన్‌ అదుపుతప్పి వంతెనను ఢీకొట్టింది.  ఈ ఘటన బుధవారం ఉదయం వరంగల్‌ జిల్లా నర్సంపేట శివారులో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల  ప్రకారం.. వరంగల్‌ నుంచి నర్సంపేటకు సరకులతో వస్తున్న ఓ ట్రాన్స్‌పోర్ట్‌కు చెందిన డీసీఎం వ్యాన్‌    నర్సంపేట శివారులో అదుపుతప్పి వంతెనను ఢీకొట్టింది. అనంతరం పక్కనే ఉన్న పొలాల్లోకి పడిపోయింది. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని